-
ఎంతమంది వచ్చినా.. ధర్మవరం గడ్డ కేతిరెడ్డి అడ్డా..
-
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు కేతిరెడ్డి సవాల్
సాక్షి, సత్యసాయి: ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కేతిరెడ్డి మాట్లాడారు. సత్యకుమార్ ఢిల్లీలో అంత పలుకుబడి ఉంటే.. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగిస్తామని కేంద్రంతో ప్రకటన చేయించాలన్నారు. అలా చేస్తే.. తాను ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. అలాగే సత్యకుమార్ యాదవ కులస్తుడిగా చెప్పుకుంటున్నారని.. కానీ, నిరూపించుకోవాలని కేతిరెడ్డి సవాల్ చేశారు. కేతిరెడ్డి సమక్షంలో పలువురు నేత వైఎస్సార్సీపీలో చేరారు. -
ధర్మవరం కేతిరెడ్డి అడ్డా.. ప్రతిపక్షాలకు ఇచ్చిపడేసిన కేతిరెడ్డి
-
ధర్మవరం కేతిరెడ్డి అడ్డా.. ప్రతిపక్షాలకు ఇచ్చిపడేసిన కేతిరెడ్డి
-
పనికిమాలిన వెధవలు చేసిన పని అందరు బయటకి వస్తారు: కేతిరెడ్డి
-
ధర్మవరంలో జోరుగా కేతిరెడ్డి భార్య ఎన్నికల ప్రచారం...!
-
సీఎం జగన్ పై దాడి...చంద్రబాబు, పవన్ కి కేతిరెడ్డి మాస్ వార్నింగ్..
-
చంద్రబాబుకు కేతిరెడ్డి అదిరిపోయే కౌంటర్
-
నిన్నటి దొంగ నేడు ముత్యమా?
గుంతకల్లు: ‘నిన్నటి వరకూ గుమ్మనూరు జయరాంను బాబు బండబూతులు తిట్టారు. ఇప్పుడు టీడీపీలో చేరగానే అదే జయరాం ముత్యమైపోతాడా? అప్పుడు జయరాం దొంగ అని అన్నారు. ఇప్పుడు మంచి వాడయ్యాడా?’ అని అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు కర్నూలు వెళ్లినప్పుడల్లా పేకాట మంత్రి అని, బెంజ్ కారు మంత్రి అంటూ గుమ్మనూరును విమర్శించేవారని, అదే వ్యక్తికి బాబు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారని, పసుపు కండువా కప్పుకోగానే పునీతుడయ్యారా అంటూ ప్రశ్నించారు. అప్పుడాయన అవినీతి చేసి ఉంటే టీడీపీలోకి రాగానే ఆ పాపాలన్నీ ప్రక్షాళన అయినట్టని బాబు భావిస్తున్నారా అని నిలదీశారు. రెడ్బుక్లో పేరు తొలగిస్తారా? లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆలూరు వెళ్లినప్పుడు ఇక్కడి పేకాట మంత్రి పేరు రెడ్బుక్లో రాసుకున్నా అని, అధికారంలోకి వచ్చాక ఆయన పని చెబుతా అంటూ గుమ్మనూరును ఉద్దేశించి అన్నారని చెప్పారు. జయరాం ఇప్పుడు టీడీపీలోకి వచ్చినందున, ఆయన పేరు రెడ్ బుక్లో నుంచి తీసేస్తారా అని ప్రశ్నించారు. ఈనాడులో గుమ్మనూరు పై కథనం రాశారని, ఇప్పుడు బెంజ్ కారులో గుమ్మంలోకి అవినీతిని తెచ్చుకున్నామని రాయగలరా అని నిలదీశారు. పేకాట జయరాం మాకొద్దంటూ టీడీపీ క్యాడర్ నిరసన గుంతకల్లు: పేకాట మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్కు గుంతకల్లు టికెట్ కేటాయిస్తే డిపాజిట్లు కూడా దక్కనివ్వబోమని టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. అసలు జయరాంకు గుంతకల్లుతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లులోని టీడీపీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేశారు. పేకాట మాజీ మంత్రి మనకు వద్దంటూ నినాదాలు చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని, అరాచకాలు చేసే జయరాంతో అది సాధ్యం కాదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, జయరాంకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆలూరులో చెత్త (గుమ్మనూరు జయరాం) ఇక్కడ బంగారం అవుతుందా అని చంద్రబాబును ప్రశ్నించారు. నారా లోకేశ్ను దూషించిన గుమ్మనూరు సోదరులను పార్టీలోకి చేర్చుకోవడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే ప్రశాంతతకు మారుపేరైన గుంతకల్లు సీటును ఈ అరాచక వ్యక్తికి ఇస్తే పేకాట క్లబ్బులు, నకిలీ మద్యానికి అడ్డాగా మార్చేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. జితేంద్రగౌడ్ను కాదని జయరామ్కు టికెట్ ఇస్తే డిపాజిట్టు కూడా రాకుండా ఓడిస్తామని శపథం చేశారు. -
ఈనాడు పత్రికపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్
-
కేతి రెడ్లా మజాకా.. చంద్రబాబు అదిరిపోయే షాక్
-
చంద్రబాబుకు కేతిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
చంద్రబాబుకు కేతిరెడ్డి అదిరిపోయే కౌంటర్
-
పవన్ కళ్యాణ్ కి కేతిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
నాడు తిట్టి నేడు కాళ్లు పట్టుకునేందుకు ఢిల్లీ వెళ్లిన వాళ్లను ఏమనాలి?
-
ఐటీ అంటే చంద్రబాబు కాదు.. ఐటీ అభివృద్ధి చేసింది వైఎస్ఆర్.. ఎలాగో ఈ వీడియో చూడండి..
-
బాబు కోసమంటూ పెయిడ్ ఆర్టిస్టులు రోడ్డెక్కితే ఏం చేయాలి?
-
సీఎం జగన్కు నేతన్నల సంఘీభావం.. ధర్మవరంలో భారీ ర్యాలీ
సాక్షి, సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతన్నల సంఘీభావం తెలిపారు. ఈ మేరకు చేనేత కార్మికులు ధర్మవరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రతి ఏటా నేతన్న నేస్తం పేరుతో సీఎం జగన్ ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేతన్న నేస్తం పథకాన్ని స్వాగతిస్తూ లబ్దిదారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి శివానగర్ దాకా సాగిన ర్యాలీలో.. జై జగన్ అంటూ ధర్మవరం చేనేత కార్మికులు నినాదాలు చేశారు. -
2014 నాటి మేనిఫెస్టో కరకట్ట కింద దాచేసిన బాబు
-
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం: ‘నువ్వు అవినీతి, అక్రమాల్లో పీకల్లోతు కూరుకుపోయావు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. పూటకో మాట మాట్లాడతావు. ఏ ఆధారాలు లేకున్నా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వో ఔట్ డేటెడ్ పొలిటీషియన్. వ్యక్తిత్వం లేని నీలాంటి వ్యక్తుల ప్రవర్తన జుగుప్స కల్గిస్తోంది. మరోసారి నాపై బురద జల్లాలని చూస్తే ఊరుకోను’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం బీజేపీ నేత వరదాపురం సూరిని హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఆధారాలతో సహా వివరించారు. మార్కెట్ రేటుకు కొన్నాను 2015లో సూరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద ఓ ప్రైవేట్ కంపెనీ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని భూములను కొనుగోలు చేసిందన్నారు. అయితే సదరు కంపెనీ ప్రతినిధులను సూరి రూ.4 కోట్లు డిమాండ్ చేయడంతో అంత ఇవ్వలేని వారు కంపెనీ ఏర్పాటు చేయకుండానే వెళ్లిపోయారన్నారు. ఈ విషయంపై అప్పట్లో అన్ని పత్రికల్లోనూ కథనాలు వచ్చాయని, వాటిని మీడియాకు చూపించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు ఆ భూములను సదరు ప్రైవేట్ కంపెనీ వేరొక కంపెనీకి విక్రయిస్తే తాను ఆ కంపెనీ నుంచి మార్కెట్ ధరకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వివరించారు. ఇదేమైనా తప్పా అని ప్రశ్నించారు. తన తాత సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే తాము భూస్వాములమని, సూరి లాగా పేదల రక్తాన్ని పీల్చి ఉన్నత స్థాయికి ఎదగలేదన్నారు. తమకు డీజీపీ బంధువని సూరి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, తనకు డీజీపీ ఏ విధంగా బంధువో తెలియజేయాలన్నారు. తాను ఆయనలాగే అధికారాన్ని దుర్వినియోగం చేయనన్నారు. ఇదే సూరి టీడీపీ ప్రభుత్వ హయాంలో డీజీపీగా జేవీ రాముడు ఉన్నప్పుడు ఆయన తనకు మామ అవుతారని పోలీసులపై స్వైర విహారం చేసిన మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా ధర్మవరం ప్రెస్క్లబ్లో జరిగిన దాడి ఘటనలో నిందితులుగా ఉన్న తన అభిమానులపై కూడా చట్ట ప్రకారం కేసు కట్టించి రిమాండ్కు పంపామన్నారు. పోలీసులకు ఎంత స్వేచ్ఛ ఇచ్చామో ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. తాను ధర్మవరం పట్టణంలో 20 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చానని, ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలోనూ రైతులకు న్యాయం చేశానన్నారు. టీడీపీ హయాంలో రైతుల పొట్టగొట్టి ఎకరానికి రూ.5 లక్షలు ఇచ్చి భూసేకరణ చేసి వారికి అన్యాయం చేశారని, తాము రేగాటిపల్లి పొలాలను ఎకరాకు రూ.25 లక్షల పరిహారం అందించి భూసేకరణ జరిపి పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు. వరదాపురం సూరి చేసిన అవినీతి, అక్రమాలు, నిబంధనలకు పాతరేసి ఏ బ్యాంకులలో ఎన్ని రూ.కోట్ల రుణం తీసుకున్నారో త్వరలోనే బట్టబయలు చేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధిపై మాట్లాడేందుకు నైతికత ఉందా? ధర్మవరం నియోజకవర్గంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,387 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని సూరి అబద్ధాలు చెప్పారని, వాటి తాలూకు ఆధారాలు చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారా.. అని ప్రశ్నించారు. సూరి లాంటి నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతికత ఉందా..? అని ప్రశ్నించారు. చదవండి: (విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలి అత్యుత్సాహం) -
ఇంతవరకూ ఓపిక పట్టా.. ఇకపై సహించే ప్రసక్తే లేదు: కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం: ‘‘నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. అందువల్లే జనమంతా మా వెంట నడుస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని పచ్చ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా నాకు ఆపాదిస్తున్నారు. అయినా ఇంతవరకూ ఓపిక పట్టాను. ఇకపై సహించే ప్రసక్తే లేదు. అవాస్తవాలతో బురదజల్లుడు రాజకీయాలు చేస్తే ఊరుకోను’’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎల్లో మీడియా, టీడీపీ నాయకులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ►ఇటీవల కందిపంట ధ్వంసం... వైకాపా నాయకుడి దౌర్జన్యం అనే కథనాన్ని ఓ ఎల్లో మీడియా వండి వార్చిందన్నారు. కందిపంట సాగు చేసిన భూమిని 2004లోనే ప్రభుత్వం సేకరించి రైతు గోనుగుంట్ల రమణప్ప అనే టీడీపీ కార్యకర్తకు పరిహారం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత భూమిలో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో కొందరు ఆ భూమిలో కందిపంట సాగుచేయగా, అధికారులు తొలగించారన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యమంటూ తప్పుడు కథనాలు రాస్తారా అని మండిపడ్డారు. ►ధర్మవరం పట్టణం సర్వే నంబర్ 661లోని స్థలం ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉండగా, ఈ స్థలాన్ని ‘అమృత్’ పథకంలో భాగంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు కేటాయించామన్నారు. కానీ ఎల్లో మీడియా మాత్రం దర్జాగా కబ్జా అంటూ కథనం అల్లేసిందన్నారు. అలాగే ఓ సర్వేనంబర్ 536లో స్థలాన్ని ఎవరో శుభ్రం చేయిస్తుంటే దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరులంటూ అసత్య కథనాలు ప్రచురిందని కేతిరెడ్డి మండిపడ్డారు. అలాగే అప్రాచెరువు సర్పంచ్ ఈశ్వర్రెడ్డి మార్కెట్ ధరకు స్థలం కొనుగోలు చేస్తే కబ్జా చేశారంటూ కథనాలు రాశారన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా తప్పుడు రాతలు రాయడం ఎల్లో మీడియాకు దాని వెనుక ఉన్న పచ్చ నేతలకు అలవాటైందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నిరాధార కథనాలు రాయడం మానుకోవాలన్నారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉనికి కోసమే విమర్శలు.. ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ నాయకులకు కేతిరెడ్డిని విమర్శిస్తే తప్ప ఉనికిలేదన్నారు. భూకబ్జాల గురించి పరిటాల శ్రీరామ్ మాట్లాడటం చూస్తే నవ్వు వస్తోందన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్గా మారిన వరదాపురం సూరి... చివరకు అక్రమంగా డీజిల్ను అమ్ముకునే స్థాయికి దిగజారారన్నారు. తాను ఆధారాలతో సహా సూరి అవినీతిని బయటపెడుతున్నానన్నారు. అనంతపురం నడిబొడ్డున రూ.వంద కోట్ల ప్రాపరీ్టని తన సొంత ఊరికి చెందిన సబ్ రిజి్రస్టార్తో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని భూమిని కొట్టేయడం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. అలాగే ముదిగుబ్బ మండలంలో 151 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని స్వాహా చేయలేదా...? మీరా నన్ను విమర్శించేది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు
సాక్షి, ధర్మవరం: ఎల్లో మీడియా బరితెగించింది. వాస్తవాలను కప్పిపుచ్చుతూ విషపు రాతలతో జనానికి కనికట్టు కడుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని టార్గెట్ చేసింది. కట్టుకథలతో అసత్యాలు వల్లిస్తోంది. టీడీపీ డైరెక్షన్లో నిరాధార కథనాలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయతి్నస్తోంది. కానీ వాస్తవాలు చూస్తున్న జనం ఎల్లో మీడియా తీరును బహిరంగంగానే కడిగిపారేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లంటూ విష ప్రచారం ధర్మవరం నియోజకవర్గంలో అధికారులు పని చేయలేక రాజకీయ ఒత్తిళ్లతో సెలవులో వెళ్లి పోతున్నారంటూ ఇటీవల ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. డీఎస్పీ, తహసీల్దార్, సెబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్లు సెలవులో వెళ్లిపోయరాని తప్పుడు రాతలు రాసింది. వాస్తవాలు ఇలా... కొన్నిరోజుల క్రితమే డీఎస్పీ రమాకాంత్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఆయన రెండేళ్లకుపైగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వర్తించారు. రాజకీయ ఒత్తిళ్లే ఉంటే రెండేళ్లు ఇక్కడ ఎలా పనిచేస్తారని ప్రజలే చర్చించుకుంటున్నారు. ►తహసీల్దార్ నీలకంఠారెడ్డి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం ఇటీవలే విధుల్లోకి వచ్చారు. అయినా ఆరోగ్యం సహకరించక పోవడంతో వైద్యుల సూచన మేరకు..మరో నెల రోజులు సెలవు పెట్టారు. ►వారం రోజుల క్రితం సెబ్ ఇన్స్పెక్టర్ సైదుల్ తన డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో బాధితుడు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సైదుల్పై కేసు నమోదు కాగా, అతను సెలవుపై వెళ్లారు. ►తాజాగా బుధవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యక్తిగత పనుల నిమిత్తం 25 రోజులు సెలవు పెట్టారు. ఈ విషయాన్ని కమిషనరే స్వయంగా మీడియా ముఖంగా చెప్పారు. అయినా ఎల్లో మీడియా ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో కమిషనర్ సెలవులో వెళ్తున్నారని విష ప్రచారం చేసింది. ►ఇలా ఏ కారణంతో అధికారులు సెలవు పెట్టినా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ టీడీపీ, దాని అనుకూల ఎల్లోమీడియా కట్టుకథలతో విష ప్రచారం చేస్తున్నాయి. దీనిపై అధికారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సెలవునూ రాజకీయం చేస్తారా ? నేను ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా రెండున్నరేళ్ల నుంచీ విధులు నిర్వర్తిస్తున్నా. ఏనాడూ రాజకీయ ఒత్తిళ్లు రాలేదు. నేను ఇంతవరకు ఎప్పుడూ ఎక్కువ రోజులు సెలవు తీసుకోలేదు. వ్యక్తిగత పనుల నిమిత్తం 25 రోజులు సెలవు పెట్టాను. దీన్ని రాజకీయం చేయడం బాధ కల్గిస్తోంది. సెలవు ముగియగానే మళ్లీ విధుల్లో చేరుతా. –మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్, ధర్మవరం వైద్య చికిత్స కోసం సెలవు నేను ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాను. వైద్యుల సూచనతో విశ్రాంతి కోసం సెలవు పెట్టాను. దీన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ధర్మవరంలో రెండేళ్లకుపైగానే విధులు నిర్వర్తించా. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా పని చేశాను. మాపై తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. –నీలకంఠారెడ్డి, తహసీల్దార్, ధర్మవరం -
ఎమ్మెల్యే కారులో విద్యార్థులు బడికి..
సాక్షి, ధర్మవరం రూరల్: సాధారణంగా ఎమ్మెల్యే కారులో ఉన్నతస్థాయి అధికారులో లేకపోతే రాజకీయ నాయకులు, వారి బంధువులు కూర్చోవడం పరిపాటి. అయితే నడిచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను తనకారులో ఎక్కించుకొని తానే స్వయంగా కారు నడుపుతూ వారి బడి వద్ద దిగబెట్టారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. వివరాల్లోకెళితే... శుక్రవారం ఉదయం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో 5వ వార్డులో చేపట్టారు. అయితే కార్యక్రమం ముగిసిన తరువాత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన నివాసానికి బయలు దేరారు. ఆ సమయంలో కొంత మంది విద్యార్థినులు కళాజ్యోతి సర్కిల్ వద్ద ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. విద్యార్థినులను గమనించిన ఎమ్మెల్యే ... కారులో ఉన్న వారిని దించివేసి ఆ విద్యార్థినులను తన కారులో ఎక్కించుకొని వారి పాఠశాల వద్ద దింపారు. దీంతో ఎమ్మెల్యే కారులో పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థినులు ఎంతో ఆనందపడిపోయారు. -
Kethireddy: ఫలించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి కృషి
సాక్షి, సత్యసాయి జిల్లా(ధర్మవరం): ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కృషి ఫలించింది. నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కదిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చేది. దీంతో ముదిగుబ్బ మండల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్లోని ముదిగుబ్బను సర్కిల్గా ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ నెం.132 విడుదల చేసింది. ముదిగుబ్బ సర్కిల్ పరిధిలోకి తాడిమర్రి, ముదిగుబ్బ, పట్నం పోలీస్స్టేషన్లు వస్తాయి. చదవండి: (YSR Kadapa: మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే) -
ప్రజా క్షేత్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి కీలక సమాచారం
Advertisement