-
బెంగాల్లో పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ
కోల్కతా: నూతన పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న పలువురికి సిటిజన్షిప్ సర్టిఫికేట్లను కేంద్రం బుధవారం జారీ చేసింది. పశ్చిమ బెంగాల్తో పాటు, హర్యానా, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో మొదటి విడత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సిటిజన్షిప్ సర్టిఫికేట్లను అధికారులు అందజేశారు. 2019లో పార్లమెంట్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం నియమ, నిబంధనలను మార్చి 11న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన విషయం తెలిసిందే. చట్టం నిబంధనలు నోటీఫై అయిన రెండు నెలల అనంతరం మే 15న తొలిసారి మొదటి విడతగా 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని, అమలు చేయమని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్న విషయం తెలిసిందే. సీఏఏ మానవత్వాన్ని అవమానించటమేనని, దేశ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని మండిపడ్డ సంగతి విధితమే.సీఏఏలో ఏముంది...!► సీఏఏ–2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు.► 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు.► అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్లో ఉంటున్నవాళ్లకు, 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కల్పిస్తారు. గతంలో 11 ఏళ్లుండగా ఐదేళ్లకు తగ్గించారు.► ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరముండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం–1955కు మోదీ సర్కారు సవరణలు చేసింది.► అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. -
LS 2024: ముగిసిన ఆరో దశ ఎన్నికల పోలింగ్
Updatesఢిల్లీలో గతంతో పోలిస్తే తగ్గిన పోలింగ్ 7.45 గంటల వరకు 59 శాతం పోలింగ్ నమోదుఎండవేడికి ఓటింగ్కు రాని జనం బీహార్ : 53.30హర్యానా: 58.37జమ్మూ కాశ్మీర్: 52.28జార్ఖండ్ :62.74ఢిల్లీ : 54.48 ఒడిశా:60.07యూపీ:54.03వెస్ట్ బెంగాల్ : 78.19ముగిసిన ఆరో దశ ఎన్నికల పోలింగ్సాయంత్రం ఐదు గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ ఢిల్లీ:సాయంత్రం 5 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 57.70బీహార్- 52.24హర్యానా -55.93జమ్మూ-కాశ్మీర్-51.35జార్ఖండ్- 61.41ఢిల్లీ -53.73ఒడిశా- 59.60ఉత్తరప్రదేశ్ - 52.02పశ్చిమ బెంగాల్- 77.99మధ్యాహ్నం 3 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 49.2బీహార్- 45.21హర్యానా -46.26జమ్మూ-కాశ్మీర్-44.41జార్ఖండ్- 54.34ఢిల్లీ -44.58ఒడిస్సా- 48.44ఉత్తరప్రదేశ్ - 43.95పశ్చిమ బెంగాల్- 70.19 ఢిల్లీ: సీపీఎం నేత ప్రకాశ్ కారత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | CPM leader Prakash Karat casts his vote in the sixth phase of Lok Sabha elections, in Delhi pic.twitter.com/858hVyqLos— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారం ఏచూరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | CPI(M) General Secretary Sitaram Yechury casts his vote in Delhi pic.twitter.com/xmd7RWEkVq— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఓటు వేశారు.#WATCH | Arvind Panagariya, Chairman of 16th Finance Commission casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi pic.twitter.com/BJlEKlYqOM— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:లోక్ సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోందిమధ్యాహ్నం 1 గంట వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్ 39.13 శాతం బీహార్- 36.48%హర్యానా -36.48%జమ్మూ-కాశ్మీర్-35.22%జార్ఖండ్- 42.54%ఢిల్లీ - 34.37%ఒడిస్సా- 35.69%ఉత్తరప్రదేశ్ - 37.23%పశ్చిమ బెంగాల్- 54.80%పశ్చిమ బెంగాల్:బీజేపీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్లోకి అనుమతించకపోవటంపై మేదినిపూర్ బీజేపీ అభ్యర్థి అగ్ని మిత్రా పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి తన పోలింగ్ ఏజెంట్ను బూత్లో కూర్చుబెట్టారు.#WATCH | Paschim Medinipur, West Bengal | BJP candidate from Medinipur Lok Sabha seat, Agnimitra Paul alleges that BJP polling agents are not being allowed inside polling booths in Keshiary as voting is underway in the parliamentary constituency “Are you not seeing that our… pic.twitter.com/CREGf4awJa— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: బీజేపీ నేత నుపుర్ శర్మ హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Former BJP Spokesperson Nupur Sharma leaves from a polling station in Delhi after casting her vote for #LokSabhaElections2024(Earlier visuals) pic.twitter.com/BFYgtP82b5— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: కేంద్రమంత్రి మీనాక్షి లేఖీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Union Minister and BJP MP Meenakashi Lekhi casts her vote for #LokSabhaElections2024 at a polling station in Delhi. She says, " I urge everyone to come out and vote. It is a festival of democracy and everyone should vote...Our government is going to be formed once… pic.twitter.com/27GokqlPi5— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Senior advocate and Rajya Sabha MP Kapil Sibal shows his inked finger after casting his vote at a polling booth in Delhi, for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/S8WLWfxQoM— ANI (@ANI) May 25, 2024 సీడీఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ దంపతులు ఓటు వేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Chief of Defence Staff (CDS) Gen Anil Chauhan, his wife Anupama Chauhan cast their votes for #LokSabhaElections2024 at a polling station in Delhi pic.twitter.com/aMdfHocLPU— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.#WATCH | Delhi CM Arvind Kejriwal, his family members show their inked fingers after casting their votes for the sixth phase of #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/Za10pO9sW2— ANI (@ANI) May 25, 2024 సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందా కారత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | CPI(M) leader Brinda Karat says, "...I have voted against dictatorship and communalism. My vote will bring change..." https://t.co/c8aglrIvSd pic.twitter.com/v6OVwhCJMf— ANI (@ANI) May 25, 2024 లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 11 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన మొత్తం పోలింగ్ శాతం 25.76బీహార్- 23.67%హర్యానా -22.09%జమ్మూ-కాశ్మీర్-23.11%జార్ఖండ్-27.80%ఢిల్లీ -21.69%ఒడిస్సా-21.30%ఉత్తరప్రదేశ్ -27.06%పశ్చిమ బెంగాల్-36.88%#LokSabhaElections2024 | 25.76% voter turnout recorded till 11 am, in the 6th phase of elections. Bihar- 23.67% Haryana- 22.09% Jammu & Kashmir- 23.11% Jharkhand- 27.80% Delhi- 21.69% Odisha- 21.30% Uttar Pradesh-27.06% West Bengal- 36.88% pic.twitter.com/iwy8GyKzFe— ANI (@ANI) May 25, 2024 హర్యానా:ద్రోణాచార్య అవార్డు గ్రహిత, రెజ్లింగ్ కోచ్ మహవీర్ సింగ్ ఫోగట్ ఓటు వేశారు.#WATCH | Haryana: Dronacharya awardee and wrestling coach Mahavir Singh Phogat casts his vote. He also casts a vote on behalf of his wife at a polling centre in Charkhi Dadri for the sixth phase of #LokSabhaElections2024 Former wrestler and BJP leader Babita Phogat also cast… pic.twitter.com/BKLH5Hgrtt— ANI (@ANI) May 25, 2024 దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | After casting his vote for the #LokSabhaElections2024 , former Indian Cricketer Kapil Dev says "I feel very happy that we are under democracy. The important thing is to pick the right people for your constituency...What we can do is more important than what the govt can… pic.twitter.com/Cl0XAb71Aq— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన ప్రియాంకా గాంధీ వాద్రాఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra casts her vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/wrg0wOISAw— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన ప్రియాంకా గాంధీ కుమార్తె, కుమారుడుఢిల్లీ: ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా,కూతురు మిరాయా వాద్రా ఓటు వేశారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు.Raihan Rajiv Vadra and Miraya Vadra, children of Robert Vadra and Congress leader Priyanka Gandhi Vadra show their inked fingers after casting their votes for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/c1pcraZCdY— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన ఎంపీ స్వాతి మలివాల్ఢిల్లీ:ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.#WATCH | Aam Aadmi Party Rajya Sabha MP Swati Maliwal casts her vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling booth in Delhi. pic.twitter.com/4jLu7RoHdz— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన మాజీ రాష్ట్రపతిఢిల్లీ:మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ ఓటు వేశారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Former President Ram Nath Kovind casts his vote for #LokSabhaElections2024 at a polling centre in Delhi pic.twitter.com/9IE5wbI7LJ— ANI (@ANI) May 25, 2024 ఒడిశా:ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఓటు వేశారు. భువనేశ్వర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Odisha CM Naveen Patnaik casts his vote for the sixth phase of #LokSabhaElections2024 and third phase of Odisha Assembly elections, at a polling station in Bhubaneswar pic.twitter.com/c0sGZ5xsIe— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు వేశారుఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన రాహుల్.. అనంతరం తల్లి సోనియా గాంధీతో సెల్ఫీ ఫొటో దిగారు.తొలిసారి సోనియా గాంధీ కుటుంబం కాంగ్రెసేతర అభ్యర్థికి ఓటు వేశారు. ఢిల్లీలో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్లో పొత్తులో బరిలోకి దిగాయి.దీంతో ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతికి సోనియా గాంధీ కుటుంబం మద్దతు తెలిపింది.#WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and party MP Rahul Gandhi click a selfie as they leave from a polling station after casting their votes for #LokSabhaElections2024 pic.twitter.com/PIvovnGPdJ— ANI (@ANI) May 25, 2024 ఓటువేసిన ఉప రాష్ట్రపతి దంపతులుఢిల్లీ: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Vice President Jagdeep Dhankhar, his wife Sudesh Dhankhar show their inked fingers after casting their votes for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/LsUrRyEusU— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:ఢిల్లీలో మందకోడిగా పోలింగ్ఉదయం 9 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 10.82బీహార్- 9.66%హర్యానా -8.31%జమ్మూ-కాశ్మీర్-8.89%జార్ఖండ్-11.74%ఢిల్లీ -8.94%ఒడిస్సా-7.43%ఉత్తరప్రదేశ్ -12.33%పశ్చిమ బెంగాల్-16.54% ఢిల్లీ:ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓటు వేశారు.ఆయన ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj casts his vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Delhi pic.twitter.com/chqk73Ydxs— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఓటు వేశారు.#WATCH | President Droupadi Murmu casts her vote for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/O8wB4aLBLG— ANI (@ANI) May 25, 2024 జమ్మూ కశ్మీర్:పోలీసులు తీరుకు నిరసనగా పీడీపీ చీఫ్, అనంత్నాగ్- రాజౌరీ అభర్థి మెహబూబా ముఫ్తీ నిరసన దిగారు.ఏ కారణంగా లేకుండా పీడీపీ పోలింగ్ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె ఆరోపణలు చేశారు.#WATCH | Anantnag, J&K: PDP chief and candidate from Anantnag–Rajouri Lok Sabha seat, Mehbooba Mufti along with party leaders and workers sit on a protest. She alleged that the police have detained PDP polling agents and workers without any reason. pic.twitter.com/dPJb4dolKQ— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన తెలంగాణ గవర్నర్ రాంచీ:జార్ఖండ్, తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆయన రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఢిల్లీ:ఢిల్లీ మంత్రి అతిశీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు#WATCH | Delhi minister & AAP leader Atishi casts her vote for #LokSabhaElections2024, at a polling booth in Delhi pic.twitter.com/AdfX0qlvkW— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.#WATCH | Delhi: Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh casts his vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Ranchi. pic.twitter.com/UoaWLUxEg7— ANI (@ANI) May 25, 2024 ఒడిశా:బీజేడీ నేత వీకే పాండియన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనేశ్వర్లోని ఓ పొలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | 5T Chairman and BJD leader VK Pandian casts his vote for the sixth phase of #LokSabhaElections2024 and third phase of Odisha Assembly elections, at a polling booth in Bhubaneswar. pic.twitter.com/WBOdNJ4ZSX— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో గంబీర్ ఓటు వేశారు.#WATCH | BJP East Delhi MP and former India Cricketer Gautam Gambhir casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/1dNMGyCoUq— ANI (@ANI) May 25, 2024 జమ్మూ కశ్మీర్జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజౌరీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంత్ నాగ్-రాజౌరీ స్థానంలో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెస్స్ (జేకేఎన్సీ) తరఫున మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీలో ఉన్నారు. పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.#WATCH | Jammu and Kashmir BJP President Ravinder Raina casts his vote at a polling booth in RajouriJammu and Kashmir National Conference (JKNC) has fielded Mian Altaf Ahmad from the Anantnag-Rajouri Lok Sabha seat. PDP has fielded Mehbooba Mufti from this seat.… pic.twitter.com/LmEFuMkIOt— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-1 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.ఆయన ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలో దిగారు.ఆయనపై ఆప్ కుల్దీప్ కుమార్ను పోటీకి దింపింది.#WATCH | Delhi BJP president Virendraa Sachdeva casts his vote at a polling booth in Mayur Vihar Phase 1. BJP has fielded Harsh Malhotra from East Delhi Lok Sabha seat. AAP has fielded Kuldeep Kumar#LokSabhaElections2024 pic.twitter.com/I9ftlwnS12— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీన్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ ఓటు చేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆమె ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిపై తలపడుతున్నారు#WATCH | BJP Lok Sabha candidate from New Delhi, Bansuri Swaraj casts her vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Delhi.AAP has fielded Somnath Bharti from the New Delhi Lok Sabha seat. pic.twitter.com/hCM2o3wqjx— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | External Affairs Minister Dr S Jaishankar casts his vote at a polling booth in Delhi, for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/SbWDv9jWZc— ANI (@ANI) May 25, 2024 హర్యానా:హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మీర్జాపూర్ గ్రామంలో ఓటు వేశారు.#WATCH | Haryana CM Nayab Singh Saini, his wife Suman Saini show their inked fingers after casting their votes at a polling booth in his native village Mirzapur, Narayangarh pic.twitter.com/TojCp0ygbU— ANI (@ANI) May 25, 2024ఢిల్లీ:ఢిల్లీలో లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.ఢిల్లీలోని ఏడు సీట్లకు పోటీపడుతున్న 162 మంది అభ్యర్థులుఆరవ విడత లో 8 రాష్ట్రాల్లోని 58 సీట్లకు పోలింగ్ఒడిశా అసెంబ్లీలోని 42 సీట్లకూ పోలింగ్ఓటు హక్కు వినియోగించుకోనున్న 11.13 కోట్ల మంది ఓటర్లు1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కొనసాగనున్న పోలింగ్ఇప్పటివరకు 25 రాష్ట్రాల్లోని 428 ఎంపీ సీట్లకు ముగిసిన పోలింగ్ఢిల్లీ:కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేశారుUnion Minister Hardeep Singh Puri, his wife Lakshmi Puri show their inked fingers after casting their votes at a polling booth in Delhi#LokSabhaElections2024 pic.twitter.com/j9norx9jL1— ANI (@ANI) May 25, 2024 ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేయాలి: ప్రధాని మోదీఆరో విడుతలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నా.ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది.. మీ ఓటు కూడా కీలకమైంది.ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరంమహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయండి: ప్రధాని మోదీPrime Minister Narendra Modi tweets "I urge all those who are voting in the 6th phase of the 2024 Lok Sabha elections to vote in large numbers. Every vote counts, make yours count too. Democracy thrives when its people are engaged and active in the electoral process. I specially… pic.twitter.com/bqM3ba2Okq— ANI (@ANI) May 25, 2024 ఆరో విడత పోలింగ్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు.ఈశాన్య ఢిల్లీలో మనోజ్ తివారీ- కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు.పురీలో సంబిత్ పాత్ర- అరూప్ పట్నాయక్ పోటీ పడుతున్నారు.హర్యానాలోని కార్నాల్లో మనోహర్ లాల్ కట్టర్- దివ్యాన్షు బుదిరాజా బరిలో ఉన్నారు. హర్యానా: హర్యానా మాజీ సీఎం, కర్నాల్ బీజేపీ అభ్యర్థి మనోహర్ లాల్ కట్టర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.కర్నాల్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Former Haryana CM and BJP candidate from Karnal Lok Sabha seat, Manohar Lal Khattar casts his vote at a polling booth in Karnal, HaryanaCongress has fielded Divyanshu Budhiraja from this seat. pic.twitter.com/owrFUNtzXy— ANI (@ANI) May 25, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది.Voting for the sixth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 58 constituencies across 8 states and Union Territories (UTs) today. Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/leDZIY9HIa— ANI (@ANI) May 25, 2024 కాసేపట్లో లోక్సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ప్రారంభం కానుందిలోక్సభ ఎన్నికల్లో ఆరో విడతకు పోలింగ్కు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.#WATCH | #LokSabhaElection2024 | People queue up outside a polling booth in Ranchi to cast their votes; voting will begin at 7 amJharkhand's 4 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/nPm398UfeM— ANI (@ANI) May 25, 2024 హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలతో పాటు మశ్చిమ గాల్లోని గిరిజన ప్రాబల్య జంగల్మహల్ ప్రాంతంలోని పలు లోక్సభ స్థానాలు వీటిలో ఉన్నాయి.ఒడిశాలో 6 లోక్సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో 486 లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది.#WATCH | #LokSabhaElection2024 | Preparations, mock polls underway at a polling booth in Rajouri, J&KJammu and Kashmir's Anantnag-Rajouri constituency constituency will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/15zvuLK08k— ANI (@ANI) May 25, 2024 మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. బరిలో కీలక నేతలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్జీత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్తో పాటు మేనకా గాంధీ, సంబిత పాత్ర, మనోహర్లాల్ ఖట్టర్ (బీజేపీ), రాజ్బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్సింగ్ హుడా (కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.#WATCH | #LokSabhaElection2024 | Preparations, mock polls underway at a polling booth in Rohtak, HaryanaHaryana's 10 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/p2Cws1ktcr— ANI (@ANI) May 25, 2024 హరియాణాలోని కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్సింగ్ సైటీ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. -
Lok Sabha Election 2024: ప్రాంతీయ సవాల్!
ఫైనాన్షియల్, కార్పొరేట్ హబ్గా దేశ ఆర్థిక ముఖచిత్రంలో కీలకమైన హరియాణాలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇక్కడి మొత్తం 10 లోక్సభ స్థానాలకూ ఆరో విడతలో భాగంగా శనివారం పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన బీజేపీకి వాటిని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కాంగ్రెస్, ఆప్లతో కూడిన ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ 9 చోట్ల, ఆప్ ఒక్క స్థానంలో బరిలో ఉన్నాయి. ప్రాంతీయ పారీ్టలు కూడా గట్టిగా సవాలు విసురుతున్నాయి. హరియాణాలోని కీలక స్థానాలపై ఫోకస్...కురుక్షేత్ర.. నువ్వా నేనా! మోదీ వేవ్లో 2014లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. 2019లో రాష్ట్ర బీజేపీ చీఫ్ నాయబ్ సింగ్ సైనీ భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన సీఎం కావడంతో ఈసారి పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్కు బీజేపీ టికెటిచి్చంది. ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ గుప్తాకు విద్యా, వ్యాపారవేత్తగా మంచి పేరుంది. ఐఎన్ఎల్డీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా తొలిసారి లోక్సభ బరిలో దిగారు. రైతు అందోళనల సెగ బీజేపీకి గట్టిగా తగులుతోంది. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీఏ కూటమి వీడి సొంతంగా పోటీ చేస్తుండటం కూడా కమలనాథులకు ప్రతికూలాంశమే. ఆ పార్టీ నుంచి పలరామ్ సైనీ బరిలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.హిసార్... ప్రాంతీయ పారీ్టల అడ్డా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ప్రాంతీయ పారీ్టల మధ్య చేతులు మారుతూ వస్తున్న కీలక నియోజకవర్గమిది. అయితే మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజం భజన్లాల్ పెట్టిన హరియాణా జనహిత్ కాంగ్రెస్ను ఆయన కుమారుడు కుల్దీప్ తిరిగి కాంగ్రెస్లోనే విలీనం చేశారు. దేవీలాల్ ముని మనవడు దుష్యంత్ చౌతాలా ఐఎన్ఎల్డీ తరఫున తొలిసారి 26 ఏళ్లకే ఎంపీ అయ్యారు! ఆ పారీ్టతో విభేదాలతో జేజేపీ ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి జేజేపీ నుంచి దుష్యంత్ తల్లి నైనా సింగ్ చౌతాలా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి దుష్యంత్ కుంటుంబానికే చెందిన దేవీలాల్ తనయుడు రంజిత్ సింగ్ చౌతాలా బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్, ఐఎన్ఎల్డీ నుంచి సునైనా చౌతాలా పోటీ చేస్తున్నారు. ఫరీదాబాద్.. బీజేపీ హ్యాట్రిక్ గురి ఈ పారిశ్రామిక హబ్లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ కృష్ణ పాల్ గుజ్జర్ హ్యాట్రిక్పై గురిపెట్టారు. కాంగ్రెస్ నుంచి మహేంద్ర ప్రతాప్ సింగ్, జేజేపీ నుంచి నళిన్ హుడా పోటీ పడుతున్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 బీజేపీ గుప్పిట్లోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.రోహ్తక్... కాంగ్రెస్ జైత్రయాత్రకు బ్రేక్ మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం పూర్తిగా కాంగ్రెస్ అడ్డా. ఆ పార్టీ జైత్రయాత్రకు 2019లో బీజేపీ బ్రేక్ వేసింది. ఆ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ కుమార్ శర్మ, కాంగ్రెస్ నుంచి దీపీందర్ సింగ్ హుడా మళ్లీ తలపడుతున్నారు. ఈ జాట్ ప్రాబల్య స్థానంలో 70 శాతం ఓటర్లు గ్రామీణులే. 20 శాతం మేర ఎస్సీలుంటారు. దీని పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 8 కాంగ్రెస్ చేతిలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.అంబాలా... దళితులే కీలకం ఒకప్పటి ఈ కాంగ్రెస్ కంచుకోటలోనూ కమలనాథులు పాగా వేశారు. 2014, 2019ల్లో బీజేపీ నుంచి గెలిచిన రతన్ లాల్ కటారియా మరణించడంతో ఈసారి ఆయన భార్య బాంటో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ములానా సిట్టింగ్ ఎమ్మెల్యే వరుణ్ చౌదరి బరిలో ఉన్నారు. ఇక్కడ 25 శాతం దళితులు, 20 శాతం వెనుకబడిన వర్గాలున్నాయి. పంజాబీ, సిక్కు, రాజ్పుత్, జాట్, బ్రాహ్మణ ఓటర్లూ కీలకమే. దళితుల్లో రవిదాసీయాలు 5 లక్షల మేర ఉంటారు.సిర్సా... కాంగ్రెస్ వర్సెస్ మాజీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ సునితా దుగ్గల్ను కాదని అశోక్ తన్వర్కు టికెటిచ్చింది. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన ఆయన ఇటీవలే బీజేపీలోకి జంప్ చేయడం విశేషం! కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ కుమారి సెల్జా బరిలో ఉన్నారు. ఆమె 1991లో తొలిసారి ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. జేజేపీ, ఐఎన్ఎల్డీలకు కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో పోటీ ఉత్కంఠ రేపుతోంది. -
నాడు అడ్డుకుని అరెస్ట్.. నేడు ప్రత్యర్థిగా తొడగొడుతున్నాడు!
విద్యార్థి నాయకుడిగా సీఎం కాన్వాయ్ను అడ్డుకున్నందుకు జైలు శిక్ష అనుభవించారు. ఏడేళ్ల తరువాత ఆయన మీదే పోటీ చేస్తున్నారు. ఆ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కాగా నాటి విద్యార్థి దివ్యాంశు బుధిరాజా. వీరిద్దరి ఆసక్తికర పోరుకు హరియాణాలోని కర్నాల్ లోక్సభ స్థానం వేదికగా మారింది. మాజీ సీఎం ఖట్టర్ బీజేపీ నుంచి, బుధిరాజా కాంగ్రెస్ టికెట్పై అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆరితేరిన నాయకుడు, విద్యార్థి ఉద్యమ కెరటం.. వీరిలో గెలుపెవరిదన్నది ఆసక్తిగా మారింది. కర్నాల్లో 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది...కర్నాల్ లోక్సభ స్థానంలో 1952 నుంచి 2009 దాకా కాంగ్రెస్ ఏకంగా 11 సార్లు గెలుపొందింది. 1996, 99 మాత్రమే మినహాయింపు. ఈ లోక్సభ స్థానం పరిధిలో 9 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కర్నాల్లో 68.31 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా ఏకంగా ఆరు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.వివాదాల సీఎం..ఆరెస్సెస్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దాకా ఎదిగిన ఖట్టర్కు ఇవి తొలి లోక్సభ ఎన్నికలు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాల్ నుంచే గెలిచారాయన. తొమ్మిదేళ్లు సీఎంగా చేశారు. అత్యాచారాలు, మహిళల సమస్యలపై ఖట్టర్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ‘‘మహిళలపై అత్యాచారాలు, ఈవ్ టీజింగ్గా చెబుతున్న ఉదంతాల్లో 90 శాతం వారి సమ్మతితో జరుగుతున్నవే. విభేదాలొచ్చి విడిపోయాక అమ్మాయిలు కేసులు పెడుతున్నారు. ఈ ధోరణికి కోర్టులే అడ్డుకట్ట వేయాలి’’ అనే వ్యాఖ్యలతో 2018లో వివాదాస్పదమయ్యారు. 2014 ఎన్నికలప్పుడూ మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శలకు గురయ్యారు. ఈ లోక్సభ ఎన్నికలకు ముందు సీట్ల పంపకంపై విభేదాలతో బీజేపీకి జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) గుడ్బై చెప్పింది. అధికార సంకీర్ణం నుంచీ బయటికొచ్చింది. దాంతో మార్చిలో ఖట్టర్ రాజీనామా చేశారు. 2014, 2019లో ఉన్న సానుకూలత ఆయనకు ఇప్పుడు కనిపించడం లేదు.పోరాటాల పిడికిలి..31 ఏళ్ల వయసున్న బుధిరాజా సోనిపట్ జిల్లా గోహనాలో పంజాబీ కుటుంబంలో జన్మించారు. తండ్రి క్లర్క్. తల్లి స్కూల్ టీచర్. 2017లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండగా పంచకుల ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల బృంద సారథిగా ఖట్టర్ కాన్వాయ్ను అడ్డుకుని అరెస్టయ్యారు. అంతకుముందు 2014లో పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఉన్నారు. 2021లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఎనిమిదేళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ అనూహ్యంగా కర్నాల్ టికెటివ్వడంతో ఖట్టర్ను ఢీకొంటున్నారు. ‘‘మా కుటుంబంలో ఎవరూ ఇంతవరకు కనీసం సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఒక సాధారణ యువకుడికి ఇలాంటి అవకాశం లభించినందుకు యువత సంతోషంగా ఉంది’’ అంటున్నారు. కర్నాల్ లోక్సభ స్థానం పరిధిలోని ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయవాదులూ బుధిరాజాకు మద్దతు తెలిపారు. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, ఎంపీ దీపేందర్ హుడా ఆశీర్వాదం, ఓటు బ్యాంకు మరింత కలిసొచ్చేవే. మోదీ సర్కారుపై రైతుల ఆగ్రహం తనను విజయతీరాలకు చేరుస్తుందని బుధిరాజా చెబుతున్నారు. ఇవీ సమస్యలు...! కర్నాల్, పానిపట్ జిల్లాలు జాతీయ రాజధాని ప్రాంత పరిధిలో ఉన్నాయి. దాంతో వాటిపై వాయు నాణ్యత ఆంక్షలున్నాయి. ఇది అభివృద్ధికి ఆటంకంగా ఉందని, రెండు జిల్లాలను ఎన్సీఆర్ పరిధి నుంచి తప్పించాలని స్థానిక పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. స్టార్టప్ ప్రాజెక్టులు, స్మార్ట్ సిటీ వంటి పలు సమస్యలూ ముందున్నాయి. -
కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
గురుగ్రామ్: కదులుతున్న బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. 17 మంది గాయపడ్డారు. హరియాణాలోని నుహ్ జిల్లా టౌరు సమీపంలో శని వారం వేకువజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. పంజాబ్లోని హోషియార్పూర్, లూధియానా జిల్లాలకు చెందిన సుమారు 60 మందితో కూడిన బంధువర్గం మథుర, బృందావన్ తీర్థయాత్రకు వెళ్లి తిరిగివస్తోంది. వీరి బస్సులో కుండ్లి– మనేసర్– పల్వాల్(కేఎంపీ)ఎక్స్ప్రెస్ వేపై వెళ్తుండగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు వాహన చోదకులు గమనించి డ్రైవర్ను హెచ్చరించారు. అతడు పట్టించుకోకపోవడంతో బస్సును వెంబడించారు. ఈలోగా బస్సులోపల మంటలు, పొగ వ్యాపించడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి పరారయ్యాడు. బస్సు మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి అతికష్టమ్మీద కిందికి దూకారు. అప్పటికే బస్సులోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. -
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి
చంఢీగడ్: హర్యానాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హర్యానాలోని నూహ్కు సమీపంలోని కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్ వేపై ఓ బస్సులో ఆకస్మత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణం చేస్తున్న 8 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. हरियाणा के नूंह जिले में बड़ा हादसा। टूरिस्ट बस में आग लगी। 8 यात्री जिंदा जले। काफी यात्री झुलस गए। ये सभी मथुरा–वृन्दावन से दर्शन करके पंजाब–हरियाणा की तरफ लौट रहे थे। रात 2 बजे कुंडली–मानेसर–पलवल एक्सप्रेस वे पर हादसा हुआ है।#haryana #Accident pic.twitter.com/Be0gInGJiq— ShivRaj Yadav (@shivayadav87_) May 18, 2024ఉత్తరప్రదేశ్లోని మధుర, బృందావనం యాత్రకు వెళ్లి వస్తుండగా శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నూహ్ ఎమ్మెల్యే అఫ్తాబ్ అహ్మద్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా పలువురు గాయపడ్డారని తెలిపారు.VIDEO | At least eight people were killed when the bus they were travelling in caught fire on the Kundli-Manesar-Palwal (KMP) Expressway near Nuh, #Haryana, late on Friday.(Source: Third Party) pic.twitter.com/xeE7XkhBGD— Press Trust of India (@PTI_News) May 18, 2024 -
చిక్కుల్లో హరియాణా సర్కారు!
రాష్ట్రాల్లో అవకాశం చిక్కినచోటల్లా విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచి, అధికారాన్ని చేజిక్కించు కోవటం అలవాటైన బీజేపీకి తొలిసారి సంకటస్థితి వచ్చిపడింది. హస్తినకు కూతవేటు దూరంలోవున్న హరియాణాలో ఆ పార్టీ ప్రభుత్వం సమస్యల్లో చిక్కుకుంది. సార్వత్రిక ఎన్నికల వేళ... రోడ్ షోలతో హోరెత్తించాల్సిన సమయంలో బీజేపీకి ఇదేమంత మంచి శకునం కాదు. అసలే ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడిందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. కనుక హరియాణా మాత్రమే కాదు... ఎన్నికలు జరగాల్సిన వేరే రాష్ట్రాల్లో కూడా వోటర్లకు వేరే సంకేతాలు వెళ్తాయి.ఈ నెల 25న ఆ రాష్ట్రంలోని పది లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా మంగళవారం ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. దాంతో 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. పైకి గంభీరంగా కనబడుతున్నా లోక్సభ ఎన్నికల హడావుడిలో తలమునకలైన బీజేపీకి దీంతో ఊపిరాడటం లేదు. ఎంపీలుగా పోటీ చేసేందుకు ఇద్దరు బీజేపీ సభ్యులు రాజీనామా చేయటంతో అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం సాగాలంటే బీజేపీకి 45 మంది మద్దతు అవసరం కాగా ఇద్దరు ఇండిపెండెంట్లు, హరి యాణా లోక్హిత్ పార్టీ సభ్యుడు బీజేపీకి మద్దతునిస్తున్నారు. అంటే బీజేపీ బలం 43కి పడిపోయింది. రెండు నెలల క్రితం బీజేపీ–జేజేపీ కూటమి సర్కారుకు నాయకత్వం వహిస్తున్న ఖట్టర్ను తొలగించి ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం నయాబ్సింగ్ సైనీని తీసుకొచ్చింది. దాంతోపాటు పదిమంది ఎమ్మెల్యేలున్న జన్నాయక్ జనతాపార్టీ (జేజేపీ)తో తెగతెంపులు చేసుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో వున్న పది స్థానాలూ గెల్చుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో జేజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వదల్చుకోలేదు. సహజంగానే అంతవరకూ ఉపముఖ్యమంత్రిగా వున్న జేజేపీ నేతదుష్యంత్ చౌతాలాకు ఇది ఆగ్రహం తెప్పించింది. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా చలవతోనే ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించు కున్నారన్నది వాస్తవం. అయితే కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే మద్దతిస్తామంటున్న జేజేపీ వాస్తవ బలమెంతో చెప్పలేం. ప్రస్తుత బేరసారాల్లో ఆ పార్టీకున్న పదిమంది ఎమ్మెల్యేల్లో ఎందరు మిగులుతారన్నది అనుమానమే. వారిలో నలుగురి మద్దతు తమకే వున్నదని సైనీ చెప్పు కుంటున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని జేజేపీ కోరినా అది బీజేపీకే తోడ్పడుతుంది. ఉన్న 88 మందిలో నలుగుర్ని అనర్హులను చేయగానే సభలో సభ్యుల సంఖ్య 84కి పడిపోతుంది. దాంతో 43 మంది మద్దతున్న బీజేపీ ప్రభుత్వం సునాయాసంగా బయటపడుతుంది.లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుండగా ప్రభుత్వ అస్తిత్వానికే ముప్పు ఏర్పడటం హరి యాణా ప్రజానీకానికి మంచి సంకేతం పంపదు. ఎమ్మెల్యేల బేరసారాలు కళ్లముందు స్పష్టంగా కన బడుతుండగా సుదీర్ఘ క్యూ లైన్లలో ఓపిగ్గా నిలబడి వోటేసేంత ఉత్సాహం ఎందరికుంటుంది? వచ్చే అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ కుర్చీలాట మొదలుకావటం వింత. రాష్ట్రంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదనటానికి ఈ సంక్షోభం సంకేతమని కాంగ్రెస్ నాయకుడు హుడా చెబుతున్నారు. నిజానికి జనం అలా అను కోవాలని, లోక్సభ ఎన్నికల్లో తమకే పట్టం కట్టా లని ఆయన ఆత్రుత పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఫిరాయింపులకు ఎవరు పాల్పడినా తప్పే. వేరే రాష్ట్రాల్లో బీజేపీ చేసినప్పుడు విమర్శించిన కాంగ్రెస్ హరియాణాలో అదే పనికి పూనుకోవటం నైతికంగా సరైందేనా? రాష్ట్రపతి పాలన కాంగ్రెస్ ఉద్దేశమని కొందరంటున్నారు. అందుకే మద్దతిస్తా మంటూ జేజేపీ ముందుకొచ్చినా హుడా సాను కూలత చూపలేదని వారి వాదన. లోక్సభ ఎన్నికల జంజాటం లేకపోతే కొన్ని గంటల్లోనే బీజేపీ సునాయాసంగా చక్కదిద్దగలిగేది. కేంద్రంలో తాముండగా హరియాణాలో సొంత ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలనకు బీజేపీ సిద్ధపడటం కల్ల. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయపై పడింది. బీజేపీకి లబ్ధి చేకూరేందుకు వీలుగా ప్రస్తుత ఎన్నికలు ముగిసేవరకూ సంక్షోభాన్ని కొనసాగించటం మాత్రం మంచిది కాదు. పాలకపక్షం సత్తాపై సంశయం ఏర్పడినప్పుడు నేరుగా అసెంబ్లీలోనే బలపరీక్షకు సిద్ధపడాలని కోరటం అన్నివిధాలా శ్రేయస్కరం. సంక్షోభాన్ని కొనసాగనిస్తే అనారోగ్యకర పరిణా మాలకు చోటిచ్చినట్టవుతుంది. ప్రభుత్వాల బలాబలాలు చట్టసభల్లో తేలాలి తప్ప రాజ్భవన్లలో కాదని చాన్నాళ్ల క్రితమే సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ వెంటనే బలపరీక్ష నిర్వహించటం సాధ్యంకాదనిపిస్తే కొంత వ్యవధి తీసుకోవచ్చు. అయితే ఈలోగా రాష్ట్రపతి పాలన విధించటమే ఉత్తమం. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పంజాబ్ రైతులతోపాటు హరియాణా రైతులు కీలక పాత్ర పోషించారు. ఇటీవలి రైతు ఉద్యమంలో కూడా వారి పాత్ర తక్కు వేమీ కాదు. రిజర్వేషన్లు కావాలంటూ 2016లో జాట్లు సాగించిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. అది కులాల మధ్య కుంపట్లు రాజేసింది. మరోపక్క ఉపాధి అవకాశాలు కరువై యువ తలో తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. ఖట్టర్ను సీఎం పదవి నుంచి తొలగించి సైనీని ప్రతిష్టించటం జాట్లకు ఆగ్రహం కలిగించిందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయపు టెత్తుల్లో అధికార, విపక్షాలు రెండూ తలమునకలైతే ఇప్పటికే ఉన్న సమస్యలు రెట్టింపవుతాయి. కనుక ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే కోణంలో కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలి. -
అక్కడ రాష్ట్రపతి పాలనకు సరైన సమయం: జైరాం రమేష్
చండీఘర్: దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.హర్యానాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ మెజారిటీని కోల్పోయింది, రాష్ట్రపతి పాలనకు ఇది సరైన సమయం అని జైరాం రమేష్ అన్నారు. ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో హర్యానా ప్రభుత్వం స్పష్టంగా మెజారిటీని కోల్పోయిందని అన్నారు. ఢిల్లీలో బీజేపీ రోజులు పోయినట్లే.. హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వం కనుమరుగయ్యే రోజులు దగ్గర పడుతున్నట్లు జైరాం రమేష్ అన్నారు.రాష్ట్రంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్కు లిఖితపూర్వకంగా రాసిన లేఖలో ప్రస్తావించారు.మే7న ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం వల్ల.. బీజేపీకి తమ మద్దతు ఇవ్వబోమని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల మధ్య, ఖట్టర్ స్థానంలో నయాబ్ సైనీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.#WATCH | On political developments in Haryana, Congress General Secretary in-charge Communications, Jairam Ramesh says, "I think the Haryana Government has clearly lost its majority when the 3 independent MLAs withdrew their support. It's the right case for President's Rule. This… pic.twitter.com/Zsta46WdE9— ANI (@ANI) May 10, 2024 -
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
హరియాణాలోని కురుక్షేత్ర లోక్సభ స్థానంలో ఎన్నికల పోరు రణరంగాన్నే తలపిస్తోంది. సాధారణంగా ముఖాముఖి పోరు సాగే ఈ నియోజకవర్గంలో ఈసారి మాత్రం బీజేపీ, ఆప్, ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) మధ్య త్రిముఖ పోరు నెలకొంది. గత రెండు ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి మాత్రం గెలుపు కోసం చెమటోడుస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచి్చన ప్రముఖ పారిశ్రామిక వేత నవీన్ జిందాల్కు టికెటిచి్చంది. ఇండియా కూటమి అభ్యరి్థగా ఆప్ నుంచి సుశీల్ గుప్తా, ఐఎన్ఎల్డీ తరఫున జాట్ నాయకుడు అభయ్ చౌతాలా పోటీ పడుతున్నారు. హరియాణా ముఖ్యమంత్రి నాయ»Œ æసింగ్ సైనీ ఇటీవలి దాకా ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉన్నారు.కురుక్షేత్రలో 2004, 2009ల్లో నవీన్ జిందాల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014, 2019ల్లో బీజేపీ భారీ విజయాలు సాధించింది. కురుక్షేత్రలో జాట్ సామాజికవర్గ ప్రాబల్యమున్న స్థానం. 17.88 లక్షల మంది ఓటర్లలో జాట్లు 14 శాతముంటారు. బ్రాహ్మణులు, సైనీలు చెరో 8 శాతం, సిక్కులు 6 శాతం, అగర్వాల్ సామాజికవర్గం 5 శాతం ఉన్నారు. అభయ్ చౌతాలా జాట్ నాయకుడు కాగా జిందాల్, సుశీల్ గుప్తాలది బనియా సామాజికవర్గం. పోరు బీజేపీ, ఆప్ మధ్యేనని తొలుత భావించినా ఐఎన్ఎల్డీ నుంచి జాట్ నేత రంగంలోకి దిగడంతో పోరు త్రిముఖంగా మారింది. బీజేపీకి రైతుల సెగగత రెండుసార్లూ బీజేపీ భారీ మెజారిటీలు సాధించినా, కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా పారీ్టపై ప్రస్తుతం వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దీనికితోడు రైతు సమస్యలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత మరింత సమస్యగా మారాయి. ఇటీవలి రైతుల ఆందోళనలు ఆ పార్టీ పుట్టి ముంచుతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పైగా ఆ సందర్భంగా వేలాది రైతులపై కేసులు పెట్టడం బీజేపీకి చాలా వ్యతిరేకంగా మారింది. భారతీయ కిసాన్ యూనియన్ (చారిణి) ఇప్పటికే చౌతాలాకు మద్దతిచ్చింది. ఈ యూనియన్ ఊరూరా రైతులతో సమావేశాలు నిర్వహించి మరీ ఐఎన్ఎల్డీకి మద్దతివ్వాలని కోరుతోంది. ఆప్ కూడా రైతులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, యువత, మహిళలకు నెలకు రూ.వేయి ఆరి్ధక సాయం వంటి హామీలతో దూసుకెళ్తోంది. ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు.జిందాల్ పొలం బాట బీజేపీకి ఎదురు గాలి వీస్తున్న సంకేతాలు అందుతుండటంతో పార్టీ అభ్యర్థి జిందాల్ ప్రచార శైలిని మార్చారు. ముఖ్యంగా రైతులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ట్రాక్టర్లు నడపడం, వరి పొలాల్లోకి దిగి రైతులతో మాట్లాడటం వంటివి చేస్తున్నారు. తన సంస్థల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు భారీగా ఉపాధి కలి్పస్తానని హామీ ఇస్తున్నారు. కురుక్షేత్రలో ఈ నెల 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, న్యూఢిల్లీ -
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
బీజేపీ పాలిత ర్యానాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో బలపరీక్ష డిమాండ్ చేసిన దుష్యంత్ చౌతాలాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. పానిపట్లోని మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఖట్టర్, మహిపాల్తో సుమారు అరగంటపాటు జేజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న తాజా సంక్షోభంపై చర్చించినట్లు సమాచారం.కాగా ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు (సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్) బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో నయాబ్ సింగ్ సైనీ సర్కార్ సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్కు లేఖ రాశారు. ఒకవేళ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కాంగ్రెస్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ మాజీ మిత్రపక్షమైన దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెలిపారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంచుకుంటే కాంగ్రెస్కు బయటి మద్దతు ఇస్తానని ప్రకటించారు. -
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్కు లేఖ రాసిన జేజేపీ
చండీగఢ్: ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరించుకోవటంతో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మిత్ర పక్షం జననాయక్ జనతా పార్టీ చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా అసెంబ్లీలో ఫోర్ టెస్ట్ (విశ్వాస పరీక్ష) నిర్వహించాలని గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.‘‘మేజార్టీని లేని బీజేపీ కూటమిని విశ్వాస పరీక్షకు పిలవాలని కోరుతున్నాం. ఇటీవల ఒక బీజేపీలో ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్యెల్యే రాజీనామా చేశారు. అదేవిధంగా ప్రస్తుతం మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరిచుకున్నారు. దీంతో బీజేపీ కూటమి ప్రభుత్వం మైనార్టీలో పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టండి. మేము ఫ్లోర్ టెస్ట్ తీర్మానికి మా పార్టీ తరఫున మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ చౌతాలా గవర్నర్కు రాసిన లేఖలో తెలిపారు.మరోవైపు.. ‘‘మేము గవర్నర్కు ఫ్లోర్ టెస్ట్ చేపట్టాలని లేఖ రాశాం. విశ్వాస పరీక్షలో జేజేపీ.. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది. మేము బహిరంగా మరో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి మా మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ ఓ వీడియో విడుదల చేశారు.ఇక.. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి)లు.. రోహ్తక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో బీజేపీకి తమ మద్దతును ఉపసహరించున్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 45 స్థానాలు. మనోర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 88. ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అయితే ముగ్గరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించగా.. బీజేపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.ఇక.. జేజేపీకి 10 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి కాంగ్రెస్ పార్టీ కూటమికి 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒకవేళ జేజేపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా మొత్తం సంఖ్య 43 కు చేరుంది. ఇలా అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటచేయాలంటే కూడా మరో ఇద్దరు ఎమ్యెల్యేలు అవసరం అవుతారు. ఎలా చూసినా కాంగ్రెస్కు ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
Lok Sabha Election 2024: ఓట్ల ‘బ్యాండ్’ బాజా!
ఎన్నికల ప్రచారంలో ఎవరి గోల వారిదే! అభ్యర్థులు ఎడాపెడా హామీలతో ఓటర్లకు గాలం వేస్తుంటే, ఎన్నికల అధికారులేమో పోలింగ్ శాతం పెంచేందుకు ‘బ్యాండ్’ బాజా మోగిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు, ముఖ్యంగా యువ ఓటర్లను బూత్లకు రప్పించేందుకు హర్యానా ఎన్నికల అధికారులు వినూత్నంగా మ్యూజికల్ బ్యాండ్లను రంగంలోకి దించుతున్నారు. ఎన్నికల థీమ్ సాంగ్స్తో మాంచి సంగీత విభావరుల ద్వారా వారిలో చైతన్యం పెంచే పనిలో పడ్డారు. ఈ బ్యాండ్లు ఓటర్లను, ముఖ్యంగా యువత ఓటేసేలా జోష్ నింపడంతో పాటు ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో అవగాహన కూడా పెంచుతాయని హర్యానా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ అగర్వాల్ చెబుతున్నారు. పంచ్కులలో తొలి ఎలక్షన్ థీమ్ మ్యూజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి మ్యూజిక్ బ్యాండ్స్ అలరిస్తాయని పేర్కొన్నారు. హర్యానాలో మొత్తం 10 లోక్సభ స్థానాలకు మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కనున్నారు. ఇక్కడ 18–19 ఏళ్ల ఓటర్లు 3.65 లక్షల మంది ఉండగా 20–29 వయస్సున్న ఓటర్ల సంఖ్య 39 లక్షలు. మ్యూజిక్ అంటే ఫిదా అయిపోయే యువతను లక్ష్యంగా చేసుకునే ఈసీ బ్యాండ్ మోగిస్తోంది. లోక్సభ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం ’చునావ్ కా పర్వ్ – దేశ్ కా గర్వ్‘ (ఓట్ల సంబరం – దేశానికి గర్వకారణం) నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని అగర్వాల్ చెప్పారు. ప్రజాస్వామ్యానికున్న పవర్ను, ఓటు ప్రాధాన్యాన్ని తెలుసుకోవడానికి యువత, ముఖ్యంగా తొలిసారి ఓటేసే యువతరం పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో హర్యానాలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కనీసం 75 శాతాన్ని టార్గెట్గా పెట్టుకున్నారట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
చంఢిగఢ్: లోక్సభ ఎన్నికల వేళ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా బీజేపీకి తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధావారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో బీజేపీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం పడదు. మాతో కూడా పలువురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. పలువురు నేతలు సైతం మాకు మద్దతుగా నిలుస్తున్నారు.వారిని రక్షించుకోవాలి.అయితే తర్వరలోనే తమతో ఎంతమంది టచ్లోకి వచ్చారన్న విషయంలో స్పస్టత వస్తుంది’ అని మనోహర్ లాల్ కట్టర్ అన్నారు.ఇక.. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి)లు.. రోహ్తక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో బీజేపీకి తమ మద్దతును ఉపసహరించున్న విషయాన్ని వెల్లడించారు.ఈ లోక్సభ ఎన్నికల్లో సీనియర్ నేత అయిన ఖట్టర్.. కర్నాల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని మొత్తం పది స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.హర్యానాలో మొతం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 45 స్థానాలు. మనోర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా రెండు స్థానాలు ఖాలీ అయ్యాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 88. ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.బీజేపీ హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అయితే నిన్న ముగ్గరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించగా.. బీజేపీ కి ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. -
బీజేపీని కూలదోస్తాం: దుష్యంత్ చౌతాలా!
ఒకవైపు దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు హర్యానా అసెంబ్లీలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. హర్యానాలోని నయాబ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరిస్తూ, కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు.జననాయక్ జనతా పార్టీ అధినేత, హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కూడా బీజేపీకి ఎదురు తిరిగి, కాంగ్రెస్కు తమ మద్దతు ప్రకటించారు. బలపరీక్ష జరిగితే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ ఎమ్మెల్యేలు మద్దతిస్తారని దుష్యంత్ వెల్లడించారు.రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బయటి నుంచి మద్దతిస్తామన్నారు. అయితే కాంగ్రెస్ ఈ విషయంలో ఏమి ఆలోచిస్తున్నదో చూడాలన్నారు. విప్కు అధికారం ఉన్నంత వరకు ఆయన ఆదేశాల మేరకు అందరూ ఓటు వేయాల్సిందేనన్నారు. అయితే అటు కాంగ్రెస్తో గానీ, ఇటు బీజేపీతో గానీ వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. -
హర్యానాలో బీజేపీ గట్టెక్కెనా?.. కాంగ్రెస్కు ఛాన్స్ ఎంత?
ఛండీగఢ్: లోక్సభ ఎన్నికల వేళ హర్యానా రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అధికార బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో హర్యానా సీఎం సైనీ మాట్లాడుతూ.. ముగ్గురు ఎమ్మెల్యేల మద్దుతు లేకున్నా తన ప్రభుత్వానికి ముప్పు లేదన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ముగ్గురు ఎమ్మెల్యేల ఆకాంక్షలు నెరవేరుస్తుందని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ఆశలు ఉంటాయి. కానీ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయి. తమ ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు. కానీ, వారి వ్యక్తిగత ఆకాంక్షలు మాత్రమే నెరవేరుస్తారు అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతును ఉపసంహరించుకున్నారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్, రణ్ ధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. VIDEO | "I have received this information. Some MLAs have their desires... Congress is fulfilling the desires, but people know everything. Congress is not concerned about the desires of people, but only about itself," says Haryana CM Nayab Singh Saini (@NayabSainiBJP) as three… pic.twitter.com/pmWwmF5oz1— Press Trust of India (@PTI_News) May 7, 2024 ఇక, వీరు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఈ పొలిటికల్ ట్విస్ట్ అనంతరం.. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. మైనారిటీలో పడిన హర్యానా ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదన్నారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. వారికి ధన్యవాదాలు. అయితే, హర్యానాలో ప్రస్తుతం బీజేపీకి జేజేపీ, స్వతంత్ర అభ్యర్థుల సపోర్టు కూడా లేదు. ప్రభుత్వం కొనసాగించే అర్హత లేదన్నారు.సమీకరణాలు ఇలా.. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మనోహర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా, రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అందువల్ల మిగిలి ఉన్న సభ్యుల సంఖ్య 88. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు 45. ఇక, ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హర్యానా లోఖిత్ పార్టీ 1 సీటు, 2 స్వతంత్రులను కలుపుకుంటే, ఎన్డీఏలో మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే బీజేపీ మెజారిటీకి ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఉంది.మరోవైపు.. కాంగ్రెస్కు మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. దీంతో, కాంగ్రెస్ మద్దతు సంఖ్య 33కు చేరుకుంది. ఇక, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, ఇటీవేల పలువురు జేజేపీ ఎమ్మెల్యేలు బీజేపీకి బైబై చెప్పారు. దీంతో, వారి నిర్ణయం కీలకంగా మారనుంది. అలాగే, మరో నలుగురు ఇండిపెండెంట్ల మద్దతు కూడా కీలకంగా మారనుంది. -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
హర్యానా: లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మంగళవారం తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం వల్ల.. బీజేపీకి తమ మద్దతు ఇవ్వబోమని పేర్కొన్నారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో రోహ్తక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయాన్ని ప్రకటించారు. రైతుల సమస్యలతో పాటు, ఇతర సమస్యలపై పోరాటడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు.#WATCH | Rohtak | Independent MLA from Haryana, Randhir Golan withdraws support from the Haryana govt, he says, "For the last 4.5 years, we extended support to the BJP. Today unemployment and inflation are at their highest. Looking at this, we have withdrawn our support (from the… pic.twitter.com/lNqo1NWobw— ANI (@ANI) May 7, 2024 -
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. -
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
అది 1995.. దేశంలోని హర్యానాలో చౌదరి బన్సీలాల్ ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని హర్యానా రాష్ట్ర ఇంచార్జిగా నియమించింది. మోదీకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, పార్టీ అతనికి హర్యానా బాధ్యతలను అప్పగించింది. నాటి రోజుల్లో పార్టీకి సొంత కార్యాలయం లేదు. పార్టీ సమావేశాలు అద్దె భవనంలో జరిగేవి.నరేంద్ర మోదీ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అతని చూపు అక్కడున్న దీపక్ అనే 12 ఏళ్ల బాలునిపై పడింది. ఆ కుర్రాడు సంఘ్ కార్యక్రమాలకు హాజరుకావడంతోపాటు, బీజేపీ కార్యాలయంలో వంటమనిషిగా కూడా పనిచేసేవాడు. మోదీ ఆ కుర్రాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మరుసటి రోజు రోహ్తక్ లో జరిగే బీజేపీ సమావేశానికి తనతో పాటు దీపక్ను కారులో తీసుకెళ్లారు.నాటి అనుభవాల గురించి దీపక్ మీడియాతో మాట్లాడుతూ ‘నాడు రోహ్తక్ నుంచి తిరిగి వస్తుండగా కిలా రోడ్డులో కారు ఆపిన మోదీ తనకు డబ్బులు ఇచ్చి , ఒక షార్ట్, టీ షర్ట్ కొనుక్కోమని చెప్పారు. తరువాత వాటిని వేసుకుని చూపించమన్నారు. కొద్దిసేపటి తరువాత కిచిడీ ఎలా చేయాలో చూపించారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నాకు నేర్పించారు.ఇక్కడికి వచ్చినప్పుడల్లా, నేను తయారుచేసిన కిచిడీని తినేవాడు. నేను అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతున్నాను. చదువు మానవద్దని చెబుతూ, నా స్కూలు ఫీజు కట్టేవారు. నన్ను చదువుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మోదీ ఆరేళ్లపాటు హర్యానా బీజేపీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.2002లో మోదీ.. దీపక్కు ఫోన్ చేశారు. అలాగే 2004, 2006లో కూడా దీపక్తో ఫోన్లో మాట్లాడారు. 2009లో మోదీ హిస్సార్లో జరగబోయే ర్యాలీకి వెళ్తుండగా హెలికాప్టర్ చెడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న దీపక్.. మోదీని కలుసుకున్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ.. దీపక్ను వేదికపైకి పిలిచి ప్రశంసించారు.తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్న పీఎంవో కార్యాలయ బృందం దీపక్ను ఇంటర్వ్యూ చేసింది. దీపక్ ఆచార్య నేపాల్కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కో-ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. -
కూటముల కురుక్షేత్రం
కురుక్షేత్ర యుద్ధాన్ని తలదన్నే రాజకీయాలకు హరియాణా ఆలవాలం. కుల సమీకరణాలు, పొత్తులు, కూటములు, వేరుకుంపట్లు ఇక్కడ పరిపాటి. జాతీయ పార్టీలతో పాటు ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీలూ రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి.రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే లోక్సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యం లభిస్తూ వస్తోంది. 2005 నుండి 2014 దాకా కాంగ్రెస్ చక్రం తిప్పగా పదేళ్లుగా బీజేపీ పట్టు బిగించింది. గత ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి 10 సీట్లను క్లీన్స్వీప్ చేసిన కమలనాథులను రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సున్నా చుట్టిన కాంగ్రెస్ ఈసారి ఇండియా కూటమి రూపంలో కాషాయ పార్టీని ఢీకొడుతోంది... – సాక్షి, నేషనల్ డెస్క్ఇండియా కూటమి, ప్రాంతీయ పార్టీలు సై... రైతు సమస్యలు తదితరాలతో రాష్ట్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతోంది. పొత్తులో భాగంగా 9 సీట్లలో కాంగ్రెస్, ఒకచోట ఆప్ పోటీ చేస్తున్నాయి. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా సారథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.ధరల పెరుగుదల, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, విపక్షాలపై వేధింపులు, నిరుద్యోగం తదితరాలను ఇండియా కూటమి ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. రైతు ఆందోళనలకు మద్దతుతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత హామీలను మేనిఫెస్టోలో చేర్చడం కలిసొస్తుందని ఆశపడుతోంది. ఐఎన్ఎల్డీ, జేజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తూ జాతీయ పార్టీలకు సవాలు విసురుతున్నాయి.అయితే జేజేపీ హరియాణా రాష్ట్ర చీఫ్ నిషాన్ సింగ్ ఎన్నికల వేళ పార్టీకి గుడ్బై చెప్పి షాకిచ్చారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కార్పొరేట్ దిగ్గజం నవీన్ జిందాల్ కురుక్షేత్రలో ఆప్ నేత సుశీల్ గుప్తాతో తలపడుతున్నారు. అది హాట్ సీట్గా అందరినీ ఆకర్షిస్తోంది. 2004, 2009ల్లో కాంగ్రెస్ తరఫున ఇక్కడ గెలిచిన జిందాల్ 2014లో బీజేపీ చేతిలో ఓడారు. 2019లో పోటీకి దూరంగా ఉన్నారు.బీజేపీకి కొత్త కష్టాలు...2014 లోక్సభ ఎన్నికల్లో 7 సీట్లు గెలిచిన ఊపులో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. మనోహర్లాల్ ఖట్టర్ సీఎం అయ్యారు. 2019లో 10 లోక్సభ సీట్లూ నెగ్గినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పుంజుకోవడంతో హంగ్ వచ్చింది. అయినా జేజేపీ, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మళ్లీ గద్దెనెక్కింది. జేజేపీ చీఫ్ దుష్యంత్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విభేదాలతో బీజేపీ, జేజేపీ పొత్తుకు తెరపడింది. దాంతో ఖట్టర్, దుష్యంత్ రాజీనామా చేశారు. ఎన్నికల ముందు ఓబీసీ వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ సీఎం అయ్యారు. తాజాగా వెల్లువెత్తిన రైతు ఆందోళనలూ బీజేపీకి ప్రతికూలంగా మారొచ్చని భావిస్తున్నారు. మోదీ కరిష్మా, అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ నినాదం తదితరాలనే పార్టీ నమ్ముకుంది.ప్రాంతీయ పార్టీల్లో చీలికలు... ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు, హరియాణా సీఎంగా, ఉప ప్రధానిగా చేసిన చౌదరి దేవీలాల్ అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన కుమారుడు ఓం ప్రకాశ్ చౌతాలా నాలుగుసార్లు సీఎం అయ్యారు. ఉద్యోగ నియామకాల కుంభకోణంలో ఆయన, అవినీతి కేసుల్లో పెద్ద కుమారుడు అజయ్ సింగ్ చౌతాలా జైలుకెళ్లారు. దాంతో రెండో కుమారుడు అభయ్ సింగ్ చౌతాలా పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్నదమ్ముల కుమ్ములాటతో పార్టీ చీలిపోయింది.అజయ్ సింగ్ కుమారులైన దుష్యంత్ చౌతాలా, దిగ్విజయ్ చౌతాలాను పార్టీ నుంచి తొలగించారు. దాంతో తండ్రి, సోదరునితో కలిసి దుష్యంత్ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ని స్థాపించారు. జేజేపీ గత లోక్సభ ఎన్నికల్లో ఆప్తో కలిసి పోటీ చేసినా ఒక్క సీటూ దక్కలేదు. అభయ్ సారథ్యంలోని ఐఎన్ఎల్డీ కూడా ప్రభావం చూపలేకపోయింది.2014లో హరియాణా జనహిత్ కాంగ్రెస్ (హెచ్జేసీ–బీఎల్) తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి పెద్దగా ప్రయోజనం లభించలేదు. బీజేపీ 8 స్థానాల్లో పోటీ చేసి ఏడింటిని దక్కించుకోగా మూడు చోట్ల పోటీ చేసిన హెచ్జేసీకి ఒక్క సీటూ దక్కలేదు. హరియాణా లో మూడుసార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసిన భజన్లాల్ 2007లో కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్తో కలిసి ఈ పార్టీని స్థాపించారు. 2016లో కాంగ్రెస్లో విలీనం చేశారు.పోలింగ్ తేదీ: మే 25 సర్వేలు ఏమంటున్నాయి?!బీజేపీ 8, ఇండియా కూటమి 2 సీట్లలో గెలుస్తాయని తాజా ఎన్నికల సర్వేలు అంచనా వేశాయి. సీఎం మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత, రైతు ఆందోళనలు, తదితర పరిణామాలు కమలనాథుల జోరుకు కళ్లెం వేస్తాయని మరికొందరు రాజకీయ పండితులు అంటున్నారు.హరియాణా రాజకీయాలు జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎత్తుజిత్తుల నడుమ సాగుతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో ఏడు సీట్లు గెలిచిన బీజేపీ 2019లో ఒంటరిగా పోటీ చేసి మొత్తం 10 సీట్లూ ఒడిసిపట్టింది. కాంగ్రెస్కు ఒక్క సీటూ దక్కలేదు. ప్రాంతీయ పార్టీ ఇండియన్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) 2014లో గెలిచిన 2 సీట్లనూ పోగొట్టుకుంది. -
ఎన్నికల ‘కురుక్షేత్రం’.. మూటలు మోసిన కుబేరుడు!
Naveen Jindal: ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆకట్టుకోవడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అపర కుబేరుడు, జిందాల్ స్టీల్స్ ఛైర్మన్ నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్లో కొనసాగారారు. 2004, 2009 ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. కొద్దిరోజుల కిందటే కాషాయ కండువా కప్పుకొన్న నవీన్ జిందాల్ అదే కురుక్షేత్ర నుంచి బీజేపీ టికెట్తో రంగంలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ జిందాల్.. స్థానిక మార్కెట్ యార్డులో మూటలు మోయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 50 కేజీల గోధుమ మూటను ఎత్తుకుని లారీలోకి లోడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. హర్యానాలోని మొత్తం 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అన్ని లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఆరో విడతలో అంటే మే 25వ తేదీన పోలింగ్ జరగనుంది. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయడానికి అటు ఎన్డీఏ, ఇటు ప్రతిపక్ష కూటమి పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. हरियाणा के किसान, देश की जान...🙏 pic.twitter.com/WNdJZduS1P — Naveen Jindal (@MPNaveenJindal) April 17, 2024 -
కెనడాలో కాల్పులు
ఒట్టావా: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాల ఘటనలు ఆగట్లేవు. తాజాగా కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్ ప్రాణాలు కోల్పోయారు. వాంకోవర్ సిటీ పరిధిలో 12వ తేన రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వాంకోవర్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం హరియాణాలోని సోనిపట్ నుంచి చిరాగ్ కెనడాకు వచ్చారు. విద్యార్థి వీసా మీద కెనడాకు వచ్చి ఎంబీఏ చేసి ఇక్కడే తాత్కాలిక ఉద్యోగంలో చేరారు. ఏప్రిల్ 12వ తేదీన చిరాగ్ తన కారులో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి చిరాగ్ తన కారులో విగతజీవిగా పడి ఉన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్ట్చేయలేదు. చిరాగ్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు భారత సర్కార్ సాయపడాలంటూ చిరాగ్ కుటుంబం ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తిచేసింది. -
షూట్ విషయంలో గొడవ.. బిల్డింగ్పై నుంచి దూకిన యూట్యూబ్ జంట
క్షణికావేశంలో తీసుకునే కఠిన నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చిన్న చిన్న సంఘటనలు చిలికి చిలికి గాలి వానలా మారడంతో నిండు జీవితాలు బలైపోవడమే కాకుండా.. కుటుంబీకుల్లోనూ కొండంత విషాదాన్ని మిగిల్చుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలోని బహదూర్ఘర్లో వెలుగుచూసింది. ఓ విషయంలో గొడవపడిన జంట.. తొందరపాటు నిర్ణయంతో బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను డెహ్రడూన్కు చెందిన గర్విత్ 25, నందిని 22గా గుర్తించారు. గర్విత్, నందిని ఇద్దరూ కంటెంట్ క్రియేటర్స్, సొంతంగా ఛానల్ పెట్టి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రీల్స్, షార్ట్ వీడియోలు చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల కిత్రమే ఈ జంట తమ టీమ్తో కలిసి డెహ్రడూన్ నుంచి బహదూర్ఘర్కు మారారు. రుహీలా రెసిడెన్సీలోని ఏడవ అంతస్తులో ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. టీమ్లోని మరో అయిదుగురు రూమ్మేట్స్తో జీవిస్తున్నారు. ఈ క్రమంలో బయట షూటింగ్ పూర్తి చేసుకొని శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. అయితే ఇద్దరి మధ్య షూట్ విషయంలో వాగ్వాదం ఏర్పడింది. ఇది కాస్తా పెరిగి పెద్దది అవ్వడంతో క్షణికావేశంలో జంట బిల్డింగ్ ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చివరగా.. ఏ సమస్యకైనా ఆలోచిస్తే తప్పక పరిష్కారం ఉంటుంది.. ప్రాణానికి మించింది ఏదీ లేదు.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవితాలను బలితీసుకోవద్ద -
స్కూలు బస్సు బోల్తా... ఎనిమిదిమంది చిన్నారులు దుర్మరణం!
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిదిమంది చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈరోజు(గురువారం) ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. కనీనా పట్టణం సమీపంలోని కనీనా- దాద్రి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బస్సు అతి వేగంతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కనీనాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్కు చెందినది. విద్యార్థులతో వెళుతున్న ఈ బస్సు ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది విద్యార్థులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను రోహ్తక్ పీజీఐకి తరలించారు. ఈద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పలు ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. ఇదే కోవలో జీఎల్ పబ్లిక్ స్కూల్కు కూడా సెలవు ఇవ్వలేదు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం మహేంద్రగఢ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం నుంచి ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన రాలేదు. -
చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!
చిన్నారులు తమలో దాగున్న అసాధారణ ప్రతిభను బయటపెట్టి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. అవన్నీ ఏదో వాళ్ల పెద్దొళ్ల ట్రైనింగ్ లేదా వాళ్ల ఆసక్తి కొద్ది త్వరితగతిన నేర్చుకున్నవి. అయినా ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదన్న రీతిలో అంత పసిమొగలు కూడా అలవోకగా నేర్చుకోవడం జరుగుతుంది. అదే బరువుల ఎత్తడం లాంటి వాటి వద్దకు వస్తే..అంత ఈజీ కాదు. కానీ ఈ చిచ్చర పిడుగు రామయణంలో సీత శివధనుస్సు ఎత్తినట్లుగా ఈజీగా ఎన్ని కిలోలు ఎత్తిపడేసిందో తెలుసా..! అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో 9 ఏళ్ల చిన్నారి జిమ్లో ఏకంగా 75 కిలోల బరువుని అలవోకగా ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి హర్యానాకు చెందిన అర్షియా గోస్వామి. ఈ వీడియోని చూసిన ఫిట్నెస్ ఔత్సాహికులు, నిపుణులు, నెటిజన్లు ఆమెను వావ్ నువ్వు గ్రేట్ రా అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఇక ఆర్షియా వెయిట్ లిఫ్టింగ్ అంటే ఆమెకు అత్యంత ఇష్టమట. అంతేగాదు చిన్న వయసులోనే అధిక బరువుల లిఫ్ట్ చేసిన పిన్న వయస్కురాలిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకెక్కింది. అంతేగాదు ఆరేళ్ల ప్రాయంలోనే ఏకంగా 45 కిలోల బరువు ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచిందంటా. నిజంగా ఆ చిట్టి తల్లి గ్రేట్ కదూ. మిగతా రంగాలన్ని ఏదో ప్రాక్టీస్ చేసి సాధించేయొచ్చు కానీ ఇది తనకు మించిన బరువు ఎత్తడం అది కూడా అంత చిన్న వయసులో అంటే..మాములు విషయం కాదు కదా..! View this post on Instagram A post shared by Arshia Goswami (@fit_arshia) (చదవండి: కళకు వయసుతో సంబంధం లేదంటే ఇదే! నలభైలలో ఆ మదర్స్..!) -
మాజీ సీఎంపై సంజయ్దత్ పోటీ.. నిజమేనా?
ముంబై : బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి వస్తున్నారా? లోక్సభ ఎన్నికల్లో మాజీ సీఎం ప్రత్యర్ధిగా బరిలోకి దిగనున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో వార్తలు. అందుకు సంజయ్ దత్ ఏమన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సంజయ్దత్ ఓ రాజకీయ పార్టీలో చేరబోతున్నారని, ఆ పార్టీ తరుపున ఎన్నికల్లో చేయబోతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. ఈ తరుణంలో తనపై వస్తున్న రూమర్స్కు సంజయ్దత్ చెక్ పెట్టారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. ఒకవేళ రాజకీయాలు చేయాలని నిర్ణయించుకుంటే, నేనే స్వయంగా ప్రకటిస్తానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నేను ఏ పార్టీ చేరడం లేదు ‘నేను రాజకీయాల్లోకి వస్తున్నానే పుకార్లకు స్వస్తి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ పార్టీలో చేరడం లేదు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు. దయచేసి నా గురించి వస్తున్న ప్రచారాల్ని మీరు నమ్మకండి అని పోస్ట్ చేశారు. I would like to put all rumours about me joining politics to rest. I am not joining any party or contesting elections. If I do decide to step into the political arena then I will be the first one to announce it. Please refrain from believing what is being circulated in the news… — Sanjay Dutt (@duttsanjay) April 8, 2024 ఖట్టర్కు పోటీగా సంజయ్ దత్ అంటూ అంతకుముందు సంజయ్దత్ హర్యానాలోని కర్నాల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ బలమైన నేత, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్కు పోటీగా సంజయ్ దత్ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరిగింది. హర్యానాతో ఉన్న అనుబంధంతో అందుకు హర్యానాతో సంజయ్ దత్కు ఉన్న అనుబంధమేనని తెలుస్తోంది. సంజయ్దత్ పూర్వీకుల గ్రామం యమునానగర్ జిల్లాలో ఉంది. గతంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నాయకుడు అభయ్ సింగ్ చౌతాలా కోసం ఎన్నికల ప్రచారం చేసేందుకు హర్యానాకు వచ్చారు. దీంతో పాటు సంజయ్ దత్ తండ్రి, నటుడు, దివంగత సునీల్ దత్ పలు మార్లు కాంగ్రెస్ ఎంపీగా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన సోదరి ప్రియా దత్ కూడా కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. ప్రచారానికి పులిస్టాప్ ఈ సారి లోక్సభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సంజయ్దత్ను ఎన్నికల బరిలోకి దించుతుందనే ప్రచారానికి బలం చేకూరినట్లైంది. ఇక సంజయ్దత్ ట్వీట్తో ప్రచారానికి పులిస్టాప్ పడింది. కాగా, 2014, 2019 ఎన్నికల్లో హర్యానా కర్నాల్ లోక్సభ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. అంతకు ముందు రెండు పర్యాయాలు ఈ సీటు కాంగ్రెస్కు దక్కింది.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement