-
సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
క్యాస్టింగ్ కౌచ్.. ఈ భయంతోనే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ అంటేనే భయపడతారు. కొందరు సెలబ్రిటీలు దీనికి లొంగిపోతే మరికొందరేమో వాటిని తిరస్కరిస్తూ ధైర్యంగా ముందడుగు వేశారు. తన కెరీర్లో కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటోంది నటి సుచిత్ర పిళ్లై. ఈ మలయాళ నటి ఫ్రెంచ్, హాలీవుడ్ సినిమాలు సైతం చేసింది. ఎక్కువగా బాలీవుడ్ మూవీస్లో మెరిసిన ఈమె సింగర్ కూడా! తాజాగా సుచిత్ర క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.ఏదో ఒక దశలో క్యాస్టింగ్ కౌచ్'కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి.. కానీ దానికి బదులుగా మరింకేదో అడుగుతుంటారు. అదే క్యాస్టింగ్ కౌచ్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు. నన్ను చూస్తే గంభీరంగా కనిపిస్తానని అంటుంటారు.. కాబట్టి మరీ అంత ఘోరమైన అనుభవాలైతే ఎదురవలేదు. ఎవరైనా ఏదైనా అడగాలన్నా నా ముఖం చూసి నోరు మూసుకుని ఉంటారని జనాలు జోకులేస్తుంటారు.సౌత్లో సినిమాలు చేస్తారా?అయితే దక్షిణాది చిత్రపరిశ్రమ నుంచి నాకు ఓసారి ఫోన్కాల్ వచ్చింది. ఇదెప్పుడో ఏళ్లక్రితం జరిగిన ముచ్చట. సౌత్లో సినిమాలు చేస్తారా? అని అడిగారు. సరేనన్నాను. అయితే ఒక మంచి సినిమా ఉంది. చాలా పెద్ద హీరో, ప్రముఖ డైరెక్టర్ కాంబినేషన్లో రాబోతోంది. మీరు అందులో హీరోకి సోదరిగా నటిస్తారా? అది చాలా ప్రాధాన్యత ఉన్న రోల్ అని చెప్పగా మంచిదే కదా అనుకున్నాను. కాంప్రమైజ్అప్పుడతడు మా నిర్మాతకు ఇదే మొదటిసారి.. మీరు కాంప్రమైజ్ అవుతారా? అని అడిగాడు. నా రెమ్యునరేషన్ తగ్గించుకోమంటున్నాడేమోనని లేదు, సారీ అని చెప్పేశా.. కానీ అతడు మళ్లీ కాంప్రమైజ్ కావాలి అని నొక్కి చెప్పాడు. నాకు విషయం అర్థమై.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాతో మీరిలాగేనా మాట్లాడేది అని కోప్పడ్డాను. ఒక్కసారి వస్తే చాలంటూ..అంటే డైరెక్టర్స్ చాలాకాలంగా ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. నిర్మాత కొత్తవాడు కాబట్టి తను ఓసారి రమ్మని అడుగుతున్నాడు అని పేర్కొన్నాడు. నేను మీ ప్రాజెక్ట్కు కరెక్ట్ వ్యక్తిని కాదు, రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేశాను. అలాంటి దారిలో వెళ్లడం నాకే మాత్రం నచ్చదు' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.చదవండి: డిప్రెషన్లో ఉపాసన.. రామ్చరణ్ (ఫోటోలు) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటి కనకలత కన్నుమూశారు. తిరువనంతపురంలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె చాలా కాలంగా పార్కిన్సన్స్, మతిమరుపుతో బాధపడుతున్నారు. దీంతో కోలుకోలేక మరణించారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న కనకలత.. 16 ఏళ్ల తర్వాత తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఎలాంటి సంతానం లేకపోవడంతో 34 ఏళ్లుగాతన సోదరి విజయమ్మతో కలిసి ఉంటోంది.కాగా.. కనకలత మలయాళం, తమిళ సినిమాలు, సీరియల్స్లో ఎక్కువగా నటించారు. దాదాపు రెండు భాషల్లో 360కి పైగా చిత్రాలు చేశారు. యాత్రామొళి, గురు, కిలుకిల్ పంబరం, పార్వతీ పరిణయం, తుంపోలి కడపురం, అతిర కన్మణి, ఎఫ్ఐఆర్, ఆకాశ గంగ, దోస్త్, నెమలి, మంత్రమోతీరం, కౌరవులు, కార్య, జాగురా, రాజు లాంటి సినిమాలు చేసింది. కనకలత చివరిసారిగా ‘పూక్కాళం’, ‘మూడు రోజులు సినిమాల్లో నటించింది. ఆమెకు చిత్ర పరిశ్రమ నుండి ఆఫర్లు వచ్చనప్పటికీ.. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె నటనకు విరామం తీసుకుంది. ఆమెకు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ), ఫిల్మ్ అకాడమీ ఆర్థిక సాయంతో చికిత్స తీసుకున్నారు. -
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో వచ్చామా, పనిచేశామా, వెళ్లిపోయామా అనేలా ఉంటారు. మరికొందరు మాత్రం ఊహించని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. భావన అలాంటి హీరోయిన్ అని చెప్పొచ్చు. 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ జీవితంలో కాంట్రవర్సీలు బోలెడు ఉన్నాయి. కిడ్నాప్, లైంగిక దాడికి గురవడం, అబార్షన్ అయిందని రూమర్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన పుకార్ల గురించి స్పందించింది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు కిడ్నాప్ అయింది. ఓ స్టార్ హీరోని ఈమెని ఎత్తుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కేసులో మలయాళ హీరో దిలీప్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ రచ్చ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన.. 2018లో నిర్మాత నవీన్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈమె నటించిన 'నడికర్' అనే మలయాళ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. అప్పట్లో తన అబార్షన్ గురించి వచ్చిన రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది.'అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలువాలో గర్భస్రావం అయిందని, కొచ్చి-చెన్నైలోనూ అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. ఇలా పలుమార్లు జరగడం వల్ల నేను చనిపోయానని కూడా మాట్లాడారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే చిరాకేస్తోంది. అప్పుడు నా గురించి వచ్చిన రూమర్స్ విని మెంటల్గా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్గా నిలబడ్డాను' అని భావన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి) -
గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
క్లాసికల్ డ్యాన్సర్, ప్రముఖ నటి కపిల వేణుకు చేదు అనుభవం ఎదురైంది. ఓ గుడిలో తన ఫ్రెండ్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటానికి వెళ్లగా.. ఊహించని అనుభవం తనకు ఎదురైందని చెప్పుకొచ్చింది. ఈ మేకరు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అసలేం జరిగిందో చెబుతూనే తనే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందని తనని తాను సముదాయించుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)'నా స్నేహితురాలి డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటం కోసం లోకల్గా ఉండే ఓ గుడికి ఒంటరిగా వెళ్లాను. అక్కడ ఆల్రెడీ ఉత్సవం జరుగుతోంది. దారి తెలియక అందరూ బయటకు వచ్చే దారి నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాను. అయితే అక్కడే ఉన్న ఓ వాలంటీర్.. నన్ను టచ్ చేసి ఆపాడు. చాలా రూడ్గా మాట్లాడాడు. ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా ఇలా చేయడం ఏంటని కాస్త గట్టిగానే అడిగాను. ఇద్దరు మధ్య కాస్త వాదన జరిగింది. ఈ టైంలో మరో ఆరుగురు వాలంటీర్లు మేమున్న చోటుకు వచ్చారు. వాళ్లందరూ కూడా నాదే తప్పన్నట్లు చెప్పారు. సీన్ చేయకుండా, వెంటనే వెళ్లిపోవాలని కామెంట్ చేశారు''దీంతో ఏడుస్తూ పోలీసుల దగ్గర వెళ్లాను. ఆ తర్వాత కమిటీ మెంబర్లలో ఒకాయన వచ్చి వాలంటీర్లతో మాట్లాడి, నా తండ్రి పేరు తెలుసుకుని నన్ను లోపలికి పంపించేశాడు. ఇంకేదో జరుగుతుందనుకుంటే నాన్న పేరు తెలుసుకుని లోపలికి పంపేయడం నాకు నిజంగా నచ్చలేదు. అయినా గుడికి ఒంటరిగా వెళ్లాలనుకోవడం నాది తప్పు. జనాలు ఎక్కువగా వచ్చారు. వాళ్లని కంట్రోల్ చేయడం వాలంటీర్లకు కష్టమే. అయినా సరే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది' అని వేణు కపిల ఇన్ స్టాలో రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య) View this post on Instagram A post shared by Kapila Venu (@kapilavenu) -
నటుడితో ప్రేమ? అవమానిస్తున్నారంటూ నటి భావోద్వేగం
సెలబ్రిటీల చుట్టూ పుకార్లు వైఫైలా ఉంటాయి. దాదాపు ప్రతి సెలబ్రిటీ ఎప్పుడో ఓసారి ఇలాంటి గాసిప్ల బారిన పడినవారే! మలయాళ నటి రేఖ రతీశ్ కూడా 42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిపై మనసు పారేసుకుందని, అతడిని మనువాడబోతుందంటూ పుకార్లు వెలువడ్డాయి. తన కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేశాడని రకరకాలుగా కథనాలు అల్లేశారు. ఇది చూసిన రేఖకు ఒళ్లు మండిపోయింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను ఈ మధ్యే కొత్త కారు కొన్నాను.కారు కొన్నా..మీడియా నావెంట వెంటపడతుందనే షోరూమ్కు వెళ్లలేదు. నా కుమారుడు, మేనల్లుడు కలిసి షోరూమ్కు వెళ్లి కారు తీసుకున్నారు. నా సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాను. అది చూసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టారీతిన కథనాలు అల్లేశాయి. నా కుటుంబంలోకి కొత్త వ్యక్తిని స్వాగతించానంటూ నాతో పని చేసిన ఓ నటుడి ఫోటోను జత చేసి ఏదేదో రాశారు. ఇంత నీచానికి దిగజారుతారా?ఓపక్క చెత్త కామెంట్లు..నాకంటూ ఓ కుమారుడున్నాడు. వీళ్ల వార్తలు చూసి చుట్టూ ఉన్నవాళ్లు అతడిని ఎంత హేళన చేస్తారో మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పటికే ఆన్లైన్లో చెత్త కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడిలా ఏది పడితే అది రాయడం వల్ల నా కుటుంబసభ్యులే నన్ను అనుమానిస్తూ అవమానించారు. ఎంతో బాధేసింది. నాతో లింక్ పెట్టిన ఆ నటుడు నన్ను చెల్లి అని పిలుస్తాడు. మీరు నా రిలేషన్షిప్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ నాకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. నా కుమారుడే నా ప్రపంచం' అని నటి కుండ బద్ధలు కొట్టింది. View this post on Instagram A post shared by RekhaRatheesh (@rekharatheesh3) చదవండి: చాహల్.. ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్! 'వీడియోలో అతడెవరు?' -
వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
మరో ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది. కుర్రాళ్ల మనసుల్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ నటుడితో ఏడడుగులు వేసింది. హల్దీ, సంగీత్ లాంటి వాటిని గ్రాండ్గా చేసుకున్నారు. పెళ్లి మాత్రం సంప్రదాయ పద్ధతిలో ఓ గుడిలో సింపుల్గా చేసేసుకున్నారు. తాజాగా బుధవారం ఈ పెళ్లి జరగ్గా ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? పెళ్లి కొడుకు ఎవరంటే?(ఇదీ చదవండి: అతని పెళ్లి కోసం కుటుంబంతో సహా వెళ్లిన విజయ్ దేవరకొండ)దళపతి 'బీస్ట్' సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా దాస్.. ఆ తర్వాత హీరోయిన్గా ఫేమ్ సంపాదించింది. 'దాదా' అనే తమిళ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది తెలుగులో వచ్చిన 'ఆదికేశవ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళంలోనే హీరోయిన్గా ఓ సినిమా చేస్తోంది.సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. కానీ అపర్ణ దాస్ మాత్రం కేవలం 28 ఏళ్ల వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టేసింది. 'మంజుమ్మల్ బాయ్స్'తో పాటు పలు మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీపక్ పరంబోల్ని అపర్ణ పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు హాజరైన పలువురు నటీనటులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కారు కొన్న 'బిగ్బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Siju Wilson (@siju_wilson) -
అక్కడ స్టార్ హీరోయిన్.. తెలుగులో ఒకే ఒక్క సినిమా!
ఎంత టాలెంట్ ఉన్నా సరే.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలో లక్ కలిసొస్తేనే అవకాశాలు, ఆర్భాటాలు.. లేదంటే ఇక్కడ పట్టించుకునే నాధుడే ఉండడు. అయితే గుర్తింపు తెచ్చుకోవడం ఒక సాహసమైతే.. ఆ క్రేజ్ను కాపాడుకోవడం కూడా అంతకుమించిన సాహసం. కొందరికి అన్నీ కలిసొచ్చి స్టార్స్గా వెలిగిపోతుంటారు. అది ఎంతకాలమన్నది వారి చేతుల్లోనే ఉంటుంది. పైన కనిపిస్తున్న నటి ఒకప్పుడు మలయాళంలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? అదే తొలి, చివరి సినిమా తన పేరు సంవృత సునీల్. కేరళలో పుట్టిపెరిగిన ఈమె 2004లో రాసికన్ సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఉయిర్ మూవీతో కోలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగులో రాజశేఖర్ సరసన 'ఎవడైతే నాకేంటి' సినిమా చేసింది. టాలీవుడ్లో అదే ఆమె తొలి, చివరి సినిమా. మలయాళంలోనే ఎక్కువ మూవీస్ చేసిన ఆమె 2012లో అమెరికాకు చెందిన ఇంజనీర్ అఖిల్ జయరాజ్ను పెళ్లాడింది. వీరికి అగస్త్య, రుద్ర అని ఇద్దరు కుమారులు సంతానం. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంవృత 2019లో ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి గుడ్బై చెప్పింది. 2008లో ఆమె నటించిన కాల్చిలంబు 2021లో రిలీజ్ అవడం విశేషం. వెండితెరపై కనిపించకుండా పోయిన ఈమె ఆమధ్య బుల్లితెరపై జడ్జిగా కనువిందు చేసింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటోంది. అక్కడే మలయాళీల కొత్త సంవత్సరం విషును సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Samvritha Akhil (@samvrithaakhil) చదవండి: మరో అమ్మాయితో నా భర్త ప్రేమ వ్యవహారం.. ఆ ఏడాది మానసికంగా ఎంతో ఒత్తిడి! -
మలయాళ నటి అదితి రవి ఫోటోలు వైరల్
-
అసలు ఆమెను ఎలా తీసుకున్నారు?.. బుల్లితెర నటిపై విమర్శలు
గతేడాది మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నేరు. మలయాళంలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ప్రియమణి లాయర్గా కనిపించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్తో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి హరిత జి నాయర్. మోహన్ లాల్ వద్ద జూనియర్ లాయర్ పాత్రలో మెప్పించింది. మొదట ఫాహద్ ఫాజిల్ నటించిన కార్బన్ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రియాల్టీ షోలు, సీరియల్స్తో బిజీగా మారిపోయింది. హరిత నాయర్ ప్రస్తుతం శ్యామంబరం సీరియల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె శ్యామాంబరం సీరియల్లో నల్లగా ఉండే అమ్మాయి పాత్రలో నటించింది. అయితే ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ పాత్రలో అసలు హరితను ఎలా తీసుకున్నారంటూ నెటిజన్స్ విమర్శించారు. అయితే ఇలాంటి కామెంట్స్పై హరిత సైతం తనదైన శైలిలో స్పందించింది. క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ తెల్లగా ఉన్నారా? లేదా నల్లగా ఉన్నారా? అనేది ముఖ్యం కాదని హితవు పలికింది. కేవలం క్యారెక్టర్ యాక్టింగ్ ఎబిలిటీ మాత్రమే చూడాలని.. రంగును కాదని సూచించింది. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే బదులిచ్చింది బుల్లితెర భామ. కాగా.. మొదటి నర్సుగా కెరీర్ ప్రారంభించిన హరిత.. తక్కువ కాలంలోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Zee Keralam (@zeekeralam) View this post on Instagram A post shared by Haritha.G Nair (@haritha.girigeeth) -
హిట్ సినిమాలో రోల్.. నటిపై నెటిజన్స్ ట్రోలింగ్!
గుడ్నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం లవర్. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్గా ఐషు పాత్రలో నటి హరిణి సుందరరాజన్ కనిపించింది. ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన లవర్ మంచి హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు నెటిజన్ల ట్రోలింగ్కు గురైంది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సోషల్ మీడియా వేదికగా నటి మండిపడింది. మీరు నాపై కోపం ప్రదర్శించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నా పాత్ర నచ్చకపోతే ఒక నటి పట్ల అలా నీచంగా, అగౌరవంగా ప్రవర్తించడం సరైంది కాదని ట్వీట్ చేసింది. ఇకనైనా ఇలాంటి విమర్శలకు ముగింపు పలకాలని కోరింది. కాగా.. హరిణి ఫింగర్టిప్ అనే తమిళ వెబ్ సిరీస్లో కూడా నటించింది. హీరోయిన్ స్నేహితురాలిగా.. లవర్ చిత్రంలో దివ్య (శ్రీ గౌరీ ప్రియ), అరుణ్ (మణికందన్) ప్రేమించుకుంటారు. అతనిపై అభద్రతా భావంతో అరుణను దివ్య తన మాటలతో దుర్భాషలాడుతూ ఉంటుంది. దీంతో అరుణ్కు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. అదే సమయంలో దివ్యకి స్నేహితురాలైన ఐషూ అతనితో బంధానికి ముగింపు చెప్పమని సలహా ఇస్తుంది. దీంతో నెటిజన్ల దృష్టిలో ఐషూ ఒక చెడ్డ స్నేహితురాలిగా కనిపించింది. ప్రేమ జంటకు సమస్యలు సృష్టించారంటూ ఆన్లైన్ ట్రోలింగ్కు గురైంది. చాలామంది నెటిజన్స్ ఆమె పాత్రపై కామెంట్స్ చేయడంతో హరిణి స్పందించింది. అది కేవలం సినిమాలో పాత్ర మాత్రమేనని మీకు తెలియదా? అంటూ ట్రోలర్స్కు ఇచ్చిపడేసింది. Secondly, don’t these thick heads realise that this behaviour only warrants the need for more Aishus? Disagreement does not have to be shown with disrespect. — Rini (@rinibot) April 10, 2024 This morning, I woke up to some idiots in my DMs swearing at me because they don’t like Aishu in Lover. Firstly, that they think it’s okay to be vile and disrespectful towards an actor because they didn’t like a character they played is beyond me. — Rini (@rinibot) April 10, 2024 -
ఆ హీరోతో ఓ సినిమా చేశా.. అయినా నంబర్ బ్లాక్ చేశాడు: హీరోయిన్
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జై గణేష్'. ఈ సినిమాకు రంజిత్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం థియేటర్లలో విడుదల కానుంది. వీరిద్దరు చివరిసారిగా 2017లో విడుదలైన'మాస్టర్పీస్' చిత్రంలో కనిపించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ మహిమ నంబియాన్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మాస్టర్పీస్ చిత్రం తర్వాత ఉన్ని ముకుందన్ తన ఫోన్ నంబర్ను బ్లాక్ చేశాడని తెలిపింది. జై గణేశ్ మూవీలో నటించేవరకు తనను అన్బ్లాక్ చేయలేదని కూడా ఆమె పేర్కొంది. మహిమ నంబియార్ మాట్లాడుతూ..'ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకోవడానికి స్క్రిప్ట్ రైటర్ ఉదయ్కృష్ణకి కాల్ చేశా. అతని వద్ద నుంచి ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకుని వాట్సాప్లో వాయిస్ మేసేజ్ పంపా. నేను మహిమను. నేనెవరో నీకు తెలుసు అనుకుంటున్నా. ఉదయన్ నీ నంబర్ ఇచ్చాడని చెబుతూనే ఉదయన్ అనే పదాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేశా. దీంతో ఉన్ని నా వాయిస్ మేసేజ్ విని బ్లాక్ చేశాడు. కానీ ఉన్ని ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు. ఆ తర్వాత ఉన్ని ఉదయన్కి ఫోన్ చేశాడు. ఆమె చాలా అహంకారి. ఆమె మిమ్మల్ని ఉదయన్ అని పిలుస్తోంది. సీనియర్ని ఇలాగేనా పిలిచేది అన్నాడట. దీంతో ఏడేళ్లుగా నా నంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు' అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా ఉన్ని ముకుందన్ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో కోపంతో తన నంబర్ను బ్లాక్ చేశానని వెల్లడించారు. ఆ తర్వాత బ్లాక్ చేసిన సంగతే మరిచిపోయినట్లు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మహిమ ఆర్డీఎక్స్లో నటించి హిట్ కొట్టినప్పుడు చూశాను. ఆ తర్వాత రంజిత్ శంకర్ సినిమాలో మహిమ హీరోయిన్గా నటిస్తుందని తెలిసింది. దీంతో వెంటనే ఆమె కాంటాక్ట్ని బ్లాక్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే అన్బ్లాక్ చేసి మెసేజ్ పంపాను.. నేను ఉన్నిని.. మీరు ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని' ఉన్ని ముకుందన్ అన్నారు. కాగా.. ఏడేళ్ల తర్వాత వీరిద్దరు జంటగా నటించిన జై గణేష్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పండగ వేళ మేలిముసుగులో కవ్విస్తున్న ఈ భామ ఎవరు?
-
గొంతు పోగొట్టుకున్న నటి.. మాట్లాడలేని స్థితిలో!
మలయాళ నటి, క్లాసికల్ డ్యాన్సర్ తారా కల్యాణ్ స్పాస్మోడిక్ డిస్ఫోనియా అనే గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీని వల్ల ఆమె మాట్లాడలేకపోతోంది. బలం కూడదీసుకుని ఒక్క పదం పలకాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటోందట! తాత్కాలికంగా ఆమె గొంతును కోల్పోయిందని తారా కల్యాణ్ కూతురు సౌభాగ్య వెంకటేశ్ వెల్లడించింది. తన యూట్యూబ్ ఛానల్లో తల్లి సమస్యను బయటపెట్టింది. 'రెండేళ్ల క్రితం అమ్మకు థైరాయిడ్ సంబంధిత సర్జరీ జరిగింది. దాని వల్లే ఇప్పుడు గొంతు పోయిందనుకున్నాం. పైగా చాలా ఏళ్లుగా తన వాయిస్ను ఉపయోగించే డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తూ ఉంటుంది. ఎక్కువగా గొంతును ఉపయోగించడం వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చనుకున్నాం. కానీ స్పాస్మోడిక్ డిస్ఫోనియా అనే వ్యాధి వచ్చిందని, దానివల్లే గొంతు మూగబోయిందని తెలిసింది. బొటాక్స్ చేయిస్తే అమ్మ కోలుకుంటుందన్నారు. ఆ సర్జరీ చేసే సమయంలోనే అమ్మమ్మ(తారా తల్లి) చనిపోయింది. వైద్యులు తనను పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ అమ్మమ్మ చనిపోయిన బాధ ఒకవైపు అమ్మను కుంగదీస్తోంది. ప్రస్తుతం మంచినీళ్లు తాగడానికి కూడా అమ్మ ఇబ్బందిపడుతోంది. తగిన విశ్రాంతి తీసుకుంటే వీలైనంత త్వరగానే అమ్మ ఎప్పటిలా మాట్లాడగలదు' అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Thara Kalyan (@tharakalyan) చదవండి: హీరోయిన్ నయా బిజినెస్! వాడిపడేసిన చీరలు అమ్మకానికి.. -
స్కూల్లో హేళనలు.. అన్నింటినీ అధిగమించి నటిగా!
కనీ కుశ్రుతి.. మలయాళ నటి. కానీ వెబ్ సిరీస్ల వల్ల దేశవ్యాప్తంగా వెండితెర, వెబ్తెర అభిమానులకు పరిచయమైంది. నటనలోనే కాదు అసలు ఆమె పెరిగిన విధానంలోనే ప్రత్యేకత ఉంది. కనీ కుశ్రుతి సొంతూరు తిరువనంతపురం. తల్లిదండ్రులు.. జయశ్రీ ఏకే, మైత్రేయ మైత్రేయన్. ఇద్దరూ హేతువాదులు, సామాజిక కార్యకర్తలు. కులాన్ని సూచించే ఇంటిపేరును తొలగించుకున్నారు. ఇంటి పేరు లేదు తమ కూతురుకీ ఇంటిపేరునివ్వలేదు. ఈ పెంపకం బయట సమాజానికి చిత్రంగా ఉండటంతో స్కూల్లో.. తోటి వాళ్ల మధ్య ఎన్నో హేళనలకు గురైంది కనీ. అయినా తమ తీరును మార్చుకోలేదు ఆమె తల్లిదండ్రులు. ఏటికి ఎదురీదే ధైర్యాన్ని నూరిపోశారు కూతురికి. అమ్మానాన్న పెట్టిన తొలిపేరే అసలు పేరని.. కులాన్ని సూచించే తోక పేరు అవసరంలేదని చెప్పి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మీద కనీకి చిన్నప్పుడే అవగాహన కల్పించారు. కానీ టెన్త్ క్లాస్లో చివరి పేరు కచ్చితంగా కావాల్సి వచ్చింది కనీకి. అప్పుడు తెలుసుకుంది ఆమె తమ చివరిపేరు కుశ్రుతి(ఆకతాయి, అల్లరచిల్లర అని తెలుగు అర్థం) అని! సర్కారు బడిలో కాన్వెంట్ స్కూల్కి పంపే ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ కనీ తల్లిదండ్రులు ఆమెను సర్కారు బడిలోనే చదివించారు. స్కూల్లో ఉన్నప్పుడు వర్క్షాప్ కోసం ఒక మోడర్న్ స్కూల్కి వెళ్లిందట కనీ. ఆ స్కూల్.. అందులోని క్లాస్ రూమ్స్ చూసి ఆశ్చర్యపోయిందట. ఆ స్కూల్తో తమ బడిని పోల్చుకుని ‘నన్నెందుకు అలాంటి స్కూల్లో చేర్పించలేదు’ అని అమ్మానాన్నలను అడిగిందట. ‘సామాన్యులు సర్కారు బడికే వెళ్తారు. నువ్వూ సామాన్యురాలివే. ఇక్కడి నుంచే ప్రపంచాన్ని చదవాలి’ అని చెప్పారట. అన్నట్టుగానే ఆ బడి తనకు ప్రపంచాన్ని చూడ్డం నేర్పింది అంటుంది కనీ. పారిస్లో థియేటర్ ఆర్ట్స్ చదివింది. వేధింపుల వల్ల సినిమాలకు దూరం! 2000 సంవత్సరంలో అభినయ థియేటర్ రీసెర్చ్ సెంటర్లో చేరి.. 2006 వరకు ఆ గ్రూప్తోనే ఉంది. ఆమె ప్రతిభకు ముచ్చటపడిన మలయాళ ఫిలిం ఇండస్ట్రీ .. ‘మనుష్యపుత్రి’ మూవీతో ఆమెకు వెల్కమ్ చెప్పింది. ఆ తర్వాత ‘కేరళ కేఫ్’ లోనూ నటించింది. గుర్తింపు వచ్చింది మాత్రం ‘బిర్యానీ’ చిత్రంతోనే. అయితే సినీపరిశ్రమలో తనకెదురైన లైంగిక వేధింపులను భరించలేక ఒకానొక దశలో సినిమాలకు గుడ్బై చెప్పాలనుకుని కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. మంచి పాత్రలు రావడంతో మళ్లీ సినిమాలు చేస్తోంది. చదవండి: రెండు ఓటీటీల్లో హనుమాన్.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో! -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా.. తెలుగులో ఆ ఒక్క సినిమా మాత్రమే!
నివేద్యం సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భామ. ఈ భామ తన అందంతో మలయాళంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. మలయాళంతో పాటు కన్నడ,తమిళం చిత్రాల్లో నటించింది. సినిమాల్లో సక్సెస్ సాధించిన భామ.. తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే చేసింది. టాలీవుడ్ హీరో తనీశ్ నటించిన మంచివాడు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు లక్ష్మి నారాయణ దర్శకత్వం వహించారు. తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయినప్పటికీ తమిళం, కన్నడ, మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అయితే పెళ్లయ్యాక నటనకు కాస్త దూరంగా ఉన్న భామ.. గతంలో భర్తతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇలాంటి వాటిపై ఆమె కనీసం స్పందించలేదు. 2018లో చివరిసారిగా ఖిలాఫత్ అనే మలయాళ చిత్రంలో నటించిన భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bhamaa (@bhamaa) -
రెండో పెళ్లి చేసుకున్న సైతాన్ నటి.. వరుడు ఎవరంటే?
ప్రముఖ మలయాళ నటి లేనా తెలుగులో వచ్చిన సైతాన్ వెబ్ సిరీస్లో నటించింది. మహి వీ రాఘవ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ సిరీస్లో లేనా మేరీ జోసెఫ్ పాత్రలో మెప్పించింది. ఆమె ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న ఆడుజీవితం చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ భామ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ 42 ఏళ్ల నటి జనవరి 17న ప్రముఖ ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను పెళ్లాడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా పంచుకుంది. నెలన్నర తర్వాత రివీల్.. పెళ్లి చేసుకున్న దాదాపు 40 రోజుల తర్వాత తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది లేనా. అయితే ఇది ఆమెకు రెండో వివాహం కాగా.. మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఇటీవల కేరళలో పర్యటించిన మోదీ గగన్యాన్ ప్రాజెక్ట్లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. వారిలో పైలట్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు. గగన్యాన్లో పాలుపంచుకునే నలుగురి పేర్లను మోదీ ప్రకటించిన వెంటనే లేనా తన పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రశాంత్ నాయర్తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లేనా తన ఇన్స్టాలో రాస్తూ..' ఈరోజు, ఫిబ్రవరి 27, 2024న, మన ప్రధాని మోదీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు మొదటి భారతీయ ఆస్ట్రోనాట్ వింగ్స్ బహుకరించారు. మన దేశం, కేరళ, ముఖ్యంగా నాకు ఇది చాలా గర్వించదగ్గ చారిత్రక సందర్భం. అధికారికంగా నేను ప్రశాంత్ను జనవరి 17, 2024న సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నానని మీకు తెలియజేయడానికి ఈ ప్రకటన కోసం వేచి ఉన్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ఫ్లైట్ మిషన్ గగన్యాన్ కోసం శిక్షణ పొందిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. వారిలో కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారు. ఈ నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. View this post on Instagram A post shared by Lenaa ലെന (@lenaasmagazine) -
కాసేపట్లో డెలివరీ.. డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లిన నటి
ప్రెగ్నెన్సీ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే కాలు తీసి అడుగు ముందుకువేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. మరికొందరేమో వ్యాయామాలు, రన్నింగ్లు చేస్తూ సర్ప్రజ్ చేస్తుంటారు. తాజాగా మలయాళ బుల్లితెర నటి లక్ష్మి ప్రమోద్ కూడా ఇలాంటి పనే చేసింది. స్వతహాగా డ్యాన్సర్ కావడంతో లేబర్ రూమ్కు వెళ్లేముందు చిందులేసింది. నిండు గర్భిణి అన్న విషయాన్ని మర్చిపోయి హాయిగా డ్యాన్స్ చేసింది. దీన్ని ఆమె భర్త అజర్ మహ్మద్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను నటి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. లేబర్ రూమ్కు వెళ్లేముందు ఒక రీల్ చేస్తే బాగుంటుందనిపించింది. అయినా డ్యాన్స్ చేసుకుంటూ లేబర్ రూమ్కు వెళ్తావా? అని అడిగారుగా.. వారికోసమే ఈ వీడియో అని రాసుకొచ్చింది. ఇది చూసిన కొందరు డెలివరీ తర్వాత కూడా ఇలాగే డ్యాన్స్ చేయ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తర్వాత నటికి పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Lekshmi Pramod (@laxmi_azar) చదవండి: ఆ సినిమా 14 సార్లు చూశా.. డైలాగ్ చెప్తూ తడబడ్డ నందమూరి హీరో! -
ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఎందరో ఇంట్ల పెళ్లి బాజాలు మోగనున్నాయి. సెలబ్రిటీలు కూడా బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పెడుతూ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు, రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ రెడ్డి వాలంటైన్స్ డే రోజే పెళ్లి చేసుకోగా రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 21న ప్రియుడితో మెడలో మూడు ముళ్లు వేయించుకోనుంది. నిశ్చితార్థం అయిన ఏడాదిన్నరకు పెళ్లి తాజాగా మరో బ్యూటీ ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. నారాయణ అండ్ కో సినిమా హీరోయిన్ ఆరతి త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 26న వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలిపింది. కాగా ఈ జంట గతేడాది ఫిబ్రవరి 16న నిశ్చితార్థం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజు తమ పెళ్లి తేదీని వెల్లడించడం విశేషం. అప్పటినుంచే లవ్.. మోడల్, నటి ఆరతి.. మలయాళ బిగ్బాస్ కంటెస్టెంట్ డాక్టర్ రాబిన్ రాధాకృష్ణన్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన రాధాకృష్ణన్ను ఇంటర్వ్యూ చేసింది ఆరతి. అప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఆరతి హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. View this post on Instagram A post shared by Dr Robin Radhakrishnan (@dr.robin_radhakrishnan) చదవండి: విశ్వక్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకు నాగచైతన్య హీరోగా.. -
భర్త చేతిలో మోసపోయిన బిగ్బాస్ కంటెస్టెంట్.. చివరికీ!
మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఆర్య ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అంతే కాకుండా మలయాళ బిగ్బాస్ సీజన్-2లో కంటెస్టెంట్గా పాల్గొంది. వీటితో పాటు బడాయి బంగ్లా, స్టార్ మ్యూజిక్ లాంటి రియాలిటీ షోలలో కనిపించింది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్యంగా తన భర్త రాహుల్ సుశీలన్తో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి తన విడాకులపై స్పందించింది. బిగ్బాస్ కంటెస్టెంట్ ఆర్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నా. వదిలించుకోవడానికే అతను నన్ను బిగ్ బాస్కి పంపాడా అనే అనుమానం ఉంది. ముఖ్యంగా షోలో వెళ్లడానికి నాకు మద్దతు ఇచ్చిన వ్యక్తి. నాకు ఓ కుమార్తె ఉంది. మా నాన్న చనిపోయి చాలా కాలం కూడా కాలేదు. బిగ్బాస్ వెళ్లమని ఆయనే నాకు సపోర్టు చేసి మరీ ఎయిర్పోర్టులో దింపారు. నాకు అక్కడ బిగ్బాస్లో ఉన్నన్ని రోజులు ఎవరితోనూ పరిచయం లేదు. నేను హౌస్ నుంచి వచ్చేలోగా నాకు దూరం కావాలనేది అతని ప్లాన్ అని తెలీదు. కానీ ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నా' అని తెలిపింది. కొవిడ్ వల్ల నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చి నా భర్తకు చాలాసార్లు కాల్ చేశా. కానీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన ఏకైక నంబర్ అతనిదే. అతను ఫోన్ తీయకపోవడంతో.. నేను అతని సోదరికి ఫోన్ చేశా. ఆమె జరిగిన విషయమంతా నాకు చెప్పింది. అతని మరో మహిళ వివాహేతర సంబంధంలో ఉన్నాడని నాకు అప్పుడే తెలిసింది. దీంతో అతన్ని కాల్చి చంపాలన్నా కోపం వచ్చింది. కానీ ఇప్పుడైతే అలాంటి కోపం లేదు. కానీ అతనికి ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే మాత్రం సంతోషిస్తా.' అంటూ తన కోపాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో అతను దుబాయ్లో ఉన్నందున.. కొవిడ్ వల్ల అతన్ని కలిసేందుకు వీలు కాలేదని ఆర్య తెలిపింది. కాగా.. ఆర్య చివరిగా మలయాళ కామెడీ చిత్రం క్వీన్ ఎలిజబెత్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం పద్మకుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్వేతా మీనన్, నరేన్, జానీ ఆంటోనీ, మీరా జాస్మిన్, నీనా కురుప్ ప్రముఖ పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) -
నేను హీరోయిన్గా పనికిరానని అవమానించారు.. ఇప్పుడు..
ప్రతిభ కలిగిన నటీమణుల్లో నటి ఇనయ ఒకరు. వాంగ చుడవా చిత్రంలో హీరోయిన్గా నటించి తానేమిటో నిరూపించుకుందీ బ్యూటీ. మాతృభాష మలయాళం అయినా తమిళంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇనయ ఎలాంటి పాత్రనైనా చాలెంజ్గా తీసుకుని నటించగలదు. ఒక పక్క హీరోయిన్గా బిజీగా ఉంటూనే, మరో పక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. ఈమె అనోరా ఆర్ట్ స్టూడియో పేరుతో మహిళా దుస్తుల వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తోంది. ఈమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదయ్యింది. బర్త్డే సెలబ్రేషన్స్ ఈ సందర్భంగా తన షాపు తొలి వార్షికోత్సవాన్ని, తన పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు, తన సంస్థ సిబ్బంది పాల్గొని ఇనయాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో ఇనయ మాట్లాడుతూ.. తాను హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ తుక్కుదురై. ఇందులో యోగిబాబు హీరోగా నటించారు. ఇది వినోదభరిత కథా చిత్రంగా ఉంటుంది. నేను పనికిరానన్నాడు ఈ తరహా కామెడీ కథా చిత్రంలో నటించడం నాకు ఇదే తొలిసారి! తొలి రోజుల్లో ఒక దర్శకుడు నేను సినిమాకు పనికి రానని అవమానించారు. అలాంటిది ఇప్పుడు తమిళం, మలయాళం భాషల్లో హీరోయిన్గా అలాగే వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాను. నాకు దర్శకత్వం వహించాలని ఆసక్తి ఉంది. అందుకు కథలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే డైరెక్టర్గా మారడానికి ఇంకా సమయం ఉంది' అని ఇనయ పేర్కొంది. చదవండి: నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా -
అలా చేస్తే ఈ సమాజం నన్ను బతకనిస్తుందా?: నటి
మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మలైకొట్టై వాలిబన్. గురువారం (జనవరి 25న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది బిగ్బాస్ బ్యూటీ సుచిత్ర నాయర్. మలయాళ ఇండస్ట్రీలో ఇదే తనకు తొలి సినిమా కావడం విశేషం. తాజాగా ఈ నటి తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. బోలెడు కథలు విన్నాను.. 'బిగ్బాస్ షోలో నన్ను చూసిన డైరెక్టర్ లిజో సర్.. తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. అదే 'మలైకొట్టై వాలిబన్'. నా తొలి సినిమా ఇంత పెద్ద బడ్జెట్లో ఉండటం, గొప్ప నటీనటులతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య ఈ మూవీలో నుంచి విడుదలైన పాటలో మోహన్లాల్తో పాటు నేనూ ఉన్నాను. అది చూసి చాలామంది నాకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. బోలెడన్ని కథలు విన్నాను కానీ ఇంతవరకు ఏదీ ఓకే చేయలేదు. వాలిబన్ రిలీజయ్యాక మంచి కథలు సెలక్ట్ చేసుకుంటాను. మలయాళంలో మంచి సినిమాలు చేయాలనుంది. గాఢంగా ప్రేమించాను.. బ్రేకప్.. ఇక పెళ్లంటారా? వివాహంపైన నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. కానీ పెళ్లి చేసుకోకపోతే నా కుటుంబం, ఈ సమాజం ఊరుకుంటుందా? పదేపదే గుర్తుచేస్తూనే ఉంటుంది. పెళ్లి అవసరం లేదనుకున్నాను కానీ జీవితాంతం ఈ ఒత్తిడి భరించడం నా వల్ల కాదు. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడు దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. అయినా ఇప్పటికీ నేను నా బ్రేకప్ బాధలో నుంచి పూర్తిగా బయటపడలేదు. మొదట్లో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ అతడు నాకు చాలా కండీషన్స్ పెట్టేవాడు. నచ్చిన దుస్తులు వేసుకోనిచ్చేవాడు కాదు, బయట తిరగనిచ్చేవాడే కాదు. నేను ఏం మాట్లాడినా అడ్డుపడేవాడు. తనకోసం ఎంతో చేశా.. నాకు నచ్చినట్లుగా బతకనివ్వలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా తన అనుమతి తప్పనిసరి. నన్ను నన్నుగా ఉండనివ్వలేదు. మా మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయాం. పంజరంలో నుంచి బయటకు వచ్చినట్లుగా అనిపించింది. తన కోసం ఎన్నో అవకాశాలను వదిలేసుకున్నాను. చేయాల్సిన పనులు వాయిదా వేసుకున్నాను. ఇలాంటి వ్యక్తిని ప్రేమించానా? అని నన్ను నేనే అసహ్యించుకున్నాను' అని చెప్పుకొచ్చింది సుచిత్ర. కాగా సుచిత్ర నాయర్.. వానంబడి సీరియల్తో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో విలన్గా మెప్పించిన ఆమె మలయాళ బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. View this post on Instagram A post shared by 𝙎𝙪𝙘𝙝𝙞𝙩𝙝𝙧𝙖 𝙉𝙖𝙞𝙧 (@suchithra_chanthu) చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న 'నెరు' సినిమా ఎలా ఉందంటే? -
గోపిచంద్ సినిమాతో ఎంట్రీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో అలా వచ్చి.. ఇలా గుడ్ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. కేరళలోని త్రిసూర్లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్లు రావడంతో టాలీవుడ్కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నిర్మాతతో ప్రేమ పెళ్లి అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
నేనే పాపం చేశాను.. నాపై ఎందుకింత పగ?: నటి
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం పరితపించే నటీనటులు ఎందరో! కొందరు ఒక్క అవకాశంతోనే తమ సత్తా ఏంటో నిరూపించుకుంటారు. మరికొందరు ఆ అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతారు. నెమ్మదిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. నటి షాలిన్ జోయా ఈ కోవలోకే వస్తుంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ సీరియల్స్తో నటిగా కెరీర్ ఆరంభించింది. తర్వాత సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ క్లిక్ అవడంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. తొక్కేయాలని చూస్తున్నారు షాలిన్ సీరియల్స్కు గుడ్బై చెప్పేసి సినీనటిగా మారింది. ఆ మధ్యలో బుల్లితెర షోలకు హోస్ట్గానూ వ్యవహరించింది. మలయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈమె రాజమంత్రి మూవీతో తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. ఈ మధ్యే విడుదలైన కన్నగి అనే తమిళ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. అయితే తన ఎదుగుదలను తొక్కేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది షాలిన్. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు మలయాళ ఇండస్ట్రీలో నాకు హీరోయిన్గా ఒక్క ఛాన్స్ రాలేదు. తమిళ్లో వచ్చింది, చేశాను. నేను మాలీవుడ్కు దూరంగా ఉంటున్నానని చాలామంది అనుకుంటున్నారు. అది నిజం కాదు, నన్నిక్కడ పెద్దగా పట్టించుకోలేదు. మంచి అవకాశాలు ఇవ్వడం లేదు. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. అవకాశాలొస్తేనే కదా నటిస్తాను. ఎందుకని నాపై కక్ష ఈ మధ్య ఓ వీడియో చూశాను. నేను కోలీవుడ్లో సినిమాలు చేస్తున్నానని నాకు ఇక్కడ సపోర్ట్ చేయొద్దంటున్నాడో పెద్దాయన. ఇదెంతవరకు కరెక్టో నాకు అర్థం కావడం లేదు. నేను ఎవరికీ ఏ పాపం తలపెట్టలేదు. ఎందుకని నా మీద ఇలా పగబడుతున్నారు. తమిళంలో లీడ్ రోల్ ఛాన్స్ రాగానే చాలా సంతోషించాను. అది నా చేతి నుంచి జారిపోకూడదని ఆ దేవుడిని ఎంతగానో ప్రార్థించాను. మలయాళంలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. వస్తే కచ్చితంగా చేస్తాను. నాకు డైరెక్షన్పై కూడా ఆసక్తి ఉంది. ఇప్పటివరకు ఎనిమిది షార్ట్ ఫిలింస్ రాసి, వాటికి దర్శకత్వం వహించాను' అని చెప్పుకొచ్చింది షాలిన్ జోయా. -
రియల్ లైఫ్లో ఒక్కటి కానున్న రీల్ జంట!
మలయాళీ ముద్దుగుమ్మ స్వసిక విజయ్ పెళ్లి చేసుకోబోతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. నటుడు ప్రేమ్ జకోబ్తో ఏడడుగులు వేయనుందని భోగట్టా! తాజాగా ఈ పుకార్లపై నటి స్పందిస్తూ.. నిజంగానే వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే పెళ్లి జరగనుందని స్పష్టం చేసింది. జకోబ్తో కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఆ సీరియల్ నుంచే.. కాగా వీరిద్దరూ 'మనంపోలే మాంగళ్యం' అనే సీరియల్లో జంటగా నటించారు. అప్పటినుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఆన్స్క్రీన్ జంటగా ప్రేక్షకుల మనసులు దోచుకున్న వీరు మరికొద్దిరోజుల్లోనే ఆఫ్స్క్రీన్ జంటగానూ మెప్పించనున్నారు. స్వసిక విజయ్ మొదట్లో హీరోయిన్గా నటించింది. తర్వాత సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు పోషించింది. తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈమె సీరియల్స్ కూడా చేసింది. తెలుగులో ఆ సినిమాలో హీరోయిన్గా స్వసిక నటి మాత్రమే కాదు యాంకర్ కూడా! పదేళ్లుగా ఎన్నో షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ వస్తోంది. అలా యాంకర్గా కూడా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. వీటికి తోడు షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. 2012లో వచ్చిన 'ఎటు చూసినా నువ్వే' చిత్రంలో హీరోయిన్గా నటించింది. చదవండి: బీడీల మీద బీడీలు తాగిన మహేశ్.. అసలు విషయం బయటపెట్టిన సూపర్ స్టార్ -
54 ఏళ్లు.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన హీరోయిన్
లక్ష్మీ గోపాలస్వామి.. నటిగా కన్నా కూడా భరతనాట్య కళాకారిణి అని పిలిపించుకోవడమే ఆమకు ఇష్టం. నాట్యం ద్వారానే కళ్లతో పలు భావాలను అవలీలగా పలికించగల నైపుణ్యాన్ని ఒడిసిపట్టుకుంది. తన అభినయంతో మలయాళ, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి పేరు సంపాదించుకుంది. సెకండ్ హీరోయిన్గా ఎక్కువ సినిమాలు చేసిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. తెలుగులో అరవింద సమేత వీరరాఘవ, సైరా సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియల్స్లో నటిస్తూ బుల్లితెరపైనా సందడి చేస్తోంది. సరైనవాడు దొరకలేదు ఆదివారం(జనవరి 7న) ఈ నటి బర్త్డే. 54 ఏళ్ల వయసున్న ఈ నటి ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. డ్యాన్స్, నటనల మధ్య పెళ్లి విషయాన్ని మర్చిపోయిందా? అని అప్పట్లో చాలామంది గుర్తు చేశారు. దీనికి సదరు నటి స్పందిస్తూ.. 'నా అందం చూసి, సమాజంలో నా గౌరవం చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేవారు నాకవసరం లేదు. ఇవేవీ లేకపోయినా నన్ను నన్నుగా ఇష్టపడేవాడినే పెళ్లి చేసుకుంటాను. అది కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికైతే సరైనవాడు దొరకలేదు' అని చెప్పింది. ఎప్పటికీ సింగిల్గానే.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా మళ్లీ పెళ్లి ఊసే ఎత్తలేదు లక్ష్మి. ఇప్పుడేకంగా పెళ్లీడు దాటిపోవడంతో వివాహం గురించే ఆలోచించడం లేదని చెప్తోంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే వయసు కాదని, దాని గురించి అడగొద్దని విన్నపిస్తోంది. ఇది విన్న జనాలు ఇక లక్ష్మి ఎప్పటికీ సింగిల్గానే ఉంటుందా! అని మాట్లాడుకుంటున్నారు. చదవండి: వర్మ ఆడిషన్కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement