-
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
ఆరోగ్య బీమా రంగ సంస్థలు పాలసీదారులకు షాకివ్వబోతున్నాయి. గతేడాదిగా పాలసీ ప్రీమియంను దాదాపు 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రీమియం ఛార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని లోకల్సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు.ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు 2023లో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా కంపెనీలు రికార్డు స్థాయిలో లాభాలు పొందుతున్నాయి. వాటి సరాసరి వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా నమోదవుతుంది. కరోనాతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, క్రమంగా తగ్గుతోంది. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా!
అరవై అయిదేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది అక్షరాలా ఆనందం కలిగించే వార్త. పిల్లలు, విద్యార్థులు, గర్భిణులు, సీనియర్ సిటిజన్లతో సహా అన్ని వర్గాలకూ ఆరోగ్య బీమా పాలసీలు అందివ్వాలనే కొత్త నిర్ణయం వచ్చింది. దేశంలోని బీమా పాలసీలకు సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ అయిన ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (ఐఆర్డీఏఐ) ఆ మేరకు బీమా సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై క్యాన్సర్, హృద్రోగం, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ లాంటి వ్యాధులున్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీల్లేదని తేల్చింది. అదే సమయంలో, నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యా వయసుల వారికి తగ్గట్టుగా ప్రత్యేకమైన బీమా పాలసీలు రూపొందించుకొనే స్వేచ్ఛ సంస్థలకు ఇచ్చింది. దీంతో, ఇప్పుడిక 65 ఏళ్ళు, ఆపై బడిన తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకొనే వీలు చిక్కింది. 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కిందకు తెస్తామని అధికార పక్షం పేర్కొన్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం గమనార్హం. అలాగే, సీనియర్ సిటిజన్ల సమస్యలు, ఆరోగ్య బీమా క్లెయిమ్ల సత్వర పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు ప్రాధికార సంస్థ సూచించింది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల (పీఈడీ) విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మునుపటి 48 నెలల నుంచి 36 నెలలకే తగ్గించింది. బీమా అంశంలో ఈ సరికొత్త సంస్కరణలు అటు ఊహించని ఆరోగ్య ఖర్చులు ఎదురైన వృద్ధులకే కాక, వయసు మీద పడ్డ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగులకూ పెద్ద ఊరట. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారి నుంచి తమకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు రక్షణనిచ్చేందుకు కొండంత అండ. వయోవృద్ధులకు పరిమిత ప్రయోజనాలే అందిస్తున్న ప్రస్తుత ధోరణి నుంచి బీమా సంస్థలు బయటకొచ్చి, తల్లితండ్రులతో సహా పాలసీదారు కుటుంబం మొత్తానికీ సమగ్ర బీమా వసతి కల్పించేలా కొత్త పాలసీలు తేగలుగుతాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను సైతం మార్చగలుగుతాయి.నిజానికి, వయసు మీద పడ్డాకనే ఎవరికైనా ఆరోగ్య బీమా మరింత అవసరం, ఉపయోగం. ఇప్పటి దాకా నిర్ణీత వయసు దాటాక వ్యక్తిగత ఆరోగ్య బీమాకు వీలుండేది కాదు. కానీ, కొత్త సంస్క రణలతో ఆ అడ్డంకి తొలగింది. ప్రత్యేకించి రానున్న రోజుల్లో మన దేశ జనాభాకు ఇది కీలకం. 2011 తర్వాత దేశంలో జనగణన జరగలేదన్న మాటే కానీ, ఐరాస జనాభా నిధి, ఇతర నిపుణుల లెక్క ప్రకారం భారత జనాభా చైనాకు సమానంగా ఉంది. 2023లో ఒక దశలో మనం చైనాను దాటినట్టు కూడా అంచనా. ఈ ఐరాస అంచనాల ఆధారంగా నిరుడు ‘భారత వార్ధక్య నివేదిక – 2023’ను సిద్ధం చేశారు. దాని ప్రకారం దేశంలో 10 శాతమున్న సీనియర్ సిటిజన్ల జనాభా వచ్చే 2050 నాటికి ఏకంగా 30 శాతానికి పెరగనుంది. మరోమాటలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 2022 నాటి 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుతుంది. అది అమెరికా ప్రస్తుత జనాభా కన్నా ఎక్కువ. ఒక్క భారత్లోనే కాదు... అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వయోవృద్ధులు దాదాపు 16 నుంచి 28 శాతం దాకా ఉన్నారు. మెరుగైన ఆరోగ్య వసతులు, పెరిగిన ఆయుఃప్రమాణం వల్ల ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సీనియర్ సిటిజన్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య వ్యవస్థలున్నా, ఇతర దేశాల్లో మాత్రం ఖరీదైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణే దిక్కు. అలాంటి చోట్ల ఖర్చెక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమాకు చెల్లించాల్సిన ప్రీమియమ్లూ ఎక్కువన్నది నిజమే. కానీ, 65 ఏళ్ళు దాటితే కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి వీలు కాదనే నిబంధన చాలా దేశాల్లో లేదని గమనించాలి. ఇప్పుడు మన దేశమూ ఆ మార్గంలోకి వచ్చి, గరిష్ఠ వయఃపరిమితి షరతు లేకుండా, అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్న మాట. దానికి తోడు పీఈడీ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం, తీవ్ర వ్యాధులున్నా సరే బీమా ఇవ్వాలనడం ప్రజానుకూల, ప్రశంసాత్మక నిర్ణయాలు. ప్రాధికార సంస్థ ఆ మధ్య జీవిత బీమా పథకాల సరెండర్ ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చింది. మళ్ళీ ఇప్పుడిలా వినియోగదారుల పక్షాన మరోసారి మరికొన్ని నిబంధనల్ని సవరించడం విశేషం. అయితే, అదే సమయంలో బీమా సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడడం అవసరం. ప్రాధికార సంస్థ ఆదేశాల స్ఫూర్తిని విస్మరించి, అందుబాటులో లేని అతి ఖరీదైన పాలసీలను సంస్థలు తీసుకొస్తే నిష్ప్రయోజనం. అర్థం కాని సాంకేతిక పదజాలం, సంక్లిష్టతలతో పాలసీలు తీసుకొచ్చినా కస్టమర్లు విముఖత చూపుతారు. పాలసీలలో పారదర్శకత పాటిస్తూ, ఇబ్బంది లేకుండా సులభంగా క్లెయిమ్లు పరిష్కారమయ్యే మార్గాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మంచిది. అప్పుడే వినియోగదారులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. తాజా బీమా సంస్కరణల తాలూకు ఫలితమూ సమాజానికి అందివస్తుంది. దేశంలోని సీనియర్ సిటి జన్లలో నూటికి 98 మందికి ఇవాళ్టికీ ఆరోగ్య బీమా లేకపోవడం సిగ్గుచేటు. అంతకంతకూ పెరుగు తున్న వైద్య, ఆరోగ్యసేవల ఖర్చు రీత్యా బీమా ఆపత్కాలంలో బలమైన భరోసా. జీవితం పొడు గునా కుటుంబానికీ, సమాజానికీ తమ వంతు సేవ చేసి, ప్రకృతి సహజపరిణామంగా వయసుపై పడ్డ ఈ పండుటాకుల గురించి పాలకులు లోతుగా ఆలోచించాలి. బీమా పాలసీలొక్కటే సరిపోవు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ వారి బాగు కోసం ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి. -
Health Insurance: ఎక్కడైనా నగదు రహిత వైద్యం!
ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో ఉన్న ముఖ్యమైన సదుపాయాల్లో ఒకటి నగదు రహిత వైద్యం. ముందస్తు ప్రణాళికతో లేదా అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా ఈ సదుపాయం ఎంతో అక్కరకు వస్తుంది. సాధారణంగా బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే ఈ నగదు రహిత వైద్యం అందుబాటులో ఉండేది. నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే, సొంతంగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తప్పిస్తూ.. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత వైద్యం పొందేందుకు వీలుగా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ ఏడాది జవనరి నుంచి ‘ఎక్కడైనా నగదు రహితం’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి విధి విధానాలేమిటో చూద్దాం. బీమా సంస్థ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లోనూ నగదు రహిత చికిత్స పొందడమే నూతన విధానంలోని సౌలభ్యం. ప్రతి బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ పేరుతో ఒక జాబితా నిర్వహిస్తుంటుంది. ఆ జాబితాలోని ఏ హాస్పిటల్లో చికిత్స పొందినా బీమా సంస్థే నేరుగా చెల్లింపులు చేస్తుంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ నెట్వర్క్ ఆస్పత్రిలోనే చికిత్స పొందాలంటే సాధ్యపడకపోవచ్చు. ప్రమాదానికి గురైనప్పుడు వేగంగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల విలువైన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఆ ఆస్పత్రి బీమా నెట్వర్క్లో భాగంగా లేకపోతే? బిల్లు భారీగా వస్తే..? ఆ మొత్తాన్ని రోగి సంబందీకులు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అయి, సత్వర వైద్యం అందాల్సిన సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి తరుణంలో సమీపంలోని హాస్పిటల్కు వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎక్కడైనా నగదు రహితం ఉపయోగపడుతుంది. అత్యవసరమనే కాదు, ముందుగా అనుకుని నిర్ణిత సమయానికి తీసుకునే చికిత్సలకు సైతం నాన్ నెట్వర్క్ హాస్పిటల్కు వెళ్లొచ్చు. కాకపోతే ఎక్కడైనా నగదు రహితం విధానం ఎలా పనినిచేస్తుందో తెలుసుకోవడం అవసరం. నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందే.. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి రావడానికి ముందు కూడా కొన్ని బీమా సంస్థలు నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి అవకాశం కల్పించాయి. ఇప్పుడు ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నేషనల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ జనరల్, బజాజ్ అలియాంజ్ జనరల్ సైతం నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశాయి. ముందస్తుగా నిర్ణయించుకుని, తీసుకునే చికిత్స విషయంలో బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్ (టీపీఏ)కు రెండు నుంచి మూడు రోజుల ముందు (48–72 గంటలు) తెలియజేయడం తప్పనిసరి. ఈ మెయిల్ లేదంటే ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా లేదంటే లిఖిత పూర్వకంగా బీమా సంస్థకు తెలియజేయవచ్చు. అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సి వస్తే కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరిన 24 నుంచి 48 గంటల్లోపు (బీమా సంస్థ ఆధారంగా వేర్వేరు) విషయాన్ని తెలియజేయాలి. 15 పడకలు తప్పనిసరి.. నగదు రహిత వైద్యం పొందేందుకు ఎంపిక చేసుకునే ఆస్పత్రిలో కనీసం 15 పడకలు (బెడ్స్) ఉండాలన్నది నిబంధన. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నిబంధనలకు అనుగుణంగా, హాస్పిటల్ అనే నిర్వచనానికి అనుగుణంగా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పనిచేస్తూ ఉండాలి. గుర్తింపు కార్డులు, పాలసీ డాక్యుమెంట్లు, మెడికల్ రిపోర్ట్లు, పి్రస్కిప్షన్లు, బిల్లులు నిర్ధేశిత ఫార్మాట్లో బీమా సంస్థకు పంపించాల్సి ఉంటుంది. నగదు రహిత వైద్యానికి అనుమతించే ముందు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి ఆమోద లేఖను చాలా బీమా సంస్థలు కోరుతున్నాయి. ఆస్పత్రి బిల్లులు నిజమైనవేనా? ప్రామాణిక అడ్మిషన్ ప్రక్రియ విధానాన్నే అనుసరిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగానే చికిత్సా విధానాలు ఉన్నాయా? అని బీమా సంస్థలు పరిశీలిస్తాయి. ఇక పాలసీకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధుల చికిత్సా క్లెయిమ్లో వేచి ఉండాల్సిన కాలం), కోపే క్లాజ్, మినహాయింపులు, ముందస్తు వ్యాధుల నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని గమనించాలి. కొన్ని చికిత్సలకు సంబంధించి (ఉదాహరణకు కేటరాక్ట్) ఉప పరిమితులు ఉంటే, వాటి విషయంలోనూ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. పాలసీలో ప్రత్యేకమైన రైడర్ తీసుకుంటే తప్ప కాటన్, ఫేస్ మాస్్కలు, సర్జికల్ గ్లోవ్లు, నెబ్యులైజేషన్ కిట్లకు పరిహారం రాదు. ఏవైనా అదనపు చార్జీలు (కవరేజీలోకి రానివి) విధిస్తే, పాలసీదారు సొంతంగా చెల్లించుకోవాలి. చార్జీల పట్ల అవగాహన నెట్వర్క్ ఆస్పత్రులు వివిధ రకాల చికిత్సలకు వసూలు చేసే చార్జీల వివరాలు బీమా సంస్థ రికార్డుల్లో ఉంటాయి. దీనివల్ల పాలసీదారు సొంత పాకెట్పై భారం పడదు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్సలకు ఎంత చార్జీ వసూలు చేస్తారన్నది కీలకం అవుతుంది. నెట్వర్క్ హాస్పిటల్కు మించి నాన్ నెట్వర్క్ ఆస్పత్రి చార్జీ చేస్తే, అప్పుడు క్లెయిమ్ పూర్తిగా రాకపోవచ్చు. పైగా ఆస్పత్రి పడకలు, ఏ ప్రాంతంలో ఉందన్న దాని ఆధారంగా చికిత్సల ధరలు ఉంటాయి. ఉదాహరణకు ఒక చికిత్సకు నెట్వర్క్ హాస్పిటల్లో రూ.50,000 పరిమితి ఉందనుకోండి. అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో ఇదే చికిత్సకు రూ.70,000 వేలు చార్జ్ చేస్తే, పాలసీదారు తాను సొంతంగా రూ.20,000 చెల్లించాల్సి వస్తుంది. అందుకని నగదు రహిత వైద్యం కోరుకునే వారు తమ పాకెట్ నుంచి పెద్దగా చెల్లించొద్దని భావిస్తే, అప్పుడు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్కు వెళ్లడం మంచిది. కొన్ని సందర్భాల్లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. అలాంటప్పుడు పాలసీదారు సొంతంగా చెల్లించి, డిశ్చార్జ్ తర్వాత రీయింబర్స్మెంట్కు వెళ్లాల్సి వస్తుంది. రోగికి శరవేగంగా చికిత్స అవసరమైతే తప్పించి, మిగిలిన వాటికి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ను ఎంపిక చేసుకోకపోవడం మంచిది. నెట్వర్క్–నాన్ నెట్వర్క్ బీమా సంస్థ నగదు రహిత వైద్యం అందించేందుకు వీలుగా పలు ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందానికి వచ్చిన ఆస్పత్రులు నెట్వర్క్ జాబితాలో ఉంటాయి. ఇలా ఒప్పందం చేసుకునే సమయంలోనే చికిత్సల ధరల విషయంలో బీమా సంస్థ ఆస్పత్రులతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. దీనివల్ల బీమా సంస్థకు కొంత భారం తగ్గుతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్తో ఈ అనుకూలత బీమా సంస్థలకు ఉండదు. బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు అన్నింటికంటే ముఖ్యమైనది.. చికిత్స కోసం ఎంపిక చేసుకునే నాన్ నెట్వర్క్ ఆస్పత్రి బీమా సంస్థ బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. బ్లాక్ లిస్ట్లోని ఆస్పత్రిలో చేరడం వల్ల నగదు రహిత వైద్యం అందదు. రీయింబర్స్మెంట్కు కూడా అవకాశం ఉండదు. దీనివల్ల మొత్తానికే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అత్యవసరంగా చికిత్స అవసరమైనప్పుడు కూడా బీమా సంస్థ పోర్టల్కు వెళ్లి బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితాను ఓ సారి పరిశీలించడం ఎంతో మంచిది. ఇక ముందస్తు ప్రణాళికతో తీసుకునే చికత్సలకు బీమా సంస్థ నెట్వర్క్లోని హాస్పిటల్కు వెళ్లడమే మేలు. ఎందుకంటే నెట్వర్క్ ఆస్పత్రులు బీమా సంస్థ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు దాదాపుగా ఎదురుకావు. నెట్వర్క్ హాస్పిటల్తో లాభాలు ► నెట్వర్క్ (ఎంపానెల్డ్) ఆస్పత్రుల్లో టారిఫ్లు బీమా సంస్థతో కుదిరిన అంగీకారం మేరకు ఉంటాయి. చికిత్సల చార్జీలు నిర్ధేశిత పరిమితుల పరిధిలోనే ఉంటాయి. దీంతో క్లెయిమ్కు సత్వర ఆమోదం లభిస్తుంది. వేగంగా డిశ్చార్జ్ కావచ్చు. ► నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ పరిష్కారం సాఫీగా, వేగంగా జరుగుతుంది. ► నెట్వర్క్ ఆస్పత్రులు అన్నింటిలోనూ చికిత్సల నాణ్యాత ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో రోగులకు చికిత్సల తర్వాత సమస్యల రిస్క్ తగ్గుతుంది. ► ఆస్పత్రి, బీమా సంస్థ మధ్య విశ్వసనీయమైన బంధం వల్ల చికిత్సల బిల్లులను మరీ పెద్దవి చేసి చూపించడం ఉండదు. అనవసర ప్రక్రియలు, ఔషధాల వినియోగం ఉండదు. మోసాల రిస్క్ తగ్గుతుంది. -
తీవ్ర వ్యాధులపై బ్రహ్మాస్త్రం..!
జీవనశైలి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అదే సమయంలో వైద్య శాస్త్రం పురోగతి, అత్యాధునిక టెక్నాలజీ, రోబోటిక్ పుణ్యమా అని మెరుగైన చికిత్సా విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కనుక ఇప్పుడు ఏదైనా తీవ్ర ఆరోగ్య సమస్య వస్తే, వైద్యుల కృషితో విజయవంతంగా అధిగమించొచ్చు. కానీ, ఇందుకు కావాల్సిందల్లా ముందస్తు సన్నద్ధత. అందుకే ఆరోగ్య బీమా ఎంత అవసరమో.. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో.. అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు, ముందస్తుగా అనుకుని ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు కవరేజీ వర్తిస్తుంది. కానీ, ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ (మొండి వ్యాధులు, తీవ్ర అనారోగ్యం) కారణంగా ఎక్కువ రోజుల పాటు చికిత్స అవసరం పడితే ఏంటి పరిస్థితి..? రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న కవరేజీ సరిపోతుందా..? చాలకపోవచ్చు. రెగ్యులర్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని రకాల వ్యాధుల్లోనూ గట్టెక్కిస్తుందని అనుకోవద్దు. తీవ్ర వ్యాధుల్లో చికిత్సల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే అప్పుడు ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి సందర్భాలను అధిగమించేందుకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఆదుకుంటుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ విడిగా ప్లాన్ రూపంలోనూ లేదంటే రైడర్ రూపంలోనూ తీసుకోవచ్చు. పాలసీలో పేర్కొన్న ఏదైనా వ్యాధి బారిన పడినట్టు తేలితే నిబంధనల మేరకు పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. ఇండెమ్నిటీ పాలసీలు కేవలం ఆస్పత్రిలో అయ్యే వ్యయాలకే పరిహారాన్ని చెల్లిస్తాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అలా కాదు. ఏక మొత్తంలో చెల్లింపులు చేస్తాయి. దీంతో ఆయా తీవ్ర వ్యాధుల చికిత్సకు అయ్యే భారీ వ్యయాలను తట్టుకోగలరు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కింద ఏకమొత్తంలో వచి్చన పరిహారాన్ని దేనికి అయినా వినియోగించుకోవచ్చు. చికిత్స కోసమే వినియోగించాలని లేదు. కనుక రెగ్యులర్ ఇండెమ్నిటీ ఆధారిత ఆరోగ్య బీమా పాలసీ కింద ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, అదనంగా అయ్యే వ్యయాలను క్రిటికల్ ఇల్నెస్ కవరేజీతో గట్టెక్కొచ్చు. కానీ, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ తీసుకున్న వెంటనే అమల్లోకి రాదు. ఓ చిన్న కొర్రీ ఉంటుంది. అదే సర్వైవల్ పీరియడ్. అలాగే, మరికొన్ని షరతులు కూడా ఉంటాయి. వీటిపై అవగాహనతోనే క్రిటికల్ ఇల్నెస్ కవర్ తీసుకోవాలి. సరై్వవల్ పీరియడ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్ను ఇండివిడ్యువల్ ప్లాన్గాను, లేదంటే రైడర్గానూ తీసుకోవచ్చు. జీవిత బీమా కంపెనీలు దీన్ని ఎండోమెంట్, టర్మ్ ప్లాన్లకు రైడర్గా అందిస్తుంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాండలోన్ పాలసీగా ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో సరై్వవల్ పీరియడ్ (జీవించి ఉండే కాలం) అనే క్లాజ్ ఉంటుంది. ఏదేనీ క్రిటికల్ ఇల్నెస్ (జాబితాలోని) బారిన పడితే పరిహారం అన్నది, వెంటనే రాదు. క్లెయిమ్ చేసుకోవాలంటే, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత నిరీ్ణత రోజుల పాటు పాలసీదారు జీవించి ఉండాలి . ఉదాహరణకు 30 రోజుల సరై్వవల్ పీరియడ్ ఉందనుకోండి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాతి నుంచి 30 రోజుల పాటు జీవించి ఉన్నప్పుడే క్లెయిమ్కు అర్హత వస్తుంది. ఈ 30 రోజుల్లోపు మరణించినట్టయితే బీమా సంస్థ నుంచి పరిహారం పొందేందుకు అర్హత లభించదు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీలు సాధారణంగా 30 రోజుల సరై్వవల్ పీరియడ్ అమలు చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు ఈ సరై్వవల్ పీరియడ్ను తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాయి. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అయితే 30 రోజుల కాలాన్ని, 15 రోజులకు తగ్గించేందుకు అంగీకరిస్తోంది. ఇందుకు గాను 5 శాతం అదనంగా ప్రీమియంను చార్జ్ చేస్తోంది. మరో 5–10 శాతం అదనపు ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వస్తే, అప్పుడు సరై్వవల్ పీరియడ్ 7 రోజులకు లేదంటే సున్నాకు తగ్గిస్తోంది’’అని ప్రమోట్ ఫిన్టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిషా సంఘ్వి తెలిపారు. వెయిటింగ్ పీరియడ్... పాలసీ కొనుగోలు చేసిన రోజు నుంచి 90–180 రోజుల వరకు క్రిటికల్ ఇల్నెస్ బారిన పడినా కానీ, క్లెయిమ్కు అర్హత లభించదు. ఈ వెయిటింగ్ పీరియడ్ తర్వాత నుంచి పాలసీ అమలు సమయంలో ఎప్పుడైనా వ్యాధి నిర్ధారణ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్నా కానీ, కవరేజీ లేని కాలంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ప్రముఖ బీమా సంస్థలు ఎక్కువ శాతం 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ను అమలు చేస్తున్నాయి. ఎన్నింటికి కవరేజీ..? క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లో మొత్తంగా ఎన్ని వ్యాధులకు కవరేజీ వరిస్తుందన్నది ముఖ్యంగా చూడాల్సిన అంశాల్లో ఒకటి. ఎందుకంటే నేడు జీవనశైలి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధులు, కేన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటోంది. కొన్ని పాలసీలు లేదా రైడర్లు 10–20 వ్యాధులకు కవరేజీ ఆఫర్ చేస్తున్నాయి. 60 నుంచి 99 వ్యాధుల వరకు కవరేజీనిచ్చేవీ ఉన్నాయి. ఎన్ని ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉంటే, అంత మంచిదనుకుంటారేమో..? కానీ, ఇది తప్పుడు అభిప్రాయం. తీసుకునే ప్లాన్లో ముఖ్యమైన వ్యాధులకు, అది కూడా సమగ్రమైన కవరేజీ ఉందా? అన్నదే కీలకం. ‘‘60 లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులకు కవరేజీనిచ్చే ప్లాన్, కేన్సర్ను పలు దశలుగా వేరు చేసి ఆఫర్ చేయవచ్చు. మరో పాలసీలో కేవలం 25 వ్యాధులకే కవరేజీ ఉండొచ్చు. ఈ ప్లాన్ అన్ని కేన్సర్లను ఒక్కటిగానే పరిగణించి, నిర్ధారణ అయిన వెంటనే క్లెయిమ్కు అనుమతించొచ్చు’’అని ఎలిఫెంట్ డాట్ ఇన్ (అలియన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్) ప్రొడక్ట్ హెడ్ కల్పేష్ చవాన్ పేర్కొన్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం టాప్–5 తీవ్ర వ్యాధులకు సంబంధించి 90% క్లెయిమ్లు వస్తున్నాయి. టాప్–10 క్రిటికల్ ఇల్నెస్లు కాకుండా, ఇతర వ్యాధుల కారణంగా వచ్చే క్లెయిమ్లు చాలా తక్కువ. కనుక దాదాపు 60 అంతకంటే ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉందంటే, వాటి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ఏ ప్లాన్ తీసుకోవాలనే సందేహం రావచ్చు. అధిక వ్యాధులకు కవరేజీ ఇస్తూ, అందులో ఒక్కో వ్యాధి వారీ కవరేజీ పరిమితి లేకపోవడం, ఉన్నా మెరుగైన కవరేజీ, అన్ని కేన్సర్లను ఒకటిగానే పరిగణించేట్టు అయితే ఆ ప్లాన్ను తీసుకోవచ్చు. లేదంటే ఎలాంటి షరతుల్లేకుండా ఆఫర్ చేసే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, అది టాప్ 25–30 వ్యాధులకు కవరేజీ ఇచ్చేది అయినా నిస్సందేహంగా తీసుకోవచ్చు. సంఖ్య కంటే షరతులు, కవరేజీకే ప్రాధాన్యం ఇవ్వాలి. రైడర్ – స్టాండెలోన్ ప్లాన్ క్రిటికల్ ఇల్నెస్ను రైడర్గా లేదంటే, స్టాండలోన్ పాలసీగా తీసుకుంటే ఏవైనా వ్యత్యాసాలు ఉంటాయా? అన్న సందేహం కలగొచ్చు. రైడర్ రూపంలో అయితే సులభంగా తీసుకోవచ్చు. బీమా పాలసీ తీసుకునే సమయంలోనే ఈ రైడర్ను కూడా ఎంపిక చేసుకుంటే, ఒకేసారి వైద్య పరీక్షలు చేస్తారు కనుక, మళ్లీ విడిగా తీసుకోవడాన్ని నివారించొచ్చు. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్తోపాటు తీసుకుంటే కవరేజీ పరంగా పరిమితి ఉంటుంది. జీవిత బీమా కవరేజీ మించి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కవరేజీ తీసుకోవడానికి అనుమతించరు. అంటే కోరుకున్నంత కవరేజీ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు. జీవిత బీమా ప్లాన్తో వచ్చే రైడర్లలో సాధారణంగా వ్యాధి ముదిరిన దశలోనే కవరేజీ అనే షరతు ఉంటుంది. ఉదాహరణకు కేన్సర్ మొదటి దశను ఇవి కవర్ చేయవు. అలాగే, రైడర్లలోనూ రెండు రకాలు ఉన్నాయి. కాంప్రహెన్సివ్ రైడర్ అయితే, బేస్ పాలసీ కవరేజీకి అదనంగా ఉంటుంది. యాక్సిలరేటెడ్ రైడర్ అయితే, బేస్ పాలసీలో భాగంగానే కవరేజీ ఉంటుంది. యాక్సిలరేటెడ్ రైడర్ తీసుకుని ఏదైనా తీవ్ర వ్యాధి బారిన పడి క్లెయిమ్కు వెళితే, ఆ మేరకు బేస్ కవరేజీ తగ్గిపోతుంది. స్టాండలోన్ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లో కవరేజీ విస్తృతంగా ఉంటుంది. పైగా జీవిత బీమా లేదా టర్మ్ ఇన్సూరెన్స్తో తీసుకునే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ జీవితాంతం పనిచేయదు. జీవిత బీమా ఎంత కాలానికి తీసుకుంటారో? అంత వరకే పరిమితం అవుతుంది. విడిగా తీసుకుంటే మీరు జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్ సమగ్రంగా చదవడం ద్వారా వేటికి కవరేజీ వస్తుంది, వేటికి రాదు? షరతులు అన్నీ తెలుస్తాయి. స్టాండలోన్ ప్లాన్ ప్రీమియం, రైడర్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. స్టాండలోన్ ప్లాన్లో ప్రీమియం ప్రతి కొన్నేళ్లకోసారి పెరుగుతూ వెళుతుంది. ఈ పెరుగుదల, రైడర్తో పోలి్చనప్పుడు అధికంగా ఉంటుంది. రైడర్లో కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, ప్రతికూలతలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి. జీవితాంతం రెన్యువల్కు అవకాశం ఉందా? వ్యాధులకు విస్తృతమైన కవరేజీ ఉందా? సర్వైవల్ పీరియడ్ జీరో లేదంటే 7–15 రోజులుగా ఉందా? (వీలైనంత తక్కువ) అని కూడా చూడాలి. అలాగే, విడిగా ఒక్కో వ్యాధికి సంబంధించి కవరేజీ ఎందులో ఎక్కువ ఉంటే, అదే అనుకూలంగా పరిగణించొచ్చు. ఒకవేళ రైడర్ ఆకర్షణీయంగా ఉందని భావిస్తే, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ను 85–90 ఏళ్ల కాలానికి తీసుకుని, రైడర్ను జోడించుకోవడం సరైనది. అప్పుడు జీవితాంతం టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. ఇక ఇప్పటికే జీవిత బీమా పాలసీ తీసుకుని ఉంటే, అటువంటి వారు ఎలాంటి సందేహం లేకుండా స్టాండలోన్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ను తీసుకోవడం సరైనది. మరీ ముఖ్యంగా కవరేజీ విస్తృతంగా ఉండాలని చెప్పి, భారీ ప్రీమియంతో కూడిన ప్లాన్ తీసుకుంటే, ఆర్థికంగా భారం అవుతుందేమో ఓసారి ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా వ్యాధి బారిన పడితే, ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పి, ప్రస్తుత బడ్జెట్ను భారంగా మార్చుకోరాదు. కనుక తమ పూర్వీకుల ఆరోగ్య చరిత్ర, వ్యాధుల రిస్్కను వైద్య నిపుణుల సూచనతో మదింపు వేసుకుని, అప్పుడు ఎంతకు కవరేజీ తీసుకోవాలనే విషయంలో స్పష్టతకు రావాలి. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, సాధారణ అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైతే ఆదుకోదు. కనుక రెగ్యులర్ హెల్త్ ప్లాన్ తీసుకోవడం కూడా ఎంతో అవసరం. అందుకే క్రిటికల్ ఇల్నెస్ను బెనిఫిట్ ప్లాన్గా చెబుతారు. రెగ్యులర్ హెల్త్ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ను ఒకే సంస్థ నుంచి తీసుకుంటే కొంత అనుకూలం. టాప్ క్రిటికల్ ఇల్నెస్లు / చికిత్సలు కేన్సర్, యాంజియోప్లాస్టీ(ప్రొసీజర్), హార్ట్ఎటాక్, అరోటా సర్జరీ, హార్ట్ వాల్వ్ వైఫల్యం, కార్డియో మయోపతి, ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్, సీఏబీజీ, క్రానిక్ లంగ్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్, కోమ, స్ట్రోక్, అల్జీమర్స్, మసు్క్యలర్ డిస్ట్రోఫీ, పార్కిన్సన్స్, బ్రెయిన్ సర్జరీ, పోలియోమైలైటిస్, మోటార్ న్యూరాన్ డిసీజ్, బ్యాక్టీరియల్ మెనింజైటిస, ఎన్సెఫలైటిస్, ఎయిడ్స్ (రక్త మార్పిడి వల్ల), థర్డ్ డిగ్రీ కాలిన గాయాలు. కవరేజీ ఎంత..? గుండె జబ్బులకు సంబంధించి శస్త్రచికిత్సల ఖరీదు నేడు 2–5 లక్షల మధ్య ఉంది. వైద్య ద్రవ్యోల్బణం 10 శాతం పైనే ఉంటోంది. కనుక భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుత చికిత్సల చార్జీలకు ఐదు నుంచి పది రెట్లు అధికంగా కవర్ తీసుకోవాలి. లేదంటే కనీసం నాలుగైదేళ్ల వార్షిక ఆదాయానికి సమానమైన కవర్ తీసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.5 లక్షలు ఉందంటే, కనీసం రూ.25 లక్షలు అవసరం. ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి, ఇండెమ్నిటీ హెల్త్ కవరేజీ చాలనప్పుడు, అదనంగా అయ్యే వ్యయాలను తట్టుకునేందుకు, ఆ కాలంలో నిలిచిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ మాత్రమైనా ఉండాల్సిందే. -
అనివార్య ఖర్చులు, సరదా ఖర్చులు, పొదుపు
ట్రెండ్స్ స్థిరంగా ఉండనట్లే ఆలోచనలు, అభిప్రాయాలు కూడా స్థిరంగా ఉండవు. జెన్ జెడ్, మిలీనియల్స్ కొత్త ప్రయాణం కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? యోలో(వైవోఎల్వో–యూ వోన్లీ లివ్ వన్స్) సెగ్మెంట్లో ఉన్న యువతరం అవసరానికి మించి ఖర్చు చేయడానికి తప్ప‘ఆర్థిక భద్రత’కు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు. అయితే ఈ ధోరణిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘యోలో’ నుంచి 50–30–20 కాన్సెప్ట్ వైపు ప్రయాణించడానికి యువతరం ఆసక్తి చూపుతున్నారు... సినిమాల గురించి తప్ప మరో లోకంతో సంబంధం లేనట్లుగా ఉండే మిలీనియల్స్, జెన్ జెడ్ ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నుంచి పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్ వరకు ఎన్నో విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అనేది మ్యూచువల్ ఫండ్స్లో నిర్ణీత మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసికం చొప్పున పెట్టుబడిగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) అనేది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్ను అందించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పదిహేను సంవత్సరాల లాక్–ఇన్ వ్యవధిని కలిగి ఉన్న ప్రభుత్వ పథకం ఇది.‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనే మాట వినబడగానే ‘ఇది నాకు సంబంధించిన విషయం కాదు’ అన్నట్లుగా పట్టించుకునే వారు కాదు చాలా మంది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనేది వయసు మళ్లిన వారికి సంబంధించిన విషయం అన్నట్లుగా ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఎర్లీ ఏజ్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తగిన అవగాహనతో ఉన్నారు. అన్ ఎక్స్పెక్టెడ్ మెడికల్ సిచ్యువేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకుంటున్నారు. యాన్యువల్ హెల్త్బడ్జెట్ను ప్లాన్చేసుకుంటున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘పర్సనల్ యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్’పై ఆసక్తి చూపుతున్నారు. ‘సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జీవన ప్రయాణానికి దిక్సూచి లాంటిది’ అనే మాటను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా కాకుండా ఆచి తూచి సరిౖయెన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఎంచుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ ప్లాన్’ అనే మాట వినబడగానే ఒకప్పుడు యువతరం నోటి నుంచే వచ్చే మాటలు... ‘అబ్బే! అంత టైమ్ లేదు’ ‘ఫైనాన్షియల్ విషయాలు నాకు బొత్తిగా తెలియవు’ ఇప్పుడు మాత్రం ‘బొత్తిగా తెలియదు’ అనుకునే విషయాలపై టైమ్ చేసుకొని మరీ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో మిలీనియల్స్, జెన్ జెడ్ను బాగా ఆకట్టుకున్న కాన్సెప్ట్ 50–30–20 ‘50–30–20’ కాన్సెప్ట్ ప్రకారం సం΄ాదించే జీతంలో అనివార్య ఖర్చులకు 50 శాతం ఖర్చుచేయాలి. ఇంటి అద్దె నుంచి భోజన ఖర్చు వరకు ఇందులో ఉంటాయి. వ్యక్తిగత అవసరాలు, సరదాల కోసం 30 శాతం ఖర్చు చేయాలి. ట్రెండీ దుస్తులు కొనుక్కోవడం నుంచి సినిమాలు చూడడం వరకు ఇందులో వస్తాయి. 20 శాతం మాత్రం తప్పనిసరిగా పొదుపు చేయాలి. ‘మిలీనియల్స్లో చాలామంది ఇన్సూరెన్స్ల గురించి పట్టించుకోవడం లేదు. అనారోగ్యం లేదా ప్రమాదం జరిగిన సందర్భాల్లో మన ఖజానా అంతా ఖాళీ అవుతుంది. దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే లైఫ్, హెల్త్, ఆటో ఇన్సూరెన్స్పై మిలీనియల్స్ తప్పనిసరిగా దృష్టి పెట్టాలి’ అంటున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శరద్ కోహ్లీ. శరద్ సలహా చదివి మారిన వారిలో తేజస్విని ఒకరు. దిల్లీకి చెందిన తేజస్వినికి ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆసక్తి, అవగాహన లేదు. ఇప్పుడు మాత్రం రకరకాల పాలసీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న మిలీనియల్స్, జెన్ జెడ్ దగ్గర ‘ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిటైర్మెంట్’ ప్రస్తావన తెస్తే పెద్దగా నవ్వుతారు లేదా ‘రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం ఎందుకు!’ అన్నట్లుగా మాట్లాడుతారు. అయితే ఈ ధోరణిలో కూడా మెల్లగా మార్పు వస్తుంది. ‘రిటైర్మెంట్ లేదా భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు అత్యవసర సమయాల్లోనే కాదు విదేశీ ప్రయాణం చేయాలి లాంటి చిరకాల కలలను నిజం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ప్రతి ఉద్యోగి ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే. కొన్ని సమయాల్లో ముందస్తు పదవీ విరమణ తప్పనిసరి కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ ఫర్ రిటైర్మెంట్ను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి’ అంటున్నాడు శరద్ కోహ్లీ. స్టాక్ మార్కెట్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్కు మాత్రమే యువతప్రాధాన్యత ఇస్తుంది. స్టాక్మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లాంటి మాటలు వినబడితే దూరంగా పారిపోయే వారిని కూడా తన మాటలతో, రాతలతో ఆకట్టుకొని నాలుగు మంచి విషయాలు చెబుతుంది నేహా నగార్. ఎంబీయే చేసిన నేహా స్టార్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్గా యువతలో ఎంతోమంది ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. స్టాక్మార్కెట్, క్రిప్టోకరెన్సీ, ట్యాక్స్యేషన్, ట్రేడింగ్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థం అయ్యేలా చెబుతుంది. ‘మనం ఎలా చెబుతున్నాం అనేదానిపై అవతలి వారి ఆసక్తి ఆధారపడి ఉంటుంది. ఆకట్టుకునేలా, సులభంగా అర్థమయ్యేలా చెప్పగలితే వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు’ అంటుంది నేహా నాగర్. -నేహా నాగర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ -
బీమా ప్రీమియం చెల్లించేందుకు రుణాలు
న్యూఢిల్లీ: ఫిన్టెక్ స్టార్టప్ ‘ఫిన్కేస్’ బీమా ప్రీమియం చెల్లింపుల కోసం రుణ సాయాన్ని అందిస్తోంది. 2025 మార్చి నాటికి ఇలా 10 లక్షల మంది హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారులకు రుణ సాయాన్ని సమకూర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను గడువులోపు చెల్లించడం తప్పనిసరి. పైగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నెలవారీ లేదా త్రైమాసిక వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉండదు. ఏడాదికి ఒకే ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంత ప్రీమియం ఒకేసారి చెల్లించడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది. అలాంటి వారికి ఈ సంస్థ రుణ సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే, ఆర్థిక ఆస్తులపైనా రుణాలను సమకూరుస్తుంటుంది. ఫిన్కేస్ అందించే రుణంతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించి.. ఆ తర్వాత నెలవారీ ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. డిజిటల్ ఇన్సూరెన్స్లో వెటరన్ అయిన అలోక్ భటా్నగర్ను ఆపరేషన్స్ హెడ్గా నియమించుకుంది. కాగా, దేశంలో 51.4 కోట్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణలో ఉన్నట్టు ఫిన్కేస్ తెలిపింది. ఇందులో కేవలం 10 కోట్లు మాత్రమే రిటైల్ హెల్త్ పాలసీలని (సొంతంగా తీసుకున్నవి) పేర్కొంది. -
ఆరోగ్య రంగానికీ నియంత్రణలు!
న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణ రంగానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు.. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆరోగ్య శాఖల మధ్య ఇందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇద్దరు తెలియజేశారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యాన్ని సాధించేందుకు మరింత సమర్ధవంత చర్యలకు తెరతీయవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను అందుబాటులో అందరికీ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల జాతీయ బీమా ఏజెన్సీ(ఎన్ఐఏ) వెలువరించిన నివేదిక ప్రకారం 40 కోట్లమందికిపైగా వ్యక్తులకు జీవిత బీమా అందుబాటులో లేదు. అంటే మొత్తం జనాభాలో మూడో వంతుకు బీమా అందడం లేదు. బీమా వ్యాప్తిలేకపోవడం, చాలీచాలని కవరేజీ, ఆరోగ్య పరిరక్షణా వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. అయితే చికిత్సా వ్యయాలలో ప్రామాణికత, ఆరోగ్య క్లెయిములను పరిష్కారించడం తదితర అంశాలలో విభిన్న సవాళ్లు, అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలో తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నియంత్రణ సంస్థ తప్పనిసరిగా వీటిని పరిష్కరించవలసి ఉంటుందని తెలియజేశారు. వెరసి సవాళ్ల పరిష్కార వ్యూహాలు, నియంత్రణ సంస్థ(హెల్త్ రెగ్యులేటర్) పాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు ఆరోగ్య బీమా రంగ కంపెనీలతోపాటు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా హెల్త్ రెగ్యులేటర్.. ఆరోగ్య క్లెయిముల జాతీయ ఎక్సే్ఛంజీ(ఎన్హెచ్సీఎక్స్) పరిధిని విస్తరించడం, పరిశ్రమను మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉండటం ముఖ్యమని మరో అధికారి వ్యాఖ్యానించారు. -
కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా.. రెండు టాపప్ ప్లాన్లు తీసుకోవచ్చా?
నేను స్వయం ఉపాధిపై ఆధారపడి ఉన్నాను. రూ.4 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అదే బీమా సంస్థ నుంచి రూ.6 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కూడా ఉంది. అంటే నా ముగ్గురు సభ్యుల కుటుంబానికి మొత్తం రూ.10 లక్షల కవరేజీ ప్రస్తుతానికి ఉంది. రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.40 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ను మరో బీమా సంస్థ ఆఫర్ చేస్తోంది. దాని ప్రీమియం చాలా తక్కువ. ఇప్పుడు రూ.40 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే మొత్తం కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా? నేను రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండొచ్చా? – తన్మోయ్ పంజా టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది డిడక్టబుల్కు పైన ఉన్న మొత్తానికి బీమా కవరేజీని ఇస్తుంది. డిడక్టబుల్ అంటే, అంత మొత్తాన్ని పాలసీదారు భరించాల్సి ఉంటుంది. అంతకు మించిన మొత్తానికి సూపర్ టాపప్ కవరేజీ అమల్లోకి వస్తుంది. సూపర్ టాపప్ ప్లాన్ తీసుకునేందుకు బేసిక్ కవరేజీ ఉండాలనేమీ లేదు. బేసిక్ టాపప్ ప్లాన్లో డిడక్టబుల్ అనేది హాస్పిటల్లో చేరిన ప్రతి సందర్భంలోనూ అమలవుతుంది. కానీ, సూపర్ టాపప్ ప్లాన్లో ఒక ఏడాది మొత్తం మీద అయిన హాస్పిటల్ ఖర్చులకు డిడక్టబుల్ అమలవుతుంది. కనుక టాపప్ ప్లాన్లతో పోలిస్తే సూపర్ టాపప్ ప్లాన్ మరింత ప్రయోజనకరం అని చెప్పుకోవాలి. ఒకే సమయంలో రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండే విషయంలో ఎలాంటి నియంత్రణలు లేవు. ప్రస్తుతం ఉన్న ప్లాన్లో లేని మెరుగైన సదుపాయాలను కొత్త సూపర్ టాపప్ ప్లాన్ ఆఫర్ చేస్తుంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. బేసిక్ పాలసీలో లేని రక్షణను సూపర్ టాపప్ ప్లాన్ ఇస్తుంటే తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ రూ.2 లక్షల కవరేజీని ఇస్తుంటే, రూ.2 లక్షల డిడక్టబుల్తో రూ.5 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ ఉంటే.. ఇప్పుడు రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.10 లక్షలకు మరో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలు అయిందనుకోండి. అప్పుడు బేసిక్ పాలసీ నుంచి రూ.2 లక్షలు, మొదటి సూపర్ టాపప్ నుంచి రూ.5 లక్షలు చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మరో రూ.11 లక్షలు మిగిలి ఉంటుంది. రెండో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి రూ.10 లక్షలు చెల్లింపులు వస్తాయి. మిగిలిన రూ.లక్షను పాలసీదారుడు భరించాల్సి ఉంటుంది. అయితే, ఎక్కువ సూపర్ టాపప్ ప్లాన్లు ఉంటే బీమా ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. బేసిక్ పాలసీకి అదనంగా ఒక సూపర్ టాపప్ ప్లాన్ను కలిగి ఉండడం సూచనీయం. మూడు బీ మా సంస్థల వద్ద క్లెయిమ్ కోసం చేయాల్సిన పేపర్ పని ప్రతిబంధకంగా మారుతుంది. కనుక కవరేజీని సాధ్యమైనంత సులభంగా ఉంచుకోవాలి. నేను 1994లో మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. అందుకు సంబంధించి భౌతిక సర్టిఫికెట్ నా వద్ద ఉంది. ఈ మొత్తాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి? వీటి విలువ ఎంత? – వచన్ 2014లో మోర్గాన్ స్టాన్లీ భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయింది. మోర్గాన్ స్టాన్లీ నిర్వహణలోని ఎనిమిది మ్యూచువల్ ఫండ్ పథకాలను హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్ హెచ్డీఎఫ్సీ లార్జ్క్యాప్ ఫండ్లో విలీనం అయింది. హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్ 2009 వరకు హెచ్డీఎఫ్సీ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్గా కొనసాగింది. 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన అనంతరం ఇది ఓపెన్ ఎండెడ్ పథకంగా మార్పు చెందింది. ఇప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే, హెచ్డీఎఫ్సీ అస్సె ట్ మేనేజ్మెంట్ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్లో మీ పెట్టుబడులకు సంబంధించి ఆధారాలను సమరి్పంచాలి. అ ప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకునే విషయమైన వారి నుంచి తగిన సహకారం లభిస్తుంది. సమాధానాలు ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆరోగ్య బీమా భారం తగ్గేదెలా..?
రమణ్సింగ్ (68)కు ఇటీవలే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ రెన్యువల్ నోటీస్ వచి్చంది. చూస్తే ప్రీమియం గతేడాది కంటే గణనీయంగా పెరిగిపోయింది. ఏకంగా 30 శాతం అధికంగా చెల్లించాల్సి రావడంతో దీన్ని ఎలా అధిగమించాలా? అనే ఆలోచనలో పడ్డాడు. రమణ్సింగ్కు మాత్రమే ఈ అనుభవం పరిమితం కాదు. దాదాపు అన్ని బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇటీవలి కాలంలో పెంచేశాయి. దీంతో సగటు మధ్యతరగతి వాసులపై హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో భారం పెరిగిపోయింది. కరోనా విపత్తు తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం పాలసీదారులకు తెలిసిన అనుభవమే. దీనికి క్లెయిమ్లు భారీగా పెరిగిపోవడమే కారణమని బీమా సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో వృద్ధులకు హెల్త్ కవరేజీ విషయంలో కొన్ని బీమా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అధిక ప్రీమియంకు తోడు, పలు షరతులు పెడుతున్నాయి. వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారంగా మారుతున్న తరుణంలో దీన్ని తగ్గించుకునే మార్గాల గురించి చర్చించే కథనమే ఇది. బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం.. హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2020–21లో 94 శాతంగా ఉంటే, అది 2021–22 సంవత్సరానికి 109 శాతానికి పెరిగింది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 100 శాతానికి దిగువన ఉంటేనే బీమా సంస్థలకు లాభం ఉన్నట్టు. 100 అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే, తమకు వస్తున్న ప్రీమియానికి మించి అవి చెల్లింపులు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘గడిచిన కొన్ని సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు పెరిగిపోయాయి. కరోనా తర్వాత అన్ని వయసుల వారి నుంచి క్లెయిమ్లు 10–30 శాతం వరకు ఎక్కువయ్యాయి. దీనివల్ల వృద్ధులపై భారం పెరిగిపోయింది. వీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. పైగా వృద్ధుల్లో క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే సదుపాయం అందరికీ ఉండదు’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ. దీంతో ఈ వయసులోని వారికి సహజంగానే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో క్లెయిమ్లు పెరగడంతో బీమా సంస్థలు ప్రీమియంను మరింత పెంచాయి. ‘‘వృద్ధులకు సహజంగా హెల్త్ రిస్క్లు ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వీరు హెల్త్ కవరేజీ ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. కనుక క్లెయిమ్ల రిస్క్ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ధారిస్తుంటాయి. 30 ఏళ్ల వయసు వారి ప్రీమియంతో పోలిస్తే 60 ఏళ్లకు పైబడిన వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 2.5 రెట్ల నుంచి 4 రెట్ల వరకు అధికంగా ఉంటుంది’’ అని గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది తెలిపారు. సీనియర్ సిటిజన్లలో కొందరికి బీమా సంస్థలు పాలసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. వారికి ముందస్తుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వచి్చన ఫలితాలే దీనికి కారణమని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. కోపేమెంట్.. కోపేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే, ప్రతి క్లెయిమ్లో పాలసీదారు తన వంతు కొంత భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. సాధారణంగా ఈ కోపేమెంట్ అనేది బీమా కవరేజీలో 10 శాతం నుంచి 50 శాతం వరకు ఉంటుంది. 20 శాతం కోపేమెంట్ ఎంపిక చేసుకుంటే, క్లెయిమ్ మొత్తంలో పాలసీదారు 20 శాతం, మిగిలిన 80 శాతం బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. క్లెయిమ్లో తన వైపు భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థ ప్రీమియంలో తగ్గింపును ఇస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కోపేమెంట్తో ప్రీమియంలో ఆదా అయిన మొత్తం కంటే, క్లెయిమ్ వచి్చనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తమే అధికంగా ఉంటుంది. అయినా సరే భారీ ప్రీమియం చెల్లించడం కష్టమనుకునే వారు కోపేమెంట్ ఆప్షన్ను పరిశీలించొచ్చు. దీనివల్ల పాలసీ ప్రీమియంలో 30–40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ‘‘వృద్ధులకు అదనపు వైద్య సంరక్షణ అవసరం ఉంటుంది. కనుక వారు ఆసుపత్రిలో చేరితే ఎక్కువ రోజుల పాటు ఉండాల్సి రావచ్చు. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ను ఎంపిక చేసుకునే వారు ఇన్ పేషెంట్ (ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే వారు)లో గరిష్ట కవరేజీని ఆఫర్ చేసే ప్లాన్ను పరిశీలించాలి. వ్యాధుల వారీగా ఎవైనా మినహాయింపులు, ఉప పరిమితులు, కోపేమెంట్ ఉన్నాయేమో పరిశీలించాలి’’ అని తపన్ సింఘాల్ సూచించారు. డిడక్టబుల్.. పాలసీదారులు ప్రీమియం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో మరొకటి డిడక్టబుల్ క్లాజ్. ఇది కూడా కోపేమెంట్ మాదిరే పనిచేస్తుంది. ఉదాహరణకు రూ.50,000 డిడక్టబుల్ అనే క్లాజ్ ఉందనుకుంటే.. రూ.50,000 మించిన క్లెయిమ్లకే బీమా సంస్థలు చెల్లింపులు చేస్తాయి. కోపేమెంట్ అలా కాదు. 10 శాతం కోపే ఉంటే రూ.50,000 క్లెయిమ్లో పాలసీహోల్డర్ రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. బీమా సంస్థ రూ.45,000 చెల్లిస్తుంది. కోపేమెంట్ అనేది ప్రతి క్లెయిమ్కు వర్తిస్తుంది. అదే డిడక్టబుల్ అనేది ఏడాది మొత్తానికి (కొన్ని బీమా సంస్థల్లో) స్థిరంగా ఉంటుంది. డిడక్టబుల్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే, ప్రీమియం అంత మేర తగ్గుతుంది. క్లెయిమ్లలో ఆ మేర భారం పాలసీదారులపై పడుతుంది. మరొక ఉదాహరణలో.. ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకుంటే రూ.2,00,000 బిల్లు వచి్చంది. డిడక్టబుల్ రూ.20,000 ఉంటే, అప్పుడు పాలసీదారు ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన రూ.1,80,000 కోసం బీమా సంస్థ వద్ద క్లెయిమ్ చేసుకోవచ్చు. డిడక్టబుల్లో ఇప్పటి వరకు చెప్పుకున్నది స్వచ్చందమైనది. రూమ్ రెంట్ ఆస్పత్రిలో చేరిప్పుడు పొందే రూమ్ వసతి కూడా ప్రీమియంను నిర్ణయిస్తుంది. ఎలాంటి పరిమితులు లేని ప్లాన్తో పోలిస్తే సింగిల్ రూమ్, షేరింగ్ రూమ్ ఆప్షన్తో కూడిన పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు ఉంటాయి. అన్నింటిలోకి షేరింగ్ తక్కువగా ఉంటుంది. కనుక షేరింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రీమియం తగ్గేలా చూసుకోవచ్చు. ఒకవేళ షేరింగ్ ఎంపిక చేసుకుంటే.. ఆస్పత్రిలో చేరినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ షేరింగ్ వసతికే పరిమితం కావడం మంచిది. ఖరీదైన వసతి తీసుకుంటే ఆస్పత్రి బిల్లులో కొంత పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ఇది కేవలం రూమ్ రెంట్ వరకే పరిమితం కాదు. ఎందుకంటే ఖరీదైన వసతిలో ఉండి పొందే వైద్యం సాధారణ షేరింగ్ రూమ్లో పొందే వైద్యంతో పోలిస్తే అధిక వ్యయాలతో ఉంటుంది. కనుక పాలసీ క్లాజ్లో ఉన్న వసతికి మించి ఖరీదైన వసతిలో ఉంటే బిల్లులో కొంత మొత్తాన్ని పాలసీదారు చెల్లించాలి. ఫిట్గా ఉంటే ప్రయోజనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం ద్వారా ప్రీమియంలో తగ్గింపు పొందే అవకాశం ఉంది. రోజువారీ వ్యాయామం చేసే పాలసీహోల్డర్లకు బీమా సంస్థలు రివార్డు పాయింట్లు కేటాయిస్తున్నాయి. ఒక ఏడాది మొత్తం మీద ఇలా పొందిన రివార్డు పాయింట్లను, మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియంలో తగ్గింపునకు వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు రోజువారీ 10,000 అడుగులు నడవడం. లేదంటే రోజులో కనీసం 4,000 అడుగులు నడవడం వంటివి. లేదా జాగింగ్ చేయడం ద్వారా హెల్త్ రివార్డులు సంపాదించుకోవచ్చు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ రివార్డులతో ప్రీమియంలో నూరు శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. పోర్టింగ్ మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరే, హెల్త్ ఇన్సూరెన్స్ను కూడా ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు పోర్టింగ్ పెట్టుకోవచ్చు. బీమా సంస్థ సేవలు నచ్చకపోయినా, ప్రీమియం భారం అనిపించినా.. కారణం ఏదైనా పోర్టింగ్ సదుపాయం ఉంది. పోర్టింగ్ వల్ల పూర్వపు బీమా సంస్థలో పొందిన ప్రయోజనాలు క్యారీ ఫార్వార్డ్ (బదిలీ) అవుతాయి. పోర్టింగ్ వల్ల నో క్లెయిమ్ బోనస్ ఒక్కటి నష్టపోవాల్సి రావచ్చు. పాత సంస్థలో ముందు నుంచి ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ పూర్తి చేసి ఉంటే, కొత్త సంస్థలో మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. పాలసీ రెన్యువల్ గడువుకు 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు కొత్త సంస్థ వద్ద పోర్టింగ్ అభ్యర్థన దాఖలు చేసుకోవాలి. ప్రస్తుత పాలసీలోని కవరేజీ ఫీచర్లతో పోలిస్తే, మెరుగైన సదుపాయాలతో తక్కువ ప్రీమియంతో ఆఫర్ చేస్తున్న సంస్థకు మారిపోవడం వల్ల కొంత ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. సూపర్ టాపప్ వృద్ధాప్యంలో నామమాత్రపు కవరేజీ చాలకపోవచ్చు. మెరుగైన కవరేజీతోనే తగినంత రక్షణ లభిస్తుంది. కానీ, మెరుగైన కవరేజీ కోసం ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ ఇండెమ్నిటీ ప్లాన్ను పరిమిత కవరేజీతో తీసుకోవాలి. దీనివల్ల ప్రీమియం తగ్గించుకోవచ్చు. దీనికి అదనపు కవరేజీతో సూపర్ టాపప్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకే పాలసీని అధిక కవరేజీతో తీసుకోవడంతో పోలిస్తే ప్రీమియం చాలా వరకు తగ్గుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షలకు బేసిక్ ప్లాన్ తీసుకుని, దీనికి రూ.20 లక్షల సూపర్ టాపప్ చేసుకున్నారని అనుకుందాం. క్లెయిమ్ రూ.5 లక్షలు దాటినప్పుడు, అదనపు మొత్తానికి సూపర్ టాపప్ ఇచి్చన బీమా సంస్థ నుంచి చెల్లింపులు వస్తాయి. రెగ్యులర్ ప్లాన్తో పోలిస్తే ఇలా చేయడం వల్ల ప్రీమియంను 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ టాపప్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కానీ టాపప్, సూపర్ టాపప్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. టాపప్ ప్లాన్లో ఒక పాలసీ సంవత్సరంలో ప్రతి క్లెయిమ్కు విడిగా నిర్ణీత మొత్తం దాటినప్పుడే చెల్లింపులు లభిస్తాయి. సూపర్ టాపప్ ప్లాన్లో అలా కాదు. ఏడాది మొత్తం మీద నిర్ధేశిత డిడక్టబుల్ ఒక్కటిగానే ఉంటుంది. అంటే బేస్ ప్లాన్ రూ.5 లక్షలు తీసుకున్నారు. దీనికి టాపప్ జోడించుకుంటే, ప్రతి క్లెయిమ్లోనూ రూ.5 లక్షలు మించినప్పుడే, రూ.5 లక్షలు మినహాయించి (డిడక్టబుల్) మిగిలినది టాపప్ నుంచి చెల్లింపులు వస్తాయి. అదే సూపర్ టాపప్లో.. ఒక ఏడాదిలో మూడు పర్యాయాలు ఆస్పత్రిలో చేరి (రూ.3లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు) రూ.10 లక్షలు బిల్లు వచి్చ నా, రూ.5 లక్షలు డిడక్టబుల్ పోను, మిగిలిన రూ.5 లక్షలను క్లెయిమ్ చేసుకోవచ్చు. బేస్ ప్లాన్ పరిమిత కవరేజీతో తీసుకుని, సూపర్ టాపప్ జోడించుకోలేని వారు.. చిన్న వాటికి క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే మంచిది. దీనివల్ల నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీని ఎలాంటి అదనపు ప్రీమియం లేకుండా నూరు శాతం వరకు పెంచుకోవచ్చు. వీటిని అనుసరించొచ్చు.. హెల్త్ ఇన్సూరెన్స్ను చిన్న వయసులోనే తీసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆ వయసులో ఉండవు. దీంతో ప్రీమియం తక్కువగా ఉంటుంది. నేరుగా 60 ఏళ్ల తర్వాత పాలసీ తీసుకునే వారితో పోలిస్తే, ముందు నుంచే హెల్త్ కవరేజీలో ఉన్న వారికి ప్రీమియం కొంత తక్కువ ఉంటుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని అధిక ప్రీమియాన్ని కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. ► హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఆన్లైన్ ద్వారా నేరుగా బీమా సంస్థ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రీమియం 5–10% తక్కువగా ఉంటుంది. కమీషన్లు, ఇతర వ్యయాల భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థలు డిస్కౌంట్ ఇస్తాయి. పైగా ఆన్లైన్లో అన్ని బీమా సంస్థల ప్లాన్ల ఫీచర్లు, ప్రీమియంను పోల్చి చూసుకునే వెసులుబాటు పాలసీబజార్ వంటి వేదికలు కలి్పస్తున్నాయి. ఈ విధంగానూ ప్రీమియం భారం తగ్గవచ్చు. ► విడిగా ప్లాన్ తీసుకోవడానికి బదులు కుటుంబం అంతటికీ ఒక్కటే ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ► అవసరం లేని కవరేజీలకు దూరంగా ఉండాలి. అవసరం లేని యాడాన్లను జోడించుకుంటే ప్రీమియం భారం పెరుగుతుంది. ► రూ.5 లక్షల బేసిక్ కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకుంటే ప్రీమియం ఆదా అవుతుంది. ► తమ పిల్లలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుంటే, వారి కార్యాలయం తరఫున తల్లిదండ్రులు కవరేజీ కల్పించుకోవడం ఒక మార్గం. గ్రూప్ ప్లాన్ కావడంతో ప్రీమియం తగ్గుతుంది. ► ఇక ప్రీమియంలో ఆదా కోరుకునే వారు ఒక ఏడాదికి కాకుండా మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించడాన్ని పరిశీలించొచ్చు. దీనివల్ల ప్రీమియంలో 10 శాతం వరకు ఆదా అవుతుంది. -
టాటా ఏఐజీ నుంచి హెల్త్ సూపర్ చార్జ్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్.. ‘హెల్త్ సూపర్ చార్జ్’ ప్లాన్ను ప్రారంభించింది. దీని కింద పాలసీదారులు ఐదు రెట్లు అధికంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందొచ్చు. ఏటా 50 శాతం రెన్యువల్ బోనస్ చొప్పున గరిష్టంగా 500 శాతం (ఐదు రెట్లు) కవరేజీని పెంచుకోవచ్చు. టైర్–1 నుంచి టైర్–4 వరకు పట్టణాల్లో నివసించే వారి భిన్న రకాల ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్ను తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్, సమ్ ఇన్సూర్డ్ అపరిమిత రీస్టోరేషన్ సదుపాయం, ముందు నుంచి ఉన్న వ్యాధుల వేచి ఉండే కాలాన్ని నాలుగేళ్ల నుంచి 30 రోజులకు తగ్గించుకునే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద రూ.5–20 లక్షల కవరేజీని పొందొచ్చు. ఏటా ఉచిత హెల్త్ చెకప్ సదుపాయం కూడా ఉంది. -
‘మీరే ఇలా చేస్తే ఎలా?’, కోర్టులో టీసీఎస్కు ఎదురు దెబ్బలు.. భారీ ఫైన్!
దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా డల్లాస్ కోర్టు టీసీఎస్ 210 మిలియన్లను స్థానిక సంస్థ డీఎక్స్సీ టెక్నాలజీకి వెంటనే చెల్లించాలని ఆదేశించింది. అయితే, అమెరికా సుప్రీం కోర్టు అదే టీసీఎస్..‘ఎపిక్ సిస్టమ్’కు 140 మిలియన్ల జరిమానా కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిన వారం వ్యవధిలో డల్లాస్ కోర్టు సైతం టీసీఎస్కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. టీసీఎస్ అమెరికా చట్టాలను అతిక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందా? మేధో సంపత్తిని తస్కరించడం, ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల తాలుకూ రహస్యాల్ని బహిర్ఘతం చేయడం, సొంత లాభం కోసం ఆయా సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఉపయోగించి వ్యాపారం చేస్తుందా? అంటే అవుననే అంటున్నాయి అమెరికా న్యాయ స్థానాలు. టీసీఎస్ వర్సెస్ కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (సీఎస్సీ) 2018లో టీసీఎస్..కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (సీఎస్సీ) సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాన్స్అమెరికాలోని 2,200 మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. దీంతో పాటు సీఎస్సీ (ఇప్పుడు సీఎస్సీ డీఎక్స్సీ టెక్నాలజీలో కలిసింది) సొంతంగా తయారు చేసుకున్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సోర్స్ కోడ్తో పాటు ఇతర సమాచారాన్ని సేకరించింది. దాని సాయంతో ఇన్సూరెన్స్ మార్కెట్లోని ఇతర కంపెనీలకు గట్టిపోటీ ఇచ్చేలా సొంత ఫ్లాట్ఫామ్ను తయారు చేసుకుంది. అనంతరం 2018లోనే ట్రాన్స్అమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి 10 ఏళ్ల పాటు టెక్నాలజీ సేవలందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఎంఓయూ ఖరీదు 2 బిలియన్ డాలర్లు. ఆ తర్వాత కోవిడ్-19, ఆర్ధిక అనిశ్చితి కారణంగా ట్రాన్స్ అమెరికా .. టీసీఎస్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సమాచారాన్ని తస్కరించి ఈ నేపథ్యంలో సీఎస్సీ యాజమాన్యం టీసీఎస్ తీరును తప్పుబడుతూ డల్లాస్లోని టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. తమ సంస్థకు చెందిన సమాచారాన్ని ఉపయోగించి లైఫ్ ఇన్సూరెన్స్, యాన్యుటీ పాలసీ సేవల్ని కష్టమర్లకు అందించేలా సైబర్లైఫ్ సాఫ్ట్వేర్ను డెవలప్ చేసిందని ఆరోపించింది. తగిన ఆధారాల్ని కోర్టు ముందు ఉంచింది. ఇరువురి వాదనల విన్న కోర్టు టీసీఎస్కు మొట్టికాయలు వేసింది. ‘ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీ మీది. మీరే ఇలా చేస్తే ఎలా? మీరు చేసింది ముమ్మాటికి తప్పే’ అంటూ తీర్పిచ్చింది. 210 మిలియన్లు సీఎస్సీ చెల్లించాలని తీర్పు వెలువరించింది. న్యాయ పోరాటం చేస్తాం కోర్టు తీర్పును సవాలు చేసేందుకు టీసీఎస్ సిద్ధమైంది. న్యాయస్థానం విధించిన జరిమానా కట్టేందుకు తాము సిద్ధంగా లేమని, ఈ అంశంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని టీసీఎస్ అధికార ప్రతినిధి కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. టీసీఎస్ వర్సెస్ ఎపిక్ సిస్టం ఈ తీర్పు వెలువరించక వారం రోజుల ముందు అదే అమెరికా సుప్రీం కోర్టులో టీసీఎస్ (టాటా అమెరికా) కు వ్యతిరేకంగా మరో కేసు విచారణ జరిగింది. 2014లో ఎపిక్ సిస్టం, టాటా లు కలిపి ఓ సంస్థకు (మ్యూచువల్ క్లయింట్)కు సేవలందిస్తున్నాయి. ‘ఆ సమయంలో టీసీఎస్ మా అనుమతి తీసుకోకుండా ఫేక్ ఐడీలతో తమ వెబ్ పోర్టల్ను యాక్సెస్ చేసుకుని 6,000 వేల సమాచారాన్ని తస్కరించింది. ఆ సమాచారంతో మా కాంపిటీటర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాప్ట్వేర్ను డెవలప్ చేయడానికి ఉపయోగించుకుందని ఎపిక్ సిస్టం ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని గతంలో కోర్టు మెట్లెక్కింది. తప్పదు.. చెల్లించాల్సిందే న్యాయ స్థానాలు భారీ ఎత్తున జరిమానా విధించగా.. ఆ ఫైన్ను తగ్గించాలని టీసీఎస్ వాదిస్తుంది. తాజాగా ఈ కేసులో టీసీఎస్కు పై కోర్టు యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ద సెవెన్త్ సర్క్యూట్ (యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్) ఇచ్చిన తీర్పు సమంజసంగా ఉందని, 140 మిలియన్లు పే చేయాలని ఆదేశించింది. -
సీనియర్ సిటిజన్స్కు ఆరోగ్య బీమా భరోసా
దేశీయంగా వయస్సు పైబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీఆర్బీ గణాంకాల ప్రకారం 2050 నాటికి 14.4 కోట్ల మంది పైచిలుకు సీనియర్ సిటిజన్స్ ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్యానికి, సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మన కుటుంబాల్లో కూడా పెద్దవారికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఆరోగ్య బీమా అవసరం ఎంతైనా ఉంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు వారి అవసరాలను దృష్టిలోఉంచుకోవాలి. ఇందుకోసం అయిదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ► వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండాలి: ఆరోగ్యబీమా పాలసీ కవరేజీ సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెయిటింగ్ పీరియడ్, అలాగే ఎలాంటి మెడికల్ చెకప్లు అవసరం లేకుండా అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా కవరేజీ లభించేలా చూసుకోవాలి. ఉదాహరణకు, మణిపాల్ సిగ్నా అందించే ప్రైమ్ సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సీనియర్ల విభిన్న ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినది. ఎటువంటి మెడికల్ చెకప్లు అవసరం లేకుండా 91వ రోజు నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ అనారోగ్య పరిస్థితులకు కవరేజీని అందిస్తుంది. ► కో–పే, ఉప–పరిమితులు ఉండొద్దు: కో–పే, ఉప–పరిమితులు ఉండని హెల్త్ ప్లాన్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే సబ్–లిమిట్ ఉన్న ప్లాన్ వల్ల మళ్లీ మన జేబుపై భారం పడుతుంది. పాలసీ పరిధిలోకి రాని కొన్ని ఖర్చులను మనమే భరించాల్సి వస్తుంది. ► అపరిమితంగా సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరణ: ఆరోగ్య బీమాలో పరిగణనలోకి తీసుకోతగిన మరో పెద్ద అంశం ఏమిటంటే, సమ్ ఇన్సూర్డ్ను అపరిమితంగా రీస్టోర్ చేసే అవకాశం. ఉదాహరణకు మీరు ఏదైనా నిర్దిష్ట అనారోగ్యానికి సంబంధించిన, లేక దానికి సంబంధించని మరోదాని కోసమైనా కొత్తగా క్లెయిమ్ చేసినప్పుడు, మీ హెల్త్ ప్లాన్ తప్పకుండా సమ్ ఇన్సూర్డ్ 100 శాతం పునరుద్ధరించేటువంటిదై ఉండాలి. ► క్యుములేటివ్ బోనస్: క్లెయిమ్స్ గానీ దాఖలు చేయని పక్షంలో కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో సమ్ ఇన్సూర్డ్కి ఏటా 10 శాతం మేర క్యుములేటివ్ బోనస్ జతవుతుంటుంది. సమ్ ఇన్సూర్డ్కి 100 శాతం స్థాయికి చేరే వరకు ఈ బోనస్ ఏటా జతవుతూనే ఉంటుంది. ఫలితంగా పదేళ్లలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కవరేజీ రెట్టింపవుతుంది. ► ప్రివెంటివ్ చెకప్: తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వయో వృద్ధులు తరచుగా వైద్యులను సంప్రదించాల్సి వస్తుంటుంది. అపాయింట్మెంట్లు లభించడం కొన్ని సందర్భాల్లో కష్టం కావచ్చు. కాబట్టి బీమా సంస్థల నెట్వర్క్ పరిధిలోని డాక్టర్లు, స్పెషలిస్టులతో అపరిమిత టెలీకన్సల్టేషన్స్ (ఫోన్ లేదా చాట్ ద్వారా) సదుపాయం ఇచ్చే ప్లాన్ను ఎంచుకోవడం మంచిది. అలాగే ఏటా నగదురహిత హెల్త్ చెకప్ అందించేదిగా కూడా పాలసీ ఉండాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, వాటి ఫీచర్లు, వ్యయాలను జాగ్రత్తగా పోల్చి చూసుకోవాలి. సీనియర్ సిటిజన్స్కు శారీరకంగాను, ఆర్థికంగాను ప్రయోజనకరంగా ఉండే సమగ్రమైన ఆరోగ్య బీమా కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవాలి. – ప్రియా గిల్భిలే, సీవోవో, మణిపాల్సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ -
మనోళ్ల ‘హెల్త్ కవర్’ అంతంతే..!
సాక్షి, హైదరాబాద్: జీవిత బీమా, హెల్త్ కవర్–ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కవరేజీ వంటి విషయాల్లో భారతీయులు అంత చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, సరైన ఆరోగ్య రక్షణలు లేనివారు రూ. 20 వేల కోట్లకు పైగానే కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం వ్యయం చేయాల్సి వచ్చిదనే అనధికార అంచనాలున్నాయి. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎదురైన పరిస్థితుల కారణంగా మధ్య, దిగువ, పేద వర్గాల ప్రజలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అని 46 శాతం మంది భావిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న వైద్యఖర్చులకు ఈ హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయని 43 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇదీ అధ్యయనం... తాజాగా భారతీయ టెక్–ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని, వారిలోనూ 27 శాతం మందికి మెడికల్ కవర్ రూ. 5 లక్షలలోపే ఉన్నట్టుగా ఇది స్పష్టం చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లోని 28–55 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ నివేదికను సిద్ధం చేసింది. అన్లిమిటెడ్ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్రెంట్ క్యాపింగ్ వంటి వాటిపై పాలసీ హోల్డర్లకు అంతగా అవగాహన ఉండటం లేదన్న విషయం నివేదికలో వెల్లడైంది. -
నెలవారీ ప్రీమియంలలో హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.1 కోటి వరకు బీమా కవరేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు దేశంలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలంటే ఏడాది ప్రీమియం ఒకేసారి చెల్లించాల్సిందే. ఇక నుంచి సులభంగా నెల వాయిదాల్లో హెల్త్ పాలసీ తీసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్పే భారత్లో తొలిసారిగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఆరోగ్య బీమా సంస్థలతో ఫోన్పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ చేతులు కలిపింది. ‘రూ.1 కోటి వరకు బీమా కవరేజ్ ఉంది. ఎటువంటి పరిమితి లేకుండా ఆసుపత్రిలో గదిని ఎంచుకోవచ్చు. క్లెయిమ్ చేయనట్టయితే ఏడాదికి బేస్ కవర్ మొత్తం మీద ఏడింతల వరకు బోనస్ కవర్ పొందవచ్చు’ అని ఫోన్పే ప్రకటించింది. ఇదీ చదవండి ➤ IT Dept clarification on PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ ప్రస్తుతానికి ఫోన్పే వేదికగా కేర్ హెల్త్, నివా బూపా నెల వాయిదాల్లో ఆరోగ్య బీమా పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56 లక్షలకుపైగా పాలసీలను విక్రయించినట్టు ఫోన్పే తెలిపింది. ఇక ఫోన్పే యూజర్ల సంఖ్య 47 కోట్లకుపైమాటే. -
హెల్త్ ఇన్సూరెన్స్ సగటు క్లెయిమ్ రూ.42,000
న్యూఢిల్లీ: దేశంలో సగటు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం రూ.42,000గా ఉంది. మొత్తం మీద 15 శాతం క్లెయిమ్లు మాత్రమే రూ.లక్ష మించి ఉంటున్నాయి. సెక్యూర్ నౌ ఈ వివరాలను ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. హాస్పిటల్లో 5 రోజులకు పైగా ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు, క్లెయిమ్ రూ.5 లక్షలు మించుతుందనే విషయాన్ని పాలసీదారులు పరిగణనలోకి తీసుకోవాలని.. అలాగే, బీమా సంస్థలు సైతం పాలసీల రూపకల్పనలో ఈ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని నివేదిక ప్రస్తావించింది. రీయింబర్స్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను పరిశీలించినప్పుడు.. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటున్నారు, క్లెయిమ్ మొత్తం? పరిష్కార శాతం, భారత్లో క్లెయిమ్ పరిష్కార ప్రక్రియలో సమర్థత అంశాలు తెలుస్తాయని సూచించింది. 3,846 రీయింబర్స్మెంట్ క్లెయిమ్ల పత్రాలను సెక్యూర్నౌ విశ్లేషించింది. భౌగోళికంగా భిన్న ప్రాంతాలు, వివిధ బీమా సంస్థల క్లెయిమ్లను పరిశీలించినప్పుడు ఈ అంశాలు తెలిశాయి. క్లెయిమ్లలో 3 శాతం ప్రమాదం కారణంగా ఉంటున్నాయి. వీటి సగటు క్లెయిమ్ రూ.33,000గా ఉంటోంది. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటున్నారనేది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లలో కీలక అంశంగా సెక్యూర్ నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. సాధారణంగా హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవడం అన్నది రెండు రోజులుగా ఉంటుంటే, 21 శాతం కేసుల్లో మూడు రోజులకంటే ఎక్కువగా ఉంటున్నట్టు ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. దీంతో ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్లో చేరాల్సి వస్తే రక్షణ ఇచ్చే కాంప్రహెన్సివ్ కవర్ అవసరమని తెలిపింది. మేటర్నిటీ క్లెయిమ్లు ఎక్కువ 50 శాతానికి పైగా క్లెయిమ్ల్లో పరిష్కార రేటు 80 శాతానికి పైన ఉంటోంది. మేటర్నిటీ క్లెయిమ్లు మొత్తం క్లెయిమ్ల్లో 20 శాతంగా ఉంటున్నాయి. జ్వరానికి సంబంధించి 5, కంటి సర్జరీలకు సంబంధించి 5 శాతం, ప్రమాదాలకు సంబంధించి 3 శాతం క్లెయిమ్లు వస్తున్నాయి. మొత్తం క్లెయిమ్లలో కేన్సర్ కేసులకు సంబంధించినవి కేవలం ఒక్క శాతంగానే ఉన్నాయి. కాకపోతే సగటు క్లెయిమ్ మొత్తం అధికంగా ఉంటోంది. -
మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? బ్లాక్ లిస్ట్ హాస్పిటల్స్ గురించి తెలుసా?
హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఒకవైపు జీవనశైలి వ్యాధులతో అస్పత్రుల్లో చేరాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు మధ్యతరగతి వాసులకు ఆరోగ్యపరమైన సామాజిక రక్షణ ఏదీ ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యం పాలైతే ఆర్థికంగా గుల్ల కాకుండా ఉండాలంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఉండాల్సిందే. కరోనా ముందు నాటితో పోలిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యాన్ని ఎక్కువ మంది నేడు అర్థం చేసుకుంటున్నారు. దీంతో దీన్ని కొనుగోలు చేసే వారి సంఖ్యలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. అయితే ఎవరో చెప్పారనో, ఏదైనా ప్రకటన చూసో హెల్త్ ప్లాన్ తీసుకోవడం కాదు. ఎంపిక చేసుకునే ప్లాన్లో రక్షణ ఏ మేరకు? ఏ ఏ వ్యాధులకు కవరేజీ ఉంది? ఉప పరిమితులు ఉన్నాయా? పాలసీ తీసుకున్న వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చా? ఆస్పత్రిలో అన్ని రకాల చికిత్సలకు కవరేజీ లభిస్తుందా? ఇలాంటి ముఖ్యమైన అన్నింటి గురించి పాలసీదారులు తెలుసుకుని ఉండాల్సిందే. లేదంటే క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చికిత్సకు అయిన బిల్లు మొత్తంలో కోతపడుతుంది. పాలసీదారుడు తనవంతు చెల్లించాల్సి వచ్చినప్పుడు విచారిస్తే వచ్చేదేమీ ఉండదు. ఇటువంటి కీలక అంశాలను వివరించే కథనమిది... మన దేశంలో ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ను పన్ను ఆదా కోణంలో తీసుకుంటూ ఉంటారు. పాలసీదారులకు సాధారణంగా కొన్ని ఫీచర్లపై అవగాహన ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మేటర్నిటీ ప్రయోజనాలు ఉంటాయి. నో క్లెయిమ్ బోనస్ ఉంటుందనే విషయాలపై సాధారణంగా అవగాహన ఉంటుంది. కానీ, ఎక్కువ మందికి తెలియని విషయం బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ గురించి. మీరు కొనుగోలు చేయబోయే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కువ ఆస్పత్రుల్లో చికిత్సలకు కవరేజీ ఇచ్చే విధంగా ఉండాలి. ఇంటి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందినా కవరేజీ వస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ, ఇంటి సమీపంలోని హాస్పిటల్ బ్లాక్ లిస్ట్లో ఉంటే, అందులో నగదు రహిత చికిత్స కాదు కదా, ముందే డబ్బులు చెల్లించి తీసుకున్న చికిత్సకు సైతం రీయింబర్స్మెంట్ రాదు. ఎందుకంటే సదరు ఆస్పత్రిని బీమా సంస్థ బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్లేనని తెలుసుకోవాలి. అందుకనే హెల్త్ పాలసీ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ముందుగా బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితా చూడాలి. అలాగే, మీరు నివాసం ఉండే ప్రాంతంలో నగదు రహిత చికిత్సలను అనుమతి ఉన్న ఎన్ని ఆస్పత్రులు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ జాబితాలో ఉన్నదీ చూడాలి. కొన్ని చిన్న ఆస్పత్రులు లేదా వ్యక్తులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. మోసపూరిత క్లెయిమ్లు చేస్తుంటారు. అందుకని అన్ని బీమా సంస్థల పరిధిలో సొంతంగా ఓ ఇన్వెస్టిగేషన్ డెస్క్ ఉంటుంది. ఏదైనా ఒక ఆస్పత్రి నుంచి క్లెయిమ్లు భారీగా వస్తుంటే అప్పుడు సదరు ఆస్పత్రిపై ఓ కన్నేసి ఉంచాలని బీమా సంస్థ తన ఇన్వెస్టిగేషన్ డెస్క్ను కోరుతుంది. అప్పు డు సంబంధిత విభాగం క్లెయిమ్లు ఎక్కువగా వస్తున్న లేదా అనుమానాస్పద క్లెయిమ్లు ఎక్కువగా వస్తున్న ఆస్పత్రికి వెళ్లి విచారణ నిర్వహిస్తుంది. తమ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా బీమా సంస్థ తదుప రి చర్యలు తీసుకుంటుంది. క్లెయిమ్ల విషయంలో చట్టవిరుద్ధమైన చర్యలు లేదా నిబంధనలకు వ్యతిరేకంగా, మోసపూరితంగా వ్యవహరిస్తున్నట్టు తేలితే ఆయా ఆస్పత్రిని నిషేధిత జాబితాలోకి మారుస్తుంది. ఇలా బీమా సంస్థలు తాము నిషేధించిన, బ్లాక్ లిస్ట్లో పెట్టిన హాస్పిటల్స్ వివరాలను పాలసీదారులతో ఎప్పటికప్పుడు పంచుకుంటాయి. వెయిటింగ్ పీరియడ్: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే ఏ సమస్య వచ్చినా క్లెయిమ్ చేసుకుంటామంటే నిబంధనలు అంగీకరించవు. కొన్ని రకాల వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ వేర్వేరుగా ఉంటుంది. ఈ వివరాలు పాలసీ డాక్యుమెంట్లో వివరంగా ఉంటాయి. ఉదాహరణకు మెటర్నిటీ (ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరడం) కవరేజీ అనేది చాలా పాలసీల్లో ఉన్నా, మొదటి రోజు నుంచే కవరేజీ వస్తుందనుకోవద్దు. ఇందుకోసం కనీసం 12 నెలలు అంతకుమించి వేచి ఉండే కాలం నిబంధన ఉంటుంది. ఆ తర్వాతే మెటర్నిటీ కవరేజీ క్లెయిమ్ చేసుకోగలరు. మరికొన్ని రకాల వ్యాధులకు 24 నెలల వెయిటింగ్ పీరియడ్ అమల్లో ఉంటుంది. పాలసీ తీసుకునే నాటికే వ్యాధులు కలిగి ఉంటే, వాటిని పాలసీ ప్రపోజల్లో వెల్లడించి ఉంటే, కవరేజీ పొందేందుకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) సేవలకు అన్ని ప్లాన్లలో కవరేజీ ఉండదు. ఇది యాడాన్ కవరేజీగా వస్తుంది. హాస్పిటల్లో కనీసం 24 గంటల పాటు చేరి చికిత్స తీసుకుంటేనే ఇండెమ్నిటీ ప్లాన్లో క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. డే కేర్ చికిత్సల కోసం అయితే ఆస్పత్రిలో ఇన్ని గంటల పాటు చేరాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకునే వాటికి కనీసం 24 గంటల నిబంధన అమలవుతుంది. కనుక పాలసీదారులు మొదట బ్లాక్ లిస్ట్ హాస్పిటళ్లు, తర్వాత ఏ వ్యాధికి కవరేజీ కోసం ఎంత కాలం పాటు వేచి ఉండాలి, క్లెయిమ్ కోసం ఎంత సమయం పాటు ఆస్పత్రిలో చేరాలనే విషయాలను తెలుసుకోవాలి. ఫీచర్లపై అవగాహన అవసరం: బీమా సంస్థ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో సాధారణ నిబంధనలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ, ఒక్కో బీమా సంస్థ తమ ఉత్పత్తిని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని అదనపు ఫీచర్లు, కవరేజీలను పాలసీల్లో భాగం చేస్తుంటాయి. ఉదాహరణకు రీస్టోరేషన్ ఫీచర్. దీన్ని చాలా సంస్థలు అందిస్తున్నాయి. ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా మొత్తం ఖర్చయిపోయిందని అనుకోండి. అప్పుడు అదే ఏడాది మరో వ్యక్తి లేదా అదే వ్యక్తి మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వస్తే? అలాంటి సందర్భాల్లో ఆదుకునేదే రిస్టోరేషన్ ఫీచర్. ఏదైనా క్లెయిమ్ కారణంగా బీమా కవరేజీ ఖర్చయిన సందర్భాల్లో బీమా సంస్థలు తిరిగి అంతే మొత్తాన్ని రీసోర్టేషన్ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే ఏడాది మరోసారి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు అది ఆదుకుంటుంది. కొన్ని బీమా సంస్థలు అయితే ఒక ఏడాదిలో ఎన్నిసార్లు ఇలా క్లెయిమ్లు వచ్చినా, అన్ని సార్లు రీస్టోరేషన్ ఫీచర్ను అందిస్తున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఒక వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరి పూర్తి బీమా కవరేజీని క్లెయిమ్ పొందాడనుకుందాం. అప్పుడు అదే వ్యక్తి అదే వ్యాధితో హాస్పిటల్లో చేరితే రీస్టోరేషన్ కవరేజీని చాలా ప్లాన్లు ఇవ్వడం లేదు. కొన్ని మాత్రం ఒక వ్యక్తి ఒక వ్యాధి కారణంగా ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినా లేక మరో సమస్యతో చేరాల్సి వచ్చినా రీస్టోరేషన్ కింద కవరేజీని పునరుద్ధరిస్తున్నాయి. కనుక ఈ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకున్న తర్వాతే ప్లాన్ను ఎంపిక చేసుకోవాలి. తప్పక తెలిసి ఉండాలి: ముందు నుంచి ఉన్న వ్యాధులు: అధిక రక్తపోటు, కేన్సర్, మధుమేహం, ఆస్తమా, డిప్రెషన్, స్లీప్ ఆప్నియా, గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు (సీవోపీడీ), స్థూలకాయం, లూపస్, అధెరోస్కెలరోసిస్, థైరాయిడ్ తదితర ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు. పాలసీ కొనుగోలు చేసే నాటికి నాలుగేళ్ల ముందు వైద్యులు నిర్ధారించి, చికిత్స తీసుకున్నవి ముందస్తు వ్యాధుల జాబితాలోకి వస్తాయి. ముందస్తు వ్యాధుల సమాచారం కావాలని వెల్లడించకపోతే.. తర్వాత క్లెయిమ్ సమయంలో బీమా సంస్థ దీన్ని గుర్తిస్తే పరిహారాన్ని నిరాకరిస్తుంది. పాలసీ తీసుకుని ఎనిమిదేళ్లు ముగిసిన తర్వాత క్లెయిమ్ వస్తే అది ముందుగా వెల్లడించని వ్యాధి అయినా సరే తిరస్కరించడం కుదరదు. కనుక పాలసీ దరఖాస్తులో అంతకుముందుగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా, చికిత్స తీసుకున్నా ఆ వివరాలను తప్పకుండా వెల్లడించడం మంచిది. 30 రోజుల వెయిటింగ్: పాలసీ విడుదల చేసిన తేదీ నుంచి మొదటి 30 రోజుల్లో ప్రమాదం లేదా ప్రమాదం కారణంగా తలెత్తే సమస్యలకే క్లెయిమ్ చేసుకోవచ్చు మరే విధమైన చికిత్సకూ క్లెయిమ్ను బీమా సంస్థలు అనుమతించవు. స్పెసిఫిక్ వెయిటింగ్: ముందు నుంచి ఉన్న వ్యాధులు కాకుండా పాలసీ తీసుకున్న తర్వాత 24 నెలల వరకు క్లెయిమ్ చేసుకోలేని ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిజం, జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోస్కోపిక్ మోకాలు సర్జరీ, చెవి, ముక్కు, గొంతు సమస్యలు లేదా సర్జరీలు (సైనసైటిస్, అడెనాయిడ్స్), ప్రొస్టేటిక్ హైపర్ట్రోఫీ, క్యాటరాక్ట్, ఫిస్టులా, హెమరాయిడ్స్, గ్యాస్టిక్ డుయోడినల్ అల్సర్లు, అన్ని రకాల హెర్నియా, హిస్టరెక్టమీ, ఫైబ్రోమయోమా, ట్యూమర్లు, కిడ్నీలో రాళ్లు, యూరెటెరిక్ స్టోన్స్, గ్లాల్ బ్లాడర్లో రాళ్లు, వారికోస్ వెయిన్స్, పార్కిసన్స్/అల్జీమర్స్/డిమెన్షియా తదితర వాటితో బీమా కంపెనీ డాక్యుమెంట్లో 24 నెలల వెయిటింగ్ జాబితా ఉంటుంది. వీటికి రెండేళ్ల తర్వాతే క్లెయిమ్ వస్తుంది. శాశ్వత మినహాయింపులు: హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, దేనికైనా పరిహారం వస్తుందిలేనని అనుకోవద్దు. కొన్నింటికి శాశ్వతంగా క్లెయిమ్ రాదు. వీటి జాబితా బీమా నియమ, నిబంధనల డాక్యుమెంట్లో ఉంటుంది. ఏదైనా వ్యాధి నిర్ధారణ కోసం ఆస్పత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. వైద్యుల సిఫారసు లేకుండా బరువు తగ్గేందుకు సొంతంగా తీసుకునే చికిత్సలు, లింగమార్పిడి చికిత్సలు, కాస్మెటిక్ లేదా ప్లాస్టిక్ సర్జరీలకు (ప్రమాదం కారణంగా చేసుకోవాల్సిన వాటికి మినహాయింపు) క్లెయిమ్ రాదు. మెటర్నిటీ వెయిటింగ్: సాధారణంగా మెటర్నిటీ కవరేజీ కోసం బీమా సంస్థలు ఏడాది నుంచి మూడేళ్ల పాటు వేచి చూడాలనే నిబంధన అమలు చేస్తున్నాయి. వెయిటింగ్ను తగ్గించుకోవచ్చా..? వేచి ఉండే కాలాన్ని తగ్గించుకునేందుకు చాలా బీమా సంస్థలు ప్రత్యేక రైడర్తో అవకాశం కల్పిస్తున్నాయి. ఇందుకు అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ముందస్తు వ్యాధులకు కవరేజీని 2 ఏళ్లకు తగ్గిస్తున్నాయి. పాలసీ తీసుకున్న నాటి నుంచే ముందస్తు వ్యాధులకూ కవరేజీనిచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. గ్రూప్ హెల్త్ ప్లాన్లో దాదాపుగా వెయిటింగ్ పీరియడ్ ఉండడం లేదు. వేచి ఉండే కాలంలో కొత్తగా నిర్ధారణయ్యే వ్యాధులను ముందు నుంచి ఉన్నవిగా పరిగణించరు. సమీప బంధువులకు షేర్ చేయాలి: ఆస్పత్రిలో చేరిన వెంటనే బీమా సదుపాయం ఉందా? అని అక్కడ సిబ్బంది ప్రశ్నించడం వినే ఉంటారు. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెబితే, అందులో చికిత్స వ్యయాలకు ఎంత మేర కవరేజీ వస్తుంది? రాదనే విషయాలను వారు చెబుతారు. ముందుగా నిర్ణయించుకుని తీసుకునే చికిత్సల విషయంలో కవరేజీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేదంటే డిశ్చార్జ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే సాధారణంగా పాలసీదారులు చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఆస్పత్రిలో చేరగా, వారి సంబంధీకులు బీమా తదితర వ్యవహారాలు చూస్తుంటారు. వారికి కవరేజీ విషయమై అవగాహన ఉండదు. అందుకని పాలసీదారులు తమ బీమా క్లెయిమ్కు సంబంధించి తమ కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు కొన్ని ఫీచర్లు, ముఖ్యమైన అంశాల గురించి తప్పకుండా చెప్పాలి. అందులో ముఖ్యమైనది రూమ్రెంట్ కవరేజీ. రూమ్ రెంట్కు ఎలాంటి పరిమితులు లేనట్టయితే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ షేర్డ్ రూమ్, సింగిల్ రూమ్ అని నిబంధన ఉంటే మిమ్మల్ని ఆస్పత్రిలో ఆయా వసతుల్లోనే చేర్చాలని సూచించాలి. పాలసీలో చెప్పినదానికంటే ఖరీదైన వసతి తీసుకుంటే బిల్లు ఎక్కువ వస్తుంది. దాంతో ఆ మేరకు బీమా సంస్థ క్లెయిమ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. అప్పుడు మిగిలినది పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ముందు నుంచి వ్యాధులు ఉండి, వాటిని పాలసీ దరఖాస్తులో వెల్లడించి ఉంటే వాటి గురించి వివరంగా చెప్పాలి. లేదంటే లిఖితపూర్వకంగా ఈ విషయాలను ఒక పేపర్పై రాసి ఇవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. హాస్పిటల్ క్యాష్ ఫీచర్ ఉంటే అది కూడా తప్పకుండా చెప్పాలి. హాస్పిటల్ క్యాష్ అనేది.. చికిత్స కోసం ఆసుపత్రిలో పాలసీదారు చేరినప్పుడు, వారికి సహాయంగా ఉండే వారికి రోజువారీ చెల్లింపులు చేస్తుంది. ఇది రోజువారీ రూ.500 నుంచి రూ.2,000 మధ్య ఉంటుంది. రీస్టోరేషన్ గురించి కూడా చెప్పాలి. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది కొన్ని ప్లాన్లలో ఇన్బిల్ట్గా ఉంటే, కొన్నింటిలో యాడాన్ కవర్గా వస్తోంది. -
పొదుపు సూత్రం మర్చిపోతున్న భారతీయ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విప్లవం, పాశ్చాత్య ధోరణి ప్రభావంతో వ్యక్తుల ఆదాయానికి, ఖర్చుకు మధ్య పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. పేరుకే ఉద్యోగం.. చివరికి మిగిలేది అప్పే అన్నట్లుగా ఉద్యోగుల పరిస్థితి దిగజారింది. సంపాదనకు తగిన విధంగా పొదుపు చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిధుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. అకస్మాత్తుగా లే–ఆఫ్లు వస్తే కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని దుస్థితిలో భారతీయ ఉద్యోగులు ఉండటం శోచనీయం. ఉద్యోగం కోల్పోతే నెల కూడా ఉండలేరు.. 75 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఎటువంటి పొదుపు మొత్తాన్ని దాచుకోవట్లేదని దేశీయ ఆర్థిక, పెట్టుబడి, స్టాక్ మార్కెట్ కోర్సులు, రీసెర్చ్ టూల్స్ సంస్థ ఫినాలజీ తాజా సర్వేలో వెల్లడించింది. మూడు లక్షల మంది భారతీయ ఉద్యోగుల నుంచి ‘ఇండియాస్ మనీ హ్యాబిట్స్’ పేరిట డేటాను సేకరించింది. దీని ప్రకారం.. ఉన్నపళంగా ఉద్యోగం కోల్పోతే ప్రతి నలుగురిలో ఒకరు ఒక నెలపాటు కూడా పరిస్థితులను తట్టుకోలేరని వెల్లడించింది. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆరోగ్య బీమా లేదని.. ఆనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు ఎదురైతే పరిస్థితి అగమ్యగోచరమేనని తెలిపింది. భద్రత పాలసీలకు దూరంగా.. ఇక దేశంలో కొంతమేర పెరిగిన అవగాహన, కంపెనీల్లో తప్పనిసరి కావడంవల్ల 30–40 ఏళ్ల వయస్సు ఉద్యోగులు బీమా పాలసీలను తీసుకుంటే.. 20–30 ఏళ్ల వయస్సు వారి బీమా పాలసీ స్కోరు చాలా దారుణంగా ఉందని నివేదిక పేర్కొంది. అధిక ఆర్జన కారణంగా విలాసవంతమైన జీవనశైలిపై ఎక్కువ ఖర్చుచేయడం వారి ప్రధాన అంశంగా మారిపోయిందని.. ఫలితంగా పొదుపు సూత్రాన్ని పాటించడమే లేదని సర్వే కుండబద్దలు కొట్టింది. ప్రతీ ఆరుగురు భారతీయ ఉద్యోగుల్లో కనీసం ఒకరికి కూడా ఎటువంటి పాలసీ కవరేజీ లేకపోవడం భవిష్యత్తు ఆలోచనకు దూరంగా ఉండటమేనని చెప్పింది. క్రిటికల్ ఇల్నెస్లో 69 శాతం మందికి, ప్రమాదవశాత్తూ మరణిస్తే 65 శాతం మందికి సరైన భరోసా దక్కట్లేదని గుర్తించింది. ఈ క్రమంలోనే కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే 68 శాతం మంది స్టాక్మార్కెట్లు నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. 15 రోజులకే జీతం ఖాళీ.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఉద్యోగుల జీతం 15 రోజులకే ఖాళీ అయిపోతున్నట్టు తెలిపింది. అలాగే.. ♦ ఇక్కడ నలుగురిలో ఒకరు రోజుకు వచ్చే జీతం కంటే ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. ♦ ఆరుగురిలో ఒకరు తమ వద్ద ఉన్నదాని కంటే రెండు రెట్లు బాకీ ఉన్నారు. ♦ ఈఎంఐలు కట్టడానికి డబ్బులు అందుబాటులో లేకుంటే మెజారిటీ ఉద్యోగులు స్టాక్స్ వెనక్కి తీసుకుంటుంటే.. 24శాతం మంది ఈఎంఐలు కట్టడానికే తిరిగి రుణాలు తీసుకుంటున్నారు. ♦ ఐదు శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. ♦ 15 శాతం మంది ఈఎంఐలు కట్టలేక ఎగ్గొడుతున్నట్లు సర్వే వెల్లడించింది. అప్పుల ఊబిలో.. మరోవైపు.. ప్రతీ ఐదుగురు భారతీయ ఉద్యోగుల్లో ఇద్దరు ఎప్పటికీ అప్పుల ఊబి నుంచి తప్పించుకోలేరని నివేదిక హెచ్చరించింది. 27 శాతం మంది ప్రస్తుతం అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతుండగా 68 శాతం మంది పదవీ విరమణ ప్రణాళిక లేకుండా గడిపేస్తున్నారని ప్రస్తావించింది. ఇక 53 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు చూసుకుంటున్నారని.. 36 శాతం మంది పెన్షన్ ఫండ్స్, 7 శాతం మంది అద్దె వస్తుందని, నాలుగు శాతం మంది తమ పిల్లలు చూసుకుంటారనే ధీమాలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. -
ప్రస్తుత హెల్త్ పాలసీ నచ్చడం లేదా? మరో పాలసీకి మారిపోండిలా..
హైదరాబాద్కు చెందిన క్రాంతి కుమార్ గతేడాది అత్యవసరంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సింగిల్ ఏసీ రూమ్ను ఆయన ఆసుపత్రిలో తీసుకున్నారు. మూడు రోజులకు కలిపి రూ.88,000 బిల్లు వచ్చింది. అతడికి రూ.4 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండడంతో నిశ్చింతగా ఉన్నాడు. కానీ, బీమా సంస్థ నుంచి పూర్తి పరిహారం అందలేదు. క్రాంతి తన వంతుగా రూ.33,000ను చెల్లించాల్సి వచ్చింది. అదేమని ప్రశ్నించగా.. బీమా కవరేజీలో రూమ్ రెంట్ పరిమితి 1 శాతంగా ఉంది. కానీ, అతడు ఎంపిక చేసుకున్న రూమ్ రోజువారీ అద్దె 1 శాతం కంటే మించి ఉంది. ఈ షరతు చూసిన తర్వాత అతడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దీంతో కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. ఇది క్రాంతి కుమార్ ఒక్కడికే ఎదురైన పరిస్థితి అనుకోవద్దు. దశాబ్దం క్రితం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుని, కొనసాగుతున్న వారంతా ఎదుర్కొంటున్నారు. క్లెయిమ్ పరిష్కారాల్లో జాప్యం, ఏదో రకమైన కొర్రీ పెట్టి తక్కువ పరిహారాన్ని చెల్లించడం, అధిక ప్రీమియం వసూలు లేదా నాసిరకమైన సేవలతో సరిపెట్టడం.. ఇలా ఎన్నో కారణాలతో పాలసీదారులు ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంటోంది. దీంతో చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ ఫలితంగా ఎన్నో సర్జరీలకు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏర్పడడం లేదు. అదే రోజు డిశ్చార్జ్ అయి వెళ్లొచ్చు. ఒకవైపు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ.. మరోవైపు జీవనశైలి వ్యాధులతో ఔట్ పేషెంట్ సేవల అవసరం పెరుగుతోంది. మారుతున్న ఈ అవసరాలు అన్నీ మన ఆరోగ్య బీమా కవరేజీలో భాగంగా ఉన్నప్పుడు అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అందుకే సమగ్రమైన హెల్త్ కవరేజీతో ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఇప్పటికే తీసుకున్న పాలసీ సమగ్ర కవరేజీకి భరోసా ఇవ్వనట్టయితే.. చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంటే, బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోతే, ప్రీమియం భారంగా మారితే అప్పుడు మన ముందు రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి బీమా సంస్థను మార్చడం. లేదంటే ప్రస్తుత సంస్థలోనే మెరుగైన ప్లాన్కు మారిపోవడం (మైగ్రేషన్). వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సేవల పట్ల సంతృప్తిగానే ఉండి, పాలసీలోని కవరేజీ ఫీచర్లు, ప్రీమియం విషయంలో సంతృప్తిగా లేకపోతే అప్పుడు మీ ప్లాన్ను పోర్టింగ్ పెట్టుకోవడానికి బదులు, అదే బీమా సంస్థలో మెరుగైన ఫీచర్లతో కూడిన మరో ప్లాన్ను మైగ్రేట్ అవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. పోర్టింగ్ అంటే ప్రస్తుత బీమా సంస్థను వీడి, మరో బీమా సంస్థకు మారిపోవడం. మైగ్రేషన్ అంటే ప్రస్తుత బీమా సంస్థలోనే మరో ప్లాన్కు మారిపోవడం. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనల కింద ఒక వ్యక్తి తన పాలసీని ఎలాంటి బ్రేక్ లేకుండా వరుసగా నాలుగేళ్ల పాటు రెన్యువల్ చేసుకుంటే, అప్పుడు ప్రస్తుత బీమా ప్లాన్ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మైగ్రేషన్కు అర్హత లభిస్తుంది’’అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థానిల్ ఘోష్ తెలిపారు. ఎప్పుడు మార్చుకోవాలి..? ‘‘కస్టమర్లు ప్రస్తుత హెల్త్ ప్లాన్ కవరేజీ పట్ల అసంతృప్తితో ఉంటే లేదా ప్రస్తుత బీమా సంస్థ సేవలు నచ్చకపోతే లేదా సమగ్రమైన, వినూత్నమైన బీమా పాలసీ అందుబాటు ప్రీమియానికి లభిస్తుంటే పోర్ట్ పెట్టుకోవచ్చు. కాకపోతే నూతన పాలసీ ప్రయోజనాలు, నూతన సంస్థ సేవల సదుపాయాలను ప్రధానంగా చూడాలి’’అని షా సూచించారు. ‘‘మార్కెట్లో ఉన్న ప్రతీ నూతన ఉత్పత్తి అందరికీ సరిపోకపోవచ్చు. వేరొక సంస్థలోని ప్లాన్లో ఉన్న ఆకర్షణీమయైన ఫీచర్లను చూసి మారిపోవడం సరికాదు. మీ అవసరాలు, కుటుంబ సభ్యులు, వయసు తదితర అంశాల ఆధారంగా కొత్త ఉత్పత్తిని మదింపు వేయాలి’’అని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోయినా, కస్టమర్ సేవలు నచ్చకపోయినా, ప్రస్తుత బీమా సంస్థ అందిస్తున్న సేవలు నాసిరకంగా ఉన్నా, సరైన కారణాలు చూపకుండా క్లెయిమ్ను తిరస్కరించినా అప్పుడు మారిపోవడాన్ని పరిశీలించొచ్చని యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో శరద్ మాథుర్ సూచించారు. సరైన సమాచారం పొందలేకపోవడం, పారదర్శకత లేమి, కంపెనీ నుంచి సత్వర స్పందన లేకపోవడం, విలువ ఆధారిత సేవలు లేకపోయినా పోర్టింగ్ను పరిశీలించొచ్చని తెలిపారు. ఇప్పటికే బీమా పాలసీ ఉండి, అందులోని నిబంధనల వల్ల సొంతంగా చెల్లింపులు చేసుకోవాల్సి వస్తుంటే, రూమ్ రెంట్ పరంగా ఉప పరిమితులు ఉంటే, మీకు దీర్ఘకాలిక వ్యాధి ఉండి ఓపీడీ లేదా డేకేర్ కవరేజీ లేకపోతే, మీ ప్లాన్లో రీస్టోరేషన్ (బీమా ఖర్చయితే తిరిగి పునరుద్ధరించడం) ఫీచర్ లేకపోయినా, ముందు నుంచి ఉన్న వ్యాధులకు దీర్ఘకాలం వెయిటింగ్ పీరియడ్ ఉన్నా, అప్పుడు మీ వంతు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. దీనికి బదులు వేరొక ప్లాన్కు మారిపోవడమే నయం. ఉదాహరణకు నివాబూపా సంస్థ రెండు గంటలకు మించి హాస్పిటలైజేషన్ అయితే చాలు చెల్లింపులు చేస్తోంది. అదే ఆదిత్య బిర్లా సంస్థ అయితే ఆరోగ్యకర జీవనశైలిని (కంపెనీ చెప్పినట్టు) అనుసరిస్తే అప్పడు ప్రీమియంలో నూరు శాతం వరకు రాయితీని ఆఫర్ చేస్తోంది. సాధారణంగా పోర్టింగ్ లేదా మైగ్రేషన్కు ప్రీమియం ఒక్కటినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే అన్ని బీమా సంస్థలు కొన్నేళ్లకోసారి ప్రీమియంను సవరిస్తుంటాయి. అలాగే వయసు వారీగా కూడా ప్రీమియం పెంపు ఉంటుంది. అలాగే, బీమా కవరేజీని పెంచుకునేందుకు సైతం పోర్టింగ్ సరికాదు. దీనికి బదులు టాపప్ లేదా సూపర్ టాపప్ రూపంలో అదనపు కవరేజీని యాక్టివేట్ చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ కవరేజీకి మించి క్లెయిమ్ వచ్చిన సందర్భాల్లోనే టాపప్, సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తాయి. ఏమి చూడాలి..? మీ అవసరాలకు సరిపడే ప్లాన్ను ఎంపిక చేసుకోవాలి. పాలసీ వర్డింగ్స్, పాలసీ బ్రోచర్ను అన్ని పేజీలు చదివితే పూర్తి వివరాలు తెలుస్తాయి. తద్వారా ప్లాన్ ఆకర్షణీయమా? కాదా? అన్నది చూడొచ్చు. క్లెయిమ్ పరిష్కారాల విషయంలో నూతన సంస్థ పనితీరును విశ్లేషించాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, క్లెయిమ్ చెల్లింపుల సామర్థ్యాలను చూడాలి. క్లెయిమ్ అభ్యర్థనలను ప్రాసెస్ చేయడంతో బీమా సంస్థల స్పందనను చూడాలి. ప్రీమియం ఎక్కువ ఉన్నా సరే, క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై చెల్లింపుల భారం పడని పాలసీని ఎంపిక చేసుకోవాలి. ఓపీడీ కవరేజీ, డేకేర్, రీస్టోరేషన్ కూడా ఉండాలి. ఒక పాలసీ సంవత్సరంలో ఒక క్లెయిమ్ వల్ల బీమా కవరేజీ మొత్తం ఖర్చయినప్పుడు.. రీస్టోరేషన్ కింద బీమా సంస్థ అంతే మొత్తాన్ని పునరుద్ధరిస్తుంది. దీనివల్ల అదే ఏడాది మళ్లీ ఆసుపత్రిలో చికిత్స అవసరం పడితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులోనూ కొన్ని సంస్థలు ఒక ఏడాదిలో ఒకరు ఎన్ని సార్లు ఆసుపత్రిలో చేరినా, గతంలో క్లెయిమ్ చేసిన వ్యాధులకు సైతం రీస్టోరేషన్ (అన్ లిమిటెడ్) ఇస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. ముందు నుంచి ఉన్న వ్యాధులకు సాధారణంగా 3–4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనివల్ల వాటికి కవరేజీ కోసం అన్నేళ్లు ఆగక తప్పదు. దీనికి బదులు ఏడాది, అసలు వెయిటింగ్ పీరియడ్ లేని (రైడర్) పాలసీలు మెరుగైనవి. నో క్లెయిమ్ బోనస్ అనేది ప్రీమియం తగ్గింపు రూపంలో కాకుండా, బీమా కవరేజీ పెంపు రూపంలో ఉంటే ఎక్కువ ప్రయోజనం. రూమ్ రెంట్ పరిమితులు లేకుండా చూసుకోవాలి. ఇంటి నుంచే చికిత్స తీసుకోవాల్సి వస్తే (కరోనా వంటి సమయాల్లో) కవరేజీనిచ్చే డోమిసిలరీ ట్రీట్మెంట్ కవరేజీ ఫీచర్ ఉంటే మంచిదే. దరఖాస్తు తిరస్కరణ..? మంచి ఆరోగ్య చరిత్ర ఉండి, సరైన వివరాలు, డాక్యుమెంట్లు అందిస్తే నూతన సంస్థ పోర్టింగ్ అభ్యర్థనను ఆమోదించి పాలసీ మంజూరు చేస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండి, ఇచ్చిన సమాచారంలో అస్పష్టత, గోప్యత ఉంటే, లేదా ఇతర కారణాలతో పాలసీ ప్రపోజల్ను తిరస్కరించొచ్చు. ఎందుకంటే అప్పటికే ఉన్న ఆరోగ్య చరిత్రను పాత సంస్థ నుంచి నూతన బీమా సంస్థ తీసుకుంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. పాత బీమా సంస్థకు దరఖాస్తు సమయంలో ఇచ్చిన దానికి భిన్నమైన సమాచారం కొత్త సంస్థకు అందించినట్టయితే తిరస్కరణకు అవకాశాలుంటాయి. అటువంటి సందర్భంలో కొత్త సంస్థను బతిమిలాడే బదులు, ఉన్న సంస్థతోనే కొనసాగడం మంచి నిర్ణయం అవుతుంది. దీనికి బదులు ప్రస్తుత బీమా సంస్థలోనే మెరుగైన ఫీచర్లతో కూడిన ప్లాన్కు మైగ్రేట్ అవ్వడం మరో మంచి ఆప్షన్. అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే, పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించాలనేమీ లేదు. ముఖ్యంగా తనకున్న వ్యాధులకు పాత ప్లాన్లో క్లెయిమ్ చేసుకుని ఉంటే పోర్టింగ్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత పాలసీ రెన్యువల్కు సంబంధించి ల్యాప్సెస్ ఉంటే అది కూడా తిరస్కరణకు కారణం అవుతుంది. నిబంధనల మేరకు రెన్యువల్ సమయంలో సంప్రదించకుంటే అప్పుడు పోర్టింగ్ విజయవంతం కాదు. అందుకే రెన్యువల్కు 60రోజుల ముందు సంప్రదించాలి. 70 ఏళ్లు దాటిన వారికి పోర్టింగ్కు అవకాశం ఉండదు. పోర్టింగ్ ఎలా..? నూతన సంస్థకు మారిపోవాలని నిర్ణయించుకుంటే రెన్యువల్ సమయంలోనే అనుమతిస్తారు. పాలసీ రెన్యువల్ తేదీకి 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు నూతన బీమా సంస్థకు పోర్టింగ్ గురించి తెలియజేయాలి. ఈ సమయంలో వీలు కాకపోతే, తిరిగి రెన్యువల్ వరకు వేచి చూడాల్సిందే. ప్రపోజల్ పత్రం, పోర్టబులిటీ దరఖాస్తు పత్రాలను నింపాలి. ఆరోగ్య చరిత్ర, బీమా సంస్థ కోరిన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ, ఇతర పత్రాలను కూడా అందించాలి. గత పాలసీ పరిధిలో క్లెయిమ్ చేసి ఉంటే, డిశ్చార్జ్ సమ్మరీ జోడించాలి. అనంతరం ప్రస్తుతం బీమా సంస్థకు పోర్టింగ్ సమాచారం వెళుతుంది. అప్పుడు ప్రస్తుత సంస్థ సదరు పాలసీదారుకు సంబంధించి క్లెయిమ్, ఇతర సమాచారాన్ని కొత్త సంస్థతో పంచుకోవాలి. అప్పుడు నూతన బీమా సంస్థ 15 రోజుల్లోపు తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పాలసీ దరఖాస్తును ఆమోదిస్తే ప్రీమియం చెల్లించాలి. వీటిని గమనించాలి.. పోర్టింగ్ సమయంలో పాత ప్లాన్లో నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలు ఉంటే, కొత్త ప్లాన్లోనూ జతవుతాయి. కానీ, దీనికి కంపెనీలు షరతు పెడుతున్నాయి. ప్రస్తుత కవరేజీ రూ. 5 లక్షలు ఉండి, కొత్త సంస్థలోనూ రూ.5 లక్షలే తీసుకుంటే, పాత ప్లాన్ పరిధిలోని నో క్లెయిమ్ బోనస్ పోర్టింగ్ అవ్వదు. అదే రూ.6 లక్షలు తీసుకుంటే నో క్లెయిమ్ బోనస్ కలుస్తుంది. పోర్టింగ్ లేదా మైగ్రేషన్ను కొత్త ప్రపోజల్గానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. అండర్రైటింగ్ నిబంధనల మేరకు ప్రీమియం నిర్ణయిస్తాయి. బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ను మాత్రమే మరో బీమా సంస్థ పరిధిలోని బీమా ఇండెమ్నిటీ ప్లాన్కు మార్చుకోగలరు. అంతేకానీ, టాపప్ లేదా క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ను మార్చుకోలేరు. ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు హెల్త్ ప్లాన్ను పోర్టింగ్ పెట్టుకుంటే ఎలాంటి చార్జీల్లేవు. కార్పొరేట్ లేదా గ్రూప్ ప్లాన్లల ఉన్న వారికి ఇండివిడ్యువల్ ప్లాన్కు పోర్టింగ్ అవకాశం లేదు. వారు అదే సంస్థతో కొసాగాల్సిందే. -
ఇవి తెలుసుకోకుండా ఆరోగ్య బీమా కంపెనీ ఎంచుకోకండి
కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య బీమా అవసరంపై అవగాహన పెరిగింది. అయితే దేశీయంగా 24 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, 5 ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నందున సరైన బీమా సంస్థను ఎంచుకోవడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా సంస్థను ఎంచుకునే ముందు పరిశీలించాల్సిన అయిదు ముఖ్య అంశాల గురించి వివరించేదే ఈ కథనం. ► క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి: బీమా సంస్థకు ఎన్ని క్లెయిమ్స్ వస్తే అది ఎన్నింటిని సెటిల్ చేసిందనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. 93–94 శాతం లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తి ఉన్న సంస్థలను మాత్రమే ఎంచుకోవడం మంచిది. ► వినియోగదారుల ఫిర్యాదులు: ఇది వరకే ఉన్న వినియోగదారులు సదరు బీమా సంస్థపై ఏమైనా ఫిర్యాదులు చేశారా అనేది కూడా చూసుకోవాలి. క్లెయిమ్ ఫిర్యాదులు, పాలసీ ఫిర్యాదుల వివరాలు ‘Nఔ–45 (గ్రీవెన్స్ డిస్పోజల్) ఫారం’లో ఉంటాయి. దీన్ని ప్రతి బీమా కంపెనీ అందుబాటులో ఉంచాలి. ఫిర్యాదులు తక్కువగా ఉండటం మెరుగైన కస్టమర్ అనుభవాన్ని సూచిస్తుంది. ► ఆన్లైన్ కస్టమర్ రేటింగ్స్: గూగుల్, ఫేస్బుక్లో లభించే కస్టమర్ రేటింగ్స్ వల్ల కూడా కస్టమర్లు ఎంత సంతృప్తిగా ఉన్నారనేది తెలుసుకోవచ్చు. రేటింగ్ ఎక్కువగా ఉన్న బీమా సంస్థలు మెరుగై న సర్వీసులు అందిస్తున్నాయని భావించవచ్చు. ► ప్రీమియం చార్జీలు, ప్రయోజనాలు: మనం తీసుకునే పాలసీకి ఎంత ప్రీమియం వసూలు చేస్తున్నారనేది అందరూ ఎక్కువగా గమనించే అంశం. అయితే, ప్రీమియం తక్కువగా ఉందనే ప్రాతిపదికన పాలసీలను ఎంచుకోవడం అన్ని వేళలా సరి కాకపోవచ్చు. బీమా సంస్థ అందించే ఆరు కీలక ప్రయోజనాలతో ప్రీమియంను పోల్చి చూసుకోండి. గది అద్దెపై పరిమితి లేకపోవడం, సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్ లేదా పునరుద్ధరణ బెనిఫిట్ (ఎటువంటి మినహాయింపుల నిబంధనలు లేకుండా), ఆఫర్ చేసే క్యుములేటివ్ బోనస్ పర్సంటేజీ (కనిష్టంగా 50 శాతం, అంతకంటే ఎక్కువ), కో–పేమెంట్ లేకుండా, కన్జూమబుల్స్కు కూడా మంచి కవరేజీ, ప్రీ–పోస్ట్ హాస్పిటలైజేషన్ ప్రయోజనం (కనీసం 60/90 రోజుల వరకు), అలాగే అవయవదాత ఖర్చులు వీటిలో ఉంటాయి. ► డిస్కౌంట్లు: మీరు ఎంచుకున్న పాలసీ ఖరీదైనది అయితే ప్రీమియంను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. నేడు మార్కెట్లో ఉన్న చాలా బీమా సంస్థలు 5–20 శాతం తగ్గింపు అందిస్తున్నాయి. అధిక వెయిటింగ్ పీరియడ్ కోసం తగ్గింపు, డిడక్టబుల్స్, ధూమపానం చేయని వారికి డిస్కౌంట్, ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి (750 అంతకంటే ఎక్కువ), పాత కస్టమర్గా ఉండటం, సిటీ డిస్కౌంట్లు (మీరు జోన్–2లో నివసిస్తుంటే) వంటి అంశాలు వీటిలో ఉంటాయి. ► ఆరోగ్య బీమా సంస్థను ఎంచుకునేటప్పుడు ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే తుది నిర్ణయం తీసుకునే ముందు పాలసీ నిబంధనలు, షరతులను తప్పకుండా చదవాలని గుర్తుంచుకోండి. -
మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారికి బీమా
న్యూఢిల్లీ: సాధారణ, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వైకల్యం ఉన్న వారు, హెచ్ఐవీ బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా బీమా ఉత్పత్తులను తీసుకు రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలకు (2016) అనుగుణంగా ఈ ఉత్పత్తుల ప్రీమియం ధరలను నిర్ణయించాలని తన తాజా సర్క్యులర్లో పేర్కొంది. ఈ తరహా వ్యక్తులకు సంబంధించి పాలసీల క్లెయిమ్లు తిరస్కరించకుండా బోర్డు స్థాయిలో ఆమోదం పొందిన అండర్రైటింగ్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించింది. ఏడాది కాల వ్యవధితో బీమా ఉత్పత్తి ఉండాలని, దాన్ని ఏటా పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
హెల్త్ ఇన్సూరెన్స్పై కీలక సర్వే! ఈ విషయాలు తెలుసుకోండి!
ముంబై: అవసరమైతే ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉండి మరీ, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో 85 శాతం మంది ఇదే చెప్పారు. 19 పట్టణాల నుంచి 6,600 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కరోనాతో అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులతో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడినట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది తమ హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ కన్సల్టేషన్ (వైద్య సలహా) కూడా భాగంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కనుక మానసిక ఆరోగ్యంపై అత్యవసర అవగాహన అవసరం ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తర్వాత ఆరోగ్యం, శ్రేయస్సుపై తమ అవగాహన పెరిగినట్టు 84 శాతం మంది సర్వేలో చెప్పారు. వైద్య అత్యవసరాల్లో వినియోగించుకునేందుకు వీలుగా కొంత నిధిని పక్కన పెట్టనున్నట్టు 52 శాతం మంది తెలిపారు. ఖర్చు దృష్ట్యా తాము మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేందుకు వెనుకాడినట్టు 35 శాతం మంది వెల్లడించారు. తాము బరువు, రక్తపోటు తదితర ఆరోగ్య అంశాలను తరచూ పర్యవేక్షించుకోవడం లేదని ప్రతి ముగ్గురిలో ఒక్కరు చెప్పడం గమనార్హం. కరోనా తర్వాత ఆరోగ్యం విషయంలో ప్రజల ఆలోచన విధానం మారిందని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడంతోపాటు అత్యవసర పరిస్థితుల పట్ల సన్నద్ధతను అర్థంచేసుకుంటున్నారని ఆదిత్య బిర్లాహెల్త్ ఇన్సూరెన్స్ సర్వే నివేదిక తెలిపింది. ‘‘ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరాన్ని కరోనా తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో తాము తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించుకుంటున్నారు’ ’అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. -
ఖర్చులు తగ్గించుకుని అయినా హెల్త్ ఇన్సూరెన్స్
ముంబై: అవసరమైతే ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉండి మరీ, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో 85 శాతం మంది ఇదే చెప్పారు. 19 పట్టణాల నుంచి 6,600 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కరోనాతో అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులతో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడినట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది తమ హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ కన్సల్టేషన్ (వైద్య సలహా) కూడా భాగంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కనుక మానసిక ఆరోగ్యంపై అత్యవసర అవగాహన అవసరం ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తర్వాత ఆరోగ్యం, శ్రేయస్సుపై తమ అవగాహన పెరిగినట్టు 84 శాతం మంది సర్వేలో చెప్పారు. వైద్య అత్యవసరాల్లో వినియోగించుకునేందుకు వీలుగా కొంత నిధిని పక్కన పెట్టనున్నట్టు 52 శాతం మంది తెలిపారు. ఖర్చు దృష్ట్యా తాము మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేందుకు వెనుకాడినట్టు 35 శాతం మంది వెల్లడించారు. తాము బరువు, రక్తపోటు తదితర ఆరోగ్య అంశాలను తరచూ పర్యవేక్షించుకోవడం లేదని ప్రతి ముగ్గురిలో ఒక్కరు చెప్పడం గమనార్హం. కరోనా తర్వాత ఆరోగ్యం విషయంలో ప్రజల ఆలోచన విధానం మారిందని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడంతోపాటు అత్యవసర పరిస్థితుల పట్ల సన్నద్ధతను అర్థం చేసుకుంటున్నారని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే నివేదిక తెలియజేసింది. ‘‘ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరాన్ని కరోనా తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో తాము తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించుకుంటున్నారు’’అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. -
Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు
న్యూఢిల్లీ: బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్ నేపథ్యంలో.. చురుకైన రిస్క్ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్ ‘ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది. మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్ తెలిపింది. అదే సమయంలో రిస్క్లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది. తిరిగి ఆవిష్కరించుకోవాలి.. ‘‘భారత బీమా రంగం డిజిటల్ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్ సంజయ్ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. -
త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలకు బీమా పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల కోసం కూడా త్వరలోనే బీమా పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు జునో జనరల్ ఇన్సూరెన్స్ (గతంలో ఎడెల్వీస్ జనరల్ ఇన్సూరెన్స్) సీడీవో రాకేశ్ కౌల్ తెలిపారు. ప్రస్తుతం రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి అంశాలకు సంబంధించి అధ్యయనం చేస్తున్నట్లు ఆయన వివరించారు. త్వరలో మరికొన్ని హెల్త్ పాలసీలను కూడా ప్రవేశపెడుతున్నట్లు కౌల్ పేర్కొన్నారు. తమ వ్యాపారంలో దాదాపు 35 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉంటోందని ఆయన పేర్కొన్నారు. 30 లక్షల పైగా కస్టమర్లు, 1,000 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లు ఉన్నట్లు కౌల్ తెలిపారు. -
సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త పాలసీ.. ప్రయోజనాలు ఇవే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీనియర్ సిటిజన్స్ కోసం మణిపాల్సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ తాజాగా ప్రైమ్ సీనియర్ పేరిట ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టింది. తక్కువ వెయిటింగ్ పీరియడ్, పాలసీ తీసుకున్న 91వ రోజు నుంచీ ప్రీ–ఎగ్జిస్టింగ్ (అప్పటికే ఉన్న) అనారోగ్య సమస్యలకు కవరేజీ మొదలైన ప్రత్యేకతలు ఈ పాలసీలో ఉన్నట్లు సంస్థ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. కో–పే, ఉప–పరిమితులు, పాలసీ తీసుకునే ముందు తప్పనిసరి మెడికల్ చెకప్ వంటి బాదరబందీలేమీ ఇందులో ఉండవని వివరించారు. నాన్–మెడికల్ ఐటమ్లకు కూడా కవరేజీ లభిస్తుందని, అపరిమిత టెలీ కన్సల్టేషన్, హెల్త్ చెకప్లు వంటి ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇది ప్రైమ్ సీనియర్ క్లాసిక్, ప్రైమ్ సీనియర్ ఎలీట్ అని రెండు వేరియంట్లలో ఉంటుందని వివరించారు. (ఇదీ చదవండి: ట్రాయ్ నిబంధనలు కఠినతరం! కాల్ సేవల నాణ్యత మెరుగుపడేనా?)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీపై ఆర్బీఐ చర్యలు
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇండియా కూటమి 272 సీట్లలో గెలిచేసింది: జైరామ్రమేశ్
అనిల్ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం
చరిత్ర సృష్టించిన బట్లర్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
స్కూల్ పిల్లల చేతుల మీదుగా 'సంకెళ్లు' పాట విడుదల
ఆలౌట్ తాగిన చిన్నారి.. అరుదైన చికిత్సతో కాపాడిన కిమ్స్ కడల్స్ డాక్టర్లు
Deepika Padukone: ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్.. ఫైనల్లో సన్రైజర్స్ (ఫొటోలు)
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్ స్వాధీనం
- రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement