-
ఓటు తెచ్చిన చేటు..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : పేద రైతులకు ముఖ్యంగా కౌలుదారులకు మొన్న జరిగిన సాధారణ ఎన్నికలు ఎక్కడాలేని కష్టం తెచ్చిపెట్టాయి. తమ యజమానులు చెప్పిన వారికి ఓటు వేయకపోవడం.. తమ మనస్సాక్షి ప్రకారం వారు నడుచుకోవడమే వారు చేసిన నేరం. తమ మాటకు విలువ ఇవ్వలేదని, తాము చెప్పినట్లు ఓట్లు వేయలేదన్న అక్కసుతో తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు బరితెగించి ఇక నుంచి మా భూముల్లోకి అడుగుపెట్టొద్దని చెప్పేస్తున్నారు.మీకు మా భూములను కౌలుకు ఇవ్వడంలేదని తేల్చిచెప్పేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతులు వ్యవసాయ సీజన్ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. తాత, తండ్రుల నుంచి ఇప్పటివరకు ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ క్రమం తప్పక కౌలు చెల్లిస్తున్న తమను రావద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదనకు లోనవుతున్నారు. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని వాపోతున్నారు.భూమి వారిదైనప్పుడు మా ఓటు మాది కాదా అని యువ కౌలుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా మాలాంటి పేదలపై పెత్తందారుల దాష్టీకాలు ఇంకెంత కాలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణాలు మంగళగిరి నియోజకవర్గంలోనే చోటుచేసుకుంటున్నాయా? లేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించిందా అని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కౌలురైతులు ‘సాక్షి’ వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు.కౌలురైతు: బుల్లా శ్రీనివాసరావు సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - గుంటుపల్లి సరస్వతిగ్రామం - పెదపాలెంసాగుచేస్తున్న భూమి- రెండెకరాలుఎప్పటి నుంచి - 15 ఏళ్లుగాకౌలు మొత్తం (ఎకరానికి) - రూ.35 వేలుకౌలురైతు: గొడవర్తి ప్రతాప్సింగ్సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - వాసిరెడ్డి వాసుగ్రామం - పెదపాలెంసాగు చేస్తున్న భూమి - మూడెకరాలుఎప్పటి నుంచి - ఏళ్లుగా చేస్తున్నారుకౌలు మొత్తం - 22 బస్తాలుకౌలురైతు: షేక్ సద్దాం హుస్సేన్ సామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - గద్దె శ్రీనివాసరావుగ్రామం - చిలువూరుసాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - ఐదేళ్లుగా..కౌలు మొత్తం - 16 బస్తాలుకౌలురైతు: షేక్ ఖాదర్ భాషాసామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - యడ్ల హర్షవర్థన్రావుగ్రామం - తుమ్మపూడిసాగుచేస్తున్న భూమి - 10 ఎకరాలు ఎప్పటి నుంచి - 35 ఏళ్లుగాకౌలు మొత్తం - 70 వేలు (నిమ్మతోట)కౌలురైతు: చిలకా తిమోతిసామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - పాటిబండ్ల హరిప్రసాద్ గ్రామం - పెదపాలెంసాగు చేస్తున్న భూమి - ఒకటిన్నర ఎకరంఎప్పటి నుంచి - 30 ఏళ్లుగాకౌలు మొత్తం - 22 బస్తాలుకౌలురైతు: షేక్ ఖాంసాసామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - లంక గోపాలరావుగ్రామం - కంఠంరాజు కొండూరుసాగుచేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 14 ఏళ్లుగాకౌలు మొత్తం - 18 బస్తాలుకౌలురైతు: గంపల శ్రీనివాసరావుసామాజికవర్గం - బీసీ (యాదవ)భూ యజమాని - పుతుంబాక సాయికృష్ణగ్రామం - పేరకలపూడి సాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 22 ఏళ్లుగాకౌలు మొత్తం - 35,000కౌలురైతు: యలమాటి ప్రసాద్కుమార్సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - గుంటుపల్లి సరస్వతిగ్రామం - పెదపాలెంసాగుచేస్తున్న భూమి - మూడెకరాలుఎప్పటి నుంచి - 35 ఏళ్లుగా (తండ్రి నుంచి)కౌలు మొత్తం - 5 బస్తాలు మొదలు 23 బస్తాల వరకు / 30 వేలుకౌలురైతు: దేశబోయిన బాబుయాదవ్సామాజికవర్గం - బీసీ (యాదవ)భూ యజమాని - గుండిమెడ బసవయ్యగ్రామం - కంఠంరాజు కొండూరుసాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 35 ఏళ్లుగాకౌలు మొత్తం - 18 బస్తాలుమంగళగిరి నుంచి లోకేశ్ పోటీతో..టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలై, మూడు శాఖల మంత్రిగా పనిచేసిన ఆయన మరోసారి అదే స్థానం నుంచి బీసీ వర్గానికి చెందిన మురుగుడు లావణ్యతో ఈసారి పోటీపడ్డారు. చాలాకాలంగా మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని తన సామాజికవర్గంపై ఆయన ప్రధానంగా దృష్టిసారించారు.ఈ నేపథ్యంలో.. పెదపాలెంకు చెందిన పాటిబండ్ల కృష్ణప్రసాద్ (కేపీ) వైఎస్సార్సీపీ నాయకుడిగా కొనసాగుతూ కొద్దినెలల కిందట లోకేశ్ పక్షాన చేరారు. అలాగే, దుగ్గిరాల మండలవాసి, మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలు, విద్య, వైద్య రంగ సంస్థల ముఖ్యులు, వ్యాపారస్తులు, ఎన్ఆర్ఐల సహకారం కూడా లోకేశ్కు తోడైంది. తమ వాడైన లోకేశ్కు మద్దతిస్తే ఇవ్వండి, లేదంటే మా సంస్థల్లో మీరు చేస్తున్న ఉద్యోగాలను వదిలేసుకోండని స్పష్టంగా చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు.. ఇళ్లలోని పెద్దలకు, మహిళలకు కూడా ఫోన్లుచేసి ఇదే విషయమై బెదిరించారని చెప్పారు.వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నామని..దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాల్లో పెత్తందారులుగా చలామణి అవుతున్న పలువురు టీడీపీ నాయకులు, మద్దతుదారులు తమను అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు వాపోయారు. మండలంలోని పెదపాలెం, తుమ్మపూడి, చిలువూరు, కంఠంరాజు కొండూరు, పేరకలపూడి, శృంగారపురం, పెనుమోలి, మోరంపూడి, చిన్నపాలెం తదితర 12 పల్లెల్లోని పేద రైతులకు ఈ ఏడాది నుంచి కౌలుకు భూమి ఇవ్వడంలేదని వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు టీడీపీ సామాజికవర్గానికి రైతులు చెప్పడం పరిశీలనాంశం. ‘ఎన్నికలు జరగడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఎవరికిష్టమైన పార్టీకు వారు ఓట్లు వేసుకుంటున్నారు. ఆ తరువాత ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఈసారే కులాలు, మతాలు అంటూ దారుణంగా పరిస్థితులు మారాయి’.. అని వైఎస్సార్సీపీ నాయకుడు వీరయ్య వ్యాఖ్యానించారు.నియోజకవర్గ ఓటర్లకు డబ్బులు..ఇక మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వాటితో పాటు విజయవాడ, గుంటూరు, ఇతర ముఖ్య నగరాల్లోని కార్పొరేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల్లో పనిచేసే నియోజకవర్గ ఓటర్లకు ఎన్నికల బోనస్ అందింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఆయా ఉద్యోగి స్థాయిని బట్టి 2,500 నుంచి 5,000 వరకు డబ్బులు అకౌంట్లలో పడ్డాయి. చేతికి కూడా ఇచ్చారు. అడక్కపోయినా తమకు ఎన్నికల బోనస్ అందిందని ఆయా గ్రామాలకు చెందిన ఉద్యోగుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. పదవులు వచ్చాయని పగబట్టారు..మండలంలోని ఓ ప్రధాన సామాజికవర్గం వారు దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ (పసుపు) యార్డు చైర్మన్ పదవిని దశాబ్దాలుగా అనుభవించారు. ఆ పదవిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికిచ్చారు. అప్పటి నుంచే ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. నియోజకవర్గంలోని ఇతర పదవుల విషయంలోనూ వారిది అదే తీరు.ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు దారులకు మండలంలో సుమారు 200 ఎకరాల వరకు కౌలుకు ఇవ్వడంలేదనేది మా అంచనా. గత ఎన్నికల్లో నారా లోకేశ్ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీసీ వర్గీయురాలిపై పోటీచేశారు. ఫలితం తేలాల్సి ఉంది. ఆయన సామాజికవర్గీయులకు చెందిన భూములు కౌలుకు ఇవ్వడంలేదంటే వారి ఆలోచనా తీరును అర్థంచేసుకోవాలి. ఆయన మంగళగిరి నియోజకవర్గ నాయకుడా? లేక రాష్ట్రస్థాయి లీడరా? అనేది ఆయనే తేల్చుకోవాల్సిన విషయం. – దుగ్గిరాల వీరయ్య, వైఎస్సార్సీపీ, దుగ్గిరాలరెడ్బుక్లో పేరు ఎక్కిందంటూ బెదిరింపులు..35 ఏళ్లుగా మా తాత తండ్రుల కాలం నుంచి మూడెకరాలను కౌలుకు చేస్తున్నాం. వాళ్ల ఇళ్లలో అన్నిరకాల పనులూ చేశాం. వైఎస్సార్సీపీ వైపు నిలిచినందుకు మాకు భూమి కౌలుకు ఇచ్చేది లేదంటున్నారు. అమరావతి భూముల అంశంలో మాట్లాడినందుకు.. ‘నీ పేరు లోకేశ్ రెడ్బుక్లో ఎక్కింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక నీ సంగతి తేలుస్తా’..మని బెదిరిస్తున్నారు. ఏం జరుగుతుందో, ఏమో! – యలమాటి ప్రసాద్కుమార్, పెదపాలెంఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకున్నారు..మేం ఇల్లు కట్టుకుంటున్నాం. నిర్మాణ సమయంలో పొరుగు ఇంటిపై కాస్త నీళ్లు పడినా, దుమ్ము రేగినా తట్టుకోలేకపోతున్నారు. పనిచేసే భవన కార్మికులను, పనివాళ్లను తిడుతున్నారు. కారణం మేం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచామని. – షేక్ బాజీ, చిలువూరుమీరు పార్టీ మారారని మేమూ మారాలా?‘మీరు ఎందుకు జగన్కు మద్దతుగా ఉంటున్నారు? ఆ పార్టీని వదిలేసి లోకేశ్కు ఓట్లు వేయండి’.. అని మా గ్రామ పెత్తందారు హుకుం జారీచేశారు. మేం జగన్ను వదిలే ప్రసక్తిలేదని నాతో పాటు మా బంధువర్గానికి చెందిన వారందరం స్పష్టంగా చెప్పాం. మీరు పార్టీ మారారని, మమ్మల్ని కూడా మారాలని ఆదేశిస్తే అంగీకరించేదిలేదన్నాం. దీంతో పదిహేనేళ్లుగా కౌలుచేస్తున్న రెండెకరాలను ఇచ్చేదిలేదన్నారు. కౌలు డబ్బులు సీజన్కు ముందే చెల్లిస్తాం. ఓట్లు వేయనందుకు పొలం ఇవ్వడంలేదనడం వ్యవసాయ సీజన్ మొదలయ్యే ముందు చెప్పడం ఎంతవరకు న్యాయమో వారే ఆలోచించుకోవాలి. – బుల్లా శ్రీనివాసరావు, పెదపాలెండబ్బులు వెనక్కు ఇచ్చేశారు..భూమి సత్తువ కోసం జొన్న మొదుళ్లను కట్టర్తో పనిచేయించాం. రూ.5వేలు ఖర్చయ్యింది. ఆ మొత్తాన్ని మా భూ యజమాని తిరిగి ఇచ్చేశారు. మూడెకరాలను ఈ ఏడాది కౌలుకు ఇచ్చేది లేనిదీ ఇరవై రోజులు తరువాత చెప్తామన్నారు. ఇక వారు చెప్పేదేంటో అర్థమైపోయింది. – గొడవర్తి ప్రతాప్సింగ్, పెదపాలెంమేమే సాగు చేసుకుంటామంటున్నారు..పద్నాలుగేళ్లుగా సాగుచేసుకుంటున్న నాలుగెకరాల పొలాన్ని ఈ దఫా కౌలుకు ఇచ్చేలా లేరు. మేమే సాగు చేసుకుంటామని చెబుతున్నారు. మొన్న ఎన్నికల్లో మేం ఫ్యాన్కు ఓట్లేశామని వారికి మాపై కోపం.– షేక్ ఖాంసా, కంఠంరాజుకొండూరుమా నాన్నకు వీడియోలు చూపించి బెదిరించారు..మీ అబ్బాయి వైఎస్సార్సీపీలో తిరుగుతున్నాడు. పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడాడు. ఇవిగో వీడియోలు చూడండని ఇంటికెళ్లి మా నాన్న ఇస్మాయిల్కు వాటిని చూపించారు. దీంతో.. ఐదేళ్లుగా చేస్తున్న నాలుగెకరాలను ఇక నుంచి కౌలుకు ఇచ్చేదిలేదని చెప్పారు. – షేక్ సద్దాం హుస్సేన్, చిలువూరుసర్పంచ్గా గెలిచానని..మాది తుమ్మపూడి. మా అన్న షేక్ ఖాదర్ బాషా. ప్రస్తుతం ఏడాదికి ఎకరానికి రూ.70 వేలు చొప్పున నిమ్మతోటకు కౌలు చెల్లిస్తూ వచ్చాం. పదెకరాలకు 35 ఏళ్ల పాటు ఎప్పటి కౌలు అప్పుడు ఇచ్చేవాళ్లం. నేను సర్పంచ్గా పోటీచేసి గెలిచినందుకు మూడేళ్ల నుంచి నిమ్మతోటను మా అన్నకు ఇవ్వలేదు. – జానీ బాషా, తుమ్మపూడి సర్పంచ్మీవి భూములైనప్పుడు మావి ఓట్లు కావా?మా బాబాయి గంపల శ్రీనివాసరావు 22 ఏళ్లుగా రెండెకరాలు కౌలుకు చేసేవారు. ఎకరానికి రూ.35 వేలు చొప్పున ముందస్తు కౌలు క్రమం తప్పక చెల్లించేవారు. ఎంబీఏ చేసిన నేను బీసీ వర్గం నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్గా గెలుపొందాను. అంతమాత్రాన కౌలుకు భూమి ఇచ్చేదిలేదంటే ఎలా? భూములు వారివి అయినప్పుడు ఓట్లు మావి కావా? వారికి మాత్రమే పార్టీ.. మాకు పార్టీ అంటే ఇష్టం ఉండదా? ఇదెక్కడి న్యాయమో అర్థంకావడంలేదు. – గంపల గంగాధరరావు, పేరుకలపూడి, సర్పంచ్ -
Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు లోకేష్ రెండోసారి ఓటమికి సిద్ధమవుతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో దొడ్డిదారిన మంత్రి పదవి వెలగబెట్టిన లోకేష్ మంగళగిరిలో పునాది వేసుకోలేకపోయారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే మంగళగిరిని ఊహించనిరీతిలో అభివృద్ధి చేశారు. వైఎస్ జగన్ పాలనకు జనం జేజేలు పలుకుతున్నారు. పోలింగ్ రోజు ఉదయమే బారులు తీరిన ఓటర్లే జగన్ పాలనకు ఆమోదమనే చర్చ జరుగుతోంది.ఆర్కే చేతిలో తొలి పరాజయంగుంటూరు జిల్లా ముఖద్వారం మంగళగిరి నియోజకవర్గాన్ని మూడోసారి కూడా వైఎస్సార్సీపీ పార్టీ కైవసం చేసుకోబోతోంది. గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. 2019లో టీడీపీ తరపున అప్పటి మంత్రి, ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తండ్రితో కలిసి హైదరాబాద్ పరార్ఓటమి తర్వాత ఏడాదికిపైగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. కరోనా సమయంలో కరకట్ట మీది ఇల్లు వదిలి తండ్రితో కలిసి హైదరాబాద్ పారిపోయారు. దీంతో మంగళగిరిలో టీడీపీ క్యాడర్ కకావికలమైంది. లోకేష్ను కలవాలంటే క్యాడర్కు సాధ్యమయ్యేది కాదు. సీఎం జగన్ పాలనలో మారిన మంగళగిరి రూపురేఖలువైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ చేరాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 500 కోట్లతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. దీంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా 1700 కోట్లు లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్లాయి. వైఎస్ జగన్ పాలనలో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడూ ప్రజలకు అందుబాటలో..తాడేపల్లి, మంగళగిరి కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మంగళగిరి అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటమే గాకుండా అవినీతికి తావు లేకుండా, ప్రతి అభివృద్ధి పనినీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. జగన్ పాలన పట్ల ఆకర్షితులైన నియోజకవర్గంలోని కీలక టీడీపీ నేతలు గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు వైఎస్సార్ సీపీలో చేరి మరింత బలోపేతం చేశారు. చేనేత వస్త్రాలకు పేరు గాంచిన మంగళగిరిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేనేత షెడ్లను ఏర్పాటు చేశారు. నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మార్కెట్లో అమ్ముకోవడానికి చేనేత బజారు ఏర్పాటు చేశారు. మంగళగిరిని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. మరోవైపు లోకేష్ వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు దిగజారిపోతూ వచ్చింది. లావణ్యకు వైఎస్సార్సీపీ టికెట్..మంగళగిరిలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ సీటును బీసీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులో భాగంగానే వరుసగా రెండుసార్లు గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాకుండా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు వైఎస్సార్సీపీ టికెట్ను కేటాయించింది. మురుగుడు లావణ్య మామయ్య మురుగుడు హనుమంతరావు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. లావణ్య తల్లి కాండ్రు కమల కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో నియోజకవర్గంపై వారిద్దరికీ మంచిపట్టుంది.సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, మరోనేత గంజి చిరంజీవి కలిసికట్టుగా ఎన్నికల యుద్ధంలో దిగటంతో లోకేష్కు మైండ్ బ్లాక్ అయింది. తనకు బలం లేకపోయినా డబ్బుతో గెలవాలని నిర్ణయించుకున్న లోకేష్ కోట్లు కుమ్మరించారు.పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే క్యూఅంతేకాదు 30 మంది డమ్మీ క్యాండెట్లను రంగంలోకి దించి ఓట్లు చీల్చడానికి, ఓటర్లను గందరగోళపరచడానికి కుట్రపన్నారు. కానీ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జగన్ పాలనకే మంగళగిరి ప్రజలు పోలింగ్ రోజు జైకొట్టారు. ఉదయం 6 గంటలకే వృద్ధులు మహిళలతో పాటు బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు గంటలకొద్దీ క్యూల్లో నిలుచుని ఫ్యాన్ను గిరగిరా తిప్పారు. వైస్సార్సీ ప్రభుత్వంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన మంగళగిరి మరింత అభివృద్ధి చెందాలంటే మురుగుడు లావణ్యను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ప్రజలు భావించారు. లోకేష్ ఎన్ని కుట్రలు చేసినా మరోసారి ఆయనకు ఓటమి తప్పదనే టాక్ మంగళగిరిలో గట్టిగా వినిపిస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఎస్సై
-
జై జగన్ నినాదాలతో మారుమోగిన మంగళగిరి
-
రూ.300 పింఛన్ను రూ.400 చేస్తా
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ మరోసారి నోరు జారి.. నవ్వుల పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్ గురువారం రాత్రి మంగళగిరి పరిధిలోని కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రులో ఆయన మాట్లాడుతూ.. రూ.300 పింఛన్ను రూ.400కు పెంచుతాననడంతో సభకు హాజరైనవారు అవాక్కయ్యారు. వెంటనే పక్కనే ఉన్న మరో నాయకుడు కలుగజేసుకొని.. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అని చెప్పడంతో లోకేశ్ నాలుక కరుచుకున్నారు. -
నేనంటే భయమెందుకు బాబు
-
మంగళగిరి మారుమోగింది.. ‘జై జగన్.. సీఎం జగన్’
గుంటూరు, సాక్షి: అది మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్.. కాస్త ఎండపూట ఇసుకేస్తే రాలనంత జనం చేరారు. సంక్షేమ సారథికి మద్దతు పలికేందుకు అశేషంగా తరలివచ్చిన జన సునామే అది. ఆ అభిమానం ఇంతటితో ఆగలేదు.. సీఎం జగన్ ప్రసంగించే సమయంలో సీఎం సీఎం.. జై జగన్.. జయహో జగన్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేలా చేశారు. మంగళగిరిలో పచ్చ బ్యాచ్ మొదటి నుంచి ఒకరమైన ప్రచారంతో ముందుకు పోతోంది. బీసీ జనాభా అత్యధికంగా ఉండే చోట.. అగ్ర కులానికి, అందునా గత ఎన్నికల్లో ఓడిన తమ చిన్నబాస్ నారా లోకేష్ను బరిలోకి దింపింది. బీసీ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సైతం చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి)ని తప్పించి మరీ.. బీసీ సామాజిక వర్గానికి, అందునా ఒక మహిళను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. మురుగుడు లావణ్య ప్రచారానికి వెళ్లిన చోటల్లా.. ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. అదే సమయంలో నారా లోకేష్కి ఆదరణ కరువు కావడంతో.. టీడీపీకి ఏమాత్రం మింగుడు పడలేదు.దీంతో మంగళగిరిలో నారా కుటుంబం ప్రచారాన్ని.. ఐటీడీపీ అండ్కో పేజీలు సోషల్మీడియాలో జాకీలు పెట్టడం ప్రారంభించారు. అక్కడా ప్రతికూల కామెంట్లే వినిపించాయి. అప్పటికీ కూడా మంగళగిరిలో టీడీపీ జెండానే ఎగురుతుందంటూ లోకేష్ అండ్ కో ప్రచారం చేస్తూ వచ్చాయి. ఈలోపే..సీఎం జగన్ మంగళగిరి ప్రచార సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు#MemanthaSiddham, #YSJaganAgain. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు.. జయజయధ్వానాలు పలికారు. ఎటుచూసినా జన సమూహంతో పండగ వాతావరణం కనిపించింది. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు..’ అంటూ ప్రసంగం ప్రారంభంలో సీఎం జగన్ చెప్పిన మాటలు.. ఆపై కొనసాగిన స్పీచ్ మంగళగిరి ప్రజల్లో ఉత్సాహం నింపింది. ఫ్యాన్ గుర్తుకు తమ ఓటేసి.. కూటమి నేతలను తిప్పికొడతామంటూ తమ నినాదాలతో స్పష్టం చేశారు మంగళగిరి వాసులు. ..‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి అంటుంటాడు, ఆ యన పాలనలో ఏనాడైనా ఇన్ని స్కీములు ఇచ్చా డా? ఇప్పటి మాదిరిగా ఏనాడైనా అవ్వాతాతలకు ఇంటింటికీ పింఛన్ ఇచ్చాడా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా?’’.. అంటూ సీఎం జగన్ అడిగిన ప్రశ్నలకు లేదూ.. లేదూ.. అంటూ రెండు చేతులు ఊపుతూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన పథకాలు గురించి వివరిస్తున్నప్పుడు అవునూ.. అవునూ.. అంటూ ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారు. స్థానికంగా ఉండే లావణ్యమ్మ(మురుగుడు లావణ్య)కు ఓటేయాలన్నప్పుడు కూడా ప్రజల నుంచి.. సిద్ధం అనే సమాధానమే వినిపించింది. మొత్తంగా.. గ్రాఫిక్స్ అనే వాళ్ల గూబ గుయ్యి మనేలా.. కూటమి వెన్నులో వణుకు పుట్టేలా.. మంగళగిరి ‘జై జగన్’ నినాదాలతో మారుమోగింది. -
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
-
చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..
-
ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు
-
సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ
-
నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!
-
మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు
-
సీఎం జగన్ కాన్వాయ్ విజువల్స్
-
వాళ్లు గొంతు నొక్కేది మీ బిడ్డ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. : సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాజకీయాల్లో.. పట్టపగలే ఇంతదారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిణామాలను చూస్తున్నామని, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలకు తెర తీశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రచార సభలో అన్నారు.‘‘ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం?. వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉందంటే.. జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందనో.. అన్ని వర్గాలు ఎక్కడ జగన్ను తమ వాడిగా భావిస్తున్నాయో అని అసూయతో కుట్రలకు తెర తీశాయి... అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్తాయో అని దానిని కూడా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్.. మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తున్నాడు. కానీ, ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు... మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి.. ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి.. సింకులోనే ఉండాలి.నా చెల్లిని పరిచయం చేస్తున్నా. లావణ్యమ్మ(మురుగుడు లావణ్య) మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి. ప్రతీ ఒక్కరూ ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా రోశయ్య నిలబడుతున్నారు. మీ ఆశీస్సులు రోశయ్యపై కూడా ఉంచాల్సిందిగా కోరుతూ.. ఓటేయమని కోరుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ
-
మంగళగిరిలో సీఎం జగన్ సభ
-
మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ
-
మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!
-
లోకేష్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య ?
-
"మంగళగిరిలో మూసీనది.."
-
మంగళగిరిలో లోకేష్ అనుచరుల దాష్టీకానికి YSRCP నేత బలి
-
మంగళగిరిలో టీడీపీ హత్యా రాజకీయాలు
-
మంగళగిరి మాదే.. భారీ ర్యాలీతో నామినేషన్
-
నేతన్నకు నాయకత్వం
బుద్ధీ జ్ఞానం ఉందా? అని నిలదీయండి ‘‘చేనేతలకు అన్ని విధాలా అండగా ఉంటూ వారు రాజకీయంగా కూడా ఎదిగేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో పెద్దపీట వేశాం. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన 54 వేల ఇళ్లను చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందంటూ కేసులు వేశారు. వాళ్లు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే.. 54 వేల మందికి జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తే నువ్వెందుకు అడ్డుకున్నావ్..! బుద్ధీ జ్ఞానం ఉందా? అని నిలదీయండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. జగన్ చేయవచ్చు, ఇంకొకరు చేయవచ్చు! బాగుపడేది పేదవాడు అయినప్పుడు అడ్డు పడాలని చూసిన ఏ నాయకుడైనా రాజకీయాలకు అనర్హుడు’’ – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: నేతన్న నేస్తం అనే ఒక్క పథకం ద్వారానే చేనేతకారులకు రూ.970 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తూ ఏకంగా 1.06 లక్షల మందికి వర్తింపజేశామని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికీ ఏటా నేతన్న నేస్తం అందిస్తూ ఏ ఒక్కరూ మిస్ కాకుండా అర్హులందరికీ పారదర్శకంగా ప్రయోజనం దక్కేలా చర్యలు తీసుకున్నామన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో చేనేతకారులతో నిర్వహించిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. బతుకులు మార్చినవాడే నాయకుడు.. బస్సు యాత్రలో భాగంగా పలు వృత్తులు, వ్యాపకాల్లో నిమగ్నమైన వారిని కలుస్తూ వస్తున్నాం. ఆ వర్గాలకు జరిగిన మంచితోపాటు ఐదేళ్లలో వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయో నేరుగా తెలుసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంకా మెరుగ్గా, సమర్థంగా చేయడంపై సూచనలు, సలహాలు ఈ కార్యక్రమం ద్వారా స్వీకరిస్తున్నాం. ప్రజలకు చేదు అనుభవాలను మిగిల్చిన చంద్రబాబు మాదిరిగా కాకుండా ప్రతి పేదవాడు గుండెల్లో పెట్టుకుని చూసుకునేలా 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఆ నాయకత్వ స్థానంలో నిలబెట్టినందుకు మన బతుకులు మారాలి. అలాంటి నాయకుడు ఆ స్థానంలో ఉంటేనే మన బతుకులు మారతాయి. ఎన్నుకునేటప్పుడు మనం పొరపాటు చేస్తే రాబోయే ఐదేళ్లు మళ్లీ మనం చేయగలిగింది ఏమీ ఉండదు. మరోసారి మోసపోయి మన బతుకులు అంధకారంలోకి వెళ్లిపోతాయి. నేతన్నకు వెన్నుపోటు.. 98 శాతం ఇంటూ గుర్తులే ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు మేనిఫెస్టో 21, 22వ పేజీల్లో చేనేతలకు కాస్తంత స్థలం కేటాయించారు. ఇప్పటి మాదిరిగానే కూటమిగా ఏర్పడి దత్తపుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో హామీలిచ్చి 98 శాతం ఎగ్గొట్టారు. నూటికి 2 మార్కులు కూడా రాలేదు. అదీ చంద్రబాబు ట్రాక్ రికార్డు. ఆ హామీలు ఒక్కసారి గమనిస్తే చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది సున్నా. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు గతంలోనే ఇచ్చారు. జరీపై వ్యాట్ రద్దు చేయలేదు. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.లక్ష మేర సంస్థాగత రుణ సౌకర్యం కల్పించలేదు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ఏటా రూ.1,000 కోట్లు కేటాయించలేదు. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పిస్తామంటూ ఆప్కోకే బకాయిలు పెట్టాడు. జిల్లాకో చేనేత పార్కు ఏర్పాటు చేయలేదు. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆస్పత్రులు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు కాలేదు. సగం ధరకే జనతా వస్త్రాలు, జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ హామీ అమలు చేయలేదు. కేంద్రం ఇస్తోంది కాబట్టి చేనేత సొసైటీలకు 20 శాతం రాయితీపై ముడి సరుకుల సరఫరా కొద్దో గొప్పో జరిగింది. ఉచితంగా ఇల్లు, మగ్గం, షెడ్డు ఏర్పాటు ఒక్కరికన్నా ఇచ్చారా? ఇలా 98 శాతం ఇంటూ గుర్తులే ఉంటే రెండు శాతం మాత్రమే టిక్కులు కనపడతాయి. ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి మళ్లీ ఈరోజు ఎన్నికలు రావడంతో మరోసార వంచనకు తయారయ్యాడు. 58 నెలల్లో రూ.3,706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా 58 నెలల వ్యవధిలో రూ.3,706 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నా. ఇవన్నీ పారదర్శకంగా కనిపిస్తున్నాయి. మీ బ్యాంకు ఖాతాలకు గత 58 నెలల్లో ఎన్ని డబ్బులు జమ అయ్యాయి? చంద్రబాబు హయాంలో ఎన్ని డబ్బులు పడ్డాయో ఒక్కసారి ఖాతాలను పరిశీలిస్తే తేడా మీకే తెలుస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం ద్వారానే రూ.970 కోట్లు 1.06 లక్షల మందికి అందచేశాం. 94,410 చేనేత కుటుంబాలు ఆత్మగౌరవంతో ఇంటివద్దే పెన్షన్ అందుకున్నాయి. నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తున్న పరిస్థితి వచ్చిందంటే దివంగత నేత వైఎస్సార్ చలువే. తొలిసారిగా చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది మన ప్రభుత్వమే. అమెజాన్, మింత్ర, ఫ్లిప్కార్ట్, మీరా, పేటీయం లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారి ఫ్లాట్ఫామ్స్లో మన వస్త్రాలను చేర్చాం. మనం రాకముందు ఆప్కో బకాయిలే రూ.120 కోట్లు ఉంటే వాటిని క్లియర్ చేయడమే కాకుండా రూ.469 కోట్లు ఆప్కోకు ఇచ్చి చేనేతలకు ఆదుకున్నాం. విద్యాకానుక ద్వారా 44 లక్షల మంది స్కూలు పిల్లలకు యూనిఫాం అందిస్తుండగా తొలి ప్రాధాన్యతగా చేనేతకారులకే ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించాం. బీసీల కోటలో బాబు కుటుంబం తిష్ట చేనేతకారులు అధికంగా ఉండే మంగళగిరి ప్రాంతంలో వారికి రాజకీయంగా కూడా పెద్దపీట వేశాం. స్థానిక ఎమ్మెల్యే ఆర్కేను పిలిచి మాట్లాడి నా చేనేత చెల్లెమ్మకు సీటు ఇచ్చేందుకు సహకరించాలని కోరా. ఆర్కే కూడా మంచి మనసుతో తాను సిద్ధంగా ఉన్నానంటూ ముందుకొచ్చాడు. లావణ్యమ్మకు మంగళగిరిలో, బుట్టమ్మకు ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. సునీతమ్మ, హనుమంతన్న ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ప్రొద్దుటూరు, రాయదుర్గం, వెంకటగిరి, ఎమ్మిగనూరు, జగ్గయ్యపేట, చీరాల, ధర్మవరం, పెడన లాంటి 8 చోట్ల మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నది నేతన్నలే. దీనికి కారణం మీ బిడ్డ రూల్ తెచ్చాడు కాబట్టే. ఒకవైపు మీ బిడ్డ చేనేతకారులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తూ అడుగులు వేస్తుంటే మరోవైపు చంద్రబాబు ఆయన కుమారుడు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్నచోట్ల కూడా వారికి సీట్లు ఇవ్వకుండా ఆ స్థానాల్లో తిష్ట వేసి రూ.కోట్లు వెదచల్లుతున్నారు. కుప్పంలో బీసీలే ఎక్కువ. చంద్రబాబు బీసీల కోటలో పాగా వేసి డబ్బులతో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడు. మీ బిడ్డ మాత్రం కుప్పంలో బీసీనే నిలబెట్టాడు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకుగానూ 50 శాతం అంటే 100 సీట్లు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకే కేటాయించి సామాజిక సాధికారతపై చిత్తశుద్ధి చాటుకున్నాం. మంగళగిరికి మంచి జరిగిందిలా.. మంగళగిరి నియోజకవర్గంలో 1,20,187 ఇళ్లు ఉండగా 1,08,408 ఇళ్లు అంటే 90.1 శాతం గృహాలకు లబ్ధి చేకూర్చాం. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.1,530 కోట్లు జమ చేశాం. మంగళగిరి నియోజకవర్గంలో నెలకొల్పిన 83 సచివాలయాల్లో ఈ వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాం. ఇక నాన్ డీబీటీతో మరో రూ.735 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం. అంటే మొత్తం రూ.2,265 కోట్లు మేర మేలు చేశాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మన అభ్యర్థి లావణ్యమ్మ దగ్గర చంద్రబాబు కుమారుడి వద్ద ఉన్నంత డబ్బులు లేవు. ఎన్నికలొచ్చేసరికే ఆయన ఓటుకు రూ.4 వేలు, రూ.5 వేలు, రూ.6 వేలు అంటాడు. ఇస్తే తీసుకోండి. ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మళ్లీ ప్రతి ఏడాది నేతన్న నేస్తం ఇచ్చే వారికే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు, బడులు, హాస్పిటళ్లు బాగుంటాయో వారికే ఓటేయండి. ఎవరు ఉంటే పేదవాడు అప్పులపాలు కాకుండా వైద్యం అందుతుందో, మన ఇంటికే పెన్షన్ డబ్బులు నడుచుకుంటూ వస్తాయో ఆలోచించి ఓటేయండి. ఎవరు ఉంటే అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తాయో వారికే ఓటు వేయాలని కోరుతున్నా. చేయగలిగిందే చెబుతాం.. మన ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అది మేనిఫెస్టోలో క్లియర్గా చెబుతాం. అబద్ధాలాడటం తప్పు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం నెరవేర్చి ఈరోజు మళ్లీ మీ ఆశీస్సులు కోరుతున్నాం. నేతన్నలకు ఏటా రూ.24 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు అందిస్తున్నాం. ఈ డబ్బులతో ఎవరైనా మగ్గం కొనుక్కోవచ్చు. ఇంట్లో మగ్గం పెట్టుకోవచ్చు. మీరు కోరుతున్నట్లుగా అద్దె మగ్గందారులకూ ప్రయోజనాలు అందించాలని నాకూ ఉంది. కానీ అలా చేయగలుగుతామా? ఎందుకంటే అద్దె మగ్గంలో ఎవరు ఉంటున్నారో, ఎవరు వాడుకుంటున్నారో ఎలా చెప్పగలం? ఈరోజు ఒకరు ఉంటారు.. రేపు మరొకరు ఉండవచ్చు. ఏది చేసినా పారదర్శకంగా ఉండాలి. మన పాలసీ ఏమిటంటే.. ఏ పార్టీవారైనా సరే అర్హత ఉంటే పారదర్శకంగా లబ్ధి చేకూర్చాలి. ఆదుకుని ఆదరించారు... చేనేత వృత్తిని గత ప్రభుత్వాలు గుర్తించలేదు. దివంగత వైఎస్సార్ మాత్రమే చేనేతకారులకు 50 ఏళ్లకే పెన్షన్ సదుపాయం, ఆప్కోస్ ద్వారా సబ్సిడీలు కల్పించారు. సీఎం జగనన్న ఎక్కడా లేనివిధంగా చేనేతలకు ఏటా రూ.24 వేలను సాయంగా అందిస్తున్నారు. నవరత్నాల సంక్షేమాల్లో అగ్రభాగం అందుకుంటున్నది మన చేనేతలే. టీడీపీ హయాంలో చేనేతలను నట్టేట్లో ముంచితే ఆప్కోను ఆదుకుని రూ.180 కోట్లు అందించారు. కరోనా కష్టకాలంలో రెండుసార్లు రూ.24 వేలు ఇచ్చారు. మనకు జగనన్న లాంటి నాయకుడు ఉండటం ఎంత అవసరమో అందరూ ఆలోచన చేయాలి. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మశాలి సోదరి లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. – జింకా విజయలక్ష్మి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ మంగళగిరిలో తయారయ్యే చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్యను, నన్ను పిలిచి చేనేత పరిశ్రమ గురించి ఆరా తీశారు. రంగులు, రసాయనాల వల్ల త్వరగా వృద్ధాప్యం బారిన పడుతున్న చేనేతకారులకు 50 ఏళ్లకే పెన్షన్ అందించేలా నిర్ణయం తీసుకున్నారు. మేం కోరిన మరో 17 డిమాండ్లు కూడా నెరవేర్చారు. చేనేతల క్రిఫ్ట్ ఫండ్ను రెట్టింపు చేసి 16%కి పెంచారు. చంద్రబాబు ప్రభుత్వం రిబేట్ను తొలగిస్తే వైఎస్సార్ పునరుద్ధరించారు. డైస్, కెమికల్స్పై సబ్సిడీ ఇచ్చారు. రూ.100 కోట్లు ఆప్కోకి విడుదల చేయడంతో చేనేత పరిశ్రమ నిలబడింది. మంగళగిరిలో ఇళ్లులేని చేనేత కార్మికుల కోసం 25 ఎకరాలు ఇచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక 150 మంది మగ్గాలకు షెడ్లు వేశాం. నవరత్నాల్లో భాగంగా చేనేతకారులకు ఏటా రూ.24 వేలు చొప్పున అందిస్తున్నారు. చేనేత కార్మికుల జీవితాలను బాగుచేసింది నాడు వైఎస్సార్ అయితే నేడు వైఎస్ జగన్ మాత్రమే. ఆప్కోకి రూ.100 కోట్లు రిలీజ్ చేశారు. మంగళగిరిలో మార్కెటింగ్ సౌకర్యం కోసం రూ.3 కోట్లతో 40 షాపులను నిర్మించారు. – మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ జగనన్న మా చేనేతలకు షెడ్లు వేశారు. నాకు చేయూత వస్తోంది. మావారికి పెన్షన్ ఇస్తున్నారు. నేతన్న నేస్తం ఇప్పిస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న చెప్పారు. – నందం దుర్గ, చేనేత మహిళ అధైర్యపడవద్దు.. అండగా ఉంటా అనారోగ్య సమస్యలు విన్నవించుకున్న బాధితులకు సీఎం భరోసా పెదకాకాని: మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ శనివారం తనను కలిసిన పలువురు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. ‘అధైర్యపడవద్దు.. అండగా ఉంటా’నంటూ వారి కన్నీళ్లు తుడిచారు. గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ పార్వతి తన కుమార్తె డింపుల్తో కలిసి సీఎం జగన్ను కలిశారు. తన కుమార్తె వినికిడి లోపంతో బాధపడుతోందని.. మాటలు కూడా రావని.. చికిత్సకు సాయమందించాలని పార్వతి కోరగా.. సీఎం జగన్ ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. పాపకు దివ్యాంగ పింఛన్ వస్తుందా అని ఆరా తీశారు. సర్జరీ చేయించడంతో పాటు వినికిడి మిషన్ ఉచితంగా అందజేస్తానని భరోసా ఇచ్చారు. రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.. ‘నా బిడ్డకు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.. ఆదుకోండయ్యా’ అంటూ గుంటూరు జిల్లా కొప్పురావూరుకు చెందిన గోపాలం సుజాత తన కుమార్తె సౌజన్యతో కలిసి నంబూరు అడ్డరోడ్డు వద్ద సీఎం వైఎస్ జగన్ను కలిసింది. సీఎం జగన్ వారిని ఓదార్చి.. ప్రభుత్వం నుంచి పింఛన్ అందుతుందా అని ఆరా తీశారు. సమస్య తెలిసి నాలుగు నెలలవుతుందని వారు బదులివ్వగా.. వెంటనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలిసిన వారు ఎవరైనా కిడ్నీ ఇస్తామంటే ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చారు. కిడ్నీ దానం చేసిన వారికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలి చేనేత కార్మికులకు 100 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది. రత్నాల చెరువు ప్రాంతంలో చాలామంది అద్దె మగ్గాలతో నేత పనులు చేస్తున్నారు. వారికి కూడా సాయం చేయాలని కోరుతున్నా. మాకూ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. – కొండేటి కుమారి, చేనేత మహిళ, రత్నాలచెరువు, మంగళగిరి సీఎం వైఎస్ జగన్ దీనికి సమాధానం ఇస్తూ... ‘మంగళగిరి నియోజకవర్గంలో లే అవుట్లు రూపొందించి 54 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఆ అక్కచెల్లెమ్మలు జగన్ను ఎక్కడ గుండెల్లో పెట్టుకుంటారో అనే భయంతో చంద్రబాబు, లోకేష్ కోర్టుకు వెళ్లి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందంటూ కేసులతో అడ్డుపడ్డారు. మీ బిడ్డ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ పోరాటం చేయడంతో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు కూడా శాంక్షన్ చేయించాం. కట్టడం ప్రారంభించే సమయానికి చంద్రబాబు మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లి కేసు వేయడంతో మేటర్ హియరింగ్ కోసం పోస్ట్ పోన్ చేస్తోంది. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువ చేసే ఆస్తిని పెడుతుంటే అడ్డుకున్నది చంద్రబాబు, లోకేషే’ అని పేర్కొన్నారు. చేనేతల కోసమే లావణ్యకు టికెట్ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: బీసీలు ఎక్కువ ఉన్న చోట్ల కూడా చంద్రబాబు, ఆయన కుమారుడే పోటీ చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. మంగళగిరిలో చేనేతలు ఎక్కువ కనుక.. తాము మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చామని చెప్పారు. ఈ తేడాను గమనించాలని ప్రజలను కోరుతూ సీఎం జగన్ శనివారం ట్వీట్ చేశారు. ‘మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చాం. మరోవైపు చంద్రబాబు, ఆయన కొడుకు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి రూ.కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కుప్పంలోనూ బీసీలు ఎక్కువ. అయినా అక్కడ కూడా ఇదే పరిస్థితి. తేడా గమనించాలని కోరుతున్నాను’ అంటూ శనివారం సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement