-
గెలుపుపై ఆశలు లేవు..పవన్ కళ్యాణ్ సైలెంట్
-
డాబుశౌరి కబుర్లు... ఓటమి భయంతో బెంబేలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ఓటమి భయం పట్టి పీడిస్తోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంత ప్రయత్నించినా పార్టీ మారిన ఆయనపై ఓటర్లలో సానుకూలత కనపడడం లేదు. ద్వితీయశేణి నాయకులకు గాలం వేసి, అడ్వాన్స్ ఇచ్చి కండువాలు కప్పుతూ హైప్ క్రియేట్ చేసే యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒకవేళ వారు పార్టీలో చేరినా తరువాత వారి గురించి పట్టించుకోకపోవడంతో వారు బయటికి చెప్పుకోలేక, లోలోన కుమిలిపోతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న బాలశౌరి గ్రాఫ్ మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పరిధిలో రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో ఫ్రస్టేషన్కు లోనవుతున్నారు. దీంతో పిట్టలదొరను మించేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లూ ఏమీ చేయలేని ఆయన ఈ సారి గెలిపిస్తే అద్భుతాలు చేస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాల వారీగా విడగొట్టి లబ్ధి పొందాలని చూసినా ప్రయోజనం లేకపోవడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చివరి అస్త్రంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. వీటన్నింటిని ఓటర్లు గమనిస్తూ సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో, వైఎస్సార్సీపీ నేతల ప్రచారాల్లో , తమ అనుచరులతో గొడవ పెట్టుకొనేలా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పిట్టలదొర వాగ్దానాలుమచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఈ పని చేశాను అని వల్లభనేని బాలశౌరి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ తన గొప్పతనమే అని డబ్బా కొట్టుకుంటున్నారు. సీఎస్ఆర్ నిధులతో అక్కడక్కడా కమ్యూనిటీ భవనాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి. ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేని బాలÔౌరి ఈ సారి గెలిపిస్తే అన్నీ చేసేస్తానని హామీలు గుప్పించడం పట్ల ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓటమి భయంతో రెచ్చగొట్టే చర్యలు మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు తనయుడు సింహాద్రి చంద్రశేఖరరావు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటమి ఖాయమని భావించిన బాలÔౌరి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలో బాలశౌరి వేటాడుతాం, వెంటాడుతాం అంటూ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. తొలి నుంచి ఆయన వ్యవహార శైలి అలానే ఉంది. ఆయన ఏపార్టీలో ఉన్నా తనకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకోవడం వారితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేయించడం వాటి ద్వారా లబ్ధి పొందడం పరిపాటి. మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా గేట్లను తోసుకుని వెళ్లారు. చేతులు మడిచి రౌడీలా అరుస్తూ నానా హంగామా చేశారు.ఈ ప్రశ్నలకు బదులేవి? ఎదురుమొండి, ఎడ్లంక గ్రామాలకు వారధి నిర్మిస్తానని చెప్పే బాలÔౌరి రెండుసార్లు ఎంపీగా పనిచేసినా ఎందుకు పట్టించుకోలేదు. 👉ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబుకి పేరు వస్తుందన్న అక్కసుతో ఎదురుమొండి వారధి టెండర్లు జరగకుండా అడ్డుకున్నది ఎందుకు? 👉 దివిసీమ తీర ప్రాంత సముద్రపు కరకట్టను ఆధునికీకరిస్తానని హామీ ఇస్తున్న బాలÔౌరి గత ఐదేళ్లూ ట్రక్కు మట్టి కూడా ఎందుకు వేయించలేక పోయావు. 👉 నాచుగుంట రహదారి నిర్మాణం చేస్తానని చెబుతున్న బాలశౌరి తెనాలి, మచిలీపట్నం ఎంపీగా ఉండి ఎందుకు ఉద్ధరించలేదు. 👉 తీర ప్రాంత రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్క రోడ్డుకు నిధులు ఎందుకు తీసుకురాలేదు.టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్సీపీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనలో చేరిన బాలÔౌరికి టీడీపీ నాయకుల నుంచి ఆశించిన మేర మద్దతు రావడం లేదు. దీంతో ఆయన నైరాశ్యం చెంది మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేతలు, ఆ పార్టీ పక్కన పెట్టిన నేతలకు డబ్బుల ఎరచూపి జనసేనలో చేర్చుకుంటున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రభావం చూపని ఈ నేతలకు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతం ప్రచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేనకు ఆదరణ లభించక పోవడంతో బాలÔౌరి కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. -
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
సాక్షి, అమరావతి: గాజుగ్లాసు గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీ వెనక్కితగ్గింది. తమ పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని, అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును జనసేన పార్టీకే రిజర్వ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను టీడీపీ ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించదంటూ ఎన్నికల సంఘం నివేదించడంతో హైకోర్టు ఆ దిశగా ఉత్తర్వులివ్వడానికి సిద్ధమైంది. దీంతో టీడీపీకి పరిస్థితి అర్థమైంది. తమ పిటిషన్ను కొట్టేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించి, హైకోర్టు అనుమతి కోరింది. వెంటనే హైకోర్టు పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులిచ్చారు. పొత్తు నేపథ్యంలో గాజుగ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకుగానీ, గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకుగానీ కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ టీడీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రు. -
ఒకరి వెంట మరొకరు..
సాక్షి అమలాపురం: అమలాపురం అసెంబ్లీ పరిధిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలలో సీనియర్లకు, కొన్ని సామాజికవర్గాల వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చివరకు పార్టీలను వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుమానంతో అడుగడుగునా వేధింపులకు గురి చేయడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు స్పందించకపోవడం దారుణం. జనసేనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్చార్జులు డీఎంఆర్ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ వెళ్లిపోయింది. వీరంతా వైఎస్సార్ సీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందినవారు టీడీపీని వీడుతుండడం గమనార్హం. నాయకులే కాదు, వందలాది మంది పార్టీల కార్యకర్తలు సైతం ఆ రెండు పార్టీలకు గుడ్బై చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రెబల్గా పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరితో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఏకంగా రాజకీయాలకు గుడ్బై చెప్పారు. టీడీపీ రెబల్ అభ్యర్థి శ్యామ్కు జగ్గయ్యనాయుడు మద్దతు ఉందని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మద్దతుదారులు బహిరంగంగా ఆరోపిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.జనసేన, టీడీపీలను వీడుతున్నవారిలో కాపు సామాజికవర్గం వారు అధికంగా ఉండడం విశేషం. జనసేనతో భవిష్యత్ లేదని తేలిపోవడంతోపాటు టీడీపీలో గుర్తింపు కరువడడంతో వారు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ జిల్లా అధిష్టానం కలుగజేసుకుంటుందా? అంటే అదీ లేదు. జనసేన పారీ్టకి జిల్లాలో ఒక యంత్రాంగం అంటూ లేదు. టీడీపీలో తగువులు తీర్చాల్సిన నేతలు గొడవలు పెడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు పారీ్టకి గుడ్బై చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనల్లో వలసలు ఆగకపోవడంతో ఆ ప్రభావం ఫలితంపై పడుతోందని రాజకీయ విశ్లేషకుల భావన.హేళన చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ పెద్దలు నన్ను పట్టించుకోవడం లేదు. పైగా నా సామాజికవర్గాన్ని కించిపరుస్తూ హేళన చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు పోటీ చేశారు. మీరు ఒకసారి మాత్రమే గెలిచారు. ఈసారి అల్లవరం నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును కోరితే మమ్మల్ని పక్కన బెట్టారు. – అడపా కృష్ణ ప్రసాద్, అల్లవరం మండలం. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుఇదేనా పార్టీ ఇచ్చే గుర్తింపు పార్టీ సీనియర్ అనే గౌరవం లేకుండా చాలా సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు మమ్మల్ని అడుగడుగునా అవహేళన చేస్తున్నారు. ఇదేనా పార్టీ మాకు ఇచ్చే గుర్తింపు. పార్టీ బాధ్యులే వర్గాలు కడుతున్నారు. – లింగోలు వెంకన్న (పెదకాపు), జనుపల్లి మాజీ సర్పంచ్, ఆత్మ మాజీ చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడురాజకీయాల నుంచి తప్పుకుంటున్నా పార్టీలో ఎంతోమంది సీట్లు ఆశిస్తారు. వారంతా మమ్మల్ని కలిసి మద్దతు కోరతారు. అంతమాత్రాన మాకు వర్గాలు కడతారా? మా కుటుంబం టీడీపీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. – నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప సోదరుడుపట్టించుకోవడం లేదు జనసేన పార్టీ పల్లకీ మోసినా మాకు గుర్తింపు లేదు. టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయి. మా సేవలకు గుర్తింపు దక్కడం లేదు. – మోకా బాలయోగి, మాజీ సర్పంచ్, రెళ్లుగడ్డ, అల్లవరం మండలంటీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పు గ్రామంలో 1,200 పార్టీ సభ్యత్వాలు చేయించగా జనసేన పెద్దలు ఘనంగా సత్కరించారు. కానీ ఇప్పుడు నేనే పార్టీ వీడి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు గుర్తింపు లేక జనసేనకు వచ్చాను. ఇప్పుడు అదే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా తప్పు. – గొలకోటి వెంకటేష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు అందుకే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ ఐదుసార్లుగా పార్టీ టిక్కెట్ ఆశించినా నాకు అవకాశం దక్కలేదు. ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు సరికదా.. అడుగడుగునా నన్ను అవమానించారు. నన్ను ఎవరో ప్రభావితం చేస్తే పోటీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే వారి వద్ద నుంచి స్పందన లేదు. అందుకే స్వతంత్ర అభ్యరి్థగా నేను పోటీలో ఉన్నాను. – పరమట శ్యామ్, టీడీపీ రెబల్ అభ్యర్థి -
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
-
జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం
-
జనసేన రెబల్స్ కు గాజుగ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ కు భారీ షాక్..!
-
గ్లాసు గుర్తుపై ఈసీ సంచలన నిర్ణయం
-
అమెరికా జీవితాన్నివదిలేసి పవన్ కళ్యాణ్ కోసం వస్తే..!
-
పిఠాపురంలో పవన్ అష్టకష్టాలు
-
మనోహర్ ఆస్తి పెరిగింది!
తెనాలిరూరల్: జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్ చూపారు. తెనాలిలో మనోహర్ నామినేషన్ తెనాలిరూరల్: నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్ల మీదుగా సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్ అధికారి ప్రఖర్ జైన్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. -
పవన్ ఆస్తులు మాయ.. పెళ్లాల లెక్కలూ మాయే..
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత ఆస్తులు మాయ అని, ఆయన పెళ్లాల లెక్కలూ మాయే అని వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల అఫిడవిట్లో ఆదాయం, ఆస్తులపై మాయ చేస్తున్నట్లు పెళ్లాలు, గొళ్లేల విషయంలోనూ మాయచేస్తున్నావే అని దెప్పిపొడిచారు. పవన్ ఏ భార్యతో ఎంతకాలం ఉన్నారు, ఒక భార్యతో సంసారం చేస్తూ మరొకరితో పిల్లలను కన్న విషయం, ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు, వీటన్నింటిపై స్పష్టత ఇస్తే బాగుంటుందని అన్నారు. మహేశ్ బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుగుకో అబద్ధం చెప్పాడని, అందులో వివరాలపై విచారణ చేయించాలని అన్నారు.‘ఐదేళ్ల ఆయన సంపాదన రూ.114.76 కోట్లు అని చెప్పారు. అందులో రూ.73 కోట్లు పన్నులు, పార్టీ డొనేషన్ రూ.20 కోట్లు అని చెప్పారు. ఇవన్నీ పోను ఇంకా రూ.90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నాడు’ అని నిలదీశారు. ‘పవన్ ప్రకటించిన ఆస్తులన్నీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్నవే. రూ.90 కోట్ల ఆస్తులు 2018 – 2024 మధ్యలో కొన్నారు. ఇది రిజిస్టర్ విలువే. వాటి మార్కెట్ విలువ రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఉంటుంది.ఇదే సమయంలో ఆయన చేసిన సినిమాలు నాలుగే. వాటిలో యావరేజ్గా ఆడినవి రెండు. మిగతావి డిజాస్టర్ అయ్యాయి. అయినా రూ.90 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా లేక జనసేన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెడితే వచ్చాయా? కరోనా సమయంలో 2021లో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే.. అప్పుడు కూడా ఆయన రూ.33 కోట్ల ఆస్తులు కొన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు పసుపు కరోనా ఏమైనా కాటేసిందా’ అని ధ్వజమెత్తారు.ఈ మధ్య ముగ్గురు నలుగురు పెళ్లాలు అంటేనే పవన్ గింజుకుంటున్నారని, మరి వలంటీర్లను ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అంటే వారికి కోపం రాదా అని ప్రశ్నించారు. ‘అన్న చిరంజీవిని పదే పదే అవమానిస్తున్నది పవనే. కానిస్టేబుల్ కొడుకునంటారు గానీ, చిరంజీవి సినిమా భిక్ష పెట్టడం వల్లే పవర్ స్టార్ అయ్యానని ఎక్కడా చెప్పరు. తల్లిని అవమానించిన లోకేశ్, చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్ ఈరోజు తల్లిని కూడా అవమానించారు’ అని అన్నారు.ఓటమి భయంతో ఇష్టానుసారం పేలుతున్న పవన్ఓటమి భయంతోనే పవన్ సీఎం జగన్పై ఇష్టానుసారం పేలుతున్నారన్నారు. కాపుల్ని, కార్యకర్తలను కూడా కించపరుస్తున్నారని చెప్పారు. పోటీ చేసిన రెండుచోట్లా ప్రజలు కాళ్ళు, కీళ్ళు విరగ్గొట్టినా పవన్కు బుద్ధి రాలేదన్నారు. తనని ఒక్కడినైనా గెలిపించాలని, ప్లీజ్ అంటూ అడుక్కునే పవన్ ఒక పార్టీకి అధ్యక్షుడేనా అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్ని నమ్ముకున్నారని, ప్రజలు కూడా సీఎం జగన్ని నమ్మారని తెలిపారు. అందుకే సీఎం జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్నందునే సీఎం జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.కూటమి కాదది.. కుమ్మక్కు రాజకీయంటీడీపీ, జనసేన, బీజేపీలది కూటమి కాదని, కుమ్మక్కు రాజకీయమని మహేశ్ ధ్వజమెత్తారు. పోటీ చేసేదంతా చంద్రబాబు మనుషులేనని, పార్టీలే మారతాయని చెప్పారు. జనసేన, బీజేపీ అభ్యర్థులు చంద్రబాబు గుంపులో నుంచి వచ్చిన వారేనన్నారు. ఈ గుంపును హైనాలు, గుంటనక్కలు, తోడేళ్లు అనక ఇంకేమనాలని ప్రశ్నించారు. వాళ్లు ప్రజల కోసం కూటమి కట్టలేదని, ప్రజల ఆస్తులను దోచుకునేందుకు, పేదల నోట్లో మట్టికొట్టేందుకు, భూములు కొట్టేసి రూ.లక్షల కోట్లు సంపాదించేందుకేనని అన్నారు.జనసేన అధ్యక్షుడు పవనే సీఎం అభ్యర్థి అని చాలా కాలం సోషల్ మీడియాలో రాగం తీశారని, తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పారని, ఆ తర్వాత 21 సీట్లతో సరిపెట్టారని, వీటిలోనూ నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లేనని చెప్పారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇలాగే ఉంటాయని అన్నారు. -
Yalamanchili: సుందరానికి షాక్
విశాఖ సిటీ: నోటి దురదతో అందరినీ దుర్భాషలాడడం.. వ్యాపారం పేరుతో మహిళకు మోసం.. నిరసనల పేరుతో పరిశ్రమలకు బ్లాక్మెయిలింగ్.. తాజాగా మత్స్యకార నాయకుడిపై హత్యాయత్నం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. యలమంచిలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. స్థానికంగా ప్రజాబలం లేనప్పటికీ.. మత్స్యకారులపై దాడులకు పాల్పడినప్పటికీ.. ఐవీఆర్ఎస్ సర్వేలో అతడికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. ఆయనకు జనసేనకు టికెట్ ఇవ్వడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లోనే కాకుండా.. సొంత పార్టీ నేతలు సైతం విజయ్ అభ్యరి్థత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. అతడికి వ్యతిరేకంగా జనసేన పార్టీ రెబల్ అభ్యరి్థగా మత్స్యకార నాయకుడు ఎర్రిపల్లి కిరణ్ నామినేషన్ వేశారు. విజయ్కు వ్యతిరేకంగా పూడిమడకతో పాటు మరికొన్ని గ్రామాల్లో జనసేన నాయకులు, అభిమానులు తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్నారు.సుందరపు సోదరులపై సీపీకి ఫిర్యాదు సుందరపు సోదరులు వ్యాపారం పేరుతో ఒక మహిళను దారుణంగా మోసం చేశారు. ముందు సుందరపు సతీష్ రూ.23 లక్షలు, తరువాత సుందరపు విజయ్కుమార్ రూ.17 లక్షలు పెట్టుబడులు రూపంలో తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని సదరు మహిళ 2020లో అప్పటి నగర పోలీస్ కమిషనర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు సుందరపు వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకువస్తున్నారు. వైజాగ్ స్టీల్ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ రమేష్ ముద్దాడ 2012లో మరణించారు. అతని మరణం అనంతరం వచ్చిన డబ్బుతో భార్య శ్రీదేవి ముద్దాడ, ఇద్దరి పిల్లలను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి పరిచయం ఉన్న సుందరపు సతీ‹Ùకుమార్(సుందరపు విజయ్కుమార్ సొదరుడు) 2013లో కలిసి ఒక వ్యాపారం కోసం చెప్పాడు.ఆమెను అక్కా అని పిలిచే సతీష్ కర్నాటకలో బల్లారి హెవీ మోటల్ వెహికల్ వ్యాపారంలో రూ.23 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.1.8 లక్షలు రిటర్న్స్ వస్తాయని నమ్మించారు. దీనికి 2013, ఫిబ్రవరిలో ఆమె తన వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి రూ.23 లక్షలు ఎటువంటి ఒప్పంద పత్రాలు లేకుండానే సతీష్కు డబ్బులు ఇచ్చారు. తొలి నాలుగు నెలలు రిటర్న్స్ ఇవ్వని సతీష్ ఆ తరువాత ఒక ఏడాది పాటు కేవలం 80 వేలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన డబ్బులు జీతాలు, వాహనాలకు ఖర్చు అవుతుందని చెప్పేవాడు. ఆ తరువాత నుంచి అది కూడా ఇవ్వడం మానేశాడు. డబ్బులు కోసం అతడికి ఆడగగా వ్యాపారంలో నష్టం వచ్చిందని, అసలు కూడా రాదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఆమె తీసుకున్న రుణం తీర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.కొద్ది రోజులకు విజయ్కుమార్.. కొద్ది రోజులకు విజయ్కుమార్.. శ్రీదేవిని కలిసి రిలయన్స్ టెలీకాంలో 4జీ కేబుల్ ప్రాజెక్టుకు రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాలని కోరాడు. ముందు అతని సోదరుడు చేసిన మోసం కారణంగా ఆ ప్రతిపాదనను శ్రీదేవి తిరస్కరించారు. అయితే విజయ్కుమార్ ఆమెను రిలయన్స్ ఆఫీస్కు తీసుకువెళ్లి అక్కడి ప్రతినిధులతో మాట్లాడించాడు. మంచి ఆదాయం వస్తుందని, గత వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడడానికి మంచి అవకాశమని, సంస్థ నుంచి బిల్లులు కూడా నేరుగా ఆమె అకౌంట్లోనే పడతాయని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి నమ్మి తన భర్త ఫ్లాట్పై లోన్ తీసుకొని రూ.17 లక్షలు సుందరపు విజయ్కుమార్కు ఇచ్చారు.విజయ్కుమార్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో శ్రీదేవి ఆ పనులు చూసుకోవడం ప్రారంభించారు. మొత్తం ప్రాజెక్ట్ వర్క్ పూర్తయినప్పటికీ.. ఆమె ఖాతాలో డబ్బులు పడలేదు. దీంతో ఆమె నేరుగా రిలయన్స్ ఆఫీస్కు వెళ్లి వాకబు చేయగా ఆ పనులకు సంబంధించి బిల్స్ విజయ్కుమార్ అకౌంట్కు రిలీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో డబ్బు కోసం శ్రీదేవి.. సుందరపు విజయ్కుమార్ను అడిగారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం విని షాక్కు గురయ్యారు. పనులు చేయించిన ఉద్యోగికి రూ.10 వేలు మాత్రమే ఇస్తామని, మహిళ కాబట్టి ఆమెకు నెలకు రూ.20 వేలు చొప్పున ఎన్ని నెలలు పనిచేస్తే అంత డబ్బు ఇవ్వాలని విజయ్ తన మనిíÙకి పురమాయించాడు. దీంతో పెట్టుబడి డబ్బులు ఇవ్వాలని అడిగినా విజయ్కుమార్ ఆమెను పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు ఆమె అతడిని డబ్బు కోసం అడగగా కొద్ది నెలల్లో ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. అయినప్పటికీ డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో శ్రీదేవి అప్పటి నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.మత్స్యకార నేతపై హత్యాయత్నంయలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పూడిమడక గ్రామ నివాసి, అదే పార్టీకి చెందిన మత్స్యకారుడు ఎర్రిçపల్లి కిరణ్పై దాడి, హత్యా ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. ఈ ఘటనతో పూడిమాడకతో పాటు తీర ప్రాంతవాసులు, ఉమ్మడి విశాఖలో మత్స్యకారులు సుందరపు విజయ్కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడిమడకకు చెందిన కిరణ్ చురుగ్గా జనసేన పారీ్టలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దీంతో జనసేన అధినాయకులు సైతం అతడిని అభినందించారు. అయితే సుందరపు విజయ్కుమార్ మాత్రం కిరణ్పై కక్ష గట్టి దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కిరణ్, అతని కుటుంబ సభ్యులు, పూడిమడక గ్రామస్తులు పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించి సుందరపు విజయ్కుమార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా మత్స్యకార నేత కిరణ్ జనసేన రెబల్ అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సుందరపు విజయ్కుమార్కు జనసేన టికెట్ ఇవ్వడం పట్ల మత్స్యకారులు తీవ్రస్థాయి మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్కు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సుందరపు వర్గీయులలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఎన్నికల వేళ.. పవన్ సంపద సృష్టి
సాక్షి, అమరావతి: సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ హైదరాబాద్, మంగళగిరిలో దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆదాయ, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో ఆయన నెలన్నర క్రితం 2024 మార్చి 4న రూ.16.14 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 1,060 చదరపు గజాల స్థలంలో 15,709 చదరపు అడుగుల్లో ఉన్న ఇంటిని కోనుగోలు చేసినట్లు చూపగా.. 2024 ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో మంగళగిరి పట్టణ పరిధిలోని 5,517.6 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్లు పవన్ అందులో పేర్కొన్నారు. అంతేకాక.. వ్యక్తిగతంగా తన పేరిట రూ. 209.13 కోట్లు స్థిర చరాస్తులుగానూ, రూ.65.76 కోట్లు అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. తన భార్య అన్నా లెజినోవా, అఫిడవిట్లో పేర్కొన్న నలుగురు పిల్లల పేరిట మరో రూ.28.47 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ఇక మొత్తం ఆస్తుల్లో 10 శాతానికి పైగా ఆస్తులు ఎన్నికలకు రెండు నెలల ముందు కొనడం గమనార్హం. ఆ పిల్లలకు ఒక రకంగా.. ఈ పిల్లలకు మరో రకంగా.. ఇదిలా ఉంటే.. అఫిడవిట్లో పవన్ తన పిల్లలు దేశాయి అకీరా నందన్, దేశాయి ఆద్య (వీరిద్దరూ రేణుదేశాయి–పవన్కళ్యాణ్ పిల్లలు)తో పాటు పోలీనా అంజని, మార్క్ శంకర్ (పవన్కళ్యాణ్–అన్నా లెజినోవా పిల్లలు) పేర్లతో ఉన్న ఆస్తులూ వెల్లడించారు. ఆ అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వీరికి ఆస్తుల కేటాయింపులో పవన్ వ్యత్యాసం చూపించారు. విడాకులిచ్చిన రేణుదేశాయి పిల్లలకు ఒక రకంగా, ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న లెజినోవా పిల్లలకు మరో రకంగా వారి పేరిట తన ఆస్తులు బహుమతుల రూపంలో ఇవ్వడం గమనార్హం. చదివింది పదో తరగతే.. ఇక పవన్ పదో తరగతి వరకే చదువుకున్నారు. అది కూడా ఎస్ఎస్ఎల్సీ (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) రద్దయి, దాని స్థానంలో ఎస్ఎస్సీ (సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎస్ఎస్ఎల్సీ చదవడం గమనార్హం. ఇంటర్లో మేథమేటిక్స్ మొదలు ఎకనామిక్స్ వరకు దాదాపు అరడజను సబ్జెక్టులు చదివినట్లు సందర్భాన్ని బట్టి చెప్పే పవన్.. అవన్నీ హంబక్ అని అఫిడవిట్లో కుండబద్దలు కొట్టారు. 1984లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెన్త్ ఉత్తీర్ణులైనట్లు అఫిడవిట్లో వివరించారు. తనపై మొత్తం 8 కేసులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొనగా.. తన ప్రస్తుత చిరునామా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీగా చెబుతూ.. మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని 197 పోలింగ్ బూత్ 1120 నెంబరుగా తనకు ఓటు ఉన్నట్లు తెలిపారు. పవన్, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో తనకెలాంటి ఆదాయం లేకపోగా, రూ.1,10,62,939 నష్టం వచ్చిందని.. అయితే, 2019–20లో రూ.4.51 కోట్లు, 2020–21లో రూ.12.86 కోట్లు, 2021–22లో 30.09 కోట్లు, 2022–23 ఆర్థిక ఏడాదిలో 12.20 కోట్లు మాత్రమే తన ఆదాయంగా ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, తన భార్య, పిల్లల ఆదాయాలకు సంబంధించి ఎలాంటి ఐటీ రిటరŠన్స్ వివరాలు లేవు. చరాస్తులు.. ► పవన్కళ్యాణ్ చేతిలో ఈ ఏడాది ఏప్రిల్ 19 నాటికి తన చేతిలో నగదు రూపంలో రూ.3.15 లక్షలు ఉన్నాయని.. బ్యాంకుల్లో డిపాజిట్లుగా రూ.16.48 కోట్లు.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.15.48 లక్షలు.. ఇన్సూరెన్స్ తదితర పెట్టుబడులుగా మరో రూ.3.02 కోట్లు.. ఇతరులకు అప్పు రూపంలో ఇచ్చిన మొత్తం రూ.3.65 కోట్లు.. అలాగే, రూ.14.01 కోట్లు విలువ చేసే కార్లు, వాహనాలున్నాయని.. రూ.2.34 కోట్ల బంగారు ఆభరణాలు.. రూ.14.51 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు.. ఇతర రూపాల్లో మరో రూ.1.79 కోట్లు కలిపి మొత్తం చర ఆస్తుల రూపంలో రూ.41.65 కోట్లుగా చూపించారు. ► తన వద్ద రూ.32 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్తో పాటు పది కార్లు (రెండు బెంజి, మూడు మహీంద్రా స్కార్పియాలు, రేంజ్ రోవర్, రెండు టయోటాలు, జీపు, టాటా పికప్ ట్రక్ వాహనాలున్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ఇక తన భార్య అన్నా లెజినోవా పేరిట నగదు రూపంలో రూ.19,340లు.. బ్యాంకు డిపాజిట్లు రూపంలో రూ.86.05 లక్షలు.. రూ.13.97 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు కలిపి మొత్తంగా రూ.ఒక కోటి చరాస్తులున్నాయి. ► పిల్లలు దేశాయి అకీరా నందన్ పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.89.38 లక్షలు.. దేశాయి ఆద్య పేరిట రూ 87.77 లక్షల బ్యాంకు డిపాజిట్లు.. పోలీనా అంజని పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.85.92 లక్షలు.. మార్క్ శంకర్ పేరిట రూ.86.25 లక్షలు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆకీరా నందన్కు తన తల్లి 2022లో ఆడి కారు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ► మరోవైపు.. మొత్తం రూ.65.76 కోట్ల మేర తాను బ్యాంకులు లేదా వివిధ వ్యక్తులకు చెల్లించాలని పవన్ పేర్కొంటూ, అందులో రూ.17.56 కోట్లు బ్యాంకులకు, మరో రూ.46.70 కోట్లు 15 మంది వ్యక్తులు లేదా సంస్థలకు అప్పులుగా చెల్లించాల్సి ఉందని ఆయన తన అఫిడవిట్లో వివరించారు. స్థిరాస్తులు.. ► హైదరాబాద్ శంకరపల్లి మండలం జొన్నవాడ గ్రామంలో 18.02 ఎకరాల వ్యవసాయ భూములున్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ. 10.42 కోట్లు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ప్రస్తుత మార్కెట్ విలువ అంచనాల ప్రకారం రూ.52.85 కోట్ల విలువచేసే ఏడుచోట్ల స్థలాలు (శేరిలింగంపల్లి మండల పరిధిలో రెండు, మంగళగిరి మండల పరిధిలో నాలుగు, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒకటి స్థలాలు ఉన్నట్లు తెలిపారు. మంగళగిరిలో పేర్కొన్న నాలుగు స్థలాల్లో ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో కోనుగోలు చేసినట్లు వివరించారు. ► ఆ ఏడింటిలో ఒకటి మంగళగిరిలోని స్థలం తన తల్లి బహుమతి రూపంలో ఇచ్చారని.. మిగిలినవి తను కొనుగోలు చేసినవన్నారు. ► హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రూ. 3.14 కోట్లు విలువచేసే రెండు ఇళ్లు ఉన్నట్లు తెలిపారు. è రూ.1.95 కోట్లు విలువచేసే హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇంటిని భార్య అన్నా లెజినోవాకు బహుమతిగా ఇచ్చానన్నారు. è రూ.22 కోట్లు విలువ చేసే హైదరాబాద్ జూబీహిల్స్లోని ఇంటిని తన భార్య అన్నా లెజినోవా పిల్లలు పోలీనా అంజని, మార్క్ శంకర్ ఇద్దరికీ చేరి సగం వాటాగా బహుమతిగా అందజేసినట్లు పవన్ పేర్కొన్నారు. పవన్కళ్యాణ్ నామినేషన్ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోదరుడు నాగబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలను వారు బేఖాతరు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి ఉండగా అంతకుమించి లోపలకు అనుమతించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థుల అనుచరులు ఉండాలన్న నిబంధననూ లెక్కచేయలేదు. అక్కడ నినాదాలూ చేశారు. బీజేపీ నేతలకు పరాభవం.. కూటమిలో సభ్యులైన టీడీపీ నేతలకు మాత్రమే విలువనిచ్చిన పవన్కళ్యాణ్.. అప్పటివరకూ ర్యాలీలో తనతో పాటు తిప్పుకున్న బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజుకు నామినేషన్ కేంద్రంలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. తనను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కృష్ణంరాజు అసహనానికి గురయ్యారు. తరువాత పోలీసులు వర్మ కుమారుడు గిరీష్ వర్మతో పాటు ఆయన్ను లోపలకు పంపించారు. ఇక నామినేషన్ వేసేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి ఒకసారి ర్యాలీగా పిఠాపురం చేరుకోవడానికే పవన్ అనుమతి తీసుకున్నారు. అయితే, రెండుసార్లు తిరగడం గమనార్హం. -
మా‘లోకం’ అనుకుంటే... మా పుట్టి ముంచేస్తోంది!
ఆక్రమణలు.. అక్రమాలు చేయడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. ఇప్పుడు అదే విద్యను రాజకీయ రంగంలో ప్రదర్శిస్తున్నారు. టీడీపీ కంచుకోటను డబ్బుమూటలతో కుదేలు చేస్తూ.. జనసేన బలం పెంచుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా.. భవిష్యత్తులో టికెట్ కోసం ఎవరికాళ్లూ పట్టుకోకూడదన్న ఉద్దేశంతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మా‘లోకం’ అంటూ తిరుగుతున్న పసుపుచొక్కా నాయకులు.. ఆమె చర్యలతో కలవరపడుతున్నారు. టీడీపీ పుట్టిమునిగిపోతోందంటూ మదనపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కూటమి అభ్యర్థిగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన నాయకురాలు లోకం మాధవి ఒంటెత్తు పోకడలు టీడీపీ నాయకులకు కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన టీడీపీ నాయకులు ఆమె తీరుతో బెంబేలెత్తిపోతున్నారు. మంచి ప్యాకేజీలతో చేరికలకు తెరతీయడంతో టీడీపీ కార్యకర్తలు సైతం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. టీడీపీ కండువాలను పక్కనపెట్టి జనసేన కండువాలు వేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి మాటెలా ఉన్నా తమ పార్టీకి నెల్లిమర్ల నియోజకవర్గంలో నూకలు చెల్లినట్లేనని టీడీపీ స్థానిక నాయకులకు బెంగపట్టుకుంది. వారంతా పలాస వచ్చిన చంద్రబాబు వద్దకు స్వయంగా వెళ్లి ‘మహాప్రభో... మాధవి మన పుట్టి ముంచేలా ఉంద’ని మొరపెట్టుకున్నా అధినేత నీళ్లు నమలడం తప్ప ఏమీ భరోసా ఇవ్వలేకపోయారట! తొలి నుంచి ఆక్రమణలే లక్ష్యం... జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలైన లోకం మాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామ పరిధిలో రెండు దశాబ్దాల కిందటే భూములు కొనుగోలు చేశారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, మిరాకిల్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ ముసుగులో సమీపంలోనున్న ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేశారు. గెడ్డలు, కాలువలతో పాటు కాలిబాటలన్నీ కలిపేసి రోడ్డు వేసేశారు. కల్వర్టులను వారే కట్టేశారు. ఆ భూముల చుట్టూ ప్రహరీ కట్టేసి పెద్ద గేట్లను పెట్టేశారు. అవతల ఉన్న భూముల్లోకి రైతులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తమ భూముల్లోకి వెళ్లడానికి తోవలేక, మిరాకిల్ వేధింపులు పడలేక విధిలేని పరిస్థితుల్లో వారు తమ భూములను కూడా మిరాకిల్కే వచ్చినకాడికి అమ్మేయాల్సిన పరిస్థితి. ఆక్రమణల్లో దాదాపు 14 ఎకరాల మేర ప్రభుత్వ భూములు, మరో పది ఎకరాల వరకూ డి.పట్టా భూములు ఉన్నట్టు ఇటీవల రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటి స్వాధీనాన్ని అడ్డుకొంటూ న్యాయస్థానం నుంచి యథాతథస్థితి ఉత్తర్వులు తెచ్చుకోవడం మిరాకిల్కే చెల్లింది. టీడీపీ అస్తిత్వానికే ఎసరు... పార్టీ మనుగడ కోసం పవన్ కల్యాణ్ మద్దతు తప్పదని టీడీపీ నాయకులకు చంద్రబాబు బుజ్జగించి పంపించినా పార్టీ భవిష్యత్తుకు మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. కూటమి అభ్యర్థిగా లోకం మాధవి ఉన్నప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మాటే నెగ్గుతుందని చెప్పినా ప్రస్తుతం అలాంటి పరిస్థితులేవీ కనిపించట్లేదు. ఆమె జనసేన పార్టీలో చేరికలకు తెరలేపారు. భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ వైఎస్సార్సీపీలో అసంతృప్త నాయకులకు వల వేశారు. ఈ వలలో టీడీపీ కార్యకర్తలు చిక్కుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లినవారు ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వస్తారనుకుంటే జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. వారి ప్రభావంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని టీడీపీ కార్యకర్తలు కూడా జనసేనలోకి పోతున్నారు. ఇది సవ్యంగా సాగాలనే ఉద్దేశంతో ఈ చేరికల కార్యక్రమాలకు టీడీపీ నాయకులను సైతం దరిచేరనీయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీకి నూకలు చెల్లినట్లేనని ఆ పార్టీ నాయకులు దిగాలు చెందుతున్నారు. డిపాజిట్ దక్కకపోయినా సీటు కేటాయింపు.. పది మందికి ఉపాధి కల్పిస్తున్నామనే ముసుగులో భోగాపురం మండలంలో సంపాదించిన భూములు, ఆక్రమించిన ప్రభుత్వ భూములను కాపాడుకోవడమే లక్ష్యంగా లోకం దంపతులు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచే జనసేన అభ్యర్థిగా లోకం మాధవి తొలుత పోటీచేశారు. ఆమెకు 7,550 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని రెండేళ్ల నుంచి ‘మిరాకిల్’ కేంద్రంగా రాజకీయాలకు తెరలేపారు. మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిగా చంద్రబాబు ప్రకటించిన కర్రోతు బంగార్రాజు సహా ఆ పార్టీ నాయకులంతా ఆమెను తక్కువగా అంచనా వేశారు. ఆమె ధనబలం ముందు వారంతా దూదిపింజల్లా తేలిపోయారు. పవన్ కల్యాణ్ తొలుత ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో లోకం మాధవి కూడా ఉండటంతో టీడీపీ నాయకులకు మతిపోయింది. తిరుగుబాటు చేస్తామని ప్రకటించిన బంగార్రాజు తదితర నాయకులంతా తర్వాత సన్మానం చేయాల్సి వచ్చిందంటే ఆమె పవర్ ఊహించవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు... పూసపాటిరేగ మండలం రెల్లివలసలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడి నివాసంలో నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి జిల్లాకు వచ్చిన చంద్రబాబు పలాసలో బస చేయడంతో మంగళవారం వారంతా అక్కడకు వెళ్లి కలిశారు. నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు, మహంతి చిన్నంనాయుడు బృందం చంద్రబాబుకు తమ కష్టాలను మొరపెట్టుకున్నా సానుకూల స్పందనకనిపించలేదని తెలిసింది. -
Visakhapatnam: పెద్దలకే ప్యాకేజీ
సాక్షి, విశాఖపట్నం: పొత్తులో ఒకరికొకరు సీట్లను సర్దుబాటు చేసుకున్న కూటమి అభ్యర్థులు మిత్రపక్ష పార్టీల పెద్దలకే ప్యాకేజీల్లో పెద్దపీట వేస్తున్నారు. తమపై చిన్న చూపు చూస్తున్నారన్న భావనలో చోటా మోటా నాయకులున్నారు. వాస్తవానికి టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఉమ్మడి విశాఖ జిల్లాలో సగానికి పైగా స్థానాల్లో సీట్లను ఆశించి భంగపడ్డారు. ఆరంభంలో వీరు తమ అధినేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉన్నారు. మరికొందరు తిరుగు బావుటా ఎగురవేశారు. నోటిఫికేషన్తో పాటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్లు దక్కించుకున్న కూటమి అభ్యర్థులు బుజ్జగింపుల పర్వానికి దిగారు. టికెట్లు ఆశించి భంగ పడ్డ వారితో పాటు పార్టీలో కీలక నాయకుల ఇళ్లకు వెళ్లారు. వారి స్థాయిని బట్టి విడతల వారీ ప్యాకేజీలకు ఒప్పించారు. ఇలా ప్యాకేజీ సెటిల్మెంట్లు రూ.లక్షలు, కోట్లలో జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీటికి తలొగ్గిన నేతలకు ఇప్పటికే ప్యాకేజీ సొమ్మును కొంతమేర పంపిణీ చేశారు. ఎలక్షన్ ప్యాకేజీతో అలక వీడిన నేతలు కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్తున్నారు. అయితే దిగువ స్థాయి నాయకులకు మాత్రం ఈ పరిణామం మింగుడు పడడం లేదు. వీరికి కూటమి అభ్యర్థులు ఇచ్చిన ప్యాకేజీ సొమ్ములో తమకు కూడా కొద్దోగొప్పో ఇవ్వకుండా వారే స్వాహా చేస్తున్నారంటూ రగిలిపోతున్నారు. కొన్ని చోట్ల తక్కువ ఖర్చుతో అయిపోయే విందు భోజనాలతోనే సరిపెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇలా మనస్తాపంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులు బరిలో ఉన్న చోట ప్యాకేజీ అందుకున్న పెద్ద నేతలే తప్ప కింది స్థాయి క్యాడర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇదీ పరిస్థితి.. భీమిలి టికెట్ను కూటమిలో టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావుకు కేటాయించారు. ఈ సీటును జనసేన నుంచి పంచకర్ల సందీప్, టీడీపీ నుంచి కోరాడ రాజబాబు ఆశించారు. ఆఖరి నిమిషంలో ఈ సీటును గంటా తన్నుకుపోవడంతో తొలుత వీరు అలకబూనారు. రాజబాబు అయితే గంటాపై తీవ్ర అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పరిస్థితిని గ్రహించిన గంటా.. రాజబాబు ఇంటికి వెళ్లి బుజ్జగించారు. సందీప్కూ ‘సర్ది’ చెప్పారు. వీరిద్దరినీ భారీ ప్యాకేజీతో దారిలోకి తెచ్చుకోవడంతోనే గంటా వెంట ప్రచారంలో పాల్గొంటున్నారన్న ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోంది. అలాగే విశాఖ ఉత్తర టికెట్ను బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్రాజుకు కేటాయించారు. అక్కడ జనసేనలో కిందిస్థాయి శ్రేణులకు ప్యాకేజీ అందకపోవడంతో ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలిసింది. పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్బాబు టీడీపీలో పైస్థాయి నేతలనే ప్రసన్నం చేసుకోవడంతో దిగువ క్యాడర్ ప్రచారంలో పాల్గొనడం లేదని చెబుతున్నారు. యలమంచిలి టీడీపీ సీటును ప్రగడ నాగేశ్వరరావు ఆశించారు. కానీ పొత్తులో జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్కు ఇచ్చారు. తొలుత తన వర్గంతో ఆందోళనకు దిగిన ఆయనకు భారీ ప్యాకేజీ అందడంతో కొద్దిరోజుల నుంచి ప్రచారంలో పాల్గొంటున్నారని, ఆయన అనుచరులు మాత్రం దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఇక పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి అనితను అక్కడ జనసేన నేతలు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ రంగంలోకి దిగి సర్దుబాటు చేసినా కింది స్థాయి క్యాడర్ టీడీపీ అభ్యర్థి ప్రచారంలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అరకు సీటును తొలుత టీడీపీలో దొన్నుదొరకు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీకి మార్చారు. దీనిపై టీడీపీలో నిరసనలు వ్యక్తమయ్యాయి. పెద్దలకు సర్దుబాటుతో ఇప్పుడు కొంతమంది ప్రచారంలో పాల్గొంటున్నారు. -
అది రాయి దాడి కాదు.. పవన్ అభిమానినే చితకబాదిన జనసైనికులు
తెనాలి రూరల్: జనసేన అధినే పవన్కళ్యాణ్ పర్యటనలో జన సైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ అభిమాని అయిన ఓ కాపు యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పవన్ కల్యాణ్పై రాళ్లు విసిరాడని పుకారు చెలరేగడంతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన సరిగిరి దిలీప్నాయుడు తెనాలిలో ఆదివారం సాయంత్రం జరిగిన పవన్కళ్యాణ్ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చాడు. ఇక్కడి సుల్తానాబాద్లోని హెలీప్యాడ్ నుండి పవన్ కల్యాణ్ కొంత దూరం కారు నుండి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చి వారాహి వాహనంలోకి మారారు. ఈ మార్గంలోనే ఉషోదయ కళ్యాణమండపం వద్ద దిలీప్ పవన్ రాక కోసం వేచి ఉన్నాడు. పవన్ కల్యాణ్ అటుగా వెళ్లగానే ఓ యువతితో దిలీప్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె తండ్రి అతనిపై దాడి చేశాడు. పక్కనే ఉన్న జన సైనికులు కలుగజేసుకుని దాడి చేస్తుండడంతో సమీపంలోని చెట్టు ఎక్కాడు. అయినా జనసైనికులు కిందకు లాగడంతో తనను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న రాయి తీసుకున్నాడు. రాళ్లతో దాడి చేస్తున్నాడని జనసైనికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరి కొందరు పవన్ కల్యాణ్పై రాళ్లు వేశాడని కేకలు మొదలు పెట్టారు. యువకులు పెద్ద ఎత్తున గుమికూడి దిలీప్పై దాడి చేస్తున్న క్రమంలో కల్యాణమండపం ఆవరణలోకి పరుగెత్తాడు. వెంబడించిన జనసైనికులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కళ్యాణ మండపం సమీపంలోనే విధుల్లో ఉన్న గుంటూరు స్పెషల్బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎస్ వెంకట్రావు, మరో మహిళా ఎస్ఐ, తెనాలి రూరల్, త్రీ టౌన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుళ్లు శివ, తిరుమలరావు, ఇతర సిబ్బంది హుటాహుటిన దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లారు. బాధితుడు దిలీప్ను పొలీసులు చుట్టముట్టి అతని ప్రాణాలను రక్షించారు. పవన్ కల్యాణ్ అభిమానినైన నేను ఆయనపై రాళ్లు ఎందుకు వేస్తానంటూ బాధితుడు వాపోయాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. వివాదానికి కారణమేంటన్నదీ విచారిస్తున్నారు. -
దత్తపుత్రుడి పార్టీకి చంద్రబాబు ఝలక్
పవన్కళ్యాణ్ ప్యాకేజీ నాయకుడని తేలిపోయింది.!. ఏళ్ల తరబడి జనసేన జెండా మోసిన వారికి టికెట్లు లేవు.. పొత్తులో భాగంగా ఇచ్చే టికెట్లనూ టీడీపీ నుంచి అప్పటికప్పుడు జనసేనలోకి వచ్చేవారికే కేటాయించారు. ఇంత జరిగినా చంద్రబాబును కిమ్మని మాట అనడంలేదంటే.. ఆయనవి స్వార్థ రాజకీయాలేనని ఆ పార్టీ వర్గాలే విమర్శిస్తున్నాయి. ప్రతీ ఐదేళ్లకోసారి రాజకీయాన్ని సినిమాగా భావించి.. చంద్రబాబు డైరెక్షన్లో సొమ్ముచేసుకుంటున్నాడని, ఆయనను నమ్మి పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసే వారిని నిలువునా ముంచేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి టికెట్ల కేటాయింపే నిలువెత్తు నిదర్శనమని పేర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జనసేన పార్టీకి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మూడు సీట్లు ఇస్తామని... తమ పొత్తు సూపర్ హిట్ అంటూ రెండు వేళ్లూ గాలిలో ఊపుతూ... ఒక్కటంటే ఒక్కటే టికెట్ ఇచ్చిన చంద్రబాబు వెన్నుపోటుకు అసలుసిసలైన బ్రాండ్ అంబాసిడర్ అని మరోసారి నిరూపించుకున్నారు! ఇదేదో ప్రత్యర్థుల మాట కాదు కూటమిలోనే మోసపోయి గుండె రగిలిపోతున్నవారి మాట! నెల్లిమర్ల టికెట్ ఒక్కటి మాత్రమే జనసేన జెండా పట్టుకొని తిరుగుతున్న లోకం మాధవికి దక్కింది. ఎచ్చెర్ల టికెట్ను గత ఏడాదే టీడీపీ నుంచి బీజేపీలోకి ప్రవేశించిన నడికుదుటి ఈశ్వరరావు దక్కించుకున్నారు. పాలకొండ టికెట్ అయినా అసలుసిసలైన జనసేన నాయకులకు దక్కుతుందనుకుంటే ఆఖరి నిమిషంలో పసుపు కండువా తీసేసి పార్టీలోకి వచ్చిన నిమ్మక జయకృష్ణకు ఇచ్చేసేశారు. ఇలాంటి ప్రయత్నాలే చేసిన మరో టీడీపీ నాయకురాలు పడాల భూదేవి ఆశలపై నీళ్లుజల్లారు. పవన్ కల్యాణ్ మాట ఇచ్చినా చంద్రబాబు గిమ్మిక్కులతో సీటు చేజారిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతుంది. ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అందామనుకున్న ఆమెకు ఎమ్మెల్యే పదవి అందని ద్రాక్ష అయిపోయింది. పాలకొండలో పాతనీరే... టికెట్ ఇచ్చేస్తామంటూ పాలకొండ జనసేన నాయకులను ఊరించి... ఊరించి చివరకు కొత్త గ్లాసులో పాత సారా పోసినట్టుగా టీడీపీ జంప్ జిలానీ జయకృష్ణకు ఎంపికచేయడమే చిత్రం. జనసేనకు పాలకొండలో రెండు శాతం ఓట్లు లేవని, పాలకొండ టికెట్ జనసేన పార్టీకి ఇస్తే ఊరుకునేది లేదని, తేడా వస్తే నిమ్మక జయకృష్ణను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దించుతామని టీడీపీ నాయకులు బీరాలు పలికారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ కోటా టికెట్లను 24 నుంచి 21కు కోతవేసిన నేపథ్యంలో పాలకొండ టికెట్ టీడీపీకి రాదని తేలిపోయింది. ఇది గమనించిన పడాల భూదేవి అప్పటివరకూ వేసుకొని తిరిగిన టీడీపీ కండువాను పక్కనపడేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సాలువా కప్పించుకున్నారు. ఇక్కడో కొసమెరుపు ఉంది. గ్లాస్ గుర్తుతో పోటీచేయడానికి ఉబలాటపడినా ఆమె మాత్రం ముందు జనసేనలో చేరలేదు. ఇదేదో కొంపముంచే వ్యవహారంలా ఉందని జయకృష్ణ హడావుడిగా టీడీపీ కార్యకర్తలను ఫూల్స్ చేస్తూ ఈనెల 1న పిఠాపురం వెళ్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని భూదేవి కూడా ఈ నెల 7న అనకాపల్లి వచ్చిన పవన్ కళ్యాణ్ను కలిసి ఆమె కూడా జనసేనలో చేరిపోయారు. చివరకు ఈనెల 9న జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు ఖరారైంది. ఎంత ఆశపడిందో కానీ ఈ వార్తతో భూదేవి కంట కన్నీరు జలపాతమైంది. ఆఖరి నిమిషంలోనైనా తనకు బీఫారం ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని హూంకరిస్తున్నా... అవేవీ వాస్తవమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఈ తాజా జనసేన నాయకుల తీరుపై ఇన్నాళ్లూ పాలకొండ జనసేన ఇన్చార్జిగా జెండా మోసిన నిమ్మల నిబ్రమ్ అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. తనకు సీటు ఇస్తామని తిప్పించుకున్న పవన్ కళ్యాణ్ ఆఖరి నిమిషంలో తాజామాజీ టీడీపీ నాయకుడికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాలకొండలో కూటమి అభ్యర్థిని ఓడిచేందుకు అటు భూదేవి, ఇటు నిబ్రమ్ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. పాలకొండ పట్టణంలోని ఓ కళ్యాణమండపంలో గురువారం నిర్వహించిన నాలుగు మండలాల కూటమి నాయకుల సమావేశంలో జయకృష్ణ అభ్యర్థిత్వాన్ని భూదేవి వర్గం వ్యతిరేకించింది. నాలుగు సార్లు ఓడిపోయిన జయకృష్ణకే మళ్లీ టిక్కెట్ ఇచ్చారని, ఈ సారి కూడా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. -
సేనానిని నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో !
తమ్ముణ్ణి సినిమాకు తీసుకెళ్లావ్..నన్నుతీసుకెళ్లలేదు..వాడికి కొత్త బట్టలు కొన్నావు,సైకిల్ కొన్నావ్..నాకు కొనలేదు అని పిల్లలు అలుగుతుంటారు..అలాంటప్పుడు తల్లి, తండ్రి వాణ్ని దగ్గరకు తీసి ఒరేయ్ చిన్నోడా అది కాదురా.. వాడికి సైకిల్ కొన్నాను కదా... నీకూ కొంటాను.. నీకు ఇంకోటి కొంటాను.. వాణ్ని సినిమాకు తీసుకెళ్ళాను కదా.. నువ్వు బాధపడకు నిన్ను జాతరకు తీసుకెళ్తాను... బాధపడకు... అని ఓదార్చాలి... అదే కుటుంబం బాధ్యత. అదే విధంగా పార్టీలో ఉన్నవాళ్లందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.. అలాంటప్పుడు పిలిచి ఇదిగోవయ్యా.. నువ్వు బాగానే కష్టపడ్డావు కానీ నీకు నేను టికెట్ ఇవ్వలేకపోతున్నాను.. దానికి ఏవేవో కారణాలు ఉన్నాయ్.. కాబట్టి ఏమీ అనుకోకు.. పార్టీ కోసం పని చేయండి.. గెలిస్తే మిమ్మల్ని తప్పక గౌరవిస్తాం అని చెప్పాల్సిన బాధ్యత పార్టీ అధినేత మీద ఉంటుంది. కానీ జనసేనాని వీటన్నిటికీ అతీతంగా ఉంటారు.. టికెట్లు తనకు నచ్చినవాళ్లకు ఇచ్చుకుంటారు. తిరుపతిలో కిరణ్ రాయల్ కావచ్చు.. విజయవాడ వెస్ట్ లో పోతిన మహేష్..ఇలా ఎన్నో జిల్లాల్లో ఎంతోమంది పవన్ కోసం పదేళ్లుగా పని చేస్తూ లక్షలు, కోట్లు తగలేశారు. ఇన్నేళ్ళుగా వాళ్ళను వాడుకుని అక్కడ పార్టీ ఉనికిలోకి వచ్చాక.. ప్రజల్లో కాస్త గుర్తింపు వచ్చాక అక్కడి సీటును వేరేవాళ్లకు ఇచ్చుకోవడం, ఇదేమంటే పొత్తు ధర్మం అని, త్యాగాలకు సిద్ధం కావాలని సమర్థించుకోవడం పవన్ కు అలవాటుగా మారింది. పోతిన మహేష్ టికెట్ బీజేపీకి అంటే సుజనా చౌదరికి ఇవ్వడానికి వెనుక కోట్లు చేతులుమారాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇలా పవన్ను నమ్ముకుని బికారులు అయిపోయినవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలోనే ఉన్నారు అయితే ఏనాడూ.. పవన్ అలా నష్టపోయిన లేదా మోసపోయినవాళ్లను పిలిచి వాళ్ళతో మాడ్లాడడం కానీ... వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా..హామీ కానీ ఇచ్చినట్లు వినలేదు. మాకు పవన్ మద్దతుగా ఉంటామన్నారు అని ఇంతవరకూ ఏ ఒక్క నాయకుడూ చెప్పలేదు. ఆంటే ఆయనది అంతా తన ఇష్టానుసారం. తనకు నచ్చినవాళ్లకు టికెట్లు ఇచ్చుకోవడం.. ఆయన్ను నమ్ముకుని మునిగిపోయినవాళ్లు పోవడం.. అంతే తప్ప...కనీసం వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా పార్టీలో ఇంకో వ్యక్తి, ఇంకో నాయకుడు లేకపోవడం ఇక్కడ దారుణం. దీంతో బాధితుల రోదన అరణ్య రోదన అవుతోంది తప్ప వాళ్ళ గోడు వినేవాళ్ళు లేకుండాపోయారు. దీంతో ఎక్కడికక్కడ జిల్లాలు.. నియోజకవర్గాల్లో పార్టీని మోసి మోసపోయిన జనసేన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ తమ దారితాము చూసుకుంటున్నారు. తాను పిఠాపురంలో గెలిస్తే చాలు..పార్టీ మొత్తం ఏమైపోయినా ఫర్లేదు...అనే భావనలో పవన్ ఉండడంతో క్యాడర్ సైతం మెల్లగా సైడ్ అయిపోతున్నారు. --సిమ్మాదిరప్పన్న -
రాజకీయాల్లో నటించకు పవన్..
తాడేపల్లిగూడెం: ప్రజాసేవ అనే మాట పలకని పవన్కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్యాకప్ చేసి, సినిమా షూటింగ్లకు వెళ్లిపోవడం మంచిదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. సినిమాల్లో నటించు.. కానీ రాజకీయాల్లో నటించొద్దంటూ హితవు పలికారు. ఈరోజు పేదల నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే అది జగన్ దయేనని.. పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ బాగుండాలని, ఆయన పది కాలాలపాటు పేదలకు సేవచేయాలని ముద్రగడ ఆకాంక్షించారు. జగన్ ప్రకటించిన అభ్యర్థులను బలపరచాలని, వారి విజయానికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో గురువారం జరిగిన కాపు సంఘీయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాలొ్గన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్ను కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కాపు, తెలగ, బలిజలను మోసగించిన బాబు.. 2014లో కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని చెప్పి చంద్రబాబు మోసగించాడు. ఇచ్చిన హామీని అమలుచేయమంటే నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు. ఆ ఐదేళ్లూ చంద్రబాబు పక్కనే ఉన్న పవన్ ముద్రగడను అలా ఎందుకు అవమానించారని ఏనాడైనా అడిగారా? పవన్కు దమ్ము, «ధైర్యం ఉండి మగాడైతే నన్ను తిట్టాలి.. అంతేగానీ మెసేజ్లు పెట్టడం మగతనం అనిపించుకోదు. 21 సీట్లకు పరిమితం కావడం దారుణం.. తెలుగుదేశం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో పవన్ పొత్తువల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగింది. పవన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకునేవారు. 80 సీట్లు తీసుకుని, పవర్లో షేరు అడగాలని అందరూ భావించారు. కానీ, చంద్రబాబు మాత్రం లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయడానికి తనయుడితో యువగళం పాదయాత్ర చేయించారు. అడగాల్సినన్ని సీట్లు అడగకుండా.. పవర్ షేరింగ్ లేకుండా కేవలం 21 సీట్లకు పవన్ పరిమితం అయిపోవడం చాలా దారుణం. ఆ సీట్లు కూడా త్యాగం చేసి ఉంటే బాగుండేది. మీకు చెప్పుకోవడానికి ఏమీలేదా బాబూ? అసలు పేదల కోసం జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మీరు అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడం ఏంటి.. మీకంటూ సొంతంగా చెప్పుకోడానికి ఏమీలేవా బాబూ? ఈ మాటలు చెప్పడానికి మీరు సిగ్గుపడటంలేదేమోగాని వినడానికి మాకు సిగ్గుగా ఉంది. వైఎస్సార్సీపీ ఓటుకు లక్ష రూపాయలు ఇస్తుందని మీరు చెప్పడం చూస్తే పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే మనుషుల్లా కనపడుతున్నారా పవన్? అయినా అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు ఇస్తామని చెప్పాలిగానీ స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడం ఏమిటి? నిజానికి.. పవన్కళ్యాణ్ ముందుగా తాడేపల్లిగూడెం నుంచి పోటీచేయాలనుకున్నారు. అయితే ఇక్కడి జనసేన అభ్యర్థి త్యాగాలు చేయడానికి సిద్ధంగాలేనని, వస్తే కాలూచేయీ తీసేస్తానని బెదిరించడంతో పవన్ పిఠాపురం వెళ్లిపోయారు. -
Guntur: పెమ్మసాని అనుమానపు చూపులు
గుంటూరు పార్లమెంట్ పరిధిలో 2.5లక్షల మంది కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. ఆ వర్గానికి టీడీపీ ఒక్క సీటు కూడా కేటాయించలేదు. అందుకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని కారణమని ఆ వర్గం ఆరోపిస్తోంది. సీటు ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేద్దామంటే చులకనగా చూస్తున్నారని కాపులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి కాపు కాయలేమని స్పష్టం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: మేం తెలుగుదేశానికి కాపు కాయలేం. ఇది గుంటూరు జిల్లాలో కాపులు ముక్తకంఠంతో చెబుతున్న మాట. జనసేన పొత్తుతో కూటమి అభ్యర్థులు ఆరు నియోజకవర్గాలు, పార్లమెంట్ పరిధిలో పోటీలో ఉన్నా వారి నుంచి రోజూ ఎదురౌతున్న అవమానాల నేపథ్యంలో వారు కూటమి అంటే విసిగిపోయారు. సోమవారం గుంటూరు నగరంలో తెలుగుదేశం ఏర్పాటు చేసిన కాపు ఆత్మీయ సమ్మేళనానికి చుక్కెదురైన సంగతి తెలిసిందే. పార్టీలోని కాపు నేతలను మాత్రమే మాట్లాడించి, సమావేశానికి వచ్చిన కాపు నేతలను మాట్లాడనీయకుండా అడ్డుకోవడంపై కాపు సంఘం నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. వీరిశెట్టి వీడియో హల్చల్ మరోవైపు పెమ్మసాని వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జనసేన సెంట్రల్ ఆంధ్రా కో కన్వీనర్ వీరిశెట్టి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ కాపులకు జిల్లాలో ఒక్క సీటు కేటాయించకపోగా, కాపులకు అంత ప్రాధాన్యత అవసరం లేదని పెమ్మసాని అన్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం రెండున్నర లక్షల ఓట్లే కదా అన్నారని, తెలుగుదేశంతో పొత్తు కారణంగా జనసేనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని కాపులతో మాట్లాడటానికి సుముఖంగా లేరని, మాట్లాడటానికి ప్రయత్నిస్తే చిన్న చూపు చూశారని, ఉమ్మడి ప్రచారం కోసం అడిగితే బిజీగా ఉన్నాను. రాత్రికి కలుద్దామని అన్నారని, రాత్రికి వెళ్తే నిద్ర పోవాలి కదా అంటూ వెటకారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డేగల ఆశలపై నీళ్లు గుంటూరు పార్లమెంట్ పరిధిలో కాపులు అత్యధికంగా రెండున్నర లక్షల పైచిలుకు ఉంటే కమ్మ సామాజికవర్గం లక్షా 65 వేలు ఉన్నారు. తెలుగుదేశంలో కమ్మ సామాజిక వర్గానికి గుంటూరు ఎంపీతోపాటు పొన్నూరు, మంగళగిరి, గుంటూరు వెస్ట్(అభ్యర్థి భర్త) దక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థితోపాటు పొన్నూరు అసెంబ్లీ కూడా కాపులకు కేటాయించారు. కాపులకు నియోజకవర్గంలో చోటు దక్కకపోవడానికి పెమ్మసాని కారణం అని సొంత పార్టీలోని కాపు నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో చంద్రబాబు అమెరికా అంతా వెతికి అత్యంత ధనికుడైన పెమ్మసానిని రంగంలోకి దింపాడు. పార్టీకి భారీగా ఫండ్ ఇచ్చారని ప్రచారంలో ఉంది. అందుకే గతంలోపార్టీకి పనిచేసిన వారినందరినీ పక్కనపెట్టి కీలకమైన గుంటూరు ఎంపీ టికెట్ను చంద్రబాబు పెమ్మసానికి కేటాయించారు. గుంటూరు అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న డేగల ప్రభాకర్ కాపు సామాజికవర్గం కోటాలో తనకు సీటు వస్తుందని ఆశించారు. గత ఐదేళ్లుగా డేగల ప్రభాకర్ పార్టీ కోసం గట్టిగా ఖర్చు పెట్టారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు అయినా కాపులకు కేటాయిస్తారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనకు సీటు దక్కుతుందని కోటి ఆశలు పెట్టుకున్నాడు. కానీ పెమ్మసాని డేగల ఆశలపై నీళ్లు చల్లారు. జనసేన కూడా తమ ఖాతాలో కమ్మవారికే సీటు కేటాయించింది. పెమ్మసాని అనుమానపు చూపులు తమకు సీటు దక్కకపోయినా తమకున్న ఓట్లను చూసైనా పెమ్మసాని గౌరవిస్తారని కాపులంతా ఆయన వద్దకు వెళ్లారు. అయితే తన వద్దకు వచ్చిన కాపులను పెమ్మసాని లైట్ తీసుకున్నారని వారు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. పార్టీకి నమ్మకంగా ఉన్న కొంతమంది కాపు నేతలు పెమ్మసాని వెంట తిరుగుతుంటే ఆయన అనుమానపు చూపులతో రోజూ ఇబ్బంది పడుతున్నారు. ఇది గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కొంతమంది కాపు నేతలతో మీరు పగలు తెలుగుదేశంతో... రాత్రి మీ కులానికి చెందిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులతో తిరుగుతున్నారంటూ దూషిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పొత్తు వల్లే తాము కలిసి తిరుగుతున్నామని లేకపోతే తమకు ఆయనతో తిరగాల్సిన అవసరం లేదని కాపు నేతలు అంటున్నారు. -
విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా
-
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కష్టమే: పవన్కళ్యాణ్
సాక్షి, అనకాపల్లి: ‘‘విశాఖ స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడం కష్టమే.. గతంలో నేను స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రధానమంత్రిని కలిసేందుకు నాతో ఎవరొస్తారో చేతులెత్తండి అని అడిగితే ఎవరూ స్పందించలేదు’’.. అని జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అప్పట్లో విశాఖ స్టీల్ప్లాంట్ కార్మిక సంఘాల నుంచి తనకు మద్దతు రాలేదని, లేదంటే ప్రధాని దగ్గరకు వెళ్లి ప్రైవేటీకరణను నిలిపివేసే వాడినని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదిని ఊరికే నిందిస్తే సరికాదని స్టీల్ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులను పవన్ తప్పుబట్టారు. అనకాపల్లిలో ఆదివారం నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఓడిపోయానని, ఇప్పుడు పిఠాపురంలో గెలవాలని బలంగా కోరుకుంటున్నానన్నారు. అనకాపల్లిలో ఉన్న శారదానది విదేశాల్లో ఉండి ఉంటే పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేదని, మా కూటమి గెలిస్తే దాని ఒడ్డును పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. మరోవైపు.. దారి పొడువునా సీఎం జిందాబాద్ అంటుంటే ‘మనకు అంత శక్తిలేదు.. 2029లో సీఎం అవడానికి ప్రయత్నిస్తా’నని పవన్ అన్నారు. -
బాబు, పవన్ డబుల్గేమ్పై క్యాడర్ తిరుగుబాటు
అవనిగడ్డ/ఎలమంచిలి/రాజంపేట/పాడేరు: పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నాయుడు, పవన్కళ్యాణ్ ఉమ్మడిగా ఆడుతున్న డబుల్గేమ్పై ఆయా నియోజకవర్గాల్లో ఆసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. అవనిగడ్డలో జనసేన నాయకులు ఎదురుతిరగగా, యలమంచిలిలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రాజంపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఆయా నేతలు ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నేతలు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేరికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సీటు ప్రకటిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతిచ్చేది లేదని తెగేసి చెప్పారు. సోమవారం అవనిగడ్డలో జనసేన నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బచ్చు వెంకటనాథ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కష్టపడిన నాయకులను కాదని ఈరోజు పార్టీలో చేరిన వారికి సీటు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జనసేన కోసం పోరాడిన తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, నడిరోడ్డుపై నిలబెట్టి విమర్శలు చేసిన వ్యక్తికి నేడు సీటెలా ఇస్తారని ప్రశ్నించారు. బుద్ధప్రసాద్కు సీటు ప్రకటిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని, వెంటనే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారడం బుద్ధప్రసాద్కు అలవాటని, 2019లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఇప్పుడు జనసేనలోకి వచ్చారని కార్యకర్తలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి మంత్రాంగం నడిపి బుద్ధప్రసాద్ను జనసేనలోకి తీసుకొచ్చారని, ఎంపీ సీటు కోసం ఆయన, ఎంఎల్ఏ సీటుకు బుద్ధప్రసాద్ పార్టీలు మారారని జనసైనికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, చిలకలపూడి పాపారావు, గుడివాక శేషుబాబుతో పాటు ఆరు మండలాలకు చెందిన జనసేన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సమాచారం ఇవ్వకుండా మీటింగా? అనకాపల్లి జిల్లా యలమంచిలిలో టీడీపీ సీనియర్ నేత పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మియ సమావేశం రసాభాసగా ముగిసింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కోట్లు ఖర్చు పెట్టించి ఐదేళ్లుగా టీడీపీ కోసం కష్టపడి పనిచేయించుకుని, పొత్తు పేరుతో నాగేశ్వరరావుకు హ్యాండిచ్చారని వారు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్ల సమక్షంలోనే పప్పల చలపతిరావును వేదికపైకి రానీయకుండా నెట్టేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్లకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమావేశం ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్నట్టు బుద్ధ నాగజగదీష్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రెండ్రోజుల్లో 10 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసి తమ సత్తా చూపుతామని ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు స్పష్టం చేశారు. సుగవాసి వద్దే వద్దు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టికెట్ రాయచోటి వాసి సుగవాసి బాలసుబ్రమణ్యానికి కేటాయించడం టీడీపీలో చిచ్చు రేపింది. సోమవారం టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీడీపీ రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు తన వర్గీయులతో బలప్రదర్శన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని తిరుపతి రహదారిలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ కొనసాగింది. చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుగవాసి వద్దు అంటూ నినాదాలు చేశారు. చెంగల్రాయుడు మాట్లాడుతూ తనే అభ్యర్ధి అని, రాజంపేట నుంచి పోటీ చేసి గెలిచి వస్తే మంచి భవిష్యత్తు కల్పిస్తామని చంద్రబాబే చెప్పారని తెలిపారు. కానీ సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్ ఇచి్చనట్లు సమాచారం వచ్చిందన్నారు. ర్యాలీ పాతబస్టాండు, శివాలయం, ఆర్టీసీ బస్టాండు, మన్నూరు మీదుగా యల్లమ్మగుడి వరకు కొనసాగింది. రమేష్నాయుడిని ఓడిద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. టికెట్ దక్కలేదని ఆగ్రహంతో ఉన్న ఆమె సోమవారం కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి రమేష్ నాయుడు వద్దు..గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి గిడ్డి ఈశ్వరికి టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో రమేష్నాయుడును ఓడిస్తామని హెచ్చరించారు. -
ప్యాకేజీ అందుకుని బీజేపీకి సీటు అమ్మేశాడు: కేశినేని నాని
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement