-
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
శాపంగా నారాయణ గారడీలు
‘నెల్లూరును స్మార్ట్ సిటీగా మారుస్తున్నాం..నగర సుందరీకరణే నా ధ్యేయం.. భూగర్భ డ్రైనేజీతో మెరుగైన పారిశుధ్యాన్ని అందిస్తాం’అంటూ గత ప్రభుత్వ హయాంలో మంత్రిగావ్యవహరించిన నారాయణ తన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను ఆ రోజుల్లో ఊదరగొట్టారు. ఇవన్నీ జరగకపోగా.. తనలోపభూయిష్ట విధానాలతో నెల్లూరు నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టారు. హడ్కో ద్వారా రుణాలను తీసుకొచ్చి.. పనులను చేయకుండానే నిధులను దిగమింగారు. ఈ పరిణామాలతో ఆ అప్పులపై కార్పొరేషన్ ఏటా రూ.55 కోట్ల వడ్డీని కడుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత టీడీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన నారాయణ పాపాలు నగర వాసులను నేటికీ వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ విస్మరించి తాజాగా జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ ఆయన అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ‘నారాయణ అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే నారాయణ’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. 9.95 శాతం వడ్డీకి అప్పు నగరపాలక సంస్థలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా కోసం రూ.1136 కోట్ల రుణానికి హడ్కోను ఆశ్రయించారు. ఇందులో తాగునీటి సరఫరా కోసం రూ.556 కోట్లు, భూగర్భ డ్రైనేజీకి రూ.580 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే హడ్కో రూ.830 కోట్లను 9.95 శాతం వడ్డీకి 2016లో మంజూరు చేసింది. అయితే నామమాత్రపు పనులతో 2018 వరకు కాలం వెళ్లదీశారు. గత ఎన్నికలకు ముందు హడావుడిగా.. గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు రెండు ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలకు టెండర్లను ఖరారు చేశారు. అప్పటికే నగరంలో ఒకట్రెండు వీధుల్లో మినహా మిగిలిన అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. భూగర్భ డ్రైనేజీ పేరుతో రోడ్లను తవ్వి.. అసంపూర్తిగా పనులు చేసి వదిలేశారు. ధ్వంసమైన రోడ్లపై నడిచేందుకు సైతం వీల్లేని పరిస్థితి ఏర్పడింది. భూగర్భ డ్రైనేజీ పైప్లైన్లను అన్ని వీధుల్లో వేస్తేనే గానీ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి వీలుంటుంది. ఈ తరుణంలో గుంతలమయమైన రోడ్లతో ప్రజలు నరకాన్ని చవిచూశారు. డివిజన్ ఇన్చార్జీలకు సబ్ కాంట్రాక్ట్లు..! సిమెంట్ రోడ్ల పనులను తమకే కేటాయించాలంటూ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల టీడీపీ ఇన్చార్జీలు నారాయణపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సదరు కన్స్ట్రక్షన్ కంపెనీలతో మాట్లాడి నిర్మాణాల పనులు వారికి అప్పగించారు. ఈ తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనగా, నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఎత్తుపల్లాలుగా.. అత్యంత నాసిరకంగా రోడ్లను నిర్మించారు. కొన్ని వీధుల్లోని రోడ్లు వారానికే కుంగిపోయాయంటే నాణ్యత ఎలా ఉంతో అర్థం చేసుకోవచ్చు. గుంతలమయంగా.. వర్షమొస్తే చెరువులను తలపిస్తూ.. పైప్లైన్ల లీకేజీలు.. ఇలా రోడ్లు దుర్భరంగా మారాయి. చిన్నపాటి లీకేజీని సైతం సరిదిద్దేందుకు రోడ్లను ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అసంపూర్తిగా ఉన్నా.. బిల్లుల మంజూరు హడావుడిగా చేసిన పనులకు బిల్లులను మాత్రం పూర్తిగా తీసుకున్నారు. పనులు అసంపూర్తిగా ఉన్నాయని.. బిల్లులను మంజూరు చేయలేమని ఇంజినీరింగ్ అధికారులు చెప్పినా, నారాయణ మౌఖిక ఆదేశాలతో వీటికి ఇవ్వక తప్పలేదు. కొన్ని బిల్లులను అధికారులు క్లియర్ చేయకపోవడంతో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. స్వచ్ఛ నీరు.. కాలువల పాలు నగర వాసులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో పైపులను ఇళ్ల వద్ద ఏర్పాటు చేసి ఓపెన్గా వదిలేశారు. ఈ పైపుల ద్వారా ప్రతి ఇంటికీ కుళాయిని ఏర్పాటు చేసి.. వినియోగాన్ని లెక్క కట్టేందుకు మీటర్లను బిగిస్తామని చెప్పారు. అయితే ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ ఓపెన్ పైపుల ద్వారా విడుదలయ్యే నీరు కాలువల పాలైంది. మరికొన్ని చోట్ల పైపులు చోరీకి గురయ్యాయి. నగరంలో అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, స్వచ్ఛమైన తాగునీటి పనులను పూర్తి చేయాలంటే మరో రూ.240 కోట్లు అవసరమవుతాయని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. వడ్డీ భారం ఇలా.. హడ్కో నుంచి తెచ్చిన రుణానికి 9.95 శాతం వడ్డీని ఏటా చెల్లించాలి. అసలు కింద రూ.80 కోట్లు.. వడ్డీగా రూ.55 కోట్లు.. ఇలా ఏడాదికి రూ.135 కోట్లను నగరపాలక సంస్థ చెల్లించాల్సి వస్తోంది. ఆరేళ్లుగా రూ.810 కోట్లను కార్పొరేషన్ చెల్లించింది. ఈ లెక్కన ఇంకా దాదాపు రూ.400 కోట్లను అసలు, వడ్డీ కింద జమ చేయాల్సి ఉంది. ఇలా నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నారాయణ లాగారు. -
కోటంరెడ్డి, నారాయణ పై విజయ్ సాయి రెడ్డి ఫైర్
-
నారాయణ నకిలీ పనులు
-
నారాయణ పై విజయసాయిరెడ్డి ఫైర్
-
సీపీఐ నారాయణకు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 16వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన వేదిక ఎక్కబోతుండగా.. జారిపడ్డారు. ఆ తర్వాత అదేం పట్టించుకోకుండా మాములుగానే తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో ఆయన వైద్యుల్ని సంప్రదించడంతో ఆయన గాయపడినట్లు తేలింది. నారాయణకు రిబ్ ఎముక విరిగిందని.. రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. -
బడుగుల భూచోరుడు చంద్రబాబే..
రాజధాని పేరిట అమరావతిలో చోటుచేసుకున్న భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబు ముఠానేనని సీఐడీ తేల్చింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం చార్్జషీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల అసైన్డ్ భూములను చంద్రబాబు బ్యాచ్ కొల్లగొట్టిందన్నది ఆధారాలతో సహా సీఐడీ వెలుగులోకి తీసుకొచి్చన విషయం తెలిసిందే. కేంద్ర అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ సాగించిన ఈ భూబాగోతం యావత్ దేశాన్ని విస్మయపరిచింది. ఏకంగా రూ.4,400 కోట్లు విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు, నారాయణ తమ బినావీులు, సన్నిహితుల పేరిట గుప్పెట పట్టారన్నది సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో తేలింది. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి భయపెట్టారు. తమకు ఆ భూములు విక్రయిస్తే కొంతైనా డబ్బులు వస్తాయని చెప్పారు. తీవ్ర ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినావీులకు అసైన్డ్ భూములను సేల్డీడ్ల ద్వారా విక్రయించేలా చేశారు. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన కేపీవీ అంజనీకుమార్ (రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్), గుమ్మడి సురేశ్, కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కొల్లి శివరామ్లతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల పేరిట ఆ అసైన్డ్ భూములు బదలాయించారు. అనంతరం.. మంగళగిరి తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులపై ఒత్తిడి తెచ్చి వాటిని అక్రమంగా బదలాయిస్తూ ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించారు. అసైన్డ్ భూములను అలా జీపీఏ పేరిటగానీ ఇతరత్రా విధాలుగాగానీ బదిలీ చేయడం చట్టవిరుద్ధం. ఆ తర్వాత ఆ భూములకు కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. తద్వారా తాము బినామీల పేరిట హస్తగతం చేసుకున్న అసైన్డ్ భూములకు సీఆర్డీఏ భారీ ప్యాకేజీ దక్కేలా చేశారు. ప్రభుత్వ ఒత్తిడితోనే అంటూ అధికారుల వాంగ్మూలం నిజానికి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. వాటికి భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు. అదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులతోపాటు అడ్వకేట్ జనరల్ కూడా అసైన్డ్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. కానీ.. చంద్రబాబు, నారాయణ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి తాము చెప్పినట్లు చేయమని హుకుం జారీచేశారు. నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అసైన్డ్ భూముల బదలాయింపు చేశామని నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్గా పరిగణించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 1,100 ఎకరాలు.. 1,336 మంది బినామీలు నారాయణ కుటుంబసభ్యుల పేరిటే 162 ఎకరాలు ► అసైన్డ్ భూదోపిడీ కోసం చంద్రబాబు ముఠా రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్కు తెగబడింది. రెవెన్యూ రికార్డులు, సీఆర్డీఏ భూసమీకరణ రికార్డులను సీఐడీ అధికారులు పరిశీలించగా మొత్తం వ్యవహారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లకు విరుద్ధంగా సీఆర్డీఏ భూసమీకరణ ప్యాకేజీ ఇచ్చిన వాటిలో 1,336 మంది బినామీల పేర్లు ఉండటం గమనార్హం. ► నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచే రూ.16.5 కోట్ల నిధులను రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం ఆ నిధులను నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి వారి పేరున అసైన్డ్ భూములను అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. ► నారాయణ కుటుంబ సభ్యుల పేరిటే అక్రమంగా 162 ఎకరాల అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. వీటి విలువ రూ.650కోట్లు. నారాయణ 16.5 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.650కోట్ల భూములు కొల్లగొట్టారు. ► అంతేకాక.. దాదాపు రూ.4వేల కోట్ల విలువైన మరో 1,000 ఎకరాల వరకు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. -
Chandrababu: ఉనికి కోసం ఆర్థిక నేరాలు!
సాక్షి, అమరావతి: కూటి కోసం కోటి పాట్లు అన్నది లోకోక్తి! ఉనికి కోసం ఆర్థిక నేరాలు అన్నది టీడీపీ అధినేత చంద్రబాబు యుక్తి! అధికారంలో ఉండగా రాజధాని పేరుతో రైతుల భూములను సమీకరించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో వెదజల్లేందుకు నిధుల కోసం మళ్లీ ఆర్థిక నేరగాళ్లనే ఆశ్రయిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని ఆందోళన చెందుతున్న ఆయన... ఉనికి చాటుకునేందుకు యధావిధిగా డబ్బు కట్టలనే నమ్ముకున్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టి ఆర్థికంగా బలవంతులైన ఎన్నారైలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లను ఎన్నికల బరిలోకి దింపేందుకు గాలం వేస్తున్నారు. వీళ్లిచ్చే డబ్బుతో పాటు ఎన్నికల్లో వెదజల్లేందుకు తన చుట్టూ ఉన్న ఆర్థిక నేరగాళ్లకు కూడా నిధులు సమీకరించే పని పురమాయించారు. అధిక వడ్డీల ఆశచూపి సామాన్యుల నుంచి డబ్బులు సమీకరించటం, బ్యాంకులను బురిడీ కొట్టించటం, లేని కంపెనీలను సృష్టించి మరీ రుణాలు తెచ్చి ఎగవేయటం వంటి కళల్లో సిద్ధహస్తులైన బాబు ముఠా మళ్లీ ఆ పనిలో పడ్డారు. దీన్లో భాగంగా అధిక వడ్డీల ఎర వేసి అప్పుల రూపంలో డబ్బులు సేకరించే బాధ్యత తన బినామీ అయిన మాజీ మంత్రి నారాయణకు అప్పగించారు. ఇక ఎడాపెడా రుణాలు తీసుకుని బ్యాంకులకు టోపీ పెట్టిన చరిత్ర సుజనా చౌదరిది. దాదాపు 10వేల కోట్లకుపైగా వివిధ బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనాను అరెస్టు చేస్తారన్న భయంతోనే 2019లో ఓడిపోయిన వెంటనే బీజేపీలోకి పంపారు చంద్రబాబు. గంటా శ్రీనివాసరావుదీ రుణాలు ఎగవేసిన బాపతే. వీళ్లు మళ్లీ అదే పనిలో పడ్డారని విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆర్థిక నేరగాళ్లతో బ్యాంకులకు కన్నమేసి.. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబుతో ఆది నుంచి ఆర్థిక నేరగాళ్లు పెనవేసుకుపోయారు. ఆది నుంచీ పలువురు బినామీలను పెంచి పోషిస్తూ వచ్చిన చంద్రబాబు... రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలోకి వచ్చినపుడు ప్రభుత్వ సహజ వనరులను, వ్యవస్థలను వీళ్లకు అప్పగించేశారు. అంతా అందినకాడికి దోచుకున్నారు. ఇది చాలదన్నట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీరు బ్యాంకులను కూడా అధికారికంగా దోచుకున్నారు. ఎడాపెడా నకిలీ కంపెనీలు పెట్టి... వాటి పేరిట కోటానుకోట్ల రుణాలు తీసుకున్నారు. ► వివిధ బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్ల రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో సుజనా చౌదరిపై 2018–19లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టింది. గత ఎన్నికల ఫలితాలు వెలువడగానే టీడీపీని వీడి బీజేపీ పంచన చేరిన సుజనా... ఇప్పటికీ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలు సాగిస్తూనే ఉన్నారని, చంద్రబాబుకు ఇం‘ధనం’ చేకూర్చుతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ► ప్రత్యూష కంపెనీ పేరుతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వివిధ బ్యాంకుల నుంచి రూ.141 కోట్ల రుణాన్ని తీసుకోగా వడ్డీతో కలిపి రూ.203.62 కోట్లకు చేరాయి. వాటిని చెల్లించకుండా మొండికేస్తున్న గంటా మరిన్ని ఆర్థిక సంస్థలను కొల్లగొడుతూ టీడీపీకి ఎన్నికల వ్యయాన్ని భారీ ఎత్తున సమకూరుస్తున్నారని సమాచారం. రిత్విక్కు పందేరం.. 2019 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కేసుల నుంచి తప్పించుకునేందుకు సుజనా చౌదరితో పాటు తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ ను కూడా బీజేపీ గూటికి చేర్చారు చంద్రబాబు. ఆయన బీజేపీలో ఉంటున్నా తరిస్తున్నది మాత్రం చంద్రబాబు సేవలోనే. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.వేల కోట్ల విలువైన పనులను సీఎం రమేష్ సంస్థ రిత్విక్ ప్రాజెక్టŠస్కు కట్టబెట్టిన చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ తోపాటు సీఎం రమేష్కు సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు సంస్థల ద్వారా బ్యాంకుల నుంచి భారీగా రుణాలను సేకరిస్తూ టీడీపీకి ఇం‘ధనం’ సమకూర్చుతున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పోలవరాన్ని పాతిపెట్టి! పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులను 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్కు కట్టబెట్టింది. దాన్ని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. అర్హత లేని ట్రాన్స్ట్రాయ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానానికి రూ.వందల కోట్లు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. అనంతరం 2014 ఎన్నికల్లో భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చాలనే షరతుతో రాయపాటిని చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో ప్రభుత్వం నుంచి తీసుకున్న డబ్బులతోపాటు పోలవరం పనుల కోసం బ్యాంకుల నుంచి ట్రాన్స్ట్రాయ్ తీసుకున్న రుణాన్ని సైతం ఎన్నికల ఖర్చుల కోసం చంద్రబాబు వసూలు చేశారని, అలా ఇచ్చేశాం కాబట్టే తాము దివాలా తీయాల్సి వచ్చిందని ఇటీవల ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు బహిరంగంగా ప్రకటించటం తెలిసిందే. చంద్రబాబు కమిషన్ల కక్కుర్తితో పోలవరం ప్రాజెక్టుతో పాటు తాము కూడా నాశనమయ్యామని ఆయన స్పష్టంగా చెప్పారు. కాలేజీలో నారాయణ ‘కౌంటర్’ 2014 వరకూ చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తూ బినామీగా వ్యవహరించిన నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ.. అధిక వడ్డీల ఆశ చూపిస్తూ భారీ ఎత్తున రుణాలను సేకరించి చంద్రబాబుకు అందిస్తుంటారు. టీడీపీ హయాంలో నారాయణకు అత్యంత కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించిన చంద్రబాబు ఆయనతో కలసి అమరావతి భూకుంభకోణంలో భారీ ఎత్తున దోచేశారు. అయితే ఎన్నికలు ముగిశాక అధిక మొత్తంలో అప్పులు ఇచ్చిన ఇద్దరు బడా వ్యాపారులు, మార్వాడీలకు నారాయణ టోపీ పెట్టారనే చర్చ నెల్లూరులో భారీ ఎత్తున సాగింది. ఇప్పుడు కూడా నారాయణ తనకు అలవాటైన రీతిలో అధిక వడ్డీల ఎర వేసి వ్యాపారులు, మార్వాడీలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున రుణాలు సేకరిస్తున్నారు. నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో వారం క్రితం నాలుగు కౌంటర్లు తెరిచి నూటికి 5 రూపాయల వడ్డీ ఆశ చూపించి... (అంటే ఏడాదికి 60 శాతం) వ్యాపారులు, మార్వాడీల నుంచి దాదాపు రూ.650 కోట్లు సమీకరించారని సమాచారం. దీన్ని రహస్య ప్రాంతానికి తరలించిన నారాయణ... అక్కడి నుంచి చంద్రబాబు సూచించిన స్థావరాలకు చేరవేయడంలో నిమగ్నమయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: నారాయణపై మరదలు ఫిర్యాదు
సాక్షి,నెల్లూరు: మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియ నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనను నారాయణ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ప్రియ పేర్కొన్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తనను పిచ్చిదానిలా క్రియేట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంతకుముందు ముందు ప్రియ ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. నారాయణపై ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ప్రియను ఇంటి వద్ద ఆమె భర్త మణి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వీరి చెర నుంచి తప్పించుకుని మరీ ప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి.. ఏపీ ఎన్నికల వరకు బాబు జిమ్మిక్కులు తప్పవా -
నారాయణ మెడికల్ కాలేజీలో ఏసీబీ తనిఖీలు
-
నారాయణ విద్యా సంస్థలపై ఎన్నికల కమిషన్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
సానుభూతి కోసం కుమార్తెతో నారాయణ ప్రచారం చేయిస్తున్నారు: అనిల్
-
పరువు పాయె..మాజీ మంత్రి నారాయణకు షాక్
-
భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్!
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భూదాహానికి బడుగు, బలహీన వర్గాల అసైన్డ్ భూములు సమిధలయ్యాయి. ప్రభుత్వ భూములూ గల్లంతయ్యాయి. చంద్రబాబు, నారాయణ, వారి బినామీలు, సన్నిహితుల హస్తగతమయ్యాయి. ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ వర్తించే 1,072 ఎకరాల అసైన్డ్ భూములు.. రూ.760.25 కోట్ల ప్యాకేజీ వర్తించే 328 ఎకరాల ప్రభుత్వ భూములు.. వెరసి భూసమీకరణ ప్యాకేజీ కింద అమరావతిలో దాదాపు రూ.5వేల కోట్ల విలువైన స్థలాలను చంద్రబాబు, నారాయణలు తమ గుప్పెట పట్టడం నమ్మలేని నిజం. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఆధారాలతో సహా ఆ భూదోపిడీ బట్టబయలైంది. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రూ.5వేల కోట్ల భూదోపిడీ.. ఇలా నాలుగు కేటగిరీల కింద దోపిడీ చేసిన 1,072 ఎకరాల అసైన్డ్ భూములకు ప్యాకేజీ ద్వారా చంద్రబాబు, నారాయణ గ్యాంగ్ ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకుంది. ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకుని మరో రూ.760.25 కోట్ల భూసమీకరణ ప్యాకేజీ పొందారు. మొత్తం భూసమీకరణ ప్యాకేజీ కింద రూ.5వేల కోట్ల భూములు కొల్లగొట్టారు. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకోసం రాజధాని భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన వారు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్డీడ్ల ద్వారా విక్రయించేలా కథ నడిపారు. అనంతరం.. అసైన్డ్ భూములను కూడా ఆరు కేటగిరీల కింద విభజించి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఈ జీఓను తీసుకొచ్చారు. అంతేకాదు.. ఏకంగా కోర్టును కూడా మోసంచేసి తమ పన్నాగాన్ని అమలుచేశారు. చట్ట ప్రకారం.. 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కాబట్టి అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చేశారు. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే ఆ జీఓను జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ భూములూ హాంఫట్.. ఇక రాజధాని కోసం అమరావతి పరిధిలోని ప్రభుత్వ భూములను కూడా చంద్రబాబు, నారాయణ ముఠా కొల్లగొట్టింది. ఎవరి ఆ«దీనంలోనూ లేని ప్రభుత్వ భూములను గుర్తుతెలియని వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. మొత్తం 328 ఎకరాల ప్రభుత్వ భూములు తమ బినామీలు 522 మంది ఆ«దీనంలో ఉన్నట్లుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేశారు. తద్వారా రూ.760.25 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. బినామీల ద్వారా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు.. నారా చంద్రబాబు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) రావెల కిశోర్బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) తెనాలి శ్రావణ్కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) మండల ఎస్ఎస్ కోటేశ్వరరావు (రియల్టర్) మండల రాజేంద్ర (రియల్టర్) టకేవీపీ అంజనీకుమార్ (రియల్టర్) దేవినేని రమేశ్ (రియల్టర్) టబొబ్బా హరిచంద్రప్రసాద్ (రియల్టర్) హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) టపొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) దోనేపూడి దుర్గాప్రసాద్ (రియల్టర్) అసైన్డ్ భూదోపిడీలో నిందితులు ఏ1 : నారా చంద్రబాబు ఏ2 : పొంగూరు నారాయణ మరో 38 మంది సెక్షన్లు : ఐపీసీ సెక్షన్లు 420, 506, 166, 167, 217, 120 (బి) రెడ్విత్ 34, 35, 36, 37లతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం–1977 కింద ఎఫ్ఐఆర్ నమోదు. -
నారాయణపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ సంచలన ఆరోపణలు
-
మాజీ మంత్రి నారాయణపై అనిల్ ఫైర్
-
నీకు దమ్ముంటే చర్చకు రా.. అనిల్ కుమార్ సవాల్
-
నీకు దమ్ముంటే చర్చకు రా..అనిల్ కుమార్ సవాల్
-
సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్ గెలిచింది: నారాయణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇదే సమయంలో మిగతా రాష్ట్రాల్లో కూడా తమతో పొత్తు పెట్టుకుంటే గెలిచేవారని నారాయణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ పార్టీతో పొత్తు లేకపోవడంతో మిగతా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోడిందని అన్నారు. కాగా, సీపీఐ నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తమ పార్టీకి 90-100 నియోజకవర్గాల్లో దాదాపు 1000 నుంచి 10,000 ఓట్ల వరకు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తమ ఓట్లు ఎంతో కలిసి వచ్చాయని తెలిపారు. మిగితా రాష్ట్రాలో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్ఢ్లో అధికారంలో ఉందని మరి అక్కడ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. అలాగే మధ్యప్రదేశ్లో కూడా గతంలో వచ్చిన సీటలును ఆ పార్టీ కోల్పోయిందని అన్నారు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. ఏఐసీసీ ముఖ్యంగా దీనిని గమనించాలని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కూడా సీపీఐతో పొత్తు పెట్టుకొని ఉంటే తమ పార్టీ ఓట్లు కూడా పడేవని, ఇవి ఎంతగానో కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చేవని కామెంట్స్ చేశారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. కాంగ్రెస్ గెలిచినా.. ఓడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బీజేపీ ఓటమే తమకు ముఖ్యమన్నారు. ఇండియా భాగస్వామ్య కూటమిలోని పార్టీలను కలుపుకుపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని నారాయణ చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల్లో సీపీఐ పోటీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేరళలో నాలుగు, తమిళనాడులో రెండు, పశ్చిమ బెంగాల్లో మూడు, ఛత్తీస్గఢ్లో బస్తర్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కో లోక్సభ స్థానంలో సీపీఐ పోటీ చేయనున్నట్టు నారాయణ వెల్లడించారు. ఎన్నికల అవగాహనలో భాగంగా మధ్యప్రదేశ్లో ఒక్క స్థానంలో సీపీఐకి అఖిలేష్ యాదవ్ మద్దతునిస్తున్నారన్నారు. కాంగ్రెస్తో మద్దతు కుదిరితే వారితో కలిసి పోటీ చేస్తామన్నారు. -
టీడీపీ నేత నారాయణ ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ
-
మంత్రివర్గంలో చేరేందుకు సీపీఐ ఆసక్తి?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో సీపీఐ నేతలు మంగళవారం ఎల్లా హాటల్లో భేటీ అయ్యారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ నేతలు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి తదితరులు రేవంత్ను కలిసి అభినందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, తమను మంత్రివర్గంలోకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీనిపై చాడ వెంకటరెడ్డిని ప్రశ్నించగా, తమకు అలాంటి ఆలోచన లేదనీ, అయితే కాంగ్రెస్ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని మాత్రమే చెప్పామన్నారు. అంటే సీపీఐకి ఈ ప్రభుత్వంలో నేరుగా భాగస్వామ్యం కావాలన్న ఆలోచన ఉన్నట్లుగా సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క సీటు గెలిస్తే మంత్రి పదవి వస్తుందా? అయితే, ఒక్క సీటు గెలిచిన సీపీఐకి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి ఉండదనీ, కాంగ్రెస్లో ఉన్న వారికే సర్దుబాటు చేయడం కష్టమని అంటున్నారు. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వంటి వారు ఉన్నప్పుడు సీపీఐకి ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రతిపాదిస్తే ఆలోచిస్తాం: నారాయణ మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టూరిజం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై జ్యూడీషియల్ విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం బయటపడుతుందని భావించి విలువైన ద్రస్తాలను తగులబెట్టారని విమర్శించారు. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంకుచిత వైఖరిని ప్రదర్శించిందని విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రమాదకరమని, వ్యవస్థలను నాశనం చేస్తోందని విమర్శించిన ఆయన ఇండియా కూటమి బలపడాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తాను అసెంబ్లీలో కమ్యూనిస్టు గొంతుకగా, అన్ని కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధిగా ఉంటానన్నారు. -
మీరు నాటిన చెట్టును మీరే నరుక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు ఆయన తండ్రి, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వర్రావు మద్దతు పలుకుతూ వివిధ రకాలుగా ప్రచారం చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పువ్వాడ నాగేశ్వర్రావుకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘మీకు ఇలాంటి ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉన్నా మీ గత చరిత్ర, మీరు పార్టీకి చేసిన సేవరీత్యా మనసంగీకరించక రాయలేదు. ఇంకా భరించడం నా వల్ల కాదు’అని నారాయణ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘మీ కుమారుడు అజయ్కుమార్ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించింది మొదలు మీలో మౌలిక మార్పులు వచ్చాయి. మీరు సీపీఐలో ప్రముఖ పాత్ర వహించారు. రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలో సీపీఐని ఉన్నత స్థాయికి తెచ్చారు. మీరు ఏ సభలకు వచ్చినా పార్టీ మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. చివరకు ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయం ముందు కూడా మీ ఫ్లెక్సీ నేటికీ ఉంది. ఇంత గౌరవం పొందిన మీరు సీపీఐకి ఇస్తున్న మర్యాద ఏది? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ మీ కుమారుడిని సమర్థించారు తప్ప, సీపీఐ తీసుకున్న విధానాలను బహిరంగంగా సమర్థించలేదు. తాజాగా కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తే అక్కడ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోటీకి పెట్టింది. కనీస మర్యాదకైనా కొత్తగూడెం స్థానం బలపడే విధంగా ఈ ఎన్నికల్లో సీపీఐ విధానాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటన చేయకపోగా, ఏ పద్ధతుల్లోనూ మీరు సమర్ధించలేదు. మీ కుమారుడు, బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్కుమార్ను బలపరుస్తూ వివిధ పద్ధతుల్లో ప్రచారం చేశారు’అని నారాయణ విమర్శించారు. ‘మీరు నాటిన చెట్టుని నరుక్కుంటున్నారు. మీకు మీరు నరుక్కుంటే నాకు అభ్యంతరం లేదు. పార్టీ కార్యకర్తలను, పార్టీ ప్రభావాన్ని కించపరచకండి. జిల్లా పార్టీ కార్యాలయం ముందున్న మీ ఫ్లెక్సీని మీరే తీయించేసుకోండి’అని నారాయణ హితవు పలికారు. -
కేటీఆర్పై సీపీఐ నారాయణ విమర్శలు
-
టీడీపీ నారాయణను ఏకిపారేసిన మహిళా..
-
చంద్రబాబు బెయిల్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement