-
పిల్లలతో రైలు ప్రయాణం మరింత భారం!
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది. -
వైష్ణోదేవి దర్శనానికి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!
వేసవి సెలవుల్లో మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించాలనుకునేవారికి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మూడు రాత్రులతో పాటు మొత్తం నాలుగు రోజులు ఉండనుంది. ఈ ప్యాకేజీ న్యూఢిల్లీ నుండి ప్రారంభంకానుంది. ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీలో మాతా వైష్ణో దేవి ఆలయంతో పాటు, కంద్ కండోలి ఆలయం, రఘునాథ్ ఆలయం, బేగ్ బహు గార్డెన్లను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఐఆర్సీటీసీ అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ పేరు ‘మాతారాణి- రాజధాని’ ఈ యాత్రలో ప్రయాణికులు థర్డ్ ఏసీలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రయాణికులకు ప్రయాణ సమయంలో ఆహారపానీయాలను ఐఆర్సీటీసీ అందిస్తుంది. ఈ ప్యాకేజీ కింద రెండు బ్రేక్ఫాస్ట్లు, ఒక లంచ్, ఒక డిన్నర్ అందజేస్తారు. అలాగే బస ఏర్పాట్లను కూడా ఐఆర్సీటీసీ కల్పిస్తుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునేవారు రూ.6,390 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వివిధ టారిఫ్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో ప్రయాణానికి గరిష్ట ఛార్జీ రూ.8,300. మరిన్ని వివరాల కోసం irctctourism.comని సందర్శించవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. -
IRCTC తో Swiggy - ఆర్డర్ చేసుకునే విధానం..!
-
IRCTC: ట్రైన్ జర్నీలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్తో నచ్చిన ఆహారాన్ని.. ఉన్న చోటుకే తెప్పించుకుని తినేస్తున్నాం. ఈ డెలివరీ సర్వీసులు దాదాపు నగరాలకే పరిమితమయినప్పటికీ, స్విగ్గీ మాత్రం 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుని మరో అడుగు ముందు వేసింది. స్విగ్గీ ఫుడ్ మార్కెట్ప్లేస్ అండ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం ఇకపైన రైళ్లలో ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడానికి స్విగ్గీ సన్నద్ధమైంది. ఈ సర్వీస్ మార్చి 12 నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో స్విగ్గీ ఈ సర్వీసును బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో 59 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసును విస్తరించనున్నట్లు సమాచారం. రైళ్లలో ప్రయాణించే సమయంలో నచ్చిన ఫుడ్ను ప్రీ-ఆర్డర్ చేయడానికి ముందుగా ఐఆర్సీటీసీ యాప్లో పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తాము ఏ స్టేషన్లో అయితే ఆహారాన్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఆ రైల్వే స్టేషన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలా చేసుకున్న తరువాత మీకు మీరు ఎంచుకున్న ఫుడ్ను స్విగ్గీ డెలివరీ బాయ్స్ తీసుకొచ్చి డెలివర్ చేస్తారు. స్విగ్గీతో ఏర్పడ్డ ఈ భాగస్వామ్యం ప్రయాణీకులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని, వారు కోరుకునే ఆహరం ఎంపిక చేసుకునే అవకాశం ఇందులో లభిస్తుందని, ఇది వారి ప్రయాణాన్ని మరింత సంతోషంగా మార్చడంలో ఉపయోగపడుతుందని IRCTC ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. -
రైళ్లలో ఫుడ్.. ఐఆర్సీటీసీ లేటెస్ట్ అప్డేట్
IRCTC Update : రైళ్లలో ఫుడ్ సప్లయికి సంబంధించి భారతీయ రైల్వే నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రీ-ఆర్డర్ చేసిన భోజనాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి ప్రసిద్ధ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ ఫుడ్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకటించింది. వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. ముందుగా ఆర్డర్ చేసిన భోజనాన్ని ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా డెలివరీ చేస్తారు. తొలిదశలో భాగంగా బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం త్వరలో ప్రారంభించనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. “సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్, 2015 రెగ్యులేషన్ 30 ప్రకారం.. ఐఆర్సీటీసీ ఈ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ముందస్తు ఆర్డర్ చేసిన భోజనం సరఫరా & డెలివరీ కోసం PoC (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్విగ్గీ ఫుడ్స్)తో ఐఆర్సీటీసీ టైఅప్ అయిందని తెలియజేస్తున్నాం. మొదటి దశలో నాలుగు రైల్వే స్టేషన్లలో అంటే బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నంలో బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ- క్యాటరింగ్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రావచ్చు” అని బీఎస్ఈ ఫైలింగ్లో ఐఆర్టీసీ పేర్కొంది. -
కులు, మనాలీ, సిమ్లా.. ఒకేసారి చూసేందుకు ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ!
హిమాచల్ప్రదేశ్లోని కులు, సిమ్లా, మనాలి పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఐఆర్సీటీసీ ఒక ట్వీట్లో ఈ టూర్ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్లోని ఈ మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ రిజర్వేషన్కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. It's time for a vacation amidst the hills. Visit #shimla-#Kullu-#Manali with IRCTC (SEA23) on 27.03.2024 from #Thiruvananthapuram Book now on https://t.co/9ulobfRHWU . . .#dekhoapnadesh #Travel #Booking #Tours #traveller #vacations #ExploreIndia #HimachalPradesh @hp_tourism… pic.twitter.com/dgf3PbNLhp — IRCTC (@IRCTCofficial) February 21, 2024 -
రైల్వేకే చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. ఇలా మీకైతే ఏం చేస్తారు?
Rs 10000 Fine On Indian Railways : దేశంలో అత్యధిక మంది ప్రయాణించే సాధనం రైల్వేలు. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే రైళ్లలో ఎదురయ్యే అసౌకర్యాలతో ప్రతిఒక్కరూ ఎప్పుడోసారి ఇబ్బంది పడే ఉంటారు. ఇలా అసౌకర్యానికి గురైన ఓ ప్రయాణికుడు రైల్వేకు, ఐఆర్సీటీసీకి చుక్కలు చూపించాడు. పంజాబ్లోని జిరాక్పూర్కు చెందిన కుటుంబానికి బెర్త్లను సెకెండ్ ఏసీ నుంచి థర్డ్ ఏసీకి ఏకపక్షంగా డౌన్గ్రేడ్ చేసినందుకు రూ.10,000 మొత్తాన్ని చెల్లించాలని నార్తన్ రైల్వే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC )ను చండీగఢ్లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది. జిరాక్పూర్కు చెందిన పునీత్ జైన్ 2018 ఆగస్టులో తనకు, తన కుటుంబానికి వైష్ణో దేవి నుంచి చండీగఢ్కి శ్రీ వైష్ణో దేవి-కల్కా ఎక్స్ప్రెస్లో ఒక్కొక్కరికీ రూ. 2,560 చొప్పున సెకెండ్ ఏసీ టిక్కెట్లను కొనుగోలు చేశారు. అయితే అతను తన కుటుంబంతో సహా 2018 అక్టోబర్ 20న కట్రా రైల్వే స్టేషన్కు చేరుకోగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వారి బెర్త్లను డౌన్గ్రేడ్ చేశారు. సమస్యను టీటీఈ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదు. దీంతో వారు థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణించవలసి వచ్చింది. సెకెండ్ ఏసీ సౌకర్యాలను కోల్పోయిన వారు థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లోని అసౌకర్యాలతో ఇబ్బందులు పడ్డారు. దీని తర్వాత బాధితుడు సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ టిక్కెట్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాపసు చేయాలని కోరగా తిరస్కరణ ఎదురైంది. అనంతరం సబ్ డివిజనల్ మేనేజర్కు మొత్తం విషయాన్ని ఈమెయిల్లో పంపాడు. జైన్ అవసరమైన సర్టిఫికేట్ అందించలేదని, అది కూడా చాలా కాలం తర్వాత సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చాడని, ఇది ఇప్పుడు పరిష్కరించడానికి వీలుకాదని నార్తన్ రైల్వే సబ్-డివిజనల్ మేనేజర్/డివిజనల్ మేనేజర్ చేతులెత్తేశారు. ఇక ఈ విషయంపై ఐఆర్సీటీసీ వాదన ఏమిటంటే తాము కేవలం ఆన్లైన్ బుకింగ్ సర్వీస్ మాత్రమే అందిస్తామని, జైన్ కోరిన ఉపశమనాలకు బాధ్యత వహించమని చెబుతోంది. సేవలో లోపం నార్తన్ రైల్వే, ఐఆర్సీటీసీ అవలంభించిన అన్యాయమైన వాణిజ్య పద్ధతుల కారణంగా బాధితుడికి ఇబ్బంది కలిగిందని జైన్కు అనుకూలంగా కమిషన్ తీర్పునిచ్చింది. రూ. 1,005 లను 2018 అక్టోబర్ 20 నుండి 9 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని, దీంతో పాటు రూ. 5,000 నష్ట పరిహారం, రూ. 4,000 వ్యాజ్యం ఖర్చులు చెల్లించాలని నార్తన్ రైల్వే, ఐఆర్సీటీలను ఆదేశించింది. -
ట్రైన్ టికెట్ బుకింగ్లో అదిరిపోయే ఫీచర్.. దీని గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
రైల్వే ప్రయాణికుల శుభవార్త. ట్రైన్ టికెట్ బుకింగ్లో ఈ ఫీచర్ గురించి మీకు తెలుసా? తెలిస్తే ఇకపై మీరు బుకింగ్ చేసుకునే టికెట్ ప్రాసెస్ చాలా సులభం అవుతుంది. అంతేకాదు..సాధారణంగా మీరు మీ సొంత ఊరు వెళ్లేందుకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు. వెంటనే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే మీరు బుక్ చేసుకున్న టికెట్ కన్ఫామా, వెయింటింగ్ లిస్ట్ అనే అంశాలతో సంబంధం ఉండదు. కానీ ఐఆర్సీటీసీలో ఇప్పటికే ఉన్న సరికొత్త ఫీచర్ను ఉపయోగిస్తే.. టికెట్ బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. మీ ట్రైన్ టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత మాత్రమే డబ్బుల్ని డిడక్ట్ అవుతాయి. ఇందుకోసం మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (irctc) నిర్వహించే చెల్లింపుల గేట్వే ‘ఐ-పే’ ని వినియోగించాల్సి ఉంటుంది. దీన్ని 'ఆటోపే' అంటారు. ఈ సదుపాయాన్ని ఐఆర్సీటీసీ ఐపే, యూపీఐ, క్రెడిట్ కార్డ్లు, డెబిట్ కార్డ్ల ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ప్రకారం రైల్వే టిక్కెట్ కోసం సిస్టమ్ పీఎన్ఆర్ నెంబర్ని రూపొందించిన తర్వాత మాత్రమే వినియోగదారు బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఈ మెకానిజం యూపీఐ ఉపయోగించి ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఐఆర్సీటీసీ ఐపే ఆటోపే వల్ల ఎవరికి ప్రయోజనం? ఐఆర్సీటీసీ ఐపే ఆటోపే సదుపాయం పెద్దమొత్తంలో ఆన్లైన్లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులతో పాటు వెయిటింగ్ లిస్ట్, జనరల్ లేదా తత్కాల్ టిక్కెట్ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రయాణికులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. కింద పేర్కొన్న సందర్భాలలో ఐపే ఆటోపే ఉపయోగకరకంగా ఉంటుందని తెలిపింది. వెయిట్ లిస్ట్: మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని టికెట్ కన్ఫామ్ కాకపోయినా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణికులు డబ్బులు చెల్లించినా 'బెర్త్ ఛాయిస్ నాట్ మెట్' లేదా 'నో రూమ్' వంటి సందర్భాలలో ఆటోపే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. వెయిట్లిస్ట్ తత్కాల్: చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా తత్కాల్ వెయిట్లిస్ట్ చేయబడిన ఇ-టిక్కెట్ వెయిట్లిస్ట్లో ఉంటే, అటువంటి సందర్భాలలో వర్తించే ఛార్జీలు (రద్దు ఛార్జీలు, ఐటీఆర్సీటీసీ కన్వీనియన్స్ ఫీజు, మాండేట్ ఛార్జీలు) చెల్లించినా ఆటోపే ఫీచర్ సాయంతో తిరిగి వెనక్కి పొందవచ్చు. ఇన్ స్టంట్ రీఫండ్: ఒక వ్యక్తి వెయిట్లిస్ట్ చేసిన టిక్కెట్ను బుక్ చేస్తుంటే, కన్ఫర్మ్ చేసిన టిక్కెట్ పొందలేకపోతే డిడక్ట్ అయిన మొత్తం మూడు లేదా నాలుగు వర్కింగ్ డేస్లో తిరిగి వాపస్ పొందవచ్చు. బుకింగ్ మొత్తం ఎక్కువగా ఉంటే, దాని కోసం తక్షణ రీఫండ్ పొందడం వలన అదనపు ఛార్జీలు లేకుండా వ్యక్తిగత బుక్ ప్రత్యామ్నాయ రవాణా ఎంపికలకు సహాయం చేస్తుంది. అయితే, ఒక వ్యక్తి వెయిట్లిస్ట్ టిక్కెట్లను బుక్ చేయడానికి ఐఆర్సీటీసీ ఆటోపే ఫీచర్ని ఉపయోగించినప్పుడు టిక్కెట్ కన్ఫామ్ కాకపోతే వెంటనే ఆ డబ్బులు మీ అకౌంట్కు రిటర్న్ అవుతాయి. -
ఐఆర్సీటీసీ సీఎండీగా సంజయ్ కుమార్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంజయ్ కుమార్ జైన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్ కుమార్ జైన్ నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా సేవలు అందించారు. ‘‘సీఎండీగా సంజయ్ కుమార్ జైన్ తక్షణ నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తేదీ 2026 డిసెంబర్ 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు వెలవరించేంత వరకు.. వీటిల్లో ఏది ముందు అయితే అది అమలవుతుందని తెలిపింది. ఈ నెల 13న నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్న జైన్, మరుసటి రోజు ఐఆర్సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సరీ్వసెస్, 1990 బ్యాచ్ అధికారి అయిన జైన్, చార్టర్ అకౌంటెంట్ ఉత్తీర్ణులు. లోగడ భారత ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల వాణిజ్య వెంచర్లు, విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. ట్రైన్ ఎక్కే ముందు తప్పక తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా రోజూ కొన్ని లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రజా అవసరాలు, సరుకుల రవాణా కోసం ఇండియన్ రైల్వేస్ వేల సంఖ్యలో రైళ్లను నడుపుతోంది. టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో రైలు బయలుదేరే సమయానికి కౌంటర్ వద్ద క్యూ ఎక్కువగా ఉండటం వల్లనో లేదా టికెట్ కొనే సమయం లేకపోవడం వల్లనో కొందరు టికెట్ లేకుండానే రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఏది ఏమైనా టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించడం చట్టరీత్యా నేరం. రైళ్లలో ప్రయాణికులు అందరూ టికెట్ తీసుకున్నారా.. ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా అన్నది పరీశీలించడానికి టీటీఈలు (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) ఉంటారు. వీరిలో కొంతమంది టికెట్ లేని ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వేలాది రూపాయలు వసూలు చేస్తుంటారు. టికెట్ లేకపోతే ఏం చేయాలి.. రైళ్లలో రోజూ కొన్ని లక్షల మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారు. వీరిలో కొందరు టికెట్ లేకుండా ప్రయాణించే సందర్భం వస్తుంది. ఈ క్రమంలో కొందరు టీటీఈలు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల లక్నో ఎక్స్ప్రెస్లో ఓ రైల్వే అధికారి ప్రయాణికుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతన్ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసింది రైల్వే శాఖ. ఇలా అధికారులు ప్రవర్తించవచ్చా.. టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు ఏం చేయాలి అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం... ఇదీ చదవండి: IRCTC: రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్లో మార్పులు టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు మొదటగా టీటీఈని సంప్రదించి మీ పరిస్థితి గురించి వారికి తెలియజేయాలి. మీ వద్ద రిజర్వేషన్ టికెట్ లేకపోతే మీరు వెళ్ళాల్సిన గమ్య స్థానానికి అయ్యే టికెట్ ధరతో పాటు రూ.250 జరిమానా విధిస్తారు. అంటే మీరు రైలు ఎక్కిన ప్రదేశం నుండి గమ్యస్థానానికి అయ్యే చార్జీతో పాటు అదనంగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేశాక ఒకవేళ ట్రైన్లో సీట్లు కాళీ ఉంటే సీటును కూడా కేటాయిస్తారు. ఇదీ చదవండి: ఓటీపీలకు స్వస్తి.. ఆర్బీఐ కీలక ప్రతిపాదన! -
IRCTC: రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్లో మార్పులు
దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే సాధనం రైల్వేలు. చాలా మంది ఆన్లైన్లో ట్రైన్ టికెట్లు బుక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారిక ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరికొన్ని మార్పులు చేసింది. ప్రయాణికులు రైలు టిక్కెట్లను సులభంగా, దుర్వినియోగానికి గురి కాకుండా బుక్ చేసుకోవడానికి వీలుగా ఐఆర్సీటీసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం.. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసే ప్రయాణికులు ముందుగా వారి ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇలా ధ్రువీకరించాలి.. మొదటగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో వెరిఫికేషన్ విండోకు లాగిన్ చేయండి తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి. హోమ్ పేజీలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వెరిఫై బటన్పై క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి మీ మొబైల్ నంబర్ని ధ్రువీకరించండి ఇక ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ముందుగా మీ ఈమెయిల్ ఐడీకి వచ్చిన కోడ్ను నమోదు చేయండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్లైన్ రైలు టిక్కెట్ బుకింగ్లు చేయగలుగుతారు. కేంద్ర బడ్జెట్ 2024ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో రైల్వేలకు కేటాయింపులు, కొత్త రైళ్లు, రైలు మార్గాలు, ఇతర అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
వందే భారత్లో పాడైపోయిన భోజనం?
దేశంలోనే సెమీహైస్పీడ్ రైళ్లుగా ప్రత్యేకతను చాటుకుంటున్నాయి వందే భారత్ రైళ్లు. సాధారణ రైళ్ల కంటే టికెట్ ధర ఎక్కువైనప్పటికీ.. త్వరగా గమ్యస్థానం చేర్చడం, ఇతర సదుపాయాల విషయంలో వందేభారత్ రైళ్లకు మంచి స్పందనే వస్తోంది. అయితే.. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న రైలులో ఓ ప్రయాణికుడికి భోజనం విషయంలో చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఎక్స్లో వందేభారత్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా, దుర్వాసన వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికుడు వెంటనే వీడియో తీశాడు. పాడైపోయిన భోజనం ఇచ్చారంటూ ఆ కస్టమర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన డబ్బులు తనకు రిటర్న్ చేయాలంటూ.. ఆ ఘటనంతా వీడియో రూపంలో బయటకు రావడంతో రైల్వే శాఖ స్పందించింది. ఫిర్యాదు అందిందని.. ఘటనపై దర్యాప్తు చేపడతామని రైల్వేస్సేవ తెలియజేసింది. ఫిర్యాదు వివరాల కోసం తమను సంపద్రించాలంటూ సదరు ఎక్స్ యూజర్కు సూచించింది. ఇక.. ఐఆర్సీటీసీ సైతం సదరు వీడియోపై స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూనే.. విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీనికి సర్వీస్ ప్రొవైడర్ పెనాల్టీ విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. @indianrailway__ @AshwiniVaishnaw @VandeBharatExp Hi sir I am in journey with 22416 from NDLS to BSB. Food that was served now is smelling and very dirty food quality. Kindly refund my all the money.. These vendor are spoiling the brand name of Vande Bharat express . pic.twitter.com/QFPWYIkk2k — Akash Keshari (@akash24188) January 6, 2024 Sir, our sincere apologies for the unsatisfactory experience you had. The matter is viewed seriously. A suitable penalty has been imposed on the service provider. Further the service provider staff responsible have been disengaged and the licensee has been suitably instructed.… — IRCTC (@IRCTCofficial) January 11, 2024 -
దివ్యాంగులకు రైల్వేశాఖ అందించే ప్రత్యేక సౌకర్యాలివే..
మనలో చాలామంది దూర ప్రయాణాలకు రైలునే ఇష్టపడతారు. రైలు ప్రయాణంలో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దివ్యాంగులకు రైల్వేశాఖ ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తోంది. అంగ వైకల్యం కలిగినవారు, మానసిక వ్యాధిగ్రస్తులు, అంధులు తమ రైలు ప్రయాణంలో ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చు. దివ్యాంగులకు రైలు టిక్కెట్ ధరలోనూ రాయితీ లభిస్తుంది. అయితే ఇందుకోసం దివ్యాంగులు తమ అంగవైకల్యానికి సంబంధించిన ధృవీకరణ పత్రం కలిగివుండాలి. సీటు సౌకర్యం దివ్యాంగులైన ప్రయాణికులకు ఇది వరం లాంటిది. దివ్యాంగులకు స్లీపర్ క్లాస్లో రెండు లోయర్, రెండు మిడిల్ బెర్త్లు, ఏసీ-3లో ఒక లోయర్, ఒక మిడిల్ బెర్త్, త్రీఈ కోచ్లో ఒక లోయర్ బెర్త్, ఒక మిడిల్ బెర్త్ కేటాయిస్తారు. టిక్కెట్లపై తగ్గింపు దివ్యాంగులైన ప్రయాణీకులకు రైలు టిక్కెట్లలో రాయితీ లభిస్తుంది. దివ్యాంగులైన ప్రయాణికులు టిక్కెట్ల ధరలో 25 శాతం నుండి 75 శాతం వరకు రాయితీని పొందవచ్చు. దివ్యాంగులైన ప్రయాణికులకు స్లీపర్ క్లాస్, ఏసీ-3 నుండి సాధారణ తరగతి వరకు అన్నింటా రాయితీలు లభిస్తాయి. ఈ రాయితీని పొందడానికి, టిక్కెట్ను కొనుగోలు చేసేటప్పుడు అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని చూపించడం తప్పనిసరి. చక్రాల కుర్చీ సౌకర్యం భారతీయ రైల్వే దివ్యాంగులైన ప్రయాణికులకు చక్రాల కుర్చీ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. స్టేషన్ నుండి రైలు వద్దకు వచ్చేందుకు దివ్యాంగులు ఈ వీల్చైర్ను వినియోగించుకోవచ్చు. ఈ వీల్ చైర్ సౌకర్యం పొందేందుకు దివ్యాంగులు ముందుగా సంబంధిత అధికారి లేదా స్టేషన్ మాస్టర్ను సంప్రదించాల్సివుంటుంది. తరువాత రైల్వే సిబ్బంది వీల్ చైర్ను దివ్యాంగుల దగ్గరకు తీసుకువస్తారు. అయితే ఈ సౌకర్యం పొందేందుకు దివ్యాంగులు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. -
ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ గురువారం మరోసారి డౌన్ అయింది. దీంతో సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు ఇబ్బందుల నెదుర్కొన్నారు. దీంతో సోషల్మీడియాలో వినియోగదారులు ఐఆర్సీటీసీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఐఆర్సీటీసీ కూడా ట్విటర్ ద్వారా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా తమ వెబ్సైట్ (నవంబర్ 23, గురువారం ) సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్టు వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. (డీప్ఫేక్లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు) గురువారం ఉదయం 10 గంటల నుంచే సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది.. తత్కాల్ విండో ఓపెన్ కాగా యూజర్లు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా కేన్సిల్ చేయాల్సిన టికెట్లు కేన్సిల్ కాగా, తత్కాల్ ద్వారా టికెట్లు బుక్ కాక యూజర్లు నానా అగచాట్లు పడ్డారు. దీంతో అధ్వాన్నమైన వెబ్ సైట్, దారుణమైన సేవలు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IRCTC వెబ్సైట్ ద్వారా రేల్వే ప్రయాణికులు టిక్కెట్ల బుకింగ్ రైళ్ల స్థితిని తనిఖీ చేయడం, ఇతర సంబంధిత సమాచారాన్ని పొందుతారు. E- ticket booking is temporarily affected due to technical reasons. Technical team is working on it and booking will made available soon. — IRCTC (@IRCTCofficial) November 23, 2023 -
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ‘సప్త జ్యోతిర్లింగ దర్శన్’
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నారు. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ జేజీఎం డీఎస్జీపీ కిశోర్ మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరులకు చెప్పారు. ఈ యాత్రతో పాటు స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఏపీ, తెలంగాణలోని యాత్రికుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి బయలుదేరే ఈ రైలుకు ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణ స్టేషన్ల్లో ఆగనుంది. 12 రాత్రులు, 13 పగళ్లు సాగే ఈ యాత్రలో ఉజ్జయిని, మహాకాళేశ్వర దేవాలయం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ద్వారకాదిస్ దేవాలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్, భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శనం, గ్రిషినేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం తదితర పూణ్యక్షేత్రలు, పర్యాటక, చారిత్రక ప్రదేశాలను దర్శించుకోవచ్చు. యాత్రలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి. 3 కేటగిరీల్లో ఉండే ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఎకానమీ (స్లీపర్ క్లాస్) రూ. 21,000, స్టాండర్డ్ (3 ఏసీ) రూ.32,500, కంఫర్ట్ (2 ఏసీ) రూ. 42,500 ధరగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా విజయవాడ కార్యాలయం 8287932312, 9281495848 నంబర్లకు సంప్రదించాలి. -
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త!
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం ఐఆర్సీటీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణంలో ప్యాసింజర్లు కోరుకున్న ఆహారాన్ని అందించేలా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో’తో జత కట్టింది. దీంతో ప్రయాణికులు రైల్వే ప్రయాణంలో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ను ముందే బుక్ చేసుకుంటే నిర్ధేశించిన రైల్వే స్టేషన్లో ఆహారాన్ని అందించనుంది. ప్రస్తుతం, ఈ సౌకర్యం ఐదు స్టేషన్లకే పరిమితం చేసింది. ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కింద ప్రస్తుతం ఢిల్లీతోపాటు ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో జొమాటో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఐఆర్సీటీసీ ప్రత్యేక సర్వీసులు, ఆఫర్లను అందిస్తుంది. ప్రత్యేకించి నవరాత్రోత్సవాల్లో ఉపవాసం ఉండే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ‘థాలీ’ని అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఐఆర్సీటీసీతో ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో జొమాటో షేర్ రూ.115 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. అయితే మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి జొమాటో షేర్ రూ.113.20 వద్ద ముగిసింది. ఐఆర్సీటీసీ స్టాక్ రెండు శాతం నష్టాలతో రూ.700 వద్ద ట్రేడయి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.48 శాతం నష్టంతో రూ.704 వద్ద స్థిర పడింది. -
సింగపూర్, మలేషియాలకు ఐఆర్సీటీసీ బడ్జెట్ ప్యాకేజీ
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) తాజాగా సింగపూర్, మలేషియా టూర్ను ప్రకటించింది. భారతదేశంలోని వారే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న పర్యాటకులు మలేషియా, సింగపూర్లను సందర్శించాలని అనుకుంటారు. అయితే బడ్జెట్ కారణంగా ముందడుగు వేయలేకపోతారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఐఆర్సీటీసీ సింపుల్ బడ్జెట్ ప్యాకేజీలో సింగపూర్, మలేషియాలలో పర్యటించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్యాకేజీలో ఆహారం పానీయాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇదొక్కటే కాదు ఆయా ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఇంగ్లీష్ గైడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో పర్యాటకులను ముందుగా భారతదేశం నుండి విమానంలో సింగపూర్కు తీసుకువెళతారు. తరువాత అక్కడ టాక్సీ ఏర్పాటు చేస్తారు. విలాసవంతమైన హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీకి ఎన్చాంటింగ్ సింగపూర్ అండ్ మలేషియా అని పేరు పెట్టింది. ఇది ఫ్లైట్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ 2023 నవంబర్ 20న, అలాగే 2023, డిసెంబర్ 4న ప్రయాణించేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో 7 పగళ్లు, 6 రాత్రులు ఉంటాయి. ప్యాకేజీలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వంటి సౌకర్యాలు లభిస్తాయి. భద్రతా ఏర్పాట్ల బాధ్యతను ఐఆర్సీటీసీ పర్యవేక్షిస్తుంది. ఈ ప్యాకేజీలో పర్యాటకులు కౌలాలంపూర్లోని బటు గుహలు, పుత్రజయ సిటీ టూర్, కౌలాలంపూర్ సిటీ తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. సింగపూర్లో మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్, సెంటోసా ఐలాండ్ వంటి పలు ప్రదేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ బీమా కూడా ఉంది. ఇక టిక్కెట్ ఛార్జీల విషయానికొస్తే ఒక్కొక్కరు రూ.1,63,700 చెల్లించాలి. ఇద్దరు వ్యక్తుల ప్యాకేజీని బుక్ చేస్తే రూ. 1,34,950 చెల్లించాలి. రూ. 1,18,950తో ముగ్గురు వ్యక్తులు ఈ టూర్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇది కూడా చదవండి: మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు! -
రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో వినాయక చవితి. దీన్నె గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) అని కూడా అంటారు. దేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకొంటారు. పండుగలో భాగంగా వినాయకుడి ప్రతిమను కొలువుదీర్చి ప్రత్యేకమైన పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన పిండి వంటలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. మహారాష్ట్రలో అయితే ప్రధానంగా లడ్డూ, మోదక్, చక్లిలు, పురాన్ పోలీ వంటి వాటితో సహా ఇంకా మరెన్నో సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలు విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఫీచర్!) చాలా మంది ఇంటిపట్టున ఉండి పండుగ జరుపుకొని సంప్రదాయక పిండి వంటకాలను ఇంట్లోనే ఆస్వాదిస్తారు. కానీ కొంతమంది వివిధ కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పండుగ సమయంలో ఈ ప్రత్యేక వంటకాలను వారు ఆస్వాదించలేరు. అటువంటి వారి కోసం ఐఆర్సీటీసీ (IRCTC) ఆమోదిత ఫుడ్ అగ్రిగేటర్ ‘జూప్’ (Zoop) వినాయక చవితి ప్రత్యేక సంప్రదాయ వంటకాలను అందిస్తుంది. 160కి పైగా రైల్వే స్టేషన్లలో.. దీంతో పండుగ వేళ రైల్లో ప్రయాణిస్తున్నప్పటికీ నోరూరించే పండుగ పిండి వంటలను ఆస్వాదించవచ్చు. ఈ వంటకాలు కావాల్సిన ప్రయాణికులు జూప్ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా గూగుల్ చాట్బాట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మహారాష్ట్రలోని 160కి పైగా రైల్వే స్టేషన్లలో వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తారు. -
రైళ్లలో వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఏ బ్రాండ్ అమ్మాలి.. రూల్స్ ఏంటి?
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. రైలు ప్రయాణంలో ఎక్కువ మంది ఇబ్బందులు పడేది ఆహారం, నీళ్లతోనే. డబ్బు పెట్టినా సురక్షితమైన నీళ్లు లభించవు. చాలా సార్లు రైళ్లలో అసురక్షితమైన ఏవో లోకల్ బ్రాండ్ వాటర్ బాటిళ్లు విక్రయిస్తుంటారు. అయితే రైళ్లలో ఏ బ్రాండ్ వాటర్ బాటిళ్లు అమ్మాలో నిబంధనలు ఉన్నాయి. తాజాగా పోర్బందర్ ఎక్స్ప్రెస్ ప్యాంట్రీ కారు నుంచి అనధికారిక, నాసిరకం తాగునీటి బాటిళ్లను మొరాదాబాద్ రైల్వే స్టేషన్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం వాటర్ బాటిళ్ల విక్రయంపై ఓ సిబ్బందిలో ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు వేగంగా చర్యలు తీసుకున్నారు. సుమారు 80 కేసులు లోకల్ బ్రాండ్కు చెందిన బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యుడైన మేనేజర్ను, మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. సీనియర్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ (DCM) సుధీర్ కుమార్ సింగ్ ఈ సంఘటనపై మాట్లాడుతూ భారతీయ రైల్వేలలో ‘రైల్ నీర్’ బ్రాండ్ వాటర్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలని, ఒకవేళ అవి అందుబాటులో లేకుంటే నిర్దిష్ట బ్రాండ్ నీటిని విక్రయించడానికి కచ్చితమైన ప్రోటోకాల్ ఉందని పేర్కొన్నారు. 'రైల్ నీర్' బ్రాండ్ వాటర్ బాటిళ్ల సరఫరా పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వేరే బ్రాండ్లను విక్రయించాల్సిన పని లేదన్నారు. ‘రైల్ నీర్’ అనేది భారతీయ రైల్వేలో భాగమైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRTC)కి చెందిన బాటిల్ వాటర్ బ్రాండ్. -
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ హెచ్చరిక!
రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక. మొబైల్ యాప్స్ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ఐఆర్సీటీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈజీ మనీ కోసం రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు ఐఆర్సీటీసీ పేరుతో ఫేక్ యాప్స్ను తయారు చేస్తున్నారు. వాటిల్లో ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ అనే యాప్ ఉంది. ఆ యాప్ను వినియోగించవద్దని కోరింది. సైబర్ కేటుగాళ్లు ఫిషింగ్స్ లింక్స్ సాయంతో డబ్బుల్ని కాజేస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్ టికెటింగ్, ఇతర రైల్వే సంబంధిత సేవల్ని అందించే ఐఆర్సీటీసీ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్లో, ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న అధికారిక ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. తద్వారా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చని సలహా ఇచ్చింది. Alert: It has been reported that a malicious and fake mobile app campaign is in circulation where some fraudsters are sending phishing links at a mass level and insisting users download fake ‘IRCTC Rail Connect’ mobile app to trick common citizens into fraudulent activities.… — IRCTC (@IRCTCofficial) August 4, 2023 అంతేకాకుండా, ఒరిజినల్ ఐఆర్సీటీసీ, ఫేక్ ఐఆర్సీటీసీ యాప్స్లను గుర్తించాలని తెలిపింది. యాప్ పనితీరు, ఇంటర్ఫేస్, లాగిన్ వివరాలు, చెల్లింపు సమాచారం, వ్యక్తిగత డేటా వంటి గోప్యమైన వివరాలను దొంగిలించే అవకాశం ఉందని సూచించింది. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ.. కొంతమంది మోసగాళ్లు భారీ స్థాయిలో యాప్ వినియోగదారులకు ఫిషింగ్ లింక్లను పంపుతున్నట్లు తేలింది. యూజర్లను మోసం చేసేలా నకిలీ 'ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్' మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేయాలని ప్రోత్సహిస్తున్నారనే ప్రచారంలో ఉంది. అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. -
రైలు టిక్కెట్ బుకింగ్ సర్వీసులో సాంకేతిక లోపం
-
ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!
IRCTC down: ఐఆర్సీటీసీ వినియోగదారులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారిక వెబ్సైట్, యాప్లో రైలు టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు సమస్యలపై యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన, ఫిర్యాదులు స్క్రీన్షాట్లతో సోషల్ మీడియా హోరెత్తితింది. దీనిపై ఐఆర్సీటీసీ స్పందించింది. ప్లాట్ఫారమ్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడయ్యాని, వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ల కోసం కేటాయించిన స్లాట్లతో టైమింగ్ క్లాష్ అవ్వడంతో వినియోగదారులు మరింత ఇబ్బంది పడ్డారు. ఏసీ (2A/3A/CC/EC/3E) తత్కాల్ బుకింగ్ ఉదయం 10:00 గంటలకు, నాన్-AC తరగతికి (SL/FC/2S) ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతాయి. దీంతో దాదాపు ఉదయం 8 గంటలనుంచే చెల్లింపులకు సంబంధించిన సమస్యల గురించి కూడా ఫిర్యాదులు మొదలైనాయి. "సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ సేవ అందుబాటులో లేదు. మా సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తోంది. సాంకేతిక సమస్య పరిష్కరించబడిన వెంటనే మేము తెలియజేస్తాము." ఐఆర్సీటీసీ ట్వీట్లో తెలిపింది. అలాగే ప్రత్యామ్నాయంగా అమెజాన్, మేక్మైట్రిప్ తదితర B2C ప్లేయర్ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చుని తెలిపింది. Not able to tatkal booking ticket... Facing some error in #IRCTC app... Please dot the something... I have emergency to back to my home...@IRCTCofficial @RailwaySeva#railways — Vijay Arya (@Im_vijayarya) July 25, 2023 #irctc As usual down ... Can't book tickets Two times banking transactions failed.... Waiting for refund and no further booking @AshwiniVaishnaw@RailwaySeva @RailMinIndia pic.twitter.com/TOPJdXiuy8 — Dhimant Bhatt (@dhimantbhatt) July 25, 2023 కాగా ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా 5 కోట్ల రెగ్యులర్ యూజర్లు ప్రతీ రోజూ సైట్ లో టికెట్ బుక్ చేసుకునే వారి సంఖ్య 20 లక్షలకు పైనే ఉంటారని అంచనా. Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.— IRCTC (@IRCTCofficial) July 25, 2023 -
ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!
ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ప్రయాణీకులకు బీమా సౌకర్యాన్ని డీఫాల్ట్గా అందివ్వనుంది. తాజా నిర్ణయంతో వెబ్సైట్/యాప్లో టికెట్ బుక్ చేసుకొనే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నుంచి ఈ ఆప్షన్ను ఐఆర్సీటీసీ డిఫాల్ట్గా ఇస్తోంది. అంటే ఐఆర్సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అనేది ఆటోమెటిక్గానే వస్తుంది. ఒకవేళ బీమా ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్ మార్క్ను తొలగించుకునే సౌలభ్యం కూడా ఉంది. కానీ ప్రతి ప్రయాణీకులు దీన్ని వినియోగించుకోవడమే చాలా అవసరం. ఐఆర్సీటీసీ పోర్టల్లో తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్గా రూ. 10 లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని బీమా పరిశ్రమలోని సీనియర్ అధికారి పేర్కొన్నారని ఐఏఎన్ రిపోర్ట్ చేసింది. అయితే దీనిపై ఐఆర్సీటీసీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఇందుకోసం భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎఐ)ఐఆర్సీటీసీకి మాత్రం వెసులుబాటు ఇచ్చింది. రైల్వే బీమాను ఎంచుకున్న ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణించినా, లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడితే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ను రైల్వే శాఖ అందిస్తుంది. ఒకవేళ తీవ్రంగా గాయపడి పాక్షిక అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా లభిస్తుంది. అలాగే గాయపడిన వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. అయితే బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటివరకు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ క్లిక్ చేసి నపుడు బీమా సౌకర్యం అందించే సౌకర్యం ఉండేది. ఈ రూ. 10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఐఆర్సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే చార్జ్ చేసేది. ఈ బీమా కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభించే సౌకర్య అందుబాటులోఉండేదన్న సంగతి తెలిసిందే. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!
ట్రైన్ జర్నీ చేసే చాలామంది కొన్ని సందర్భాల్లో ఫుడ్ కోసం ఇబ్బందిపడే ఉంటారు. అధిక ధరలు లేదా నాణ్యత లేకపోవడం వంటివి నిజ జీవితంలో ఎదురై ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాటికి 'ఐఆర్సీటీసీ' (IRCTC) చరమగీతం పాడటానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రయాణికుల కోసం రైల్వే ఓ కొత్త విధానం తీసుకువచ్చింది. సరసమైన ధరతోనే ప్రయాణికులకు మంచి భోజనం అందించాలనే సదుద్దేశ్యంతో రైల్వే బోర్డు ఇప్పటికే డివిజనల్ యూనిట్లకు 'రైల్వేస్ జనతా ఖానా' ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ కేవలం 'నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్'లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సదుపాయం రానున్న రోజుల్లో మరింత విస్తరించడానికి ప్రణాళికలు చేపడుతున్నారు. (ఇదీ చదవండి: బీచ్లో చిల్ అవుతున్న మస్క్, జుకర్బర్గ్.. ఏంటి, కలిసిపోయారా?) రైల్వేస్ జనతా ఖానా.. ఐఆర్సీటీసీ ఈ ఫుడ్ రెండు కేటగిరీలలో అందించనుంది. 7 పూరీలు (175 గ్రామ్స్), పొటాటో వెజిటేబుల్స్ (150 గ్రామ్స్), ఊరగాయ (12 గ్రామ్స్) వంటివి కేవలం రూ. 20 మాత్రమే. అయితే రూ. 50 కాంబో ప్యాక్లో 350 గ్రామ్స్ రాజ్మా లేదా రైస్, పాప్ బాజీ, మసాలా దోశ, కిచిడి మొదలైనవి ఉంటాయి. ఇక 200 మీలీ వాటర్ బాటిల్ ఖరీదు కేవలం రూ. 3 మాత్రమే. ఈ కొత్త విధానం సమర్థవంతంగా సాగితే ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. -
ఐఆర్సీటీసీ ఈ-టికెట్ & ఐ-టికెట్ గురించి తెలుసా?
IRCTC E-Ticket & I-Ticket: ఆధునిక కాలంలో ట్రైన్ జర్నీ సర్వ సాధారణమయిపోయింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ముందుగానే రైలు రిజర్వేషన్ చేసుకుంటారు. ఇలా ముందుగానే రిజర్వ్ చేసుకోవాలనుకునే వారు రెండు విధాలుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అవి ఈ-టికెట్ & ఐ-టికెట్. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ-టికెట్ (E-Ticket) ఐఆర్సీటీసీ అందించే ఎలక్ట్రానిక్ టికెట్నే 'ఈ-టికెట్' అంటారు. ఈ టికెట్ ద్వారా ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. టికెట్స్ అందుబాటులో ఉంటే ప్రయాణం చేసే ముందు రోజు కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడినుంచైనా ఇంటర్నెట్ సదుపాయం ఉంటే బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రింటెడ్ రూపంలో లభించదు. ఈ టికెట్తో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ గుర్తింపు కార్డుని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సీట్ నెంబర్, బెర్త్ వంటి వాటిని మీరే సెలక్ట్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) ఐ-టికెట్ (I-Ticket) ఐ-టికెట్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా ప్రింటెడ్ రూపంలో ఉంటుంది. ఈ టికెట్ మీరు నేరుగా ఏదైనా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది. దీనికి ప్రత్యేక చార్జీలు ఉంటాయి. దీన్ని ప్రయాణానికి మూడు రోజులు ముందుగా అయినా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డెలివరీ కావడానికి కనీసం 48 గంటలు పడుతుంది. దీనిని క్యాన్సిల్ చేసుకోవాలనుంటే కూడా మీరు రైల్వే స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
Advertisement