-
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
టీ20 వరల్డ్కప్-2024లో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు.ట్రావిస్ హెడ్(34), వార్నర్(39), మిచెల్ మార్ష్(35), మాక్స్వెల్(28), స్టోయినిష్(30) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ,అర్చర్, లివింగ్ స్టోన్, రషీద్ తలా వికెట్ సాధించారు.రాణించిన ఆసీస్ బౌలర్లు..202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. ఫిల్ సాల్ట్(37), మొయిన్ అలీ(25) తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్వుడ్, మార్కస్ స్టోయినిష్ తలా వికెట్ పడగొట్టారు. కాగా ఆసీస్కు ఇది వరుసగా రెండో విజయం కావడం గమనార్హం. -
T20 World Cup 2024: సెమీస్కు చేరేది ఆ నాలుగు జట్లే.. ఆసీస్కు నో ఛాన్స్..?
టీ20 వరల్డ్కప్ 2024పై జోస్యాల పర్వం తారాస్థాయికి చేరింది. పలనా జట్టు టైటిల్ గెలుస్తుంది.. పలానా జట్లు సెమీస్కు చేరతాయంటూ మాజీలు, విశ్లేషకులు ఊదరగొడుతున్నారు. తాజాగా ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఈ క్రికెట్ జ్యోతిష్యుల సరసన చేరాడు. ఈసారి ప్రపంచకప్లో ఇంగ్లండ్, టీమిండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు సెమీస్కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. బట్లర్ తన అంచనాల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాకు చోటివ్వకపోవడం ఆశ్చర్యకరం.కాగా, ఇంగ్లండ్ నిన్న (జూన్ 4) జరగాల్సిన తమ తొలి మ్యాచ్లో స్కాట్లాండ్తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. సూపర్-8 చేరే క్రమంలో ఇంగ్లండ్కు ఇది అంత శుభపరిణామం కాదు. ఇంగ్లండ్, స్కాట్లాండ్ పోటీపడుతున్న గ్రూప్లోనే ఆస్ట్రేలియా, నమీబియా, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతానికి ఆడిన ఒక్క మ్యాచ్లో (ఒమన్తో) గెలిచిన నమీబియా 2 పాయింట్లు ఖాతాలో కలిగి టాప్లో ఉంది. ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ను ఆడాల్సి ఉంది.Jos Buttler reveals his predictions for the top four teams in the T20 World Cup 2024.Share your own selections in the comments section below👇 pic.twitter.com/SX0TZxuD5D— CricTracker (@Cricketracker) June 5, 2024ఇదిలా ఉంటే, ఇవాళ జరిగే గ్రూప్-ఏ పోటీలో భారత్-ఐర్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుంది. గ్రూప్-ఏలో ఇప్పటివరకు జరిగిన ఏకైక మ్యాచ్లో యూఎస్ఏ.. కెనడాపై విజయం సాధించింది. ప్రస్తుతం యూఎస్ఏ పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. ఈ గ్రూప్లో భారత్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడాతో పాటు పాకిస్తాన్ ఉంది. భారత్.. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం జరుగబోయే మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా-ఒమన్ (6 గంటలకు).. పపువా న్యూ గినియా-ఉగాండ (5 గంటలకు) తలపడనున్నాయి. -
రాణించిన రషీద్, సాల్ట్.. పాక్ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్ 2024కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్తో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాక్ చిత్తుగా ఓడింది. నిన్న (మే 30) ముగిసిన నాలుగో మ్యాచ్లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పాక్ను మట్టికరిపించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా నిన్న జరిగిన నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు సాధించారు.అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్కు మూడు వికెట్లు దక్కాయి.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా రేపటి నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరే గ్రూప్ల్లో ఉన్నాయి. పాక్.. భారత్తో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుండగా.. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టోర్నీలో భారత్-పాక్ల మెగా సమరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
ENG vs PAK: ఇంగ్లండ్కు ఓ గుడ్న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
కార్డిఫ్ వేదికగా పాకిస్తాన్తో జరగనున్న మూడో టీ20కు ముందు ఇంగ్లండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ మూడో టీ20కు దూరమయ్యాడు. బట్లర్ భార్య లూయిస్ తమ మూడో బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. బట్లర్ పితృత్వ సెలువు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మూడో టీ20కు జోస్ దూరం కానున్నాడు. నాలుగో టీ20కు కూడా అతడి అందుబాటులో ఉండేది అనుమానమే. బట్లర్ గైర్హజరీలో స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఇంగ్లీష్ జట్టును నడిపించనున్నాడు. అయితే తొలుత బట్లర్ టీ20 వరల్డ్కప్-2024లోని తమ ప్రారంభ మ్యాచ్లకు బట్లర్ దూరమవుతాడని అంతా భావించారు. కానీ అనుకున్న సమయం కంటేముందు తన భార్య బిడ్డకు జన్మనించే అవకాశం ఉంది.దీంతో అతడు ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నట్లు ఇంగ్లండ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్పై ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బట్లర్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. -
తుస్సుమన్న పాక్ బ్యాటర్లు.. ఇంగ్లండ్ ఘన విజయం
నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా స్వదేశంలో పాక్తో జరిగిన రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్ను చిత్తు చేసింది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 19.2 ఓవర్లలో 160 పరుగులకే చాపచుట్టేసి 23 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా 1-0 ఆధిక్యంతో సిరీస్లో ముందడుగు వేసింది. సిరీస్లో భాగంగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. మూడో టీ20 కార్డిఫ్ వేదికగా ఈ నెల 28న జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న బట్లర్ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో (51 బంతుల్లో 84; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. విల్ జాక్స్ (23 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్స్టో (18 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా నిరాశపరిచారు. ఓ దశలో (14.5 ఓవర్లలో 144/2) ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లలో ఒక్కసారిగా లయను అందుకోవడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్తో సరిపెట్టుకోక తప్పలేదు. షాహీన్ అఫ్రిది 3, ఇమాద్ వసీం, హరీస్ రౌఫ్ తలో 2 వికెట్లతో రాణించారు.తేలిపోయిన పాక్ బ్యాటర్లు..ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫకర్ జమాన్ (45), బాబర్ ఆజమ్ (32), ఇఫ్తికార్ అహ్మద్ (23), ఇమాద్ వసీం (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతావారంతా దారుణంగా విఫలమయ్యారు. రీస్ టాప్లే భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ 3 వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్ తలో 2 వికెట్లు పడగొట్టి పాక్ను ముప్పుతిప్పలు పెట్టారు. క్రిస్ జోర్డన్, ఆదిల్ రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ పడగొట్టి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. -
చరిత్ర సృష్టించిన బట్లర్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా
ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బట్లర్ కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 84 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 3000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 115 టీ20 మ్యాచ్లు ఆడిన బట్లర్.. 3011 పరుగులు చేశాడు.బట్లర్ అంతర్జాతీయ టీ20 కెరీర్లో 23 ఫిప్టీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని కూడా బట్లర్ అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(84)తో పాటు విల్ జాక్స్(37), బెయిర్ స్టో(21) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. రవూఫ్, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. -
ఇంగ్లండ్కు బిగ్ షాక్.. బట్లర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్లో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి భార్య లూయిస్ మూడో బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. బట్లర్ పితృత్వ సెలవు తీసుకోనున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే అతడు లీగ్ దశ మ్యాచ్లకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ బట్లర్ దూరమైతే ఇంగ్లీష్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఆల్రౌండర్ మొయిన్ అలీ చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్లో జూన్ 4న బార్బోడస్ వేదికగా స్కాట్లాండ్తో తలపడనుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం టీ20 వరల్డ్కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత గడ్డపై నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాకిస్తాన్తో తలపడనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దు అయింది.శనివారం ఇరు జట్లు మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ క్రమంలో రెండో టీ20కు ముందు మొయిన్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడాడు. "నేను వైస్-కెప్టెన్గా ఉన్నప్పుడు జోస్ బట్లర్ గైర్హజరీలో చాలా సందర్బాల్లో జట్టును నడిపించాను. ఆ సమయంలో కెప్టెన్సీ పరంగా నేను ఎటువంటి ఒత్తిడికి లోనవ్వలేదు. కొత్తగా కూడా నాకేమి అన్పించలేదు. మనం తీసుకునే నిర్ణయాలపై ఏదైనా ఆధారపడి ఉంటుంది.ఇక జోస్ భార్య మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. బేబీ అనుకున్న సమయంలోనే ఈ ప్రపంచంలో అడుగుపెడుతుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా జోస్ ఎక్కువ మ్యాచ్లకు దూరం కాకుడదని నేను కోరుకుంటున్నాని" అలీ పేర్కొన్నాడు. -
ఐపీఎల్ నుంచి స్వదేశానికి...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో లీగ్ దశ మ్యాచ్లు ముగింపు దశకు చేరగా... ఆయా జట్లకు కీలకమైన ఇంగ్లండ్ ఆటగాళ్లు తిరుగుపయనమయ్యారు. జోస్ బట్లర్ (రాజస్తాన్), లివింగ్స్టోన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్, రీస్ టాప్లీ (బెంగళూరు)లు ఇంగ్లండ్కు బయలుదేరారు. వచ్చే నెల 2 నుంచి అమెరికా, వెస్టిండీస్లలో జరిగే టి20 ప్రపంచకప్కు తుది సన్నాహంగా సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్తో టి20 సిరీస్ ఆడనుంది.మే 22 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టి20ల సిరీస్ జరుగుతుంది. 22, 25, 28, 30 తేదీల్లో మ్యాచ్లు జరుగుతాయి. కాగా... ఈ ఐపీఎల్ సీజన్లో లివింగ్స్టోన్ ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్ రాజ స్టాన్ స్టార్ ఓపెనర్. ఈ సీజన్లో ఒంటిచేత్తో కొన్ని మ్యాచ్ల్ని గెలిపించాడు. బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాక్స్, టాప్లీలలో జాక్స్ది కీలకపాత్ర. బెంగళూరు వరుస విజయాల్లో భాగమైన అతను లేకపోవడం జట్టుకు లోటే! చివరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు... చెన్నైతో ఈ నెల 18న తలపడుతుంది.ఇవి చదవండి: మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?.. కొట్టిపారేయలేం! -
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్కు ముందు రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. మరి కొన్ని రోజుల్లో టీ20 వరల్డ్కప్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో బట్లర్ స్వదేశానికి పయనమయ్యాడు. ఈ పొట్టి వరల్డ్కప్ సన్నహాకాల్లో భాగంగా ఇంగ్లండ్ స్వదేశంలో పాకిస్తాన్తో 4 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ మే 22న ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లు పాకిస్తాన్ సిరీస్ కంటే ముందే స్వదేశానికి రావాల్సి ఉంటుందని ఐపీఎల్ ప్రారంభంలోనే తమ ఆటగాళ్లకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జోస్ బట్లర్ ఇంగ్లండ్కు బయలు దేరాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది. తమ క్యాంప్ను బట్లర్ వీడి వెళ్తున్న వీడియోను రాజస్తాన్ ఎక్స్లో షేర్ చేసింది. బట్లర్తో పాటు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు విల్ జాక్స్, రీస్ టాప్లీ సైతం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యారు. విల్ జాక్స్, రీస్ టాప్లీ బట్లర్తో పాటు ఇంగ్లండ్కు వెళ్లిపోయారు. We’ll miss you, Jos bhai! 🥺💗 pic.twitter.com/gnnbFgA0o8— Rajasthan Royals (@rajasthanroyals) May 13, 2024 -
IPL 2024: రెండు సెంచరీలకు విలువ లేకుండా చేసిన బట్లర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ హవా కొనసాగుతుంది. ఈ సీజన్లో అతను 6 మ్యాచ్ల్లో 2 సెంచరీల సాయంతో 250 పరుగులు చేసి సీజన్ లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. నిన్న (ఏప్రిల్ 16) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిన బట్లర్.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 36 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో బట్లర్ వీర ఉతుకుడు ఉతికి రాయల్స్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ శతకంతో ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న బట్లర్.. ఎవరూ గమనించని ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బట్లర్ సెంచరీలు చేసిన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి జట్టులోని బ్యాటర్లు కూడా శతకాలు చేశారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి అజేయ శతకంతో (113) చెలరేగగా.. నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సునీల్ నరైన్ (109) సెంచరీతో కదంతొక్కాడు. ఈ రెండు సందర్భాల్లో బట్లర్ మెరుపు శతకాలతో సునామీలా విరుచుకుపడి ప్రత్యర్ధి ఆటగాళ్లు చేసిన సెంచరీలకు విలువ లేకుండా చేశాడు. పోతే.. కేకేఆర్తో మ్యాచ్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో సెంచరీ చేసిన బట్లర్.. ఐపీఎల్ హిస్టరీలో మూడు సార్లు ఛేజింగ్లో సెంచరీలు చేసి ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీతో (7) బట్లర్ ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ను (6) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ (8) టాప్లో ఉన్నాడు. కేకేఆర్తో మ్యాచ్లో బట్లర్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం సాధించింది. బట్లర్ సెంచరీతో కేకేఆర్ ఆటగాడు నరైన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. -
శ్రేయస్ అయ్యర్కు దెబ్బ మీద దెబ్బ! మరో షాక్..
ఓటమి బాధలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మరో షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడికి భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడినా రాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ కారణంగా ఓటమిని మూటగట్టుకుంది. రెండు వికెట్ల తేడాతో ఓడిపోయి పరాజయం పాలైంది. నిజానికి.. కేకేఆర్ రాజస్తాన్ను నిలువరిస్తుందనే అంతా అనుకున్నారు. కొంప ముంచి స్లో ఓవర్ రేటు కానీ స్లో ఓవర్ రేటు కేకేఆర్ కొంపముంచింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లనే ఉంచాల్సి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్న బట్లర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు. ఓటమితో పాటు మరో షాక్ కూడా అనంతరం మూడు బంతుల్లో విజయ సమీకరణం ఐదు పరుగులు కాగా.. చివరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ విజయలాంఛనం పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే స్లో ఓవర్ రేటు కారణంగా కేకేఆర్ మ్యాచ్ ఓడిపోగా.. నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందున కోల్కతా సారథి శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఇది మొదటి తప్పు కాబట్టి ఈ మేర ఫైన్తో సరిపెట్టినట్లు తెలిపింది. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: ఈసారి టైటిల్ సన్రైజర్స్దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి, ధోని గురించే మాట్లాడాలా?... అతడూ ఓ లెజెండ్
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్పై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అతడొక ప్రత్యేకమైన, అసాధారణ ఆటగాడు అంటూ ఈ ఇంగ్లండ్ కెప్టెన్ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ మంగళవారం కోల్కతా నైట్ రైడర్స్తో తలపడింది. ఈడెన్ గార్డెన్స్లో ఆఖరి బంతి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్లో బట్లర్ రాజస్తాన్ను గెలిపించాడు. కేకేఆర్ విధించిన 224 పరుగుల భారీ లక్ష్యం ముందున్న వేళ.. 14 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులే చేసిన తరుణంలో పట్టుదలగా నిలబడిన బట్లర్.. ఒత్తిడిలోనూ సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 అజేయ శతకం(60 బంతుల్లో 107)తో చెలరేగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆఖరి ఓవర్ చివరి బంతికి సింపుల్గా సింగిల్ తీసి రాజస్తాన్ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో ఆరో విజయం నమోదైంది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ బట్లర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి, ధోని గురించే ఎందుకు మాట్లాడాలి? ‘‘అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. వేరే లెవల్ అంతే! బట్లర్ ఇలాంటి ప్రదర్శనతో ఆకట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా అతడు ఇదే పని చేస్తున్నాడు. మున్ముందు కూడా చేస్తాడు. అసాధారణమైన ప్రతిభ అతడి సొంతం. అయితే, బట్లర్ భారత ఆటగాడు కాదు కాబట్టి మనం అతడి గురించి ఎక్కువగా మాట్లాడుకోం. ఒకవేళ ఇదే సెంచరీ గనుక విరాట్ కోహ్లి చేసి ఉంటే.. కనీసం రెండు నెలల పాటు అతడిని ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్లం. అంతెందుకు ధోని కొట్టిన మూడు.. నాలుగు సిక్సర్ల గురించి కూడా మనం పెద్ద ఎత్తున చర్చిస్తాం. అతడొక లెజెండ్ మన ప్లేయర్ల గురించి సెలబ్రేట్ చేసుకున్నట్లుగానే బట్లర్ గురించి కూడా సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే అతడొక క్రికెట్ లెజెండ్’’ అని హర్భజన్ సింగ్ జోస్ బట్లర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఐపీఎల్లో బట్లర్కు ఇది ఏడో సెంచరీ. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్గా బట్లర్ కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి 250 పరుగులు చేశాడు. చదవండి : ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. మాకు దొరికిన విలువైన ఆస్తి అతడు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా?.. స్టార్క్పై ఆగ్రహం
#Starc: కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. కోట్లు పెట్టి కొన్నందుకు అతడి వల్ల జట్టుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా కేకేఆర్ మిచెల్ స్టార్క్ కోసం మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ అతడిని సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా ఈ ఆసీస్ స్టార్ రికార్డులకెక్కాడు. కానీ అందుకు తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు. పదిహేడో ఎడిషన్లో తొలి రెండు మ్యాచ్లో వికెట్లు తీయలేకపోయిన స్టార్క్.. ఆ తర్వాత గాడిలో పడ్డట్లే కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై రెండు.. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా? అయితే.. రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో మరోసారి విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన స్టార్క్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా 50 పరుగులు లీక్ చేశాడు. ముఖ్యంగా కీలకమైన పద్దెనిమిదవ ఓవర్లో 18 పరుగులు ఇవ్వడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక కేకేఆర్ మిగిలిన బౌలర్లలో స్పిన్నర్లు సునిల్ నరైన్ (2/30), వరుణ్ చక్రవర్తి (2/36) మెరుగ్గా ఆడగా.. స్టార్క్తో పాటు పేస్ విభాగంలో వైభవ్ అరోరా(1/45), హర్షిత్ రాణా (2/45) భారీగా పరుగులు ఇచ్చారు. అయితే, వీరిద్దరు వికెట్లు కూడా తీశారు. కానీ ఎంతో అనుభవం ఉన్న స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. ఇక ఈ మ్యాచ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసిన సెంచరీ వీరుడు జోస్ బట్లర్ రాజస్తాన్ను గెలిపించిన విషయం తెలిసిందే. పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు ఫలితంగా వరుస విజయాలతో జోరు మీదున్న కేకేఆర్కు ఓటమి ఎదురైంది. ఈ క్రమంలో స్టార్క్ విమర్శకుల టార్గెట్గా మారాడు. స్టార్క్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే కేకేఆర్కు భంగపాటు తప్పేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నెట్టింట అయితే.. అతడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టి కొంటే పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు’’ అంటూ స్టార్క్పై సెటైర్లు వేస్తున్నారు. అయితే, అతడి ఫ్యాన్స్ మాత్రం అండగా నిలుస్తూ.. కీలక సమయంలో రాణించి తన విలువేంటో చాటుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్పై రాజస్తాన్ విజయం Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అందుకే వరుణ్ చేతికి బంతి!
రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం తమను భావోద్వేగాల డోలికలో ఊగిసలాడేలా చేసిందని.. కానీ తమకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ ఓటమిని అంగీకరించక తప్పదన్న శ్రేయస్.. టోర్నీ మధ్యలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఒక రకంగా మంచిదైందని పేర్కొన్నాడు. లోపాలు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే వీలుంటుందన్నాడు. ఇక ఈ మ్యాచ్లో అద్బుతంగా రాణించిన సునిల్ నరైన్ గురించి ప్రస్తావిస్తూ.. కేకేఆర్కు దొరికిన అత్యంత విలువైన ఆస్తి నరైన్ అని ప్రశంసించాడు. అదే విధంగా ఆఖరి ఓవర్లో బంతిని కావాలనే వరుణ్ చక్రవర్తికి ఇచ్చానన్న శ్రేయస్ అయ్యర్.. ఫలితం రాబట్టలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. On Display: 𝗘𝗳𝗳𝗼𝗿𝘁𝗹𝗲𝘀𝘀 𝗛𝗶𝘁𝘁𝗶𝗻𝗴 😍 Sunil Narine smacking it with perfection👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvRR | @KKRiders pic.twitter.com/yXC3F5r1SY — IndianPremierLeague (@IPL) April 16, 2024 అందుకే వరుణ్ చేతికి బంతి జోస్ బట్లర్ను నిలువరించేందుకు తాము అనుసరించి వ్యూహాలు ఫలించలేదని పేర్కొన్నాడు. కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఓడిపోవడం బాధగా ఉందని శ్రేయస్ అయ్యర్ అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే ఓటమినే తలచుకుంటూ కూర్చోలేమని.. తదుపరి మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని శ్రేయస్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానంలో కేకేఆర్కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్లో రాజస్తాన్ రాయల్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో కోల్కతా రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ సీజన్లో కేకేఆర్కు ఇది రెండో ఓటమి. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. అదే విధంగా.. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు ఈ స్పిన్ ఆల్రౌండర్. అయితే, రాయల్స్ స్టార్ జోస్ బట్లర్ అజేయ శతకం కారణంగా నరైన్సుడిగాలి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. వాళ్లిద్దరి వల్లే ఓటమి 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 128 పరుగులకే పరిమితమైన వేళ బట్లర, రోవ్మన్ పావెల్తో కలిసి దూకుడుగా ఆడాడు. పావెల్ మెరుపు ఇన్నింగ్స్(13 బంతుల్లో 26)తో ఆకట్టుకోగా.. సెంచరీ వీరుడు బట్లర్(60 బంతుల్లో 107) ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ను గెలుపుతీరాలకు చేర్చాడు. అలా నమ్మశక్యంకాని రీతిలో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ పైవిధంగా స్పందించాడు. బట్లర్, రోవ్మన్ పావెల్ అద్భుతంగా ఆడారని వారిద్దరికి క్రెడిట్ ఇచ్చాడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంచలన విజయం.. ఐపీఎల్లో రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు
#KKRvRR: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్పై రెండు వికెట్ల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(107) కారణంగా ఐపీఎల్-2024లో ఆరో విజయాన్ని అందుకుంది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్(56 బంతుల్లో 109) కారణంగా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది కేకేఆర్. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ చివరి బంతి వరకు పట్టుదలగా పోరాడింది. నిజానికి 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ స్కోరు 128/6. గెలవాలంటే చివరి ఆరు ఓవర్లలో 96 పరుగులు కావాలి.. రోవ్మన్ పావెల్తో కలిసి బట్లర్ ఈ క్లిష్టతర పరిస్థితి నుంచి రాజస్తాన్ను గట్టెక్కించాడు. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 గెలుపు సమీకరణం 1 బాల్.. 1 రన్ ఉన్న తరుణంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బట్లర్ ఏమాత్రం తడబడకుండా ఆవేశ్ ఖాన్ కలిసి సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించిన ఈ మ్యాచ్లో ఆఖరికి ఇలా రాజస్తాన్ విజయ దరహాసం చేయగా.. కేకేఆర్ నైరాశ్యంలో మునిగిపోయింది. ఇక ఈ అద్భుతమైన గెలుపుతో రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. పదిహేడేళ్లుగా ఏ జట్టుకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించింది. రన్ ఛేజింగ్లో ఆరో వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన తొలి జట్టుగా ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. అదే విధంగా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ అవతరించింది. ఛేజింగ్లో ఆరో వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన జట్లు 1. రాజస్తాన్ రాయల్స్- కేకేఆర్ మీద- 103 రన్స్- 2024, కోల్కతా. 2. ఆర్సీబీ- గుజరాత్ లయన్స్ మీద- 91 రన్స్- 2016, బెంగళూరు 3. చెన్నై- ముంబై మీద- 85 రన్స్- 2018, వాంఖడే, ముంబై 4. చెన్నై- సన్రైజర్స్ మీద- 78 రన్స్- 2018, వాంఖడే 5. ఢిల్లీ- గుజరాత్ లయన్స్ మీద- 76- 2017, కాన్పూర్. Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్పై రాజస్తాన్ గెలుపు. ఇవి కూడా చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వీరోచిత శతకంతో రాజస్తాన్ను గెలిపించిన బట్లర్ (ఫొటోలు)
-
KKR Vs RR Highlights: రాయల్స్కు బట్లర్ జోష్
కోల్కతా: కోల్కతాతో మ్యాచ్లో రాజస్తాన్ విజయలక్ష్యం 224...14 ఓవర్ల తర్వాత 128/6తో అసాధ్యంగా కనిపించింది. చివరి 6 ఓవర్లలో 96 పరుగులు కావాలి! ఈ దశలో బట్లర్ 42 పరుగుల వద్ద ఉన్నాడు. కానీ బట్లర్తో పాటు పావెల్ బ్యాటింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వరుసగా 6 ఓవర్లలో 17, 17, 16, 18, 19, 9 పరుగుల చొప్పున రాబట్టిన రాయల్స్ విజయాన్ని అందుకుంది. ఇందులో బట్లర్ 6 ఫోర్లు, 5 సిక్స్లు బాదగా...పావెల్ 1 ఫోర్, 3 సిక్స్లు బాదాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతినే సిక్స్గా కొట్టి 55 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్న బట్లర్... సింగిల్ తీయకుండా ఆఖరి బంతి దాకా నిలబడి గెలిపించాడు. 15వ ఓవర్లో 36 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బట్లర్ తర్వాత సంచలన ఇన్నింగ్స్ ఆడిన మరో 21 బంతుల్లోనే వందకు చేరుకున్నాడు. దీంతో మంగళవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై అనూహ్య విజయం సాధించింది. తొలుత నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (56 బంతుల్లో 109; 13 ఫోర్లు, 6 సిక్స్లు) తొలి సెంచరీ సాధించాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసి గెలిచింది. జోస్ బట్లర్ (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. పావెల్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరిపించాడు. నరైన్ ధనాధన్ ఫిల్ సాల్ట్ (10) లైఫ్ను సద్వినియోగం చేసుకోకపోగా, రఘువంశీ (18 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్ నరైన్ 4, 6తో జట్టు పవర్ప్లేలో 56/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు (10) ముగిసేసరికి నైట్రైడర్స్ సరిగ్గా 100/1 స్కోరు చేసింది. నరైన్ సిక్సర్తో 29 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆ మరుసటి ఓవర్లో కుల్దీప్ సేన్... రఘువంశీ ఆట ముగించడంతో రెండో వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (7), రసెల్ (13) జతయినా... పెద్ద స్కోర్లేమీ చేయలేకపోయారు. కానీ నరైన్ ఫోర్లు, సిక్స్లతో తన ఆటతీరును కొనసాగించాడు. చహల్ 16వ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు బాదేయడంతో ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. దీంతోనే అతని సెంచరీ 49 బంతుల్లో పూర్తయ్యింది. 18వ ఓవర్లో బౌల్ట్ యార్కర్తో నరైన్ పోరాటానికి ముగింపు పలికాడు. రింకూ సింగ్ (9 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) మెరుపులతో నైట్రైడర్స్ 200 పైచిలుకు స్కోరు చేసేసింది. బట్లర్ మెరుపులతో... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడిన అది కాసేపే కావడం, టాపార్డర్లో కెప్టెన్ సంజూ సామ్సన్ (12) చెప్పుకోదగ్గ స్కోరే చేయలేకపోవడం రాజస్థాన్ లక్ష్యఛేదనపై ప్రభావం చూపింది. ఇంపాక్ట్ ప్లేయర్గా ఓపెనింగ్ చేసిన బట్లర్ క్రీజును అట్టిపెట్టుకున్నాడు. కానీ ధాటిగా ఆడలేకపోయాడు. రియాన్ పరాగ్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా ఆడే క్రమంలో వికెట్ కోల్పోగా... ధ్రువ్ జురెల్ (2), అశ్విన్ (8), హెట్మైర్ (0) చేతులెత్తేయడంతో 121 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అండ్ (బి) అవేశ్ 10; నరైన్ (బి) బౌల్ట్; రఘువంశీ (సి) అశ్విన్ (బి) కుల్దీప్ సేన్ 30; శ్రేయస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 11; రసెల్ (సి) జురెల్ (బి) అవేశ్ 13; రింకూసింగ్ నాటౌట్ 20; వెంకటేశ్ (సి) జురెల్ (బి) కుల్దీప్ సేన్ 8; రమణ్దీప్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 21; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–21, 2–106, 3–133, 4–184, 5–195, 6–215. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–31–1, అవేశ్ ఖాన్ 4–0–35–2, కుల్దీప్ సేన్ 4–0–46–2, చహల్ 4–0–54–1, అశ్విన్ 4–0–49–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 19; బట్లర్ నాటౌట్ 107; సామ్సన్ (సి) నరైన్ (బి) హర్షిత్ 12; పరాగ్ (సి) రసెల్ (బి) హర్షిత్ 34; జురెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 2; అశ్విన్ (సి) రఘువంశీ (బి) వరున్ 8; హెట్మైర్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 0; పావెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 26; బౌల్ట్ రనౌట్ 0; అవేశ్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–22, 2–47, 3–97, 4–100, 5–121, 6–121, 7–178, 8–186. బౌలింగ్: స్టార్క్ 4–0–50–0, వైభవ్ 3–0–45–1, హర్షిత్ రాణా 4–0–45–2, నరైన్ 4–0–30–2, వరుణ్ 3–0–36–2, రసెల్ 1–0–17–0. ఐపీఎల్లో నేడు గుజరాత్ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. ఈ మ్యాచ్లో బట్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఓటమి తప్పదనుకున్న చోట బట్లర్ తన విధ్వంసకర ఇన్నింగ్స్తో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆరంభంలో తడబడింది. వరుస క్రమంలో జైశ్వాల్, సంజూ శాంసన్ వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అనంతరం పరాగ్, అశ్విన్, హెట్మైర్ వరుస క్రమంలో ఔటయ్యారు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయమైందని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న బట్లర్ మాత్రం తన పట్టును విడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి తన జోరును కొనసాగించాడు. తన హాఫ్ సెంచరీ పూర్తియ్యాక కేకేఆర్ బౌలర్లను బట్లర్ ఊచకోత కోశాడు. ఆఖరివరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 6 సిక్స్లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. క్రిస్ గేల్ రికార్డు బద్దలు ఓవరాల్గా బట్లర్కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం గేల్(6 సెంచరీలు) రికార్డును జోస్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో బట్లర్(7) నిలిచాడు. Like this tweet if u witnessed jos Buttler Alone warrior century knock Jos the boss you absolutely beauty #KKRvRR | #IPL2024 pic.twitter.com/EpWGnD1OOL — 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) April 16, 2024 -
కోహ్లి, బుమ్రా, రోహిత్ కాదు.. అతడే మా జట్టుకు ఆడాలి: బట్లర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2018 సీజన్ నుంచి బట్లర్ రాజస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా నిలిచాడు. అయితే ప్రస్తుత సీజన్లో తొలి మూడు మ్యాచ్ల్లో ఇబ్బంది పడిన బట్లర్.. ఆర్సీబీతో మ్యాచ్లో సెంచరీ చేసి తన ఫామ్ను తిరిగి పొందాడు. శనివారం ముల్లానాపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కూడా సత్తాచాటాలని బట్లర్ ఊవ్విళ్లరుతున్నాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు బట్లర్ తన సహచర ఆటగాడు ట్రెంట్ బౌల్ట్త్ కలిసి "రాయల్స్ ర్యాపిడ్ ఫైర్" అనే ఇంటర్వ్యూలో పాల్గోనున్నాడు. ఈ క్రమంలో బట్లర్కు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత ఐపీఎల్ క్రికెటర్లలో ఏ ఆటగాడు రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాలని మీరు కోరుకుంటున్నారు? అని బౌల్ట్ ప్రశ్నించాడు. అందుకు బట్లర్ ఏమీ ఆలోచించకుండా వెంటనే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బట్లర్ టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలను ఎంచుకోపోవడం అందరని విస్మయానికి గురిచేస్తోంది. From his favourite wicket to one player he would like at the Royals, here’s Jos and Boulty like never before 🔥😂 pic.twitter.com/F7524zWiQZ — Rajasthan Royals (@rajasthanroyals) April 12, 2024 -
IPL 2024: గేల్ రికార్డు సమం చేసిన బట్లర్.. రాహుల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. నిన్నటి సెంచరీతో క్యాష్ రిచ్ లీగ్లో సెంచరీల సంఖ్యను ఆరుకు పెంచుకున్న బట్లర్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్తో (6) కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని షేర్ చేసుకున్నాడు. బట్లర్ తన వందో ఐపీఎల్ మ్యాచ్లో వంద కొట్టడం మరో విశేషం. ఐపీఎల్ చరిత్రలో బట్లర్కు ముందు కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. రాహుల్ సైతం తన వందో మ్యాచ్లో శతక్కొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. బట్లర్ నిన్న సెంచరీ చేసిన మ్యాచ్లోనే విరాట్ కూడా సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విరాట్ ఐపీఎల్ సెంచరీల సంఖ్య ఎనిమిదికి చేరింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. ఈ మ్యాచ్లో విరాట్ తన సెంచరీ పూర్తి చేసేందుకు 67 బంతులు తీసుకుని విమర్శలపాలయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీ కావడమే విరాట్పై విమర్శలకు కారణం. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విరాట్ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. పిచ్ కూడా విరాట్ బ్యాటింగ్ సమయంలో స్పిన్నర్ల పక్షాన ఉండింది. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్తో సెంచరీ పూర్తి చేసి మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024: ఒక్కడు ఎంత కాలమని లాక్కొస్తాడు..సెంచరీ చేసినా చెత్త కామెంట్లే..!
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఇదే మొదటి సెంచరీ. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్పై సెంచరీ చేసేందుకు విరాట్ చాలా కష్టపడ్డాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విరాట్ చివరి వరకు క్రీజ్లో నిలబడాలని భావిస్తే.. అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. విరాట్ సెంచరీ కోసం నిదానంగా ఆడాడంటూ గిట్టని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. జట్టు కోసం నిస్వార్దంగా బ్యాటింగ్ చేసి విమర్శలు ఎదుర్కొంటుండటంతో కోహ్లి అభిమానులు రంగంలోకి దిగారు. తమ ఆరాధ్య ఆటగాడిని టార్గెట్ చేస్తున్న వారిపై ఎదురుదాడికి దిగారు. 18 మ్యాచ్లు అయినా ఒక్కరు కూడా సాధించలేకపోతే విరాట్ సీజన్ తొలి సెంచరీ చేసి చూపించాడని, ఇది తమ ఆరాధ్య ఆటగాడి లెవెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్లోగా బ్యాటింగ్ చేశాడని కామెంట్లు చూసే ముందు విరాట్ బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. నిన్నటి మ్యాచ్ జరిగిన పిచ్పై 183 పరుగుల స్కోర్ డిఫెండ్ చేసుకోదగిందే అంటూ మెసేజ్లు చేస్తున్నారు. అయినా ఎంత కాలమని విరాట్ ఒక్కడు ఆర్సీబీ బండిని లాక్కొస్తాడని తమ ఆరాధ్య ఆటగాడిని ఆకాశానికెత్తుతున్నారు. ఈ సీజన్లో అప్పటివరకు ఎవరి వల్ల కాని సెంచరీని చేసి చూపించినా చెత్త కామెంట్లేనా అని మండిపడుతున్నారు. జట్టులోని మిగతా ఆటగాళ్లంతా సహకరిస్తే కోహ్లి వ్యక్తిగతంగా చేసిన స్కోర్తోనే (113) మ్యాచ్లు గెలవొచ్చంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. గిట్టని వారు చెబుతున్నట్లు విరాట్ ఇన్నింగ్స్ మరీ అంత నెమ్మదిగా ఏమీ సాగలేదని.. చెత్త బంతులను ప్రతి సందర్భంలోనూ విరాట్ చీల్చిచెండాడని గుర్తు చేస్తున్నారు. అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు అశ్విన్, చహల్లకు, సూపర్ సెంచరీ చేసినందుకు బట్లర్కు క్రెడిట్ ఇవ్వాల్సింది పోయి విరాట్ను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, రాజస్థాన్ రాయల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ సెంచరీతో కదంతొక్కినా ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఛేదనలో జోస్ బట్లర్ మెరుపు వేగంతో సెంచరీ (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి రాయల్స్ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. విరాట్ తన సెంచరీని 67 బంతుల్లో సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీగా రికార్డైంది. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయండతో విరాట్ అనుకున్నంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ విషయాన్ని కోహ్లి సైతం అంగీకరించాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. -
RCB: ఫామ్లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు?
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహిపాల్ లామ్రోర్కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా శనివారం రాజస్తాన్తో తలపడ్డ ఆర్సీబీకి భంగపాటు తప్పలేదు. జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్లో నాలుగో ఓటమి నమోదు చేసింది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113)తో వృథాగా పోగా.. జోస్ బట్లర్ సెంచరీ(100- నాటౌట్) రాజస్తాన్ను గెలిపించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ బ్యాటర్ సౌరవ్ చౌహాన్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రంలో ఈ గుజరాత్ ఆటగాడు ప్రభావం చూపలేకపోయాడు. #ICYMI Local lad and our brilliant leggie, Himanshu 🔁 Saurav#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB pic.twitter.com/05BczWmHJh — Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2024 సౌరవ్ అరంగేట్రంలో ఇలా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసిన లెఫ్టాండర్ సౌరవ్.. యజువేంద్ర చహల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంపాక్ట్ ప్లేయర్గా నామినేట్ చేసిన మహిపాల్ లామ్రోర్ సేవలను ఉపయోగించుకోలేకపోయింది ఆర్సీబీ. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 ఫామ్లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు? ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ ఆర్సీబీ వ్యూహాలపై పెదవి విరిచాడు. ‘‘ దేశవాళీ క్రికెట్లో మహిపాల్ లామ్రోర్ ఈ పిచ్పై ఎన్నో మ్యాచ్లు ఆడాడు. కానీ ఈరోజు అతడికి ఆర్సీబీ తుదిజట్టులో చోటు కల్పించలేదు. అతడు ఫామ్లోనే ఉన్నాడు కూడా! అయినా ఇలా ఎందుకు చేశారో తెలియదు. భారత కోచ్లు కూడా ఐపీఎల్ విషయాల్లో కాస్త జోక్యం చేసుకుంటే.. ఇలాంటి ప్రాథమిక తప్పిదాలు జరగవు. ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న దానికి ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన లామ్రోర్ కాగా రాజస్తాన్లోని నాగౌర్కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్లో 32 మ్యాచ్లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. 452 పరుగులు చేశాడు. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన అతడు ఒక వికెట్ కూడా తీశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ సాధించిన ఒకే ఒక్క విజయం(పంజాబ్పై)లోనూ లామ్రోర్ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కేవలం 8 బంతుల్లోనే 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో 13 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు. రాజస్తాన్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: జైపూర్.. సవాయి మాన్సింగ్ స్టేడియం ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 183/3 (20) ►రాజస్తాన్ స్కోరు: 189/4 (19.1) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(రాజస్తాన్). చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే -
స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే
ఐపీఎల్-2024లో సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి. అంతేకాదు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో 7500 పరుగుల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా శనివారం ఈ ఘనత సాధించాడు. కోహ్లి స్లో ఇన్నింగ్స్ ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది ఆర్సీబీ. ఈ క్రమంలో ఓపెనర్ విరాట్ కోహ్లి 113 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 44 పరుగులు సాధించాడు. వీరి తర్వాతి స్థానాల్లో బరిలోకి దిగిన గ్లెన్ మాక్స్వెల్(1), సౌరవ్ చౌహాన్(9) పూర్తిగా నిరాశపరిచారు. కామెరాన్ గ్రీన్ ఆరు బంతులు ఎదుర్కొని 5 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 183 రన్స్ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 19.1 ఓవర్లలోనే పని పూర్తి చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లి స్లో ఇన్నింగ్స్ ఫలితాన్ని ప్రభావితం చేసిందంటూ విమర్శలు వస్తున్నాయి. దూకుడుగా ఆడలేకపోయానని తెలుసు ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఇన్నింగ్స్ అనంతరం విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘చూసేందుకు వికెట్ కాస్త ఫ్లాట్గా అనిపించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్వభావం మారిపోయింది. కాబట్టి మా(విరాట్/డుప్లెసిస్)లో ఒక్కరైనా ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలని భావించాం. ఈ పిచ్పై 183 రన్స్.. మెరుగైన స్కోరే అనిపిస్తోంది. ఇలాగే బ్యాటింగ్ చేయాలని నేనేమీ ముందే ప్రణాళికలు రచించుకోలేదు. నేను దూకుడుగా ఆడలేకపోయానని నాకు తెలుసు. బౌలర్ల వ్యూహాలను అంచనా వేసి అందుకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాను. పరిస్థితులకు అనుగుణంగా పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడటం అవసరమని భావించా. ఈ పిచ్పై అలవోకగా పరుగులు రాబట్టడం బ్యాటర్లకు అంత సులువేమీ కాదు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. యజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో హిట్టింగ్ ఆడటం కుదరలేదని తెలిపాడు. కాగా రాజస్తాన్తో మ్యాచ్లో కోహ్లి 67 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా ఐపీఎల్ హిస్టరీలోనే ఇది స్లోయెస్ట్ సెంచరీ. ఇక ఇదే మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్ జోస్ బట్లర్ 58 బంతుల్లోనే 100 పరుగుల మార్కు అందుకుని సిక్సర్తో జట్టును గెలిపించడం విశేషం. చదవండి: IPL 2024: నీకు ‘బడిత పూజ’ తప్పదు.. యువీ ‘ఫైర్’! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Another day, another fifty for Virat Kohli 🫡 👑#RRvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/3OrfdETaqE — JioCinema (@JioCinema) April 6, 2024 -
Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు
మళ్లీ పాత కథే.. ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో పరాజయం. రాజస్తాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113) బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(44) తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం.. ‘మిగిలిన వాళ్లకు ఆడే అవకాశం రాకపోవడం’తో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది ఆర్సీబీ. అయితే, సొంతమైదానంలో లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగినా రాజస్తాన్ తిరిగి పుంజుకుంది. మరో ఓపెనర్ జోస్ బట్లర్(100 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ(69)తో మెరిశాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసిన రాజస్తాన్ జయభేరి మోగించి వరుసగా నాలుగో గెలుపు అందుకుంది. ఇక ఆర్సీబీ ఖాతాలో మాత్రం నాలుగో ఓటమి చేరింది. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 అయితే, ఈ మ్యాచ్లో సెంచరీ చేసినా విరాట్ కోహ్లిపై మాత్రం విమర్శల వర్షం కురుస్తోంది. కోహ్లి స్వార్థపూరిత ఇన్నింగ్స్ వల్లే ఆర్సీబీ 183 పరుగులకు పరిమితమైందని.. ఒకరకంగా జట్టు ఓటమికి అతడు కూడా కారణమే అని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. నిజానికి కోహ్లి వంద పరుగుల మార్కు అందుకోవడానికి 67 బంతులు తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో.. భారత గడ్డపై సెంచరీ కొట్టడానికి ఇన్ని బంతులు(స్లోయెస్ట్ సెంచరీ) తీసుకున్న తొలి క్రికెటర్గా చెత్త రికార్డు సృష్టించాడు. Another day, another fifty for Virat Kohli 🫡 👑#RRvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/3OrfdETaqE — JioCinema (@JioCinema) April 6, 2024 ఓవరాల్గా మనీశ్ పాండే(2009- సెంచూరియన్)తో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. టీ20 క్రికెట్లో కోహ్లి యాభై కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న సందర్భాల్లో అతడి జట్టు 96 శాతం మ్యాచ్లు ఓడిపోయిందంటూ గణాంకాలు షేర్ చేస్తున్నారు. "I've still got it, I guess." ❤️#RRvRCB #TATAIPL #IPLonJioCinema #ViratKohli pic.twitter.com/XdO7AmVq5l — JioCinema (@JioCinema) April 6, 2024 అంతేకాదు.. సెల్ఫిష్ అంటూ కోహ్లిని ట్రెండ్ చేస్తున్నారు. రాజస్తాన్ రాయల్స్ సైతం.. ‘‘200 పరుగులకు పైగా స్కోరు సాధ్యమయ్యే చోట 184 కూడా పర్లేదులెండి!’’ అంటూ కోహ్లి ఇన్నింగ్స్పై సెటైర్లు వేసింది. -
IPL 2024 RR vs RCB: కోహ్లి సెంచరీ వృథా.. రాజస్తాన్ 4/4
జైపూర్: ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ అజేయంగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఆ జట్టు జయభేరి మోగించింది. శనివారం జరిగిన పోరులో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు) ఐపీఎల్లో 8వ శతకం సాధించగా, కెప్టెన్ డుప్లెసిస్ (33 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు శతకం సాధించగా, కెప్టెన్ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఫ్రాంచైజీకి చెందిన ‘రాయల్ రాజస్తాన్ ఫౌండేషన్’ చేపట్టిన ‘పింక్ ప్రామిస్’లో భాగంగా మహిళా సాధికారత ప్రచార కార్యక్రమం కోసం రాజస్తాన్ జట్టు నిలువెల్లా గులాబీ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. కోహ్లి శతక్కొట్టాడు కానీ... బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ శుభారంభం ఇచ్చారు. దీంతో పవర్ప్లేలో జట్టు 53/0 స్కోరు చేసింది. ఓవర్లు గడుస్తున్న కొద్దీ బ్యాటర్లు పాతుకుపోయినా... పరుగుల వేగం మాత్రం అంతంతమాత్రంగానే సాగింది. కోహ్లి 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో బెంగళూరు స్కోరు వందకు చేరింది. అప్పటికీ ఓపెనింగ్ జోడీనే అజేయంగా ఉంది. సింహభాగం ఓవర్లు (14) ఇద్దరే ఆడారు. కానీ బ్యాటింగ్కు బాగా అనుకూలించిన పిచ్పై ధాటిని ప్రదర్శించలేకపోయారు. 14వ ఓవర్లో డుప్లెసిస్ నిష్క్ర మించడంతో 125 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హిట్టర్ మ్యాక్స్వెల్ (1), సౌరవ్ చౌహాన్ (9) నిరాశపరిచారు. గ్రీన్ (5 నాటౌట్) వచ్చినా... కోహ్లి 67 బంతుల్లోనే సెంచరీతో అజేయంగా నిలిచినా... డెత్ ఓవర్లలో బెంగళూరు పెద్దగా మెరిపించలేదు. 19వ ఓవర్లో 4 పరుగులు, 20వ ఓవర్లో 14 పరుగులు రావడంతో 200 మార్క్కు ఆమడ దూరంలో నిలిచింది. బట్లర్, సామ్సన్ ధనాధన్ జైస్వాల్ (0) ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ కావడంతో బెంగళూరు శిబిరం సంబరాల్లో మునిగింది. కానీ ఈ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. బట్లర్కు కెప్టెన్ సంజూ సామ్సన్ జతవడంతో చేజింగ్ చాలా సులువుగా సాగింది. మయాంక్ డాగర్ వేసిన 6వ ఓవర్ను పూర్తిగా ఆడిన బట్లర్ 4, 0, 4, 6, 4, 0లతో 20 పరుగులు పిండుకున్నాడు. పవర్ప్లేలో రాయల్స్ స్కోరు 54/1 తక్కువే అయినా అక్కడ్నుంచి ఇద్దరు దంచేసే పనిలో పడటంతో బౌండరీలు, సిక్సర్లు క్రమం తప్పకుండా వచ్చేశాయి. బట్లర్ 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే సామ్సన్ ఫిఫ్టీ 33 బంతుల్లో పూర్తయింది. ఇద్దరి దూకుడు కొనసాగడంతో బంతులు, పరుగుల మధ్య అంతరం తగ్గిపోయింది. సామ్సన్ను ఎట్టకేలకు సిరాజ్ అవుట్ చేయగా... 148 పరుగుల రెండో వికెట్కు భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పరాగ్ (4), జురెల్ (2) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ అప్పటికే 18 బంతుల్లో 14 పరుగుల సమీకరణం రాజస్తాన్కు విజయాన్ని ఖాయం చేసింది. 6 బంతుల్లో పరుగు అవసరమైన చోట 94 పరుగుల వద్ద ఉన్న బట్లర్ సిక్సర్తో సెంచరీని, మ్యాచ్ను ఒకేసారి పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 113; డుప్లెసిస్ (సి) బట్లర్ (బి) చహల్ 44; మ్యాక్స్వెల్ (బి) బర్గర్ 1; సౌరవ్ (సి) జైస్వాల్ (బి) చహల్ 9; గ్రీన్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–125, 2–128, 3–155. బౌలింగ్: బౌల్ట్ 3–0–30–0, బర్గర్ 4–0–33–1, అశ్విన్ 4–0–28–0, అవేశ్ఖాన్ 4–0–46–0, చహల్ 4–0–34–2, పరాగ్ 1–0–10–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మ్యాక్స్వెల్ (బి) టాప్లీ 0; బట్లర్ నాటౌట్ 100; సామ్సన్ (సి) యశ్ (బి) సిరాజ్ 69; పరాగ్ (సి) కోహ్లి (బి) యశ్ 4; జురెల్ (సి) కార్తీక్ (బి) టాప్లీ 2; హెట్మైర్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–0, 2–148, 3–155, 4–164. బౌలింగ్: టాప్లీ 4–0–27–2, యశ్ దయాళ్ 4–0–37–1, సిరాజ్ 4–0–35–1, మయాంక్ 2–0–34–0, గ్రీన్ 3.1–0–27–0, హిమాన్షు 2–0–29–0. ఐపీఎల్లో నేడు ముంబై X ఢిల్లీ వేదిక: ముంబై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి లక్నో X గుజరాత్ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
ఒకరోజు వర్షాకాలం ఉదయాన్నే.. నదికి వెళ్లిన ముని..
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
నెహ్రూ తర్వాత మోదీనే అంటూ ఢిల్లీ బయల్దేరిన రజనీకాంత్
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
Advertisement