-
జోడీ రిటర్న్స్
కొన్ని జంటలు ‘హిట్’ అవుతాయి. వెండితెరపై హిట్ అయిన ఆ జోడీలను మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మళ్లీ ఆ జోడీకి తగ్గ కథ కుదరాలి, కథ కుదిరితే ఇద్దరి డేట్స్ సెట్ అవ్వాలి. ఈ రెండూ సెట్ అయి, వెంటనే రిపీట్ అయిన జోడీలు ఉంటాయి.. ఎన్నో ఏళ్లకు గానీ రిపీట్ అయ్యే జోడీలూ ఉంటాయి. అలా కొన్నేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం.విశ్వంభర పిలిచాడు దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత హీరో హీరోయిన్లుగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరంజీవి, త్రిష. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘స్టాలిన్’ 2006లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, సిస్టర్ సెంటిమెంట్తో పాటు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఈ కథలో ఉంటాయని ఫిల్మ్నగర్ సమాచారం.ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ షెడ్యూల్లో ఇంట్రవెల్ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త. షష్ఠిపూర్తి సంబరం రాజేంద్రప్రసాద్–అర్చన కలిసి నటించిన ‘లేడీస్ టైలర్’ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 1986లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన కలిసి మళ్లీ వెంటనే మరో సినిమా చేయలేదు. 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘షష్ఠిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ లీడ్ రోల్స్లో, ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, శకుంతల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ కుటుంబకథా చిత్రానికి ఇళయరాజా స్వరకర్త. అప్పటి ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాయే ఈ ‘షష్ఠిపూర్తి’ సినిమాకూ స్వరాలు సమకూర్చడం విశేషం. కుటుంబ విలువలు, కుటుంబ సభ్యుల అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపేష్ నిర్మిస్తున్నారు. తెరపై యాభైఆరోసారి... మలయాళ సిల్వర్ స్క్రీన్పై మోహన్లాల్, శోభనల జోడీ సూపర్ హిట్. ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ (1985) సినిమా కోసం తొలిసారి మోహన్లాల్, శోభన జత కట్టారు. ఆ తర్వాత ‘మణిచిత్ర తాళు’, ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ సినిమాలతో పాటు యాభైసార్లకు పైగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు మోహన్లాల్, శోభన. అయితే 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ తర్వాత మరోసారి మోహన్లాల్, శోభన కలిసి లీడ్ రోల్స్లో నటించలేదు.ప్రస్తుతం మోహన్లాల్ హీరోగా నటించనున్న 360వ చిత్రంలో శోభన ఓ లీడ్ రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది మోహన్లాల్, శోభన కలిసి నటిస్తున్న 56వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో మోహన్లాల్కు జోడీగా కనిపిస్తారట శోభన. తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో మోహన్లాల్ టాక్సీ డ్రైవర్గా కనిపిస్తారని టాక్. ఈ ఏడాది ఓనమ్కు సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పెళ్లి తర్వాత తొలి సినిమా? దాదాపు పాతికేళ్ల క్రితం తమిళ చిత్రం ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ (1999)లో తొలిసారి సిల్వర్ స్క్రీన్పై జోడీగా కనిపించారు సూర్య, జ్యోతిక. ఆ తర్వాత ‘ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కక్క, మాయావి’ వంటి సినిమాల్లో సూర్య, జ్యోతిక హిట్ జోడీ అనిపించు కున్నారు. చివరిసారిగా 2006లో ‘సిల్లున్ను ఒరు కాదల్’ సినిమాలో సూర్య–జ్యోతిక జోడీగా కనిపించారు.ఈ సినిమా విడుదలైన తర్వాత సూర్య, జ్యోతిక రియల్ లైఫ్ జోడీ కూడా అయ్యారు. అయితే ‘సిల్లున్ను ఒరు కాదల్’ తర్వాత సూర్య, జ్యోతిక కలిసి సినిమా చేయలేదు. పద్దెనిమిదేళ్ల తర్వాత ఆ సమయం ఆసన్నమైందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ‘కేరళ కేఫ్’, ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అంజలీ మీనన్ ఓ కథ సిద్ధం చేశారని, ఈ కథతో తెరకెక్కనున్న సినిమాలో సూర్య, జ్యోతిక జోడీగా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటించే చిత్రం ఇదే అవుతుంది. ఇంకా మరికొందరి హీరో హీరోయిన్ జోడీలు రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
అల్లు అర్జున్తో ఛాన్స్.. నో చెప్పిన తెలుగు హీరో ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే పేద మహిళా డ్రైవర్కు కొత్త ఆటో బహుమతిగా అందించారు. తనవంతు సాయంగా సమాజ సేవలో భాగంగా తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లారెన్స్. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 ద్విచక్ర వాహనాలు అందజేశారు. అంతే కాకుండా వారికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. త్వరలోనే వారికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం రాఘవ చేస్తున్న సేవలను కొనియాడారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చంద్రముఖి-2, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాలతో అలరించిన రాఘవ.. ప్రస్తుతం దుర్గ అనే చిత్రంలో నటిస్తున్నారు. Hatsoff @offl_Lawrence Sir தமிழர் பாரம்பரிய மல்லர் கலையில் கலக்கி வரும் #கை_கொடுக்கும்_கை மாற்றுத்திறனாளி குழுவினர் ஒவ்வொருவருக்கும் இரண்டு சக்கர வாகனம் பரிசளித்தார் மாஸ்டர் #ராகவா_லாரன்ஸ் .#RaghavaLawrence pic.twitter.com/879dQ28jLO — Actor Kayal Devaraj (@kayaldevaraj) April 18, 2024 Service is god 🙏🏼 pic.twitter.com/UBZXYFIDMQ — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2024 -
సుహాస్ మూవీతో 'నువ్వు నేను' హీరోయిన్ రీ ఎంట్రీ (ఫోటోలు)
-
క్రేజ్ కాపాడుకోలేకపోయాడు.. ఆ తప్పు వల్ల కెరీర్, జీవితం సర్వనాశనం!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగేవాళ్లు చాలామందే కనిపిస్తారు. నిజంగానే ఒక్క ఛాన్స్తో అద్భుతాలు జరిగిపోతాయా? అంటే అవుననే చెప్పాలి. ఎంతోమంది తొలి సినిమాతోనే తామేంటో ప్రూవ్ చేసుకుని గొప్ప స్థాయికి ఎదిగారు. అదే సమయంలో ఫస్ట్ సినిమాతో క్రేజ్ అందుకున్నా తర్వాతి రోజుల్లో దాన్ని కాపాడుకోలేక మరుగునపడ్డ హీరోలూ ఉన్నారు. ప్రేమికుల రోజు సినిమా హీరో కునాల్ సింగ్ ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించే నేటి ప్రత్యేక కథనం.. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ కునాల్ సింగ్ నటించిన తొలి సినిమా కాదల్ దినం. ఈ మూవీ తెలుగులో ప్రేమికుల రోజు పేరిట డబ్ అయింది. ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్గా యాక్ట్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. వాలు కనులదానా, ప్రేమ అనే పరీక్ష రాసి.. , దాండియా ఆటలు ఆడ.. ఇలా అన్ని పాటలు బ్లాక్బస్టర్ హిట్టయ్యాయి. సినిమా కూడా సూపర్ హిట్టయింది. ఇంకేముంది.. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక్కడే తప్పటడుగులు వేశాడు. హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువగా అందుకున్నాడు. అతడు సంతకం చేసిన సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. (చదవండి: Vithika Sheru: మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. వితికా ఎమోషనల్ పోస్ట్) భార్య ఉండగా నటితో క్లోజ్.. మరికొన్ని షూటింగ్ జరిగినా విడుదలకు నోచుకోలేదు. ఐదేళ్లలోనే డీలా పడిపోయాడు. 2007లో చివరగా నంబనిన్ కాదలై అనే సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్టర్గా రాణించడం కష్టమని తెలియగానే అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తాడు. తర్వాత నిర్మాతగానూ మారాడు. అయతే కునాల్, నటి లావిణ పంకజ్ భాటియా అత్యంత సన్నిహితంగా మెదిలేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటికే అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి ప్రేమ విషయం కునాల్ భార్య అనురాధకు తెలిసింది. దీని గురించి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవట! ప్రాణాలు తీసుకున్నాడు ఆమె కోపంతో ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్లిపోవడంతో కునాల్ మనస్తాపానికి గురయ్యాడు. 2008 ఫిబ్రవరి 7న తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ఏదో సినిమా గురించి స్క్రిప్ట్ రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, నటి పంకజ్తో తన ఇంట్లోనే చర్చలు జరిపాడు. అందరూ వెళ్లిపోయాక పంకజ్ అక్కడే ఉన్న వాష్రూమ్ను వాడుకుందామని వెళ్లి వచ్చింది. అంతలోనే కునాల్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఏమీ మిగల్లేదు అయితే పంకజ్కు, కునాల్కు మధ్య ఏదో గొడవ జరిగిందని, ఆ ఆవేశంలోనే హీరో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న పుకార్లు కూడా వచ్చాయి. ఈ కేసులో పోలీసులు పంకజ్ భాటియాను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ ఇది ఆత్మహత్యే అని నిర్ధారించారు. అంతకుముందు కూడా కునాల్ ఒకటీరెండు సార్లు చనిపోయేందుకు ప్రయత్నించాడట! ఒకవైపు కెరీర్ నాశనమైంది.. మరోవైపు సంసార జీవితం కూడా సవ్యంగా లేదు.. వీటికి తోడు నిర్మాతగా అప్పులపాలు అవడంతోనే అతడు తనువు చాలించాడని చెప్తుంటారు. ఏదేమైనా 31 ఏళ్ల వయసులోనే అతడు ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేసింది. చదవండి: తనకెందుకు క్రెడిట్? అని ఆటిట్యూడ్ చూపించా.. తర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వలే! -
స్టార్ హీరోయిన్లతో సినిమాలు.. ఇప్పుడేమో ఖరీదైన కారును అమ్మేసి!
సినిమా రంగం అంటేనే కలల ప్రపంచం. ఇక్కడ స్టార్డమ్ అనేది అంత ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన టాలెంట్పై ఆధారపడి ఉంటుంది. అలా ఒక్క సినిమాతో మెరిసి.. ఇలా వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్గా వెలుగొందిన హీరోలకు సైతం అవకాశాలు రాక ఇబ్బందులు పడినా సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ముందువరుసలో ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్.. జానే తూ.. య జానేనా అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేశారు. చివరిసారిగా కంగనాతో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. అంతే కాదు స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు కూడా. 2015లో విడుదలైన చివరిసారిగా కట్టి బట్టీలో కనిపించిన ఇమ్రాన్ ఖాన్ అప్పటి నుంచి దాదాపు సినిమాల్లో కనిపించలేదు. అతను సినిమాలకు దూరమై దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు మానేశాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం తన కూతురు కోసమే సమయం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?) ఖరీదైన కారు అమ్మేసి..సింపుల్గా సినిమాలు చేసే సమయంలో ఫుల్ లగ్జరీ లైఫ్ను అనుభవించిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో తాను వినియోగించిన ఖరీదైన ఫెరారీ కారును సైతం అమ్మేశారు. ప్రస్తుతం వోక్స్ వాగన్ కారును ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలోని పాలి హిల్లోని లగ్జరీ బంగ్లా నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఓ చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'నేను ఇటీవలే తండ్రిని అయ్యా. ఈ సమయం నాకు చాలా విలువైనది. నా కూతురు ఇమారా కోసం నేను సమయం కేటాయించాలని కోరుకుంటున్నా. ఇకపై నటుడిగా ఉండటం నా పని కాదని నిర్ణయించుకున్నా. నేను నన్ను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. నా కుమార్తె, నా ఫ్యామిలీతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా' అని తెలిపారు. అయితే కంగనాతో చేసిన కట్టి బట్టీ ఫ్లాప్ అయిన తర్వాత తనకు అవకాశాలు రాలేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ అప్పటికే ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే 30 ఏళ్లు వచ్చేసరికి డబ్బుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాలేదని వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్ కోసం గతంలో మాదిరి కష్టపడేంత ఉత్సాహం ఇప్పుడు లేదని అన్నారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్ మేరీ బ్రదర్ కీ దుల్హాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ, ఢిల్లీ బెల్లీ, గోరీ తేరే ప్యార్ మే లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. -
సినిమా రక్తం
‘టప్’మంటూ లైట్ వెలుగుతుంది. ఆగంతకుడు ఛాతీ మీద రక్తంతో నేలకొరిగి ఉంటాడు. హీరోయినో, హీరో చెల్లెలో ‘కెవ్వు’మని నోటికి చెయ్యడ్డం పెట్టుకుంటూ కేక వేసి ‘రక్తం... రక్తం’ అని పరిగెడుతుంది. లేదా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ చేరుతారు. పోలీసులు వస్తారు. రక్తం బయటకు వస్తే రక్తం బయటకు రావడానికి కారకులను పట్టుకోవాలి. శిక్షించాలి. అది చట్టం. సమాజానికి వహించవలసిన బాధ్యత. అక్కడి నుంచి సినిమా కథంతా నడుస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రక్తం నల్లగా ఉంటుంది. పైగా కొంచెమే కనిపిస్తుంది. అయినా సరే డైరెక్టర్గాని, సినిమా రచయితగాని, హీరోగాని హంతకుణ్ణి క్లయిమాక్స్లో పోలీసులకు అప్పజెప్పకుండా ఊరుకునేవారు కాదు. హిందీలో ‘దుష్మన్’ అనే సినిమా పెద్ద హిట్. రాజేష్ఖన్నా హీరో. లారీ డ్రైవర్. నిర్లక్ష్యంగా లారీ నడిపి గొడ్లు కాచే వ్యక్తి చావుకు కారణం అవుతాడు. జడ్జిగారు అతణ్ణి జైల్లో మగ్గమని తీర్పు చెప్పకుండా, ఏ వ్యక్తి చావుకైతే కారణమయ్యాడో ఆ వ్యక్తి ఊరికెళ్లి, అతడి పొలం పండించి, పిల్లల, ముసలి తల్లిదండ్రుల బాగోగులు చూడమని ఆదేశిస్తాడు. రాజేష్ ఖన్నా ముందు నిరాకరించినా కాలక్రమంలో పరివర్తన చెందుతాడు. ఊరికి ఇలవేల్పుగా మారి క్షమార్హుడవుతాడు. టైరుకు అంటిన రక్తం ఒక మనిషిని చేర్చాల్సిన గమ్యం అది. ఈ సినిమాను తెలుగులో ‘ఖైదీ బాబాయ్’గా తీస్తే హిట్ అయ్యింది. ఇదే రాజేష్ ఖన్నా ‘రోటీ’లో ఒక వ్యక్తి అకారణ చావుకు కారణమై పశ్చాత్తాపం చెందడమే కథ. గతంలో అలా ఉండేది. హీరో నేరం చేస్తే పశ్చాత్తాపం చెందేవాడు. ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. తప్పు దారి పట్టి ఏ దొంగో, స్మగ్లరో, హంతకుడో అయితే క్లయిమాక్స్లో మరణించేవాడు. జైలుకు వెళ్లేవాడు. అట్టి హీరోకు హీరోయిన్ దక్కే అవకాశం లేదు. పోలీస్జీపులో వెళ్లిపోతున్న హీరోని గుడ్ల నీరు కక్కుకుంటూ చూడాల్సిందే. ‘దీవార్’లో అమితాబ్ చచ్చిపోతాడు. ‘ఖైదీ’లో చిరంజీవి జైలుకెళ్లిపోతాడు. ‘మల్లీశ్వరి’, ‘బంగారు పాప’ వంటి క్లాసిక్స్ తీసిన బి.ఎన్.రెడ్డి కాసింత కత్తి యుద్ధాలు వగైరా ఉండే ‘రాజమకుటం’ తీస్తే ‘ఈయనకేం పోయేకాలం వచ్చింది’ అన్నారట ప్రేక్షకులు హిట్ చేస్తూ కూడా! ‘తమరు కూడా రక్తపాతం తీయాలా మహాశయా’ అన్నారట సినిమా మిత్రులు. ఆయన బాధపడి, ఇదేదో చెడ్డపేరు వచ్చేలా ఉందని తర్వాత అలాంటి సినిమాల జోలికి పోలేదు. సృజించబడే కళ, సృజిస్తున్న కళాకారుడు వేరువేరు కాదు అనుకునేవారు పూర్వం. కళాకారుడి వ్యక్తిత్వమే కళ వ్యక్తిత్వంగా జనం గుర్తించే వారు. దర్శకులుగాని, హీరోలుగాని తమ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వస్తే తలవంపులుగా భావించేవారు. ‘ఏ సర్టిఫికెట్ వచ్చిందట’ అనేది పెద్ద వార్త. ఎన్.టి.రామారావు ‘బొబ్బిలిపులి’లో హింస ఎక్కువైందని సెన్సార్ వారు పేచీ పెట్టారు. కారణం హీరోయే దుర్మార్గులను తుదముట్టిస్తున్నాడు. స్వీయకోర్టు నిర్వహిస్తున్నాడు. రక్తపాతం సృష్టిస్తున్నాడు. దాసరి దర్శకత్వం వహించిన ‘తాండ్ర పాపారాయుడు’ చారిత్రక చిత్రమే అయినా, బొబ్బిలి యుద్ధమే కథాంశమైనా రక్తం ఎక్కువ కనిపిస్తున్నదని కొన్ని కట్స్ చెప్పారు. 1990ల ముందు వరకూ రక్తం ఎక్కువ కనిపించరాదనే సెన్సార్ నియమం ఉండేది. అంతెందుకు? చచ్చీ చెడీ ‘షోలే’ సినిమాను తయారు చేసి సెన్సార్కు పంపితే క్లయిమాక్స్లో సంజీవ్ కుమార్ గబ్బర్ సింగ్ను ఎలా చంపుతాడు... సెన్సార్ ఇవ్వం అని గట్టిగా చెప్పారు అధికారులు. దాంతో క్లయిమాక్స్ రీషూట్ చేసి గబ్బర్ను పోలీసులకు అప్పజెప్పడం చూపారు. చెడ్డపాత్రలు ఎంత మందినైనా చంపొచ్చు. మంచిపాత్రలు చంపుతూ పోతే సమాజం ఏం నేర్చుకోవాలి? సమాజం మీద ఏర్పడే ప్రభావం ఎట్టిది? రామ్గోపాల్ వర్మ వచ్చి ‘శివ’ సినిమాతో రక్తపాతాన్ని పెంచాడనే విమర్శలు వచ్చాయి గాని, సినీ హింసలో ‘శివ’ నేడొక చిన్నగీత. కాలం మారింది. ‘మనుషులను చంపుకుంటూ వెళితే ఎవరూ మిగలరు’ అని అంటూనే చాలామందిని చంపుకుంటూ వెళ్లడమే హీరోయిజం అయ్యింది. ‘ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్... వందమందిని పంపు’ అని కత్తికొక కండగా నరుకుతుంటే రక్తం ఎగజిమ్మేకొద్దీ కలెక్షన్లు వచ్చిపడ్డాయి. సినిమా ఒప్పుకున్న హీరో కాస్ట్యూమ్స్తోపాటు డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లతో కూర్చొని పోస్టర్లో మెరిసే సరికొత్త మారణాయుధాన్ని తయారు చేయించుకుంటున్నాడు. చాలక భారీ మిషన్గన్లను కూడా తయారు చేయించుకుంటున్నాడు. పేలుస్తున్నాడు. హీరో ఇంతమందిని చంపుతున్నా సినిమా పోలీసులు ఏమవుతున్నారో ఎందుకు కానరావడం లేదో వారిపైన ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలో తెలియని అయోమయ స్థితి. రక్తం మనిషికి జీవధార. చాలా ప్రమాదాల్లో, దాడుల్లో మనుషులు చనిపోయేది ప్రమాద తీవ్రత వల్ల కాదు. రక్తం పోయి. రక్తం అందక. ధర్మరాజు రక్తమే కాదు, ఏ అమాయకుడి నెత్తురు నేల మీద పడ్డా... ఆ నేలకు అది శుభసూచకం కాదు. రక్తాన్ని చూసి చలించని, రక్తాన్ని చూడటం అలవాటుగా మారిన సమాజం మానవీయంగా మనజాలదు. ఎన్ని బ్లడ్బ్యాంకులు పెట్టినా చాలనంత రక్తాన్ని ఇవాళ హీరోలు తెరల మీద పారిస్తూ ఉంటే... స్వయంగా కత్తి పట్టి క్రూరంగా గొంతులు కోస్తూ ఉంటే, ఈలలు వేస్తూ గోలలు చేస్తున్న మన ఇంటి పిల్లల్ని మనం ఎలా తయారు చేశామో తల్లిదండ్రులు ఆలోచించాలి. సినిమా అయినా, సాహిత్యమైనా జంతువును మనిషిగా చేయాలి. మనిషిని జంతువుగా కాదు! కమర్షియల్ కళకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును సినిమావారు గుర్తెరిగితే మంచిది. లేదంటే ప్రేక్షకులే ఏదో ఒకనాడు గుర్తు చేస్తారు. ఫస్ట్హాఫ్లో కాకపోతే సెకండ్ హాఫ్లో! ఏ సినిమాకైనా ‘ది ఎండ్’ పడవలసిందే కదా!! -
నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తున్న కొత్త టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగ భద్రత పట్ల మెజారిటీ నిపుణుల్లో (82 శాతం మంది) ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా మార్పు చెందుతున్న పని వాతావరణాన్ని అధిగమించేందుకు నైపుణ్యాల పెంపు సాయపడుతుందని వారు భావిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు ఇలా రెండు లక్షల మంది అభిప్రాయాలను హీరో వేద్ (హీరో గ్రూప్ కంపెనీ) పరిగణనలోకి తీసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో వస్తున్న నూతన మార్పులను, సవాళ్లను అధిగమించడానికి నైపుణ్యాల పెంపు పరిష్కారమని 78 శాతం మంది చెప్పారు. నేటి ఉద్యోగ మార్కెట్లో నిలిచి రాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై అవగాహన పెరుగుతుందడానికి ఇది నిదర్శనమని హీరో వేద్ సీఈవో అక్షయ్ ముంజాల్ తెలిపారు. ‘‘సుస్థిరత, సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు, కంపెనీలు ఒకే విధమైన దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది’’అని చెప్పారు. కృత్రిమ మేథ (ఏఐ) విజ్ఞానం కలిగి ఉండడం, తమ కెరీర్లో మెరుగైన అవకాశాలు అందుకోవడానికి కీలకమని 39 శాతం మంది అంగీకరించారు. తమ సంస్థలు ఏఐపై సరైన శిక్షణ అందించడం లేదని 43 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఏఐ విభాగంలో కావాల్సిన నైపుణ్యాలకు, అందిస్తున్న శిక్షణకు మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నివేదిక గుర్తు చేసింది. 18–55 ఏళ్ల మధ్య వయసున్న నిపుణుల్లో 43.5 శాతం మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదనపు నైపుణ్యాలు, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. -
Salaar Part 1 : డార్లింగ్ హీరో ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు
కథలు ఊహల్లో నుంచే కాదు.. వాస్తవ జీవితాల్లో నుంచి కూడా వస్తుంటాయి. ఇలా రియల్గా జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా కొందరు దర్శకులు రాసుకున్న కథలతో కొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. రియల్ టు రీల్గా రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ‘డాన్ శీను (2010)’, ‘బలుపు (2013)’, ‘క్రాక్ (2021)’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించనున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇది కంప్లీట్ పీరియాడికల్ ఫిల్మ్ అని, ఆంధ్రప్రదేశ్లో 1991లో జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. మరోవైపు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ కూడా కొన్ని వాస్తవ ఘటనల ప్రేరణతో తెరకెక్కి, హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ► హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుంది. అయితే ఈ సినిమా కథలోని కొంతభాగం వాస్తవ ఘటనల ఆధారంగా ఉంటుందని ఈ చిత్ర రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ గత ఏడాది అక్టోబరులో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కథను బట్టి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా రాజమౌళి అండ్ కో ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ► శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన దాదాపు 25 మంది మత్స్యకారులు బతుకుతెరువు కోసం గుజరాత్ తీర ప్రాంతంలోని వీరవల్ వద్ద చేపల వేట కొనసాగిస్తూ, 2018 నవంబరులో పోరపాటున పాకిస్తాన్ కోస్ట్గార్డ్ అధికారులకు బందీలుగా చిక్కారు. దాదాపు ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించిన వారి జీవితాల్లోని వాస్తవ ఘటనల సమాహారంగా ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది. ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబి నేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఇది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులోప్రారంభం కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా వివాహం జరిగిన కొద్ది కాలానికే, తాను తండ్రి కాబోతున్న సమయంలోనే పాకిస్తాన్లో ఖైదు కాబడిన శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నట్లుగా తెలిసింది. వచ్చే ఏడాది చివర్లో ‘తండేల్’ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ► ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా వరుణ్ తేజ్ నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. హిందీ, తెలుగు భాషల్లో రూపోందిన ఈ ద్విభాషా చిత్రంతో శక్తీ ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో మానుషీ చిల్లర్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వరుణ్ తేజ్ హిందీకి పరిచయం అవుతున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చోటు చేసుకున్న కొన్ని వైమానిక దాడుల వాస్తవ ఘటనల సమాహారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ్రపోడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. తొలుత ఈ సినిమాను డిసెంబరు 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని, వచ్చే ఏడాదిప్రారంభంలో విడుదల చేసే ఆలోచన ఉందని యూనిట్ వెల్లడించింది. ► సుధీర్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరోం హర: ది రివోల్ట్’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రధారి. కాస్త రివెంజ్ టచ్ ఉన్న ఈ సినిమా 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 22న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ తేదీకి ప్రభాస్ ‘సలార్’ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘హరోం హర’ చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ► శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా రూపోందిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. ఖుషీ రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ఇతర ప్రధాన పాత్రలుపోషించారు. ఓ నిజజీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, చిత్రీకరణ సమయంలో కొన్ని ఘటనలు జరగడంతో కాస్త భయంగానే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ చిత్రదర్శకుడు సాయికిరణ్ దైదా చెబుతున్నారు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 15న విడుదల కానుంది. 1930, 1990.. ప్రస్తుతం.. ఇలా మూడు కాలాలతో ‘పిండం’ స్క్రీన్ ప్లే ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇలా వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుని, ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. -
హీరోగా బిగ్బాస్ ఫేమ్.. షూటింగ్ ప్రారంభం!
బిగ్బాస్ రియాల్టీ గేమ్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్న సిబీ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సిబీ ఇంతకుముందే వంజగర్ ఉలగం, మాస్టర్ తదితర చిత్రాల్లో నటించారు. నటి ఖుషితా కల్లప్పు హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పరుత్తివీరన్ శరవణన్, జయప్రకాష్, నిరోషా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. క్రౌన్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఎస్ ఇబ్రహీం నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రకాష్ కృష్ణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవీ చిత్రం ఫేమ్ బాబు సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి గోపి కృష్ణన్ చాయాగహ్రణం అందిస్తుండగా.. కబీర్ వాసుకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం చైన్నెలో రెగ్యులర్గా షూటింగ్ జరుగుతోందని యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. -
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్హాసన్ కెరీర్లో ఓ బ్లాక్బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
పబ్లిక్ ఇష్యూ ద్వారా హీరో ఫిన్కార్ప్ రూ.4వేల కోట్లు సమీకరణ!
ప్రముఖ దిగ్గజ కంపెనీ హిరో మోటోకార్ప్ ఆటోమోబైల్ రంగంలో సేవలు అందించడంతో పాటు ఫైనాన్స్ రంగంలోనూ తన సత్తాచాటేందుకు సిద్ధం అయింది. హీరో మోటోకార్ప్ ఆర్థిక సేవల విభాగమైన హీరో ఫిన్కార్ప్ రూ.4,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో 2024లో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూపై సలహాలు ఇచ్చేందుకు ఎనిమిది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను సంస్థ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జెఫ్రీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, యూబీఎస్, ఎస్బీఐ కేపిటల్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయని ఓ వార్త మీడియాలో ప్రచురించారు. ప్రతిపాదిత ఐపీఓలో భాగంగా కొత్త షేర్ల జారీ, ప్రస్తుత వాటాదార్ల షేర్ల విక్రయం ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హీరో ఫిన్కార్ప్లో హీరోమోటో కార్ప్ సంస్థకు 40 శాతం వాటా ఉంది. ముంజల్ కుటుంబం చేతిలో 35-39 శాతం వాటా ఉండగా.. అపోలో గ్లోబల్, క్రిస్ కేపిటల్, క్రెడిట్ సూయిజ్, హీరో మోటోకార్ప్నకు చెందిన కొన్ని డీలర్ల సంస్థల వద్ద మిగిలిన వాటా ఉంది. 1991లో హీరో ఫిన్కార్ప్ బ్యాంకింగేతర ఆర్థిక సేవల కంపెనీగా ఏర్పడింది. -
హీరోతో కలిసి ఎంగిలి ఐస్క్రీమ్ తినమన్నారు.. ఇబ్బంది పడ్డా: సుహాసిని
ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్గా కొనసాగారు సుహాసిని. చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేశ్ లాంటి బడా హీరోలందరితోనూ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి పాత్రతో పాటు సహాయక నటిగా చేస్తోంది. అయితే హీరోయిన్గా చేసినప్పుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి తాజాగా ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడారు. ‘గతంలో హీరోయిన్గా చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే..సున్నితంగా తిరస్కరించేదాన్ని. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉంది. అది చేయాలని డైరెక్టర్ చెబితే.. నేను నో చెప్పాను. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చోవడం తప్పు..కాబట్టి నేను ఆ సీన్ చేయనని గట్టిగా వాధించాను. (చదవండి: స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్!) అదే సినిమాలో హీరో కలిసి ఐస్క్రీమ్ తినే సీన్ ఉంది. హీరో తిన్న ఐస్క్రీమ్నే తినాలని నాకు చెప్పారు. అది నాకు నచ్చలేదు. ‘వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి? ఐస్క్రీమ్ మార్చండి’అని ఫైర్ అయ్యాను. దీంతో కొరియోగ్రాఫర్ షాకయ్యారు. నేను చెప్పిన విధంగా చేయలని నాపైకి సీరియస్ అయ్యాడు. అయినా కూడా నేను అంగీకరించలేదు. ఐస్క్రీమ్ తినడం కాదు కదా కనీసం ముట్టుకోబోనని తెగేసి చెప్పారు. ఆ తర్వాత ఐస్క్రీమ్ మార్చారు’అని సుహాసిన చెప్పికొచిఉ్చంది. -
హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం..పెరుగుతున్న వాహనాల ధరలు
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్ - షోరూం ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు అక్టోబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఎంత శాతం మేర పెరుగుతుందనే అంశంపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెహికల్స్కు మార్కెట్లో ఉన్న డిమాండ్, మోడల్స్ ఆధారంగా ఒక శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం. పెరిగిపోతున్న ధరలు, కాంపిటీషన్, ద్రవ్యోల్బణం కారణంగా వాహనాల ధరల్ని పెరుగుదలకు కారణమని హీరో మోటో కార్ప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. పెరిగే ఎక్స్ షోరూం ధర ఎంతంటే? ఇంతకుముందు, కొత్తగా ప్రారంభించిన ఫ్లాగ్షిప్ కరిజ్మా ఎక్స్ఎంఆర్ ప్రమోషనల్ ఆఫర్ ముగిసినందున అక్టోబర్ 1 నుండి ఎక్స్ షోరూం ధరను రూ.7,000కు (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.1,79,900) పెంచుతున్నట్లు ప్రకటించింది. హీరో కరిజ్మా ఎక్స్ ఎంఆర్ ప్రస్తుత బుకింగ్ విండో రూ.1,72,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది నేటితో ముగియనుంది. ఇకపై పెంచిన ధరలతో సేల్స్ నిర్వహిస్తామని హీరో కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పెరుగుతున్న ఎగుమతులు కాగా, హీరో మోటోకార్ప్ ఆగస్టు నెలలో మొత్తం వాహనాల అమ్మకాలు 6 శాతం పెరిగి 4,88,717 యూనిట్లుగా నమోదయ్యాయి. డొమెస్టిక్ సేల్స్ 4,50,740 యునిట్లుగా ఉండగా 2022 ఇదే ఆగస్టు నెలతో పోలిస్తే దేశీయ విక్రయాలు 5 శాతం వృద్ధితో 4,72,947 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 11,868 యూనిట్ల నుంచి 15,770 యూనిట్లకు పెరిగడం విశేషం. చదవండి👉 హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్ విటారా కార్లు! -
రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో రాజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గతకొంతకాలంగా పాస్టర్గా దైవసేవలో మునిగి తేలుతున్న ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాడు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. 'నాకు రాజకీయాలు కొత్తేం కాదు. ఇంతకుముందు తెర వెనుక పని చేశాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చి పని చేసేందుకు రెడీ అయ్యాను. కేవలం ఒక రాష్ట్రం కోసమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీలో చేరాను' అని చెప్పుకొచ్చాడు. సినిమాలకు దూరం.. 'ఆనంద్: మంచి కాఫీలాంటి సినిమా'తో తెలుగువారికి దగ్గరయ్యాడు హీరో రాజా. 2002లోనే ఓ చిన్నదాన సినిమాతో వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ 2004లో వచ్చిన ఆనంద్ మూవీతోనే అసలు సిసలైన సక్సెస్ రుచి చూశాడు. ఆ నలుగురు, వెన్నెల చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ తర్వాత సినిమాల ఎంపికలో తడబడ్డాడు. ఫలితంగా హిట్లు కరువైపోయాయి. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యాడు. 2013 తర్వాత మరే సినిమా చేయలేదు. కాగా రాజా.. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నాడు. చదవండి: ప్రియుడితో జయసుధ? మరోసారి తెరపైకి మూడో పెళ్లి రూమర్స్! -
12 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో
7/G బృందావన్ కాలనీ.. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. 20 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా, సోనియా అగర్వాల్ హీరోయిన్గా నటించింది. నిర్మాత ఏఎం రత్నం తనయుడే రవికృష్ణ. 7/G బృందావన్ కాలనీ తమిళంలో 7/G రెయిన్బో కాలనీగా విడుదలైంది. అక్కడ కూడా సెన్సేషన్ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు రవికృష్ణ. తర్వాత తెలుగు, తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు, కానీ మళ్లీ అంతటి హిట్ అందుకోలేకపోయాడు. 2011లో చివరగా అరణ్య కాండం అనే తమిళ చిత్రంలో కనిపించాడు. తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. ఇన్నాళ్లకు అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాను డైరెక్ట్ చేసిన సెల్వ రాఘవన్ సీక్వెల్కు దర్శకత్వం వహించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. 7/G బృందావన్ కాలనీ ఈ నెల 22న మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మీడియాతో మాట్లాడాడు. 'చాలారోజులుగా ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని నాన్నగారు అనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నాం. దానికంటే ముందు ఈ సినిమాను మరోసారి మీరు చూసేయండి' అని చెప్పుకొచ్చాడు. అయితే అప్పటికి, ఇప్పటికి రవికృష్ణలో చాలా మార్పు వచ్చింది. అసలు 7/G బృందావన్ కాలనీ హీరోలానే లేడు. బరువు పెరిగి గుర్తుపట్టరానంతగా మారిపోయాడు. చదవండి: అజిత్తో సినిమాకు సిద్ధమైన జైలర్ నిర్మాతలు.. ఏకంగా అన్ని కోట్లు ఆఫర్! -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
రాజకీయాల్లోకి స్టార్ హీరో.. పక్కా ప్లాన్తో ప్రజల్లోకి!
తమిళస్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. అంతే కాకుండా విజయ్ ప్రజాసంఘం ఇప్పుడు సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ మరింత బలంగా ముందుకు సాగే ప్రయత్నానికి సిద్ధం అవుతోంది. ఇది చూస్తుంటే విజయ్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: అల్లు అర్జున్కే అవార్డు అని ముందే హింట్ ఇచ్చిన రష్మిక.. వీడియో వైరల్) ఆయన అభిమానులు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో పలు వార్డుల్లో పోటీ చేసి గెలుపొందారు. విజయ్ రంగప్రవేశమే తదుపరి అనే ప్రచారం జోరుగా సాగుతుంది. విజయ్ ఆంజనేయ సంఘం ఇప్పటికే ప్రజాసంఘంగా మార్చి రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది. కాగా.. ఈ సంఘం ద్వారా పలు విభాగాలను ఏర్పాటు చేశారు. తాజాగా సామాజిక మాధ్యమాలను వాడుకునే ప్రయత్నం చేశారు. ఇందులోభాగంగా శనివారం ఉదయం విజయ్ అభిమాన సంఘం కార్యదర్శి బుస్సీ ఆనంద్ నేతృత్వంలో పనైయూర్లోని విజయ్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన అభిమానులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో సామాజిక మాధ్యమాల కోసం 30 వేల మందిని నియమించారు. బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ విజయ్ ప్రజా సంఘాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. తమ సంఘానికి చెందిన ప్రతి విషయాన్ని ప్రజల్లోకి చేరే విధంగా వాట్సాప్లను వినియోగించాలని చెప్పారు. అదే విధంగా 234 నియోజకవర్గాల్లో జరిగే విషయాలను క్లుప్తంగా వీడియోలో చిత్రీకరించి సంఘం ప్రధాన నిర్వాహకునికి పంపించాలని కోరారు. అలాంటి వాటిని ప్రధాన నిర్వాహకుల అనుమతి లేకుండా ప్రచారం చేయరాదన్నారు. అదేవిధంగా ఏ విషయంలోనూ కుల,మత వివక్షతకు పాల్పడరాదని సూచించారు. (ఇది చదవండి: ఎవరైనా ప్రపోజ్ చేశారా?.. హీరోయిన్ శ్రీలీల క్రేజీ కామెంట్స్?) -
Actor Vineeth Unseen Photos: ప్రేమదేశం హీరో వినీత్ బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
రాజకీయాల్లోకి స్టార్ హీరో ఎంట్రీ.. అప్పుడే స్టార్ట్ చేశారు!
నటుడు స్టార్ హీరో విజయ్ రాజకీయాల వైపు శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగానే అందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పవచ్చు. లక్షలాదిమంది విజయ్ అభిమానులు ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. ఇదంతా విజయ్ మక్కళ్ సంఘం ప్రధాన కార్యదర్శి, పుదుచ్చేరి శాసన సభ్యుడు బస్సీ సారథ్యంలో జరుగుతోంది. ఆ మధ్య సంస్థాగత ఎన్నికల్లో విజయ్ అనుమతితో పోటీ చేసి ఆయన పేరుతో ప్రచారం చేసి పలువురు అభిమానులు గెలిచిన విషయం తెలిసిందే. అదే విజయ్కి రాజకీయ రంగ ప్రవేశంపై నమ్మకాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఇక ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 10 పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను జిల్లాకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి వారికి నగదు బహుమతి కార్యక్రమాన్ని విజయ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నోటుకు ఓటు సంస్కృతిని నిలువరించాలని వారికి విజయ్ హిత బోధ చేసినప్పుడే ఆయన రాజకీయ రంగ ప్రవేశం షురూ అయ్యిందనే ప్రచారం హోరెత్తింది. కాగా ఇటీవల నటుడు విజయ్ తాను నటిస్తున్న లియో చిత్ర షూటింగ్ను పూర్తి చేసి విశ్రాంతి కోసం లండన్కు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో విజయ్ మక్కళ్ సంఘం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈనెల 5, 6 తేదీల్లో సంఘం న్యాయవాదుల సమావేశం జరగనుంది. స్థానిక పనైయూర్లోని విజయ్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నట్లు బస్సీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల ప్రజా సమస్యలపై చట్టపరమైన అంశాల గురించి చర్చించనున్నట్లు, 6వ తేదీన కేరళా విజయ్ అభిమానులతో సమావేశం కానున్నట్లు అందులో పేర్కొన్నారు. -
హీరోగా చేస్తున్న సమయంలో విలన్గా ఆఫర్.. అయినా ఓకే!
నిరోజ్ పుచ్చా హీరోగా ధీన రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భారతీయన్స్’. శంకర్ ఎన్. అడుసుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ అయింది. శనివారం విలేకరుల సమావేశంలో నిరోజ్ పుచ్చా మాట్లాడుతూ– ‘‘2019లో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్తో నా యాక్టింగ్ జర్నీ మొదలైంది. ‘భారతీయన్స్’ చేస్తున్నప్పుడే నాకు విలన్గా చాన్స్ వస్తే, ఓకే చెప్పాను. ఎందుకంటే హీరోనా? విలనా అని కాదు.. యాక్టర్గా నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
బర్త్ డే స్పెషల్.. నెవ్వర్ బిఫోర్ గెటప్లో సూర్య (ఫొటోలు)
-
హీరోగా సింగర్ సునీత కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు సంగీత ప్రేక్షకులకు చాలా ఏళ్ల నుంచి తెలిసిన పేరు సునీత. సింగర్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. ప్రస్తుతం పాటలు పాడటంతోపాటు పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ చాలా ఫేమస్ అయింది. ఈమె కుమార్తె ఇప్పటికే ఓ సినిమాలో పాట పాడి గాయనిగా పరిచయమైంది. ఇప్పుడు కొడుకు ఆకాశ్ ఏకంగా హీరో అయిపోయాడు. తాజాగా ఫస్ట్లుక్ కూడా విడుదల చేశారు. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) సునీత్ రియాక్షన్ 'కంగ్రాట్స్ ఆకాశ్.. ఓ తల్లీ, కుమారుడి కల నెరవేరిన రోజు ఇది. ప్రపంచానికి నువ్వు నాకు చెప్పిన కథని చూపించడంతో, నటుడు కావాలనే సాకారం చేసుకోవడం కోసం నువ్వు పడిన శ్రమ, వృత్తి పట్ల నిబద్ధత, నువ్వు చేసిన త్యాగాలు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అని సింగర్ సునీత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ పెట్టారు. ఫస్ట్ లుక్ లో ఏముంది? 'సర్కారు నౌకరి' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ బట్టి చూస్తుంటే.. 1980ల్లో జరిగిన కథలా అనిపిస్తుంది. ఓ పెద్ద చెట్టు, దానికి కండోమ్ ప్యాకెట్స్ డబ్బా, వెనక పల్లెటూరు చూస్తుంటే ఆసక్తి కలుగుతోంది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) (ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్కి అక్క?)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
Advertisement