-
వదినమ్మ బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
వదిన మరిది బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..
-
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
-
లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు: నందమూరి లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: మంగళగిరిలో నారా లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని అన్నారు వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు.. బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, లక్ష్మీపార్వతి ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకేష్ ఎంట్రీతోనే మంగళగిరిలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. దీనికి ఉదాహారణే వెంకటరెడ్డి హత్య. చంద్రబాబు, నారా లోకేష్ హింసా రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు. రాజధాని భూముల కేసుల్లో ఇప్పటకే మాజీ మంత్రి నారాయణ, పుల్లారావులు ఉన్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్రం తీసుకువచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రధాని మోదీ, బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. అవినీతి, దుర్మార్గానికి మారుపేరే చంద్రబాబు. అటువంటి వ్యక్తి రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్సీపీపై విష ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు మేలు చేసే వ్యక్తి. భూములు లాక్కునే వ్యక్తి కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
పద్మవ్యూహంలో వీర అర్జునుడు
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది మరో మహాభారతం. వీరత్వంతో యుద్ధం చేస్తున్న బాలుడు అభిమన్యుడి మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలు సంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ పాలన చేస్తున్న పిన్న వయస్కుడైన జగన్ మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నారు ఈనాడు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! అయితే జగన్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. కనుకనే ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుర్యోధన సైన్యంలా వారంతా రోజురోజుకు పెరిగిపోతుంటే ఇవతల జగన్ ప్రజాదరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది.మహాభారత రాజకీయం అన్ని కాలాలకు వర్తిస్తుందనటానికి ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలే నిదర్శనం. ధర్మరాజును ప్రాణాలతో బంధించటానికి ఆనాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అది చాలా ప్రమాదకరమైనది. శత్రువు లోపల ప్రవేశించడమంటే అతని మరణాన్ని కొనితెచ్చుకోవటమే. దానినే చక్రవ్యూహం అని కూడా అంటారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్రెడ్డి గారి చుట్టూ పద్మ వ్యూహం అల్లబడింది. అతిరథ మహారథులందరూ ఒక్కడిని జయించడానికి లేదా మట్టుపెట్టడానికి అంచెలంచెలుగా వ్యూహాత్మకంగా కుట్రలు సాగిస్తున్నారు. అక్కడ తలపండిన ద్రోణుడు ఆ వ్యూహానికి కర్త అయితే, ఇక్కడ 87 ఏళ్ళ వృద్ధ రామోజీ ఇదంతా నడిపిస్తున్నాడు. వీళ్ళ ఎత్తుగడలో భాగం మీడియా ద్వారా జగన్నూ, ఆయన పాలనను రోజూ దుమ్మెత్తిపోయడం. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. దానికి వైకాపా సోషల్ మీడియా ఎదురు దాడికి దిగటంతో ఆ ఆటలు సాగలేదు.ఇక ఎన్డీయేతో రామోజీతో పాటు వెంకయ్య కూడా కష్టపడి పొత్తును కుదిర్చారు. దానితో ఈ మూడో అంచె వ్యూహాన్ని జగన్ అస్సలు దాటలేడని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ ఈ అవకాశ పొత్తులు ప్రజలకే నచ్చక ఛీ కొట్టడంతో అదికూడా ఫెయిలయ్యింది.దాంతో ‘చతుర్విధోపాయసాధ్యేతు రిపౌసాంత్వమప క్రియాన్’... అనగా సామ భేద దాన దండోపాయాల్లో, బలమైన శత్రువును ఎదుర్కోవా లంటే నాలుగవది అయిన దండోపాయమే సరయినదని ఈ కూటమి భావించి ఏకంగా ప్రాణాలు తియ్యటానికి తెగించింది. అందుకే విజ యవాడలో సూటిగా బాణం వేయగలిగిన సైంధవుడి లాంటి సతీష్ను బోండా ఉమ డైరక్షన్లో ప్రవేశపెట్టారు. జగన్మోహన్రెడ్డి అన్నట్టు, ఆ దైవమే ఆ సమయంలో కూడా ఆయనను కాపాడింది. ఏ కొంచెం స్థానం మారినా, పెను విషాదం చోటు చేసుకునేది.వీరత్వంతో నిజాయితీగా యుద్ధం చేస్తున్న ఒక్క బాలుడి (అభిమన్యుడు) మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలుసంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా పెట్టుకుని దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ నిర్భయంగా పాలన చేస్తున్న ఈ పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తు న్నారు ఈనాడు. ఆయన చేస్తున్న సంక్షేమాన్ని ఆపుచేయటానికి మేధావుల ముసుగులో ఒక ఫోరమ్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వృద్ధులకు, అంగ వికలురకు నిరంతరం సేవలందిస్తున్న వలంటీరు వ్యవస్థను ఈ కుహనా మేధావులు ఆపించి ఏదో గొప్ప కార్యం సాధించినట్లు భుజాలెగరేస్తున్నారు.ఈసారి ఈ దుష్టకూటమి ఎన్నారై వింగ్ను చివరి చక్రంలోకి ప్రవేశపెట్టింది. దానికి ప్రధాన నాయకుడు కోమటి జయరాం. 2020లో వైకాపా నుండి 23 మంది ఎమ్యెల్యేలను కొనటం దగ్గర నుండి మొన్న ఎమ్మెల్యే శ్రీదేవికి డబ్బు ఇచ్చి ఎమ్మెల్సీ ఓటు కొను క్కునే వరకు కథంతా నడిపించింది ఈ ఎన్నారై మేధావే. కోట్లాది రూపాయలతో ఓటరు ‘వెధవలను’ (వాళ్ళ భాషలో) కొనటానికి మరో అస్త్రం సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ అది కూడా బయటపడిపోయింది. కాలం సమీపించినపుడు పాపాత్ములు ఏ పని చేసినా అది వాళ్ళకు ఎదురీతగానే మారుతుందన్న సామెత నిజ మైంది. భారతం కూడా అదే చెబుతుంది. ‘పిరికితనము, నేరప్రవృత్తి, పదవి, ధనాశ లాంటి ప్రవృత్తి గలవానికి సిరి తనంతట తానే తొలగి పోతుంది’ అనే మాట చంద్రబాబు పట్ల ఋజువు కాబోతున్నది.ఇక జగన్ మీద తండ్రీకొడుకుల వాగ్బాణాలయితే చెప్పే పని లేదు. ఒక్కడిని చుట్టు ముట్టి బహిరంగ దూషణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! ఆయన చేసిన పాపం ఏమిటి? ఆనాడు భారత యుద్ధంలో కూడా కపటోపాయంతో తండ్రిని దూరంగా పంపి అభిమ న్యుడిని బలి చేశారు. ఈరోజు కూడా ఈ ఎన్నికల సమరంలో తండ్రి లేని జగన్ను ఇంతమందీ కలసి ముట్టడిస్తున్నారు. అయితే ఆయన అర్జునుడు కనుక ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా ఈ దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూ హాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. జగన్ అంటే ధైర్యం, జగన్ అంటే ధర్మం, జగన్ అంటే విశ్వసనీయత. అందుకే వీరి బరితెగింపు నీచరాజకీయాలను తన పదునయిన అస్త్రాలతో ఛిన్నా భిన్నం చేసుకుంటూ అశేష ప్రజల ఆశీస్సులందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.ఇక కూటమి దురవస్థ కూడా కౌరవుల మధ్య పొసగని అభిప్రా యాల్లాగానే ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడుస్తారో అని అస్తమానం అదే భయంతో బతుకు తున్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు సిద్ధాంత బలం లేదు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా కలుస్తాయి. కమ్యూనిస్టులు బీజేపీ కూటమికి మద్దతిస్తారు. ఒక విచిత్రమైన రాజకీయ విన్యాసం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నది. కుల నాయకుడి కోసం ఐఏఎస్ పట్టాలను దాచిపెట్టి కుల రౌడీల్లా వీధుల్లోకొస్తారు కుహనా మేధా వులు. తండ్రికి మరో వెన్నుపోటుదారు పురందేశ్వరి. వైయస్సార్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ తిరుగుతున్న షర్మిల లాంటి వాళ్ళు కూడా ఈ విష కూటమితో కలిసి జగన్ను తిట్టి పోస్తారు. దుర్యోధన సైన్యంలా వీరంతా రోజురోజుకు పెరిగి పోతుంటే ఇవతల జగన్ ప్రజా దరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది. ఇంకా జగన్ను చంపడానికి ప్రయత్నించిన, హర్షవర్ధన చౌదరి, బోండా ఉమా లాంటి రౌడీలు కూడా ఈ వర్గంలో తక్కువేమీ కాదు. రాష్ట్రంలో ఈ అల్లరి మూకలు వైకాపా కార్యకర్తల మీద సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న గాక మొన్న మంగళగిరిలో రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ హింసావాదాన్ని రెచ్చగొడుతున్న లోకేష్ గూండాలు ఎదురుగా వెళ్ళి పార్టీ ప్రచారంలో ఉన్న వెంకటరెడ్డిని బైకులతో గుద్ది చంపేశారు. దానిని కూడా సమర్థించుకుంటూ వీరి ప్రచారం సాగిపోతూనే వుంది.ఈ ఆంధ్రా కురుక్షేత్రంలో మే 13న జరిగే ఎన్నికలు అన్నింటికీ సమాధానం చెబుతాయి. ప్రళయం వస్తే మొత్తం ఊడ్చేసినట్లు రేపు ఈ ఓటరు సునామీ ఈ కౌరవ సైన్యాన్నంతా ఓడించి దూరంగా విసిరేస్తుందనే మాట ఖాయం. దేశమంతా మెచ్చుకుంటున్న జగన్ పాలన మళ్ళీ రావటం ఖాయం. కొద్దిరోజులు ఓపిక పడదాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రతి ఓటు జగన్కు వేసి వీళ్ళ పద్మవ్యూహాన్ని ధ్వంసం చెయ్యాలి. వీర అర్జునుడికి విజయం అందించాలి.- వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు–సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్- డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
బాబు నీచ రాజకీయాలపై లక్ష్మీపార్వతి ఫైర్
-
ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది నువ్వే..
-
తండ్రిని చంపినవాళ్లకు ఇది ఒక లెక్కనా: లక్ష్మీపార్వతి
-
‘వై నాట్ 175?’ నినాదం స్ఫూర్తితో...
ఎట్టకేలకు ఎన్నికల నగార మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4 ‘సిద్ధం’ సభల ద్వారా తమ సత్తా ఏంటో చాటుకుంది. అభ్య ర్థులను అన్ని పార్టీల కన్నా ముందే ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 ఎంపీ స్థానాలకు సామాజిక న్యాయాన్ననుసరించి అభ్యర్థులను నిర్ణయించారు వైఎస్సార్సీపీ వారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటుకు కలిపి మొత్తం 59 టికెట్లు ఇచ్చారు. ఆశ్చర్యమేమిటంటే వీరిలో చాలామంది అతిపేదలు. ఇది రాజకీయానికి ఒక కొత్త నిర్వచనంగా చెప్పవచ్చు. మరోపక్క అప్పటికప్పుడు సూట్కేసులతో విమానాలు దిగిన పెద్దలకు మాత్రమే చంద్రబాబు సీట్లు కేటాయిస్తున్నారు. అందులోనూ స్వజాతి పక్షులే ఎక్కువ. సీనియర్లు దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. ఇదిలావుంటే ‘గండస్యోపరిపిటకవత్’ అనే సామెత (గోడదెబ్బ – చెంపదెబ్బ)గా ఇష్టంలేని పొత్తుల వల్ల టీడీపీ – జనసేన కార్యకర్తలు బాహాబాహీ యుద్ధానికి దిగుతున్నారు. ఇక అసలు నాయకుడు ఎన్డీయే పొత్తుకోసం నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసి, చూసి రాయబారాలు పంపీ, పంపీ ఎట్టకేలకు వదినగారి దయతో చేరి పోయారు. తన జన్మధన్య మైందనుకుంటూ రాష్ట్రానికి తిరిగి వచ్చి సీట్ల పంపిణీ ప్రారంభిస్తే... అది పూర్తిగా బెడిసికొట్టి సిగపట్ల వ్యవ హారం సీరియస్గా సాగుతున్నది. పోనీ సభల ద్వారా వాటిని కవర్ చేసుకుందామంటే వెయ్యి రూపాయలు, క్వార్టర్ బాటిల్, బిర్యానీ ఇచ్చినా తినేసి పోతున్నారు కానీ సభదాకా రావడంలేదు. ‘రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదనట్లు’ మోసాలు, అడ్డ దారులు తప్ప నిఖార్సయిన రాజకీయం తెలియని ఈ అబద్ధాల కోరును భరించలేమని జనాలు 2019లోనే అధికారం నుండి తోసేస్తే, అదేమీ గుర్తించకుండా తనకుతానే గొప్పనాయకుడిని అనుకుంటూ మతిలేని ఉపన్యాసాలు ఇస్తున్న ఇతనికి తోడు దత్తపుత్రుడొకరు. రాసిచ్చిన డైలాగులు ఆవేశంలో వూగిపోతూ చదవటం తప్ప సొంత ఆలోచన లేదు పవన్ కల్యాణ్కు. ఇక అసలు పుత్రుడిని చూద్దామంటే అతని పేరెత్తితేనే పార్టీ పారిపోతున్నది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదేదారిలో ఉన్నాడు. అతడికి సర్టిఫికెట్స్ తప్ప ఏ భాషా రాదు. కొత్తగా వచ్చిన మరో తోడు వదినగారు. ప్రస్తుతం తన ఒక్కసీటు గెలిస్తే చాలు వచ్చే ఎన్డీయే ప్రభుత్వంలో ఎలాగయినా మంత్రిపదవి దక్కించుకోవాలని సొంత పార్టీనే తాకట్టు పెడుతున్నారు. ఈ నలుగురు ఇలా నడుస్తుంటే... వీళ్ళకేడరు మాత్రం నియోజక వర్గాల్లో తన్నుకోవడంలో యమ బిజీగా ఉన్నారు. సిద్ధాంత బలం లేక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్కమాట మాట్లాడలేక పోతున్నారు. కానీ జగన్ను తిట్టడానికి మాత్రం ఒకేదారిలో నడుస్తున్నారు. వాళ్ళకున్న సిద్ధాంతమల్లా జగన్ ఓడిపోవాలి. ఎందుకంటే సమా ధానం లేదు. వీళ్ళ ఎజెండాలో కులగర్జనలు, మతాల పూత్కా రాలు, ముఖ్యమంత్రి మీద విష ప్రచారాలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. అదుపు తప్పిన కట్టుబాట్లతో, అబద్ధపు రాతలే తమ ధ్యేయ మన్నట్లు కులఅహంకారంతో పిచ్చిరాతలు రాస్తున్నాయి పచ్చ పత్రికలు. ఒక అవినీతిపరుడి కొమ్ముకాస్తూ అవి ఏనాడో విలువల్ని పోగొట్టు కున్నాయి. మరోవైపు మరో దత్తపుత్రిక వచ్చి చేరింది. కుటుంబ వ్యవస్థను నాశనం చేసే విద్యలో ఎన్నో డిగ్రీలు పొందిన చంద్రబాబు మరో కుటుంబ వినాశనానికి పూనుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చి ఇంటి పెద్దను నాశనం చేసిన ఇతడు, పచ్చగా, సమష్టిగా కష్టాలను సమైక్యంగా ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులను అధిగమించి అధికారాన్ని సాధించుకున్న వైఎస్సార్ కుటుంబం మీద తన వక్రదృష్టి సారించాడు. ఫలితంగా అదికూడా చీలిపోయింది. ఈ దురాశాపరులు అభివృద్ధిలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ భవిష్య త్తును నాశనం చెయ్యటానికి కంకణం కట్టుకున్నారు. సామాజిక సహ జీవనంతో సౌభ్రాతృత్వంగా వర్ధిల్లుతున్న ఆంధ్రుల ప్రశాంతతను చెరపటానికి ఈ కూటమి ప్రయత్నిస్తున్నది. కానీ ఆంధ్రులు అమా యకులు కాదు. స్వాతంత్య్ర పోరాటం నుండి ఇప్పటి వరకు ఎన్నో రాజకీయాలను, ఎందరో నాయకులను చూసిన అనుభవం వారిది. అందుకే ఈ దుష్టగ్రహ కూటమి సభలకు వెళ్ళకుండా తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. వారి ఏ సభ చూసినా, ఖాళీ కుర్చీలే. వీరి పతనం చివరిదశకు చేరిందనటానికి ఇవన్నీ సంకేతాలే. రాజనీతిజ్ఞుడు, అనుభవజ్ఞుడు అయిన మోదీ ఈ పొత్తుకు సుముఖంగా లేరనే విషయం వారి ప్రవర్తన, ప్రసంగధోరణి చెప్పకనే చెప్పాయి. జగన్ గురించి ఏమీ విమర్శించక పోవటం, వైరి గుండెల్లో గునపాలు గుచ్చినట్లే వుంది. పక్క రాష్ట్రాలయిన తెలంగాణ, కర్ణాటక, చెన్నై సభల్లో అక్కడి ముఖ్యమంత్రులను ఏకిపారేశారు మోదీ. ఆ ప్రసంగాలతో పోల్చి చూస్తే ఏపీ ముఖ్యమంత్రిని, ఆయన పాలనను ప్రధాని మెచ్చినట్లే కనిపించింది. ఇంకో విషయం కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అది జగన్ పట్ల వారికున్న అభిమానం. ప్రధానమంత్రి కంటే ఐదు నిమిషాల ముందు ప్రసంగించిన చంద్ర బాబు జగన్ను విమర్శిస్తూ ‘తల్లిని, చెల్లిని చూసుకోలేనివాడు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ కెలా మేలుచేస్తాడు...’ అంటూ తన లేకితనాన్ని ప్రదర్శించుకున్నాడు. కానీ మోదీ ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా ‘అన్నా, చెల్లి ఒకటే. ఇది కాంగ్రెస్–వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ’ అంటూ చంద్రబాబు గొప్పగా ప్రయోగించాలనుకున్న షర్మిల అస్త్రాన్ని ఉపసంహరించారు. ప్రైమ్ మినిస్టర్ ముందు జగన్ను పెద్ద విలన్గా చూపించాలనుకున్న వీళ్ళ ఎత్తుగడను ఆయన చిత్తుచేసి ప్రజల్ని ఒక అయోమయంలో ఉంచి వెళ్ళిపోయారు. ‘ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు’ ఈ సభ ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలనుకున్న చంద్రబాబుకు, పవన్ కల్యాణ్లకు అవమానాలే మిగిలాయి. లక్షల్లో వస్తారన్న జనం రాలేదు. వచ్చిన ప్రధానమంత్రి వీరి పేరయినా ఎత్తలేదు. మరో పక్క పొత్తుకు గండికొడుతున్నాడని బీజేపీ సీనియర్లు అధిష్టానానికి లేఖ రాశారు. ఆ పొత్తు చివరిదాకా వుంటుందో లేదో తెలియదు. జనసైన్యం అసలు సహకరించటం లేదు. ఇక ఓట్లు షేర్ చేసుకునే దెప్పుడు? ‘కత్తితో చంపేవాడు ఆ కత్తితోనే చస్తాడు’ అన్నట్లు అవగాహన, రాజకీయ సంస్కారం లేని ముఠాలను తయారుచేసుకున్న దత్తపుత్రుడి సైన్యం తమ నాయకుల మీదే తిరుగుబాటు చేస్తోంది. ఎటుచూసినా పంచకూళ్ళ కూటమికి గందరగోళంలా తయారయ్యింది పరిస్థితి. కలసినా ఒకళ్ళనొకళ్ళు ఓడించుకుంటారు. మరోవైపు జగన్ ఒక్కడే తన సైన్యంతో ముందుకు దూసుకు పోతున్నాడు. అతని ఆయుధం ప్రజాబలం. అతని నినాదం పేదల సంక్షేమం. అతని సైన్యం ఐకమత్యంతో నాయకుడిని అనుసరించే పార్టీ. ఇప్పుడు చెప్పండి – ముఖ్యమంత్రి జగన్ అన్నట్లుగా ‘వైనాట్– 175?’ సాధించి చూపెడదాం – ఆదర్శ రాజ్యాన్ని నిలబెడదాం. - వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ - డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
రెండేళ్లలో 13.37 లక్షల పుస్తకాల ముద్రణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక అకాడమీ ప్రచురణలను మార్కెట్లోకి తీసుకొచ్చి నట్టు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి, ఉన్నత విద్యకు అవసరమైన విజ్ఞాన సంపదను అందించేందుకు అకాడమీ విశేష కృషి చేస్తోందన్నారు. గురువారం వడ్డేశ్వరంలోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి అకాడమీ విభజన పూర్తయిన తర్వాత ఏపీలో సేవలు ప్రారంభించిన రెండేళ్లలో రూ. 21 కోట్ల విలువైన 13.37 లక్షల పుస్తకాలను ముద్రించామన్నారు. డీఎస్సీ, బీఈడీ, టెట్, ఏపీపీఎస్సీతో పాటు వివిధ రకాల పోటీ పరీక్షల సిలబస్తో 67 రకాల పుస్తకాలకు సంబంధించి 3 లక్షల కాపీలను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. వీటితో పాటు 10.37 లక్షల ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాలను ముద్రించడం ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ధరకు స్టడీ మెటీరియల్స్ అందించామన్నారు. ఆంగ్లం, ఇతర భాషల ద్వారా వాడుకలోకి వచ్చి న పదాలకు త్వరలోనే తెలుగు పదజాలాన్ని రూపొందిస్తామన్నారు. తెలుగు–సంస్కృతం–ఆంగ్లం కలగలిపిన త్రిభాషా పదకోశాన్ని (డిక్షనరీ) ముద్రిస్తామన్నారు. డిగ్రీ, పీజీ పాఠ్యప్రణాళికలకు తగ్గట్టుగా పుస్తకాలను ముద్రిస్తామన్నారు. ఇకపై అకాడమీ ప్రతి ముద్రణను తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రవేశపెడుతుందన్నారు. బాబు స్వార్థానికి అకాడమీ బలి చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు తెలుగు అకాడమీ తీవ్రంగా నష్టపోయిందని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హయాంలో తెలుగు అకాడమీ విభజనను పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. అనంతరం కోర్టుకు వెళ్లి ఉమ్మడి అకాడమీ విభజన పూర్తి చేసి ఏపీ వాటా కింద రూ. 140 కోట్లు సాధించామన్నారు. కానీ, చంద్రబాబు అకాడమీ ప్రచురణలకు పాతరేసి నారాయణకు పాఠ్యపుస్తకాల ముద్రణను కట్టబెట్టడం ద్వారా భారీ రేట్లకు విక్రయించి రూ. కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియా అకాడమీ సేవలపై విషం చిమ్ముతోందన్నారు. తిరుపతి నుంచే తెలుగు, సంస్కృత అకాడమీలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. విజయవాడ కేంద్రంలో ఎక్కువ ముద్రణాలయాలు ఉండటంతో ప్రింటింగ్ ఉద్యోగులు మాత్రమే స్థానిక కార్యాలయంలో సేవలందిస్తున్నారన్నారు. త్వరలోనే తిరుపతిలో ఎస్వీ వర్సిటీ స్థలంలో తెలుగు, సంస్కృత అకాడమీ శాశ్వత భవనం నిర్మాణాన్ని చేపడతామన్నారు. -
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులకి లక్ష్మి పార్వతి స్ట్రాంగ్ కౌంటర్
-
చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ మద్దతు పలకడు: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: అమిత్ షా ఇంటిముందు శివరాత్రి జాగారం చేసి చంద్రబాబు పొత్తులకు ఒప్పించాడంటూ వైఎస్సార్సీపీ మహిళా నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు అనైతికమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి అని, చంద్రబాబుకు మద్దతు పలకడని లక్ష్మీపార్వతి అన్నారు. వరుణ్ తేజ్ ప్రచారం చేస్తే టీడీపీ పొత్తుకు ఓట్లేమీ పడవు. వారు రీల్ హీరోలే గాని రియల్ హీరోలు కాదు. ఈ సిద్దం సభ ద్వారా మరోసారి సీఎం జగన్ సత్తా తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని లక్ష్మీపార్వతి అన్నారు. కేసుల నుంచి బాబు తప్పించుకోవడానికే.. వైఎస్సార్ జిల్లా: ఏ ప్రయోజనం కోసం టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం కోసమా, విశాఖ స్టీల్ కోసమా, ప్రత్యేక హోదా కోసమా, రాష్ట్ర అభివృద్ది కోసమా దేనికోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో వివరణ ఇవ్వాలన్నారు. గతంలో బీజేపీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, దూది ఏకి పారేసినట్లు విమర్శించే బాబు ఇప్పుడు కలయిక ఏంటి? నరేంద్ర మోదీని, అమిత్ షా పట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు ఎవరూ మర్చిపోరు. ఈ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి బీజేపీ, కాంగ్రెస్సే కారణం’’ అని శివప్రసాద్రెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ ఉనికి కోసం, లోకేష్ రాజకీయ భవిషత్తు కోసం ఈ పొత్తు. గతంలో ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇదంతా’’ శివప్రసాద్రెడ్డి దుయ్యబట్టారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాట: ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా రాష్ట్రంలో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ఈ సారి 75 శాతం ఓట్లతో తిరిగి అధికారంలోకి వస్తాం. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడింది. సింహం సింగిల్గా వస్తుంది అనేలా జగన్ సింగిల్గా వస్తారు. మళ్లీ సీఎం అవ్వడం ఖాయం. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు చేసిన మంచి ఏంటి? కరవును తోడుగా తెచ్చారు వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్దారు. కాలర్ ఎగరేసి చెప్పే దమ్ము ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. 175కి 175 స్థానాల్లో అలవోకగా గెలుస్తాం’’ అని రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. -
ఆమ్ ఆద్మీ ని చూసి నేర్చుకో పవన్
-
పవన్ ఓ సైకో: లక్ష్మీపార్వతి
సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్ను సైకో అంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. సీఎం జగన్ను విమర్శించే హక్కు పవన్కు లేదని, ప్రభుత్వ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అంటూ ఆమె ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నీచుడు.. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చాడు. ఇప్పుడు జగన్ కుటుంబాన్ని చీల్చుతున్నారు. సునీత చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మగా మారారు. నీ తండ్రిని హత్య చేసినవారిని వదిలి సీఎం జగన్ను విమర్శిస్తున్నారు. నీ తండ్రిని ఓడించిన టీడీపీ చేతుల్లో పడ్డావు సునీత’’ అంటూ లక్ష్మీపార్వతి హెచ్చరించారు. తాడేపల్లి గూడెం సభ చూసిన తర్వాత టీడీపీ ఎంత బలహీనంగా ఉందో కనిపించింది. పవన్ మీకు ఆలోచన లేదా?. 75 ఏళ్ల ముసలి చంద్రబాబుపై అరవై కేసులు వున్నాయి.ఎలా నమ్మావ్ పవన్. నీ బలహీనతతో కాపు సామాజిక వర్గాన్ని అవమాన పరిచావు. నీ బలహీనతను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నీ బలహీనత ఏంటో అర్థం కావడం లేదు. ఎప్పుడైనా కాపు సామాజిక వర్గానికి మేలు చేశావా?. మీ బాస్ రెండు ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు ఎలా ఎదిగారు?’’ అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ‘‘పవన్ కల్యాణ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. నీచుడైన చంద్రబాబు ఉచ్చులో పడ్డాడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రమాదం. గత టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని జరిగిందా?. అప్పుడు ఎన్టీఆర్పై దుష్ప్రచా రం చేసిన పచ్చ మీడియా ఇప్పుడు జగన్పై గట్టింది. ప్రతి కుటుంబంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు నడుపుతున్నారు. షర్మిల గురించి అందరికీ తెలుసు. తండ్రిని మోసం చేసిన పార్టీతో జత కలిసింది. మంచి కుటుంబంలో పుట్టిన షర్మిల, సునీత.. ఎందుకు చంద్రబాబు ఉచ్చులో పడ్డారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు నైజం బయట పడుతుంది’’ అని లక్ష్మీపార్వతీ పేర్కొన్నారు. ఇదీ చదవండి: సునీత ముసుగు నేటితో తొలగిపోయింది: సజ్జల -
మీరెంత మంది కలిసి వచ్చినా సీఎం జగన్ను ఓడించలేరు: లక్ష్మీ పార్వతి
-
వాడు పనికిమాలిన వెధవ... వీడు ఒక పిచ్చోడు: లక్ష్మి పార్వతి
-
ముందే ఓటమిని అంగీకరించిన బాబు: లక్ష్మీ పార్వతి
-
జగన్ పాలన-మహిళ స్పందన రాష్ట్రస్థాయి మహిళ సదస్సు
-
మహిళా సాధికారతకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్దపీట
-
అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: లక్ష్మీపార్వతి
విజయవాడ, సాక్షి: చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. అయితే మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్మారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన - మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి.. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త. ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు.. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఇబ్బందులు తొలగిపోలేదు. అలాంటిది.. ఇందిరాగాంధీ చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు ఓ మహర్షిలా జగన్.. .. మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని స్థాపించారాయన. అలాగే.. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది వైఎస్సార్.. ఇప్పుడు వైఎస్ జగన్. దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగన్ ఒక్కరే. అందుకే ప్రజలు మంచి మనసుతో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి.. జగన్మోహన్రెడ్డి ఒక వ్యవస్థ. వయసులో చిన్నవాడే అయినా ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి. పేదలు...మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా పాటు పడుతున్నారు. భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్. అందుకే జగన్ చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి. రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది చంద్రబాబు పనైపోయింది అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు. గత పాలనలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది. చంద్రబాబు పనైపోయింది. ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి. అందుకే తన కొడుకుని సీఎం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు బాధితుల్లో నేను, నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం. చంద్రబాబుకి ఆడవాళ్లంటే అసహ్యం. జగన్ను తిట్టడానికే చంద్రబాబు మీటింగ్లు పెడుతున్నాడు. సన్నాసి అయిన లోకేష్ కావాలా?.. మంచి వ్యక్తి అయిన జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలి. పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది అని ఏపీ ప్రజలను హెచ్చరించారామె. ఈ సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి బండ్లమూడి రోజారాణి,మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు సునీతా లఖంరాజు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
చంద్రబాబు,అమిత్ షా భేటీపై లక్ష్మి పార్వతి ఫైర్
-
టీడీపీని చంద్రబాబు హీన స్థితికి తెచ్చాడు: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నేడు, చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, కేసుల భయంతో చంద్రబాబు బీజేపీలో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని విమర్శించారు. కాగా, లక్ష్మీపార్వతి శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవాలని 25 సార్లు బ్రతిమిలాడుకుంటే ఒక మీడియేటర్ ద్వారా వారిని కలిశారనే ప్రచారం జరుగుతోంది. నాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. నేడు చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని హీనమైన పరిస్థితి తీసుకువచ్చాడు. ఎంతో మహోన్నతమైన విలువలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు ఆయనను బహిష్కరించారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేసి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు. కేసుల భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడు. బీజేపీకి చంద్రబాబు ఎంత డబ్బు అయినా ఇస్తానంటున్నాడు. అవసరమైతే టీడీపీని పూర్తిగా తీసేసుకుని కేసుల నుంచి బయటపడేమయని పెద్దల్ని వేడుకుంటున్నాడు. నారా లోకేష్ ఓ పనికిమాలిన వ్యక్తి. లోకేష్ను తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబును ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో ఆయన సభలను చూస్తే అర్థమవుతుంది. పచ్చ మీడియా కూడా లోకేష్ మాదిరిగానే మారింది. లోకేష్ చెప్పినట్టు 200 సీట్లు వస్తాయని బాకా ఊదుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రెండు ఎకరాలున్న చంద్రబాబు వేలాది కోట్లకు అధిపతి ఎలా అయ్యారు ?
-
నాకు సీటు రావడానికి సీఎం జగనే కారణం: లక్ష్మీ పార్వతి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
క్లాసెన్ మాస్ క్యాచ్.. బ్యాటర్ మైండ్బ్లాంక్! వీడియో
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement