-
రూ.21లక్షల విలువ చేసే 130 సెల్ఫోన్లు స్వాధీనం..!
డోన్ టౌన్: పట్టణంలోని చిగురమానుపేటలో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో రూ.21 లక్షల విలువ చేసే 130 సెల్ ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకొని కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు.పట్టణంలో సమస్యాత్మకమైన చిగురమానుపేటలో పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్కుమార్, అస్రత్బాషా, పట్టణ, రూరల్ ఎస్ఐలు శరత్కుమార్రెడ్డి, సుధాకర్రెడ్డిలతో పాటు జలదుర్గం ఎస్ఐ విజయ్కుమార్లు మూడు పోలీసు స్టేషన్ల సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారన్నారు. ఇందులో భాగంగా కాలనీకి చెందిన ఎరుకలి రవి అలియాస్ పిలక రవి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఒక లగేజ్ బ్యాగ్లో దొంగలించుకొచ్చిన 130 సెల్ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రవిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని సమీప బంధువులు ఎరుకలి నవాగ్ మరియు ఎరుకలి పవన్లు తమిళనాడు రాష్ట్రంకు వెళ్ళి అక్కడ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లు దొంగలించేవారన్నారు. వాటిని రవికి ఇవ్వగా హైదరాబాద్కు తీసుకెళ్ళి మహమ్మద్ ఖాజా నిజాముద్ధీన్ అలియాస్ ఖైజర్కు ఒట్టుగా అమ్ముతున్నట్లు వెల్లడైందన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ.21 లక్షలు ఉంటుందన్నారు. పైన తెలిపిన ముద్దాయిలు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
యువత పాత్ర కీలకం
నేను పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్ చేస్తున్నాను. 2023లో ఓటరుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు నా దరఖాస్తును ఆమోదించారు. ఎపిక్ కార్డు కూడా వచ్చింది. మొదటి సారిగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మంచి పాలకులను ఎన్నుకోవడంలో యువత పాత్ర కీలకం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. – వినీల భూపని, కృష్ణానగర్, కర్నూలు -
ఓటు తప్పకుండా వేస్తా
నేను బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరుగా నమోదు అయ్యేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. దరఖాస్తును ఆమోదించి ఓటరుగా నమోదు చేశారు. స్మార్ట్ ఎపిక్ కార్డు కూడా వచ్చింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు ఓటు లభించింది. పోలింగ్ రోజు ఎన్ని పనులున్నా.. ఓటు తప్పకుండా వేస్తాను. స్వేచ్ఛగా, నిర్ఛయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాను. – పి.లక్ష్మిచేతన రెడ్డి, వీనస్ కాలనీ, కర్నూలు ● -
లారీ డ్రైవర్ సజీవ దహనం
ఆస్పరి: మండలంలోని చిన్నహోతూరు గ్రామం దగ్గర ఆదివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని సిమెంట్ తరలిస్తున్న ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ నజీర్ (32) సజీవ దహనం అయ్యారు. సోమవారం ఆస్పరి సీఐ హనుమంతప్ప చెప్పిన వివరాలు మేరకు.. ఆదివారం రాత్రి బళ్లారి నుంచి సిమెంట్ చిప్స్ లోడుతో వస్తున్న లారీ డ్రైవర్ చిన్నహోతూరు గ్రామం దగ్గర ఆపారు. బళ్లారి నుంచి హైదరాబాద్కు సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ క్యాబిన్లోని నుంచి క్షణాల్లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ నజీర్ కేకలు వేయడంతో గ్రామస్తులు, ఆటు వైపు వస్తున్న వాహనాల డ్రైవర్లు అప్రమత్తమయ్యారు. క్యాబిన్లో ఇరుకున్న డ్రైవర్ను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కళ్ల ముందే డ్రైవర్ సజీవ దహనమయ్యారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు చలించిపోయారు. ఆస్పరి సీఐ హనుమంతప్ప ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలూరు నుంచి అగ్ని మాపక దళ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. మృతదేహాన్ని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం తరువాత బంధువులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. మృతి చెందిన నజీర్ది హర్యానా రాష్ట్రం కాగా.. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
● బీమా సంస్థకు వినియోగదారుల కమిషన్ ఆదేశం
రైతులకు వడ్డీతో రూ.3 కోట్లు చెల్లించాల్సిందేకర్నూలు (లీగల్): గోడౌన్లో దాచుకున్న పంట షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన ఘటనలో 25 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తేల్చిచెప్పింది. గోడౌన్ యజమాని కావాలనే రైతులు దాచుకున్న పంటను కాల్చివేశారన్న అనుమానంతో పరిహారం తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. గోడౌన్ యజమానే కాల్చివేశారనడానికి ఎటువంటి ఆధారాలను ఇన్సూరెన్స్ కంపెనీ సమర్పించలేదని స్పష్టం చేసింది. 25 మంది రైతులకు రూ.3 కోట్లు పరిహారం 2018 నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాల్సిందేనని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ అధ్యక్షులు కె.కిషోర్కుమార్, సభ్యులు ఎన్.నారాయణరెడ్డి, నజీమా కౌసర్లతో కూడిన బెంచ్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే... నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేనలోని శ్రీసాయి లక్ష్మి రూరల్ గోడౌన్లో సమీప గ్రామాలకు చెందిన 25 మంది కందిపప్పు, జొన్న, మినుములు, శనగపప్పు పంటను జులై 2017లో ఏడాది పాటు నిల్వ చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. 2018 జులై 4న గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగి దాదాపు 80 శాతం పంట కాలిపోయింది. ఈ గోడౌన్కు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన రూ.18 కోట్ల విలువైన నాలుగు బీమా పాలసీలు ఉన్నాయి. పరిహారం చెల్లించాలంటూ గోడౌన్ యజమాని, రైతులు బీమా కంపెనీని ఆశ్రయించినా ఫలితం లేదు. దీంతో జిల్లా వినియోగదారుల కమిషన్లో కేసులు దాఖలు చేయడంతో పై విధంగా ఆదేశాలు ఇచ్చింది. -
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
ఆదోని అర్బన్: ఐపీఎల్–2024 సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.50 లక్షలు నగదు, నాలు గు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక త్రీటౌన్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆదోని పట్టణం ఎమ్మిగనూరు బైపాస్ వద్ద కల్వారి కొండ సమీపంలో ముళ్లకంపల చెట్ల కింద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా ఆదోని పట్టణం మరాఠీగేరికి చెందిన మహానంది, రమేష్, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షహీద్, ఆదోని పట్టణం కార్వన్పేటకు చెందిన బెస్త వినోద్లను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షలు నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. జల్సాల కోసం వీరు క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. త్రీ టౌన్ సీఐ నరసింహరాజు, పోలీసు సిబ్బంది లక్ష్మన్నస్వామి, నరేంద్ర, పరశురామ్, పరమేష్, గిరిబాబు, నరసింహులు, ఇస్మాయిల్లు తదితరులు పాల్గొన్నారు. కారు ఢీకొని వ్యక్తి మృతి ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని గుడేకల్ ఎల్ఎల్సీ కాలువ సమీపంలో ఆదివారం రాత్రి బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో బోయ లక్ష్మన్న (28) మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. గుడేకల్కు చెంది న లక్ష్మన్న, భార్య నారాయణమ్మ పుట్టినిళ్లైన పెద్దకడబూరు మండలం హనుమాపురానికి వెళ్లింది. లక్ష్మన్న ఆదివారం రాత్రి టీవీఎస్ ఎక్స్ఎల్పై భార్య వద్దకు వెళ్తుండగా ఆదోని వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. బైక్ రోడ్డు పక్కనున్న ముళ్ల పొదల్లో పడగా లక్ష్మన్న గుంతలో పడిపోయాడు. ఢీకొట్టిన వ్యక్తి కారును వదిలి పారిపోయాడు. సోమవారం ఉదయం ఆ మార్గంలో వెళ్లిన వారు బైక్ను గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా లక్ష్మన్న మృతదేహం కనిపించింది. మృతుడి భార్య నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. పర్యావరణాన్ని విస్మరిస్తే భవిష్యత్ అంధకారంకోవెలకుంట్ల: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో వా తావరణ కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్ అంధకారమంతుందని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ డీన్ (కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్), భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రామగోపాల్ అన్నారు. స్థానిక వాసవీ బొ మ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రిన్సిపాల్ వేణుగోపాల్ అధ్యక్షతన జాతీయ సె మినార్ కార్యక్రమం నిర్వహించారు. భౌతికశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సస్టెయినబుల్ మెటీరియల్స్ అనే అంశాలపై జరిగిన సెమినార్ కార్యక్రమంపై ఆయన విద్యార్థులనుద్ధేశించి ఆయన ప్రసగించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉ ద్యమంలా చేపట్టాలని సూచించారు. వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని ప్రజానీకానికి, వ్యవసాయ రంగానికి హాని జరుగుతోందన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల భౌతిక శాస్త్ర అసోసియేట్ ప్రొఫె సర్ జమాలయ్య, బళ్లారి ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ నర్సింహులు, కళాశాల అధ్యాపకులు దాసు, రామసుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి,భాస్కర్రెడ్డి,క్రిష్ణశశాంక పాల్గొన్నారు. -
మంచి పాలనకే ‘తొలి’ ఓటు!
● నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాం ● ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగం ● పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది ● తొలిసారిగా ఓటు వేయబోతున్న యువత మనోగతం కర్నూలు(అగ్రికల్చర్): మంచి పాలన అందించే వారికే తాము ఓటు వేస్తామని తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులు చెబుతున్నారు. పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి వారినే తాము ఎన్నుకుంటామని పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో 20.14 లక్షలు, నంద్యాల జిల్లాలో 13.94 లక్షలు.. మొత్తం 34.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18, 19 ఏళ్ల యువత 1,71,215 మంది ఉన్నారు. అయితే ఇందులో 87,285 మంది ఓటర్లుగా నమోదయ్యారు. మే నెల 13న నిర్వహించే శాసనసభ, లోకసభ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 49,741, నంద్యాల జిల్లాలో 37,844 మంది మొద టి సారిగా ఓటు వేయనున్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని వీరు స్పష్టం చేస్తున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే వారిని, అభివృద్ధి చేసేవారని గెలిపిస్తామని చెబుతున్నారు. ఈ సారి పెరగనున్న ఓటింగ్ శాతం.. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ఎన్నికల కమిషన్ పిలుపు నిస్తోంది. ఇందులో భాగంగా స్వీప్ కార్యక్రమాలను అధికారులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. 2019 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఓటింగ్కు 50 శాతం వరకు యువత దూరంగా ఉంటోంది. ఈ సారి ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా యువఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. నియోజక వర్గం 18–19 ఏళ్ల యువ ఓటర్లు కర్నూలు 6,425 పాణ్యం 8,250 పత్తికొండ 5,678 కోడుమూరు 5,947 ఎమ్మిగనూరు 6,483 మంత్రాలయం 5,429 ఆలూరు 5,749 శ్రీశైలం 8,349 నంద్యాల 6,709 బనగానపల్లె 6,402 ఆదోని 5,510 ఆళ్లగడ్డ 5,247 డోన్ 5,488 నందికొట్కూరు 5,609 మొత్తం 87,275 -
వైఎస్సార్సీపీకే ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు
● ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ వెల్లడి కర్నూలు(టౌన్): ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. సోమ వారం స్థానిక అబ్దుల్లా ఖాన్ ఎస్ట్టేట్లోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాటు తన్ని తగలేసిన చంద్రబాబు వంచన చేరిన మందకృష్ణ మాదిగ ఆయనకు ఎంతకు అమ్ముడుపోయాడో ప్రజలకు తెలపాలన్నారు. రోడ్ల మీద తిట్టి ఇంట్లో కాళ్లు పట్టుకునే నైజం మందకృష్ణదన్నారు. చంద్రబాబు నెంబర్ వన్ మోసగాడు అని, ప్రాణహాని ఉందని చెప్పి ఇప్పుడు ఆయన చెంతకు చేరడం వెనుక రహస్య ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. మాదిగ కులాలను రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టే నీచ సంస్కృతి ఆయనదన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీలు, దళిత వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారన్నారు. మాదిగలు జగనన్న వైపు ఉన్నారని, వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి పనిచేస్తామన్నారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్ అకెపోగు రాజరత్నం, సుందర్రాజు, పేరపోగు రమేష్, ఎమ్మార్పీఎస్ యువజన విభాగం నాయుకులు డేవిడ్ పాల్గొన్నారు. -
జయ నాగేశ్వర రెడ్డిపై క్రిమినల్ కేసులు
కర్నూలు(సెంట్రల్): ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి జయనాగేశ్వరరెడ్డిపై ఐదు క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. నామినేషన్ వేసిన సమయంలో అఫిడవిట్లో ఈ అంశాలను ఆయన పొందుపరిచారు. వ్యాపార లావాదేవీల్లో తీసుకొన్న సొమ్ము తిరిగి ఇవ్వలేదని, బ్లాంక్ చెక్లతో బురిడీ కొట్టించాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రమణ్యం అనేవ్యక్తి( సీసీ197/2019) చిత్తూరు కోర్టులో బి.జయనాగేశ్వరరెడ్డిపై చెక్బౌన్స్ కేసువేశారు. ఆ కేసు విచారణలో ఉంది. ఇదే కేసులో తప్పుడు సమాచారం ఇచ్చారని బాధితుడు శ్రీకాళహస్తి వన్ టౌన్ పీఎస్లో జయనాగేశ్వరరెడ్డిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎంబీబీఎస్ చదివినట్లు తప్పడు అఫిడవిట్ సమర్పించాడంటూ టీడీపీకే చెందిన మాజీకౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ కేసు (ఆర్పీ నెం.9/2018 ఐపీసీ సెక్షన్ 506,499,500, 120ఏ) వేశారు. ప్రస్తుతం ఈ కేసు ఆదోని కోర్టు లో విచారణలో ఉంది. ఎమ్మిగనూరు టౌన్ పీఎస్లో ఆయనపై (క్రైం నంబర్ 358/2021) బైండోవర్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయా లని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. చిత్తూరు టూటౌన్ అర్బన్ పీఎస్లో చీటింగ్ కేసు నమోదైంది. 417, 420,120బీ,193,194,467,468, 156 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అలాగే ఆయన పేరిట రూ.13.59 లక్షల విలువ చేసే 200 గ్రాముల బంగా రం అభరణాలు, భార్య బైరెడ్డి నిత్యాదేవి పేరిట రూ. 40.77 లక్షల విలువ చేసే 600 గ్రాముల బంగారుఅభరణాలు ఉన్నాయి. వీరికి ఒక కారు ఉన్నట్లు ఆఫిడవిట్లో చూపారు. పొలాలు.. ఇళ్లే సాయిప్రసాద్రెడ్డి ఆస్తులు ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై.సాయిప్రసాద్రెడ్డికి వంశపార్యపరంగా వస్తున్న పొలాలు.. ఇళ్లే ఆస్తులుగా ఉన్నాయి. సోమవారం ఆయన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఆవిడవిట్లో తన ఆస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆయనకు అనంతపురం జిల్లా కొనకొండ్ల, మంత్రాలయం మండలం రాంపురం, కాశాపురంలలో 39 ఎకరాల వ్యవసాయ భూమి, ఆదోనిలో ఒక ఇల్లు ఉంది. అలాగే తన భార్య వై.శైలజ పేరిట కూడా కొనకొండ్ల, ఆదోనిలోని మండగిరి, 9.47 ఎకరాల భూమి, ఆదోని, నంద్యాల, కసాపురం, మండిగిరిలలో నాలుగు ప్లాట్లు, ఆదోనిలో ఒక్క ఇల్లు, కర్నూలులో టీజే షాపింగ్ మాల్లో 1551 చదరపు అడుగుల ప్లాట్ ఉంది. మొత్తంగా ఆయన పేరిట చరాస్తిరాస్తులు రూ. 4.22 కోట్లు ఉండగా, ఆమె పేరిట రూ. 5.99 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అంతేకాక ఆయన పేరిట రూ.15 లక్షల విలువ చేసే 25 తులాల బంగారు అభరణాలు, రూ.3 లక్షల విలువ చేసే వెండి ఉంది. ఆమె పేరిట రూ.57 లక్షల విలువ చేసే 96 తులాల బంగారు, 3.75 లక్షల విలువ చేసే 5 కేజీల వెండి ఉంది. వీరి కుటుంబానికి ఎలాంటి వాహనం లేదు. అంతేకాక సాయిప్రసాద్రెడ్డి పేరిట రూ.1.22 కోట్లు, భార్య పేరిట రూ. 44.39 లక్షల అప్పులు ఉన్నాయి. -
వైద్య విద్యార్థుల హాస్టల్లో ఇతరులు
● సూపరింటెండెంట్ తనిఖీలో బహిర్గతం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పీజీ హాస్టల్, హౌస్సర్జన్ హాస్టల్స్లో ఇతరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోమవారం ఆయా హాస్టల్స్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి. వెంకటరంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి వైద్య విద్యార్థుల గురించి ఆరా తీశారు. ఈ సమయంలో అక్కడ వైద్య విద్యార్థులు కాకుండా ఇతరులు ఉంటున్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికారికంగా వసతి గృహాల్లో ఉంటున్న వారి వివరాలు సేకరించి వెంటనే వారు ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ఆర్ఎంవోను ఆదేశించారు. హౌస్సర్జన్ క్వార్టర్స్ దగ్గర పార్కింగ్ స్థలంలో వాహనాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్వార్టర్స్కు ఎవరు వస్తున్నారన్న విషయాలపై నిఘా పెట్టాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలోని పారిశుధ్య సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సూపర్వైజర్లను ఆదేశించారు. ఆయన వెంట సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బి. వెంకటేశ్వరరావు, ఆర్ఎంవో డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాల నాగాంజన్, డాక్టర్ కిరణ్కుమార్ ఉన్నారు. -
టీజీ భరత్ జన్మదిన వేడుకకు కోట్లలో ఖర్చు..!
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది. టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది.. ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి.. టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బర్త్డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్డేను వేదికగా చేసుకున్నారు. బర్త్డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు -
నేడు తర్తూరు రంగనాథుడి రథోత్సవం
జూపాడుబంగ్లా: త ర్తూరు శ్రీ లక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓఏడీ వెంకటరమణ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంతో అలంకరించిన ప్రభోత్సవ రథంపై కొలువుంచారు. అనంతరం గ్రామోత్సవంలో ప్రజలు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
స్నేహితులతో కూడా ఓటు వేయిస్తా
ప్రస్తుతం నేను ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాను. ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడంతోనే అమోదించి ఓటరుగా నమోదు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో నా ఓటు నేను స్వేచ్ఛగా వినియోగించుకుంటాను. పాలకులు మంచివారైతే రాష్ట్రం బాగుపడుతుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటువేస్తాను. మొదటి సారిగా ఓటు వేయబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఓటు వేస్తా... నా స్నేహితులతో కూడా ఓటు వేయిస్తాను. – గుర్రం చేతన లాస్య, చాణుక్యపురి కాలనీ, కర్నూలు -
No Headline
జిల్లాలో కొన్నేళ్లుగా పరిశీలిస్తే పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. 2015లో పురుష ఓటర్లు 15,43,536 మంది .. మహిళా ఓటర్లు 15,44,328 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లు 792 మంది ఎక్కువగా ఉన్నారు. 2019 ఎన్నికల కోసం ప్రచురించిన ఓటరు జాబితాను పరిశీలిస్తే మహిళా ఓటర్లు 14,51,258 మంది ఉండగా... పురుష ఓటర్లు 14,39,183 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లు 12,075 మంది అధికంగా ఉన్నారు. 2024 ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాలో జిల్లాలో మొత్తం 20,14,797మంది ఓటర్లు ఉంటే అందులో మహిళలు 10,19,597 మంది, పురుషులు 9,94,885 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లు 24,712 మంది ఎక్కువగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వీరే కీలకం కానున్నారు. –కర్నూలు(సెంట్రల్) -
నిఘా మరింత పెంచాలి
● మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి ● అడిషనల్ ఎస్పీ నాగరాజు కర్నూలు: మద్యం, నగదు, కానుకల అక్రమ రవాణాను అరికట్టేందుకు సెబ్, ఎకై ్సజ్, ఎన్నికల టాస్క్ఫోర్స్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆదేశించారు. చెక్పోస్టుల్లో నిఘా మరింత పెంచాలన్నారు. సెబ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబుతో పాటు జిల్లాలోని 7 సెబ్ స్టేషన్లు, 7 ఎకై ్సజ్ చెక్పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మోడల్ కండక్ట్ టీమ్ అధికారులతో సమన్వయ సమావేశం సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగింది. మద్యం, సారా అక్రమ రవాణాలో ఆరు నెలల్లోపు వరుసగా మూడుసార్లు పట్టుబడి కేసులు నమోదైనవారి జాబితాను తయారు చేసి ఎస్పీ ద్వారా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపాలని ఏఎస్పీ సెబ్ అధికారులకు సూచించారు. జిల్లా బహిష్కరణకు 26 మంది జాబితాను సిద్ధం చేసినట్లు సెబ్ అధికారులు వెల్లడించారు. అలాగే పీడీ చట్టం నమోదుకు ఒకరి పేరు ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. ప్రభుత్వం మద్యం దుకాణాల నుంచి, బార్ల నుంచి ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేసినట్లయితే అలాంటి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వారిపై నిఘా పెంచాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలకు పాల్పడిన సేల్స్ మెన్లు, సూపర్వైజర్లను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. అలాగే సారా బెల్లం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీఐలు వాసుదేవ చౌదరి, చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ నరసనాయుడు పాల్గొన్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నాలుగోరోజు సోమవారం 34 మంది అభ్యర్థులు 38 నామినేషన్లను దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆదోని నుంచి వై.సాయిప్రసాద్రెడ్డి అట్టహాసంగా నామినేషన్లను దాఖలుచేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు బుట్టారేణుక, కంగాటి శ్రీదేవి, వై.బాలనాగిరెడ్డి తరఫున అదనపు సెట్ల నామినేషన్లను ప్రతిపాదులు అందించారు. ● కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఐదు మంది ఏడు నామినేషన్లను ఆర్వోలకు అందించారు. కాంగ్రెస్ నుంచి జి.రాంపులయ్య యాదవ్, టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుగా, బి.నాగరాజుగా మరో రెండుసెట్ల నామినేషన్లను వేశారు. వడ్డే ఉరుకుంద అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లను వేశారు. తరగోపుల రాజాబాబు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరపున షేక్ నజీర్ అహ్మద్ నామినేషన్ దాఖలు చేశారు. ● కర్నూలు నుంచి ఆరుగురు నామినేషన్లను వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సంధ్యపోగు రాఘవేంద్ర, ఎస్.నౌషద్, ఏపీ రామయ్య యాదవ్, హుసేనపీరా సాహెబ్,షేక్ ఇంతియాజ్ బాషా, బీకే నాగరాజు నామినేషన్లను దాఖలు చేశారు. ● పాణ్యంనుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నుంచి కాటసాని రాంభూపాల్రెడ్డి, సీపీఎం అభ్యర్థిగా డి.గౌస్దేశాయ్, జలదుర్గం సీతమ్మ నామినేషన్లను అందించారు. ● ఎమ్మిగనూరు నుంచి మొత్తం నలుగురు ఆరు సెట్ల నామినేషన్లను వేశారు. వైఎస్ఆర్సీపీ తరపున బుట్టారేణుక మూడు సెట్లు, టీడీపీ అభ్యర్థి బీ.జయనాగేశ్వరరెడ్డి, అతని భార్య బైరెడ్డి నిత్యాదేవీ ఒక్కో సెట్ నామినేషన్ వేశారు. బీఎస్పీ నుంచి కె.రాఘవేంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ● మంత్రాలయం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వై.బాలనాగిరెడ్డి ఒక నామినేషన్, టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి తరపున ఒక నామినేషన్ వేశారు. ● ఆదోని నియోజకవర్గం నుంచి వై.సాయిప్రసాద్రెడ్డి ఒక్కరే ఒక సెట్ నామినేషన్ వేశారు. ● ఆలూరు టీడీపీ అభ్యర్థి బి.వీరభద్రగౌడ్, ఆయన కుమారుడు బి.గిరిమల్లేష్ గౌడ్ ఒక్కో సెట్ నామినేషన్లను దాఖలు చేశారు. 4వ రోజు 34 మంది అభ్యర్థులు 38 నామినేషన్ల దాఖలు -
సప్లిమెంటరీకి నేటి నుంచి ఫీజు చెల్లింపు
ఫ్యాక్షన్ గడ్డపై విద్యా కుసుమం ఆలూరు రూరల్: ఒకప్పుడు అవి ఫ్యాక్షన్ గొడవలతో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు. ముఠాకక్షలతో ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. నిత్యం కరువుతో దయనీయ దుస్థితిలో ఉన్న ఆ గ్రామాల్లో నేడు చదువుల పంట పండుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, హంద్రీ– నీవా జలాలను పొలాలను తరలించడంతో ఫ్యాక్షన్ తగ్గిపోయి తల్లిదండ్రులను పిల్లలను బడికి పంపించి మంచి చదువులు చదివిస్తున్నారు. ఈ కోవలోనే తెర్నేకల్ గ్రామానికి చెందిన త్రివేణి ప్రభుత్వ పాఠశాలలో చదివి పది ఫలితాల్లో 593 మార్కులు సాఽధించి తన సత్తా చాటింది. గ్రామానికి చెందిన నాగేష్ ఆటో డ్రైవర్గా, ఆయన భార్య లక్ష్మి కూలి పనిచేస్తున్నారు. వీరు కష్టపడి తన కమార్తె త్రివేణిని చదివించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు బాగున్నాయని, ఉన్నత చదువులు చదివి సివిల్స్ రాయాలన్నదే తన లక్ష్యమని త్రివేణి తెలిపారు.● పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటిన సర్కారు స్కూళ్లు ● గతేడాదితో పోలిస్తే పెరిగిన ఉత్తీర్ణత ● గుడేకల్లు విద్యార్థికి 594 మార్కులు ● సత్ఫలితాలను ఇచ్చిన ఇంగ్లిష్ మీడియం విద్య ● మొదటి శ్రేణిలో 13,183 మంది ఉత్తీర్ణత ● వచ్చే నెల 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలుచేనేతపురిలో మెరిసిన అణిముత్యం ● గుడేకల్ విద్యార్థి కె.అజయ్కు 594 మార్కులు ఎమ్మిగనూరురూరల్: పోగుపోగు కలిపి అందమైన వస్త్రాన్ని నేసే ఆ కుటుంబంలో అక్షరాలు అద్భుతాన్ని సృష్టించాయి. చేనేత కుటుంబానికి చెందిన విద్యార్థి కె. అజయ్ పదో తరగతిలో అత్యధికంగా 594 మార్కులు సాధించి ప్రశంసలు అందుకున్నాడు. గుడేకల్లు గ్రామానికి చెందిన తండ్రి చంద్రశేఖర్, తల్లి పుష్పలత.. చేనేత మగ్గంపై పనిచేస్తున్నారు. వీరి కుమార్తె అమృత గుడేకల్ జెడ్పీ స్కూల్ చదివి 576 మార్కులు సాఽధించి.. ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో చదువుతోంది. అక్కను స్ఫూర్తిగా తీసుకుని తమ్ముడు అజయ్ కూడా పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులు కష్టపడి తనను చదివించారని, ట్రిపుల్ఐటీలో సీటు వస్తే చేరుతానని అజయ్ తెలిపారు. మంచి ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. కర్నూలు సిటీ: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తాచాటాయి. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఫలితాలను సాధించాయి. ఈ ఏడాది సర్కారు స్కూళ్లలో చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి నూతన ఒరవడి సృష్టించారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలలు 489 ఉండగా.. మొత్తం 30,802 మంది విద్యార్థులు గత నెల18 నుంచి 30వ తేదీ వరకు 162 కేంద్రాల్లో పరీక్షలు రాశారు. ఈ నెల 1 నుంచి 8వ తేది వరకు మూల్యాంకనం నిర్వహించారు. కేవలం 14 రోజుల్లోనే సోమవారం విజయవాడలో పాఠశాల విద్య కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 19,242 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పెరిగిన ఉత్తీర్ణత గతేడాది 60.58 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. ఈఏడాది అది 62.47 శాతానికి పెరిగింది. గతేడాదితో పోలిస్తే 1.89 శాతం పెరగడం విశేషం. గతేడాది బాలుర ఉత్తీర్ణత శాతం 55.89 ఉండగా.. ఈ ఏడాది 57.22 శాతానికి పెరిగింది. బాలికలు గతేడాది 65.88 శాతం ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 68.35 శాతం మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 13,183 మంది ఫస్ట్ క్లాసు, 3,877 మంది సెకెండ్ క్లాస్, 2,182 మంది థర్డ్ క్లాస్ సాధించారు. జిల్లాలోని 25 మండలాలు ఉండగా 9 మండలాల్లో 50 శాతంలోపు ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా కృష్ణగిరి మండలంలో 75.48, అతి తక్కువ హొళగుంద మండలంలో కేవలం 37.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలుగు మీడియం కంటే ఇంగ్లిషు మీడియం విద్యార్థులు అత్యధిక శాతం మంది పాస్ కావడం విశేషం. జిల్లాకు చెందిన సింగం సాయి స్వతేజ్, మంగలి హర్షవర్ధన్లకు అత్యధికంగా 597 మార్కులు సాధించారు. ఆ తరువాత కె. వాసవి ప్రియ 596, జి.హారిక 596, షేక్ రోషిణి 596, ప్రశాంత్ 596, భావన 596, ఎస్.రజియా సుల్తానా 596, కె.అజయ్ 594, త్రివేణి 593 మార్కులు తెచ్చుకున్నారు. సత్ఫలితాలను ఇచ్చిన ప్రభుత్వ చర్యలు గతంలో ప్రభుత్వ పాఠశాల అంటే చిన్నచూపు ఉండేది. చాలీచాలని తరగతి గదులు.. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు...తాగేందుకు నీరు ఉండదు.. కాలకృత్యాలకు అవస్థలు..సబ్జెక్టు టీచర్ల కొరత.. ఇలా ఎన్యోన సమ్యలు ఉండేది. అత్యధిక మంది విద్యార్థులు తెలుగు మీడియంలోనే పరీక్షలు రాసేవాళ్లు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారాయి. ఇంగ్లిషు మీడియం, డిజిటల్ విద్యను ప్రవేశ పెట్టడంతో ప్రవేశాలు సైతం పెరిగాయి. ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చడంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోగలిగారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 74.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంగ్లిషు సబ్జెక్టులో 95.23, తెలుగులో 90.45, హిందీ/సంస్కృతంలో 98.14 శాతం, గణితంలో 73.67, సైన్స్లో 74.68, సోషల్లో 79.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. 30 స్కూళ్లలో 100 శాతం ఫలితాలు జిల్లాలో 489 స్కూళ్లకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇందులో 30 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నాలుగు ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కరూ కూడా పాస్ కాలేదు. 100 శాతం ఉత్తీర్ణతలో 26 స్కూళ్లు ప్రైవేటు, ఒక మున్సిపల్ హైస్కూల్, ఒక జెడ్పీ హైస్కూల్, బీసీ వెల్ఫేర్ రెండు, రెసిడెన్షియల్ రెండు స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ ఇదీ.. జెడ్పీ పాఠశాల విద్యార్థులు 283 మంది 500 మార్కులకుపైగా తెచ్చుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 57, బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 104, మున్సిపల్ పాఠశాలల్లో 132, కేజీబీవీల్లో 21, మోడల్ స్కూళ్లలో 133, సోషల్ వెల్ఫేర్లో పాఠశాలల్లో 70, ట్రైబల్ వెల్ఫేర్లో 7, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 142 మంది 500 మార్కులకు పైగా తెచ్చుకున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో 1,894 మందికిగాను 951 మంది పాసైయ్యారు. జెడ్పీ హైస్కూల్(ఉర్దూ–కోడుమూరు) 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. ● జిల్లాలో ఏపీ మోడల్ స్కూళ్లు 16 ఉండగా.. 1,404 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 1,050 మంది పాసయ్యారు. ● జిల్లాలో 25 కస్తూర్బాగాంధీ విద్యాలయాలకు చెందిన 929 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 550 మంది ఉత్తీర్ణులయ్యారు. ● మున్సిపల్ హైస్కూళ్లలో 1,958 మందికిగాను 1,033 మంది ఉత్తీర్ణులయ్యారు. కర్నూలు నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ స్కూల్లో 48 మంది పరీక్షలు రాస్తే 48 మంది పాసైయ్యారు. ఈ స్కూల్కి చెందిన షేక్ హూమీరా ఇక్బాల్కు 593 మార్కులు సాధించింది. ఆదోని మున్సిపల్ హైస్కూల్కి చెందిన కె.ధనుంజయ అనే విద్యార్థికి 590 మార్కులు వచ్చాయి. ● ఎయిడెడ్ స్కూళ్లలో 176 మందికిగాను, 73 మంది పాసయ్యారు. ● ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 78 మందికిగాను 54 మంది, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 77 మందికిగాను 54 మంది, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 540 మందికిగాను 452 మంది, బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 254 మందికిగాను 242 మంది ఉత్తీర్ణులయ్యారు. ● ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 372 మందికిగాను 363 మంది పాసైయ్యారు. కాల్వబుగ్గ రెసిడెన్షియల్ స్కూల్, బీక్యాంపు రెసిడెన్షియల్ స్కూల్(బాలికలు) మహాత్మజ్యోతిరావు ఫూలే స్కూల్స్, గోరంట్ల, ఆరెకల్లు చెందిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. జ్యోతిరావు ఫూలే స్కూల్ (ఆరెకలు)కు చెందిన బోయ హరిక 591 మార్కులు, దేవనకొండ త్రివేణి 593 మార్కులు సాధించారు. తెర్నేకల్ విద్యార్థినికి 593 మార్కులు కూలీ ఇంట చదువుల తల్లి కూలీ ఇంటి ఆణిముత్యం మెరిసింది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఓ బాలిక 593 మార్కులు సాధించింది. కర్నూలు నగరంలో ఎం. ఇక్బాల్ బాషా, ఆసియా తహసీన్ కుమార్తె షేక్ హుమెరా ఇక్బాల్ నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ హైస్కూల్లో చదివింది. తండ్రి దినసరి కూలీగా పనిచేస్తూ కుమార్తెను చదివించాడు. తండ్రి కష్టాన్ని చూసి చలించిన షేక్ హుమెరా ఇక్బాల్ ప్రతిరోజూ స్కూల్కు వెళ్లి శ్రద్ధగా చదువుకునేది. సబ్జెక్టుల వారీగా వచ్చే అనుమానాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నివృత్తి చేయడంతో ఈ బాలిక అత్యధిక మార్కులు సాధించింది. డాక్టర్ అయి సేవలు అందించడమే తన లక్ష్యమని ఈ విద్యార్థిని పేర్కొన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు : 30,802 ఉత్తీర్ణత సాధించిన వారు : 19,242 బాలురు : 9,313 బాలికలు : 9,929పదో తరగతి పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చిన వారు, ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైనా రీకౌంటింగ్, రీవెరిఫికేఫన్కు నేటి(మంగళవారం)నుంచి దరఖాస్తు చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా సప్లిమెంటరీ పరీక్షలకు సైతం నేటి నుంచే ఫీజు చెల్లించే విధంగా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకరానున్నారు. రీకౌంటింగ్, వెరిఫికేషన్తో పాటు సప్లమెంటరీ పరీక్షలకు ఫీజుఈ నెల 30వ తేదీ వరకు చెల్లించవచ్చు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టు స్క్రిప్ట్తో కలిపి రూ.500, రీవెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలి. వీటికి దరఖాస్తూలు, ఫీజుల చెల్లింపులన్ని కూడా ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. -
నేడు విరూపాక్షి నామినేషన్
ఆలూరు: వైఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుసినె విరూపాక్షి మంగళవారం నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడులైంది. నామినేషన్ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఉమ్మడి కర్నూలు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, జేసీఎస్ కోఆర్డినేటర్, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు తెర్నేకల్లు సురేంద్రరెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీమోహన్రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఉపాధ్యాయ నగర్ కాలనీలోని కొలువుదీరిన సాయిబాబు మందిరం నుంచి అంబేద్కర్సర్కిల్ మీదుగా ఏటీఎం వరకు ర్యాలీ జరుగుతుందని వైఎస్సార్సీపీ లీగల్సెల్ న్యాయవాది లక్ష్మీకాంతం, ఆలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఏరూరు శేఖర్ తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని కోరారు. పీజీ ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ సప్లిమెంటరీ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ పీజీ కోర్సులు చదివి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ వెంకట సుందరానంద పుచ్చ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22 నుంచి మే 6వ తేదీ వరకు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల వద్ద దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. క్వింటా కందులు రూ.11,569 ● వాము గరిష్ట ధర రూ.28,669 కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల ధర రోజు, రోజుకు పెరుగుతోంది. సోమవారం మార్కెట్కు 61 మంది రైతులు 174 క్వింటాళ్ల కందులు తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ.3,829, గరిష్ట ధర రూ.11,569 లభించింది. మోడల్ ధర రూ.11109 నమోదైంది. అంటే అత్యధిక లాట్లకు రూ.11వేలపైనే ధర లభించడం విశేషం. 2023–24లో వర్షాభావం వల్ల కందుల దిగుబడులు తగ్గినప్పటికీ గిట్టుబాటు ధరలు లభిస్తుండటం రైతులకు ఊరటనిస్తోంది. వాము మార్కెట్కు 215 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.రూ.1,060, గరిష్ట ధర రూ.28,669, మోడల్ ధర రూ.17,082 లభించింది. తగ్గని భగభగలు ● మహానంది, గోస్పాడులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): భానుడి భగభగలు తగ్గడం లేదు. ఎండలు, వడగాలుల తీవ్రత పెరిగిపోతుండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు పాదచారుల దాహార్తి తీరుస్తున్నాయి. మహానంది, గోస్పాడులో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బనగానపల్లి, డోన్లలో 44.5, రుద్రవరంలో 44.3, నంద్యాల, కోడుమూరులో 44.1, ఆత్మకూరులో 44, మంత్రాలయంలో 43.6, కర్నూలులో 43.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ఎన్నికల విధులకు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కర్నూలు కల్చరల్: సాధారణ ఎన్నికల విధులకు సహాయ సహకారాలు అందించేందుకు ఎన్ఎస్ఎస్ వలంటీర్లను ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన ఆదేశాల మేరకు రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలోని డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ల వలంటీర్లను ఎంపిక చేసినట్లు వర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.పి.నాగరాజు తెలిపారు. వర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ బి. సుఽధీర్ ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు వర్సిటీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు 980 మంది జాబితాను ఎన్నికల అధికారికు పంపామని తెలిపారు. వీరు వయోవృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ బూత్ల వద్దకు తీసుకురావడం, ఓటర్లు క్యూలైన్లలో ఉండేలా చూడటం లాంటి విధుల్లో సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. -
మల్లెలు సమర్పించి.. మొక్కులు తీర్చి
● శేషవాహనంపై విహరించిన శ్రీలక్ష్మిరంగనాఽథుడు జూపాడుబంగ్లా: తర్తూరు లక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గొవ రోజు శుక్రవారం శ్రీలక్ష్మీరంగనాథస్వామి వారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని శేషవాహనంతో అలంకరించిన ప్రభోత్సవ రథంపై ఉంచి వైభవంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. శేషవాహనసేవ నాడు శ్రీలక్ష్మిరంగనాథస్వామి వారికి మల్లెలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటే ఏడాదంతా తమకు సర్పగండం ఉండదని భక్తుల నమ్మకం. ఈ మేరకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారికి మల్లెపూలలను సమర్పించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో భక్తులు సమర్పించే మల్లెలతో స్వామి, అమ్మవారి మూలవిగ్రహాలు నిండిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం హనుమద్వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఏడీ వెంకటరమణ, ఆలయ అర్చకుడు ఈశ్వరరెడ్డి తెలిపారు. -
ఆశీర్వదించండి.. అండగా ఉంటా
కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీవై రామయ్యకు ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని ఆదిమూలపు సతీష్ విజ్ఞప్తి చేశారు. నామినేషన్ దాఖలు అనంతరం ఆయన మాట్లాడారు. జగనన్న తనపై ఎంతో నమ్మకం ఉంచి ఎమ్మెల్యే సీటు ఇచ్చారన్నారు. అందరి సహకారంతో ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒక డాక్టర్గా నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. నియోజకవర్గంలో వరుసగా మూడోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్నారు. జెడ్పీటీసీలు రఘునాథ్ రెడ్డి, మౌలాలి, ప్రసన్నకుమార్, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాకు ట్రైనీ కలెక్టర్ కేటాయింపు
కర్నూలు(సెంట్రల్): జిల్లాకు ట్రైనీ కలెక్టర్ను కేటాయించారు. కొత్తగా కలెక్టర్గా ఎంపికై న చల్లా కల్యాణిని జిల్లాకు కేటాయించడంతో ఆమె శుక్రవారం కర్నూలు వచ్చారు. కలెక్టర్ డాక్టర్ జి.సృజన, జేసీ నారపురెడ్డి మౌర్యలను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేలను అందజేశారు. శిక్షణకు అన్ని రకాలుగా సహకరించాలని ఆమె వారిని కోరారు. నేడు ‘ఏకలవ్య’ పరీక్ష కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఏకలవ్వ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష బీ క్యాంప్లోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో శనివారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ లక్ష్మిగుర్రప్ప తెలిపారు. జిల్లాకు చెందిన విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందని ఇక్కడ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు కూడా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారన్నారు. మిగిలిన సీట్లలో ప్రవేశం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని ప్రవేశ పరీక్షకు హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జరుగుతుందని, ఎండలు అధికంగా ఉన్నందున పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 10 గంటలకంతా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం డోన్, బనగానపల్లె మండలాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గోస్పాడులో 45, ఆత్మకూరులో 44.2, ఆళ్లగడ్డలో44.2, బండిఆత్మకూరులో 44.2, సంజామలలో 44.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత కాస్త తగ్గింది. కర్నూలులో 42.5, మంత్రాలయంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దుర్తి, సి.బెళగల్, గూడూరు, కల్లూరు, కోడుమూరు, కోసిగి, కౌతాళం, కర్నూలు మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. ఉమ్మడి జిల్లాలో రెండు, మూడు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. హోమ్ ఓటింగ్ దరఖాస్తుకు 22 వరకు గడువు కోవెలకుంట్ల: 85 సంవత్సరాలు వయస్సు పైబడిన వృద్ధులు, అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆయా కేటగిరిలకు చెందిన ఓటర్లు ఫారం–12డీని సమర్పించాల్సి ఉంది. పూర్తి వివరాలతో నింపిన ఫారాన్ని ఈ నెల 22వ తేదీలోపు రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కామేశ్వరీదేవికి వెండి కాసుల హారం మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి మహానందికి చెందిన రిటైర్డ్ వీఆర్ఓ సత్యనారాయణ దంపతులు శుక్రవారం వెండి కాసుల హారం అందించారు. ఈ మేరకు వారు కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం డొనేషన్ కౌంటర్ వద్దకు చేరుకుని ఏఈఓ యరమల మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శశిధర్రెడ్డికి హారం అందించారు. 59 గ్రాముల బరువు ఉందని, వెండి కాసుల హారానికి బంగారు పూత వేయించినట్లు దాతలు చెప్పారు. -
క్షేత్ర రక్షణకు కుంభోత్సవం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే కుంభోత్సవం క్షేత్ర రక్షణ కోసమేనని, అమ్మవారికి ఉత్సవ సంబంధిత కై ంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు వైదిక కమిటీని ఆదేశించారు. ఈ నెల 26న శ్రీశైలంలో నిర్వహించే కుంభోత్సవం సందర్భంగా ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో ఈఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ దేవదాయ చట్టం అనుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధిచడం జరిగిందన్నారు. నిషేధం అమలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు శాఖల పూర్తి సహాయ సహకారాలను అందించాలని ఆ శాఖల స్థానిక అధికారులకు సూచించారు. జంతుబలి నిషేధానికి పోలీసు, రెవెన్యూ సిబ్బంది చేత తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా గస్తీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కుంభోత్సవం రోజు అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో శ్రీశైలం మండల తహసీల్దర్ గుర్రప్ప, సీఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు, మాణికేశ్వరిమాత అశ్రమ ప్రతనిధులు పాల్గొన్నారు. -
25న గురుకుల ప్రవేశ పరీక్ష
నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం ప్రవేశానికి ఈనెల 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి నరసింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతులకు ఏపీఆర్ఎస్ Cat–2024 ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, కళాశాలలకు ఏపీఆర్జేసీ, డీసీసెట్ – 2024 మధ్యాహ్నం 2.30గంటల నుండి 5గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు హాల్టికెట్లను https://aprs.apcfss.in వెబ్సైట్లో ఉంచామన్నారు. అభ్యర్థులు ఐడీతో పాటు పుట్టిన తేదీ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు. -
గౌరుపై కేసులు లేవంట!
కర్నూలు(సెంట్రల్): నామినేషన్ వేసే సందర్భంలో తనపై, తన భర్త గౌరు వెంకటరెడ్డిపై ఎక్కడా కేసులు లేవని టీడీపీ పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి గౌరు చరితారెడ్డి అఫిడవిట్ సమర్పించారు. తన పేరిట రూ.3.08 కోట్లు, తన భర్త పేరిట రూ.5.03 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని చూపించారు. తనకు రూ.24 లక్షల విలువ చేసే రెండు కార్లు, తన భర్తకు రూ.5 లక్షల విలువ చేసే మహేంద్ర ట్రాక్టర్ ఉందని ఆమె అందులో పేర్కొన్నారు. రూ. 74 లక్షల విలువ చేసే 1,100 గ్రాముల బంగారం ఉందని.. తన పేరిట రూ.14,85,000, భర్త పేరిట రూ.96,99,000, కుమారుడు పేరిట రూ.67,43,000 చరాస్తులు ఉన్నాయని చూపించారు. తనకు బ్యాంకుల్లో రూ.22,57,500, భర్తకు రూ.7,77,000 అప్పులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. సమానంగా అప్పులు.. ఆస్తులు కోడుమూరు(ఎస్సీ) వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలపు సతీష్కు ఆస్తులతోపాటు అప్పులు కూడా సమానంగా ఉన్నాయి. తన పేరిట రూ.8.83 కోట్లు, భార్య పేరిట రూ.2.19 కోట్లు, కూతూరు రీతు జాస్మిన్పేరిట రూ.19.50 లక్షలు, కుమారుడు రిత్విక్ శ్యామూల్ రూ.13.24 లక్షల చరాస్తులు ఉన్నట్లు చూపారు. కాగా, ఆయనకు వివిధ బ్యాంకులు, ఇతరా చోట్లా రూ.8.50 కోట్లు, భార్యకు రూ.7.06 లక్షల అప్పులు ఉన్నాయి. 220 గ్రాముల బంగారం పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి 220 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. కూతూరుకు 200 గ్రాముల బంగారం ఉంది. ఆమె మొత్తం చరాస్తులు విలువ 83.64 లక్షలు కాగా, ఆమె భర్త లేట్ నారాయణరెడ్డి పేరిట రూ.28 లక్షలు, కూతూరుస్నేహారెడ్డి పేరిట రూ.8.86 లక్షల ఆస్తులు ఉన్నాయి. స్థిరాస్తులే ఎక్కువ ఆలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి.విరుపాక్షికి చరాస్తుల కంటే స్థిరాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఈయనకు చిప్పగిరిలో 26.04 ఎకరాలు, ఆయన భార్యకు అక్కడే 10.98 ఎకరాల భూమి ఉంది. ఆయనకు రూ.6,66,00,000 స్థిరాస్తులు ఉన్నాయి, ఆయన భార్యకు కూడా 46 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకుల్లో రూ. 84,18,709 అప్పు ఉన్నట్లు ఆయన ఆఫిడవిట్లో చూపారు. అఫిడవిట్ సమర్పించిన టీడీపీ అభ్యర్థి గౌరు చరిత -
బుడ్డాపై క్రిమినల్ కేసులు
సాక్షి, నంద్యాల: శ్రీశైలం నియోజవకర్గ టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బెదిరింపులకు పాల్పడడం, దాడులు తదితర నేరాలు చేయడంతో ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. ఐపీసీ 504, 506 సెక్షన్ 155(3), ఐపీసీ 143, 341, 149, 324, 506, 34, సీఆర్పీసీ 151 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. 2019లో బుడ్డా దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఈ ఐదేళ్ల కాలంలోనే ఆయన మీద పలు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదవడం గమనార్హం. పెరిగిన బుడ్డా దంపతుల ఆస్తులు ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన బుడ్డా దంపతుల ఆస్తుల విలువ గత ఎన్నికల కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్లు వారు సమర్పించిన అఫిడవిట్లో ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బుడ్డా రాజశేఖర్రెడ్డి చరాస్తులు పరిశీలిస్తే రూ.47,35,533 ఉండగా, బుడ్డా శైలజకు అప్పట్లో రూ.22,71,420 ఆస్తులు ఉండేవి. ప్రస్తుతం ఇప్పుటు ప్రకటించిన ఆస్తులు వివరాలు పరిశీలిస్తే చరాస్తుల్లో బుడ్డాకు రూ.39,09,644, బుడ్డా శైలజకు వాహనాలు, బంగారం కలిసి రూ.96,32,854 చరాస్తుల విలువ పెరిగాయి. అలాగే స్థిరాస్తులు పరిశీలిస్తే బుడ్డా రాజశేఖర్రెడ్డికి భూములు, భవనాలు, సొంత ఇళ్లు కలిపి గత ఎన్నికల సమయంలో రూ.64,39,000, బుడ్డా శైలజకు రూ.22,50,000 స్థిరాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్లో బుడ్డా రాజశేఖర్రెడ్డికి రూ.58,99,200, బుడ్డా శైలజకు రూ.1,61,51,000 స్థిరాస్తి కలిగి ఉంది. ఇలా ఆస్తుల వివరాలు చూస్తే గతం కంటే బుడ్డా రాజశేఖర్రెడ్డికి రూ.49,76,848 పెరగగా బుడ్డా శైలజకు రూ.2,12,62,434 ఆస్తి పెరిగింది. అయితే ఈ దంపతులకు రూ.88,49,999 అప్పులు ఉన్నట్లు చెప్పారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement