-
ట్యాపింగ్లో కదలిక!
నిజామాబాద్, కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో జిల్లాలోనూ ప్రకంపనలు వస్తున్నాయి. ప్రతిపక్షాల కదలికలను పసిగట్టి, చెక్ పెట్టడానికి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటెలిజెన్స్ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ట్యాపింగ్కు సహకరించిన జిల్లాకు చెందిన అధికారులు, నాయకుల్లో గుబులు మొదలైంది.అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కూడా ఇక్కడినుంచి బరిలో నిలిచారు. రేవంత్రెడ్డి తరఫున ఆయన సోదరుడు కొండల్రెడ్డి ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకున్నారు. మరోవైపు బీజేపీ అభ్యరి్థగా కె.వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో వెంకటరమణారెడ్డి వైపు ఓటర్ల మొగ్గు ఉన్నట్లు సర్వేల ద్వారా తెలుసుకుని బీజేపీతోపాటు కాంగ్రెస్లపైనా అప్పటి ప్రభుత్వం నిఘా పెట్టింది.వెంకటరమణారెడ్డి, కొండల్రెడ్డిల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించింది. కాగా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఏఎస్పీ భుజంగరావు వాగ్మూలాన్ని సిట్ ఇటీవల రికార్డు చేసింది. బీఆర్ఎస్ను వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ పనిచేసినట్లు ఆయన అంగీకరించడం గమనార్హం. ఆయన కామారెడ్డి నియోజకవర్గంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వివరాలనూ వెల్లడించినట్లు తెలిసింది.హోటల్లో వార్ రూం.. ప్రత్యర్థుల కదలికలను తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ను కామారెడ్డికి పంపారని, ప్రతిపక్షాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేశారని ప్రాథమిక విచారణలో సిట్ గుర్తించింది. వార్ రూంను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరి పాత్ర ఏమిటనే పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించి రెండు నెలల క్రితమే నివేదికను ‘సిట్’కు అందించినట్లు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యవహారాలపై నిఘా పెట్టడం కోసం కామారెడ్డికి వచ్చిన ట్యాపింగ్ గ్యాంగ్ జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో నాలుగు గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.అక్కడే వార్ రూంను ఏర్పాటు చేసి తమ కార్యకలాపాలను నడిపించారు. అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం, ఆర్థిక మూలాలు, ఇతర విలువైన సమాచారాన్ని తెలుసుకుని అధికార పక్ష నేతలకు అందించడం లాంటివి చేశారని తెలుస్తోంది. వార్ రూం ఇన్చార్జీగా వ్వవహరిస్తూ, ఇక్కడకు వచ్చిన గ్యాంగ్కు అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పంచిన ముఖ్య నేతలు ఎవరు, ఇక్కడి అధికారులు ఎవరైనా సహకారం అందించారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని బీఆర్ఎస్ నేతలు, వారికి సహకరించిన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.ఆరోపణలకు బలం..ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు బలం చేకూరేలా ఎన్నికల సమయంలో పలు సంఘటనలు చో టు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మూడు రోజుల ముందు జిల్లా కాంగ్రెస్లో ముఖ్య నాయుకుడైన గూడెం శ్రీనివాస్రెడ్డికి చెందిన వ్యాపార కార్యాలయంపై అధికారులు దాడులు చేశారు. ఇందులో రూ.58 లక్షలు ప ట్టుబడ్డాయి. దేవునిపల్లి ప్రాంతంలో సీఎం రే వంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి నివాసం ఉన్న ఇంట్లో కూడా ఆకస్మిక తనిఖీలు జరిగాయి.ఆయనను గృహ నిర్భంధం కూడా చేశారు. అంతే కాకుండా విద్యానగర్కాలనీలో నివసించే ప్ర స్తుత మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ ఇంటిపై కూడా దాడులు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వా గ్వాదం కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్తోనే వివరాలు తెలుసుకుని దాడులు చేశారని సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. -
స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
నిజామాబాద్నాగారం: స్కానింగ్ కోసం వచ్చే మహిళల అశ్లీల వీడియోలను రికార్డు చేస్తున్న ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. స్కానింగ్ సెంటర్కు వచ్చే మహిళల ఫొటోలు, వీడియోలు తీసి.. వారికి ఫోన్లు చేసి సోషల్ మీడియాలో పెడతానని వేధించడం సంచలనంగా మారింది. సెంటర్లోని ఓ ఆపరేటర్ ఈ అకృత్యాలకు పాల్పడడం కలవరం సృష్టిస్తోంది. దీంతో స్కానింగ్ సెంటర్లలో మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నా యి. నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో కొంత కాలంగా ఈ తతంగం కొనసాగుతుండడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అందులో పనిచేసే ఆపరేటర్ ఒక్కరే చేశారా..? వెనుక ఉండి ఎవరైనా చేయించారా అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. తాజాగా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సీరియస్గా స్పందించి నోటీసులివ్వ డంతో పాటు.. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అధికారుల తనిఖీస్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల చిత్రీకరణ చేసి బ్లాక్ మెయిల్కు పాల్పడిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి స్కా నింగ్ సెంటర్కు నోటీసులు జారీచేసి నలుగురి తో కూడిన విచారణ కమిటీ వేశారు. కమిటీలో జిల్లా జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి రేడియోలాజిస్ట్ డాక్టర్ శ్రావణి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అంజనాదేవి, గైనకాలజిస్టులు డాక్టర్ అనుపమ, డాక్టర్ లావణ్యలున్నారు. వారం రోజుల్లో విచారణ చేసి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. అలాగే సీపీ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. జరిగిందిలా.. నిజామాబాద్ నగరంలో పదుల సంఖ్యలో స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అయితే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ప్రారంభమైన కొన్ని రోజులకే అశ్లీల ఫొటోలు, వీడియోల చిత్రకరణకు తెరలేపారు. ఇందులో పనిచేసే ఓ ఆపరేటర్ స్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల చిత్రాలను, వీడియోలను గుట్టుచప్పుడు కాకుండా తీసేవాడు. అనంతరం మహిళలకు ఫోన్లు చేసి వీడియోలు సోషల్ మీడి యాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. పదుల సంఖ్యలో మహిళలతో ఇలా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ తతంగం కొంత కాలంగా కొనసాగుతోంది. ఈ విషయం స్కానింగ్ సెంటర్లో నిర్వాహకులకు, వైద్యులకు తెలిసే జరిగిందని ఆరోపణలున్నాయి. ఓ ఆపరేటర్ ఇలాంటి దుశ్యర్యలకు పాల్పడుతున్నాడంటే నిర్వాహకులు పసిగట్టలేదంటే నమ్మేటట్లు కనిపించడంలేదు. గతంలోనూ ఇలా చేసినా నిర్వాహకులు తొలగించకపోవడంతోనే మరింత రెచ్చిపోయినట్లు సమాచారం. సీపీని కలిసిన ఐఎంఏ నాయకులుసీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో పోలీసులు తనిఖీలు చేసి విచారణ చేపట్టారు. పలుమార్లు స్కానింగ్సెంటర్లో ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకున్నట్లు సమాచారం. సద రు ఆపరేటర్ను సైతం అరెస్ట్ చేశారు. అయితే ఐఎంఏ నాయకులు ఎంటరై నిర్వాహకులకు మద్ద తుగా వెళ్లి సీపీని కలిశారు. ఆపరేటర్ తప్పు చేస్తే నిర్వాహకులకు సంబంధం లేదని చెప్పినట్లు సమా చారం. అయితే సీపీ స్పందిస్తూ ఐఎంఏ నాయకులపై మండిపడ్డారు. తప్పు చేసిన వారికి అండగా నిలబడడంపై ఆగ్రహించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన వారి్నంగ్ ఇచ్చారు. వివరాలు ఇవ్వాలని సీపీ కార్యాలయానికి వైద్యశాఖ లేఖ సీపీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో విచారణ చేపట్టగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ నెల మొదటి వారంలో విన్నవించారు. కానీ వివరాలు రావడంలో ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ కారణంగా సీపీ, అధికారులు బిజీబిజీగా ఉన్నారు. దీంతో వివరాలు ఇంకా శాఖకు రాలేదని వైద్యాధికారి తెలిపారు.ఫిర్యాదుతో వెలుగులోకి.. అయప్ప స్కానింగ్ సెంటర్లో మహిళల అశ్లీల చిత్రాలు, వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇందులో తమ ఇంటి మహిళల వీడియో కనిపించడంతో ఓ వ్యక్తి నేరుగా స్కానింగ్ సెంటర్కు వెళ్లి ప్రశ్నించారు. అనంతరం నిజామాబాద్ ఒకటో టౌన్లో ఈనెల 7న రాతపూర్వగా ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. -
ఆ గట్టూ నాదే..! ఈ గట్టూ నాదే..!!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ, ఆర్మూర్లలో పరిస్థితి ఒకలా ఉండగా, జిల్లా కేంద్రాలైన నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి సెగ్మెంట్లలో షబ్బీర్ అలీ పెత్తనం పట్ల పలువురు మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు గుస్సా అవుతున్నారు. షబ్బీర్ పేరు చెప్పుకుని కొందరు నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన షబ్బీర్ అలీ ఓటమి చెందారు. ఓడినవారే నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జిగా ఉంటూనే తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలోనూ పెత్తనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో షబ్బీర్కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంకు పదవి వచ్చింది.నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి దక్కించుకోలేకపోయిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మరోవైపు బీసీ కోటాలో కేబినెట్ రేసులోనూ ఉన్నారు. మహేశ్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో షబ్బీర్ కామారెడ్డిలో పెత్తనం చేస్తూనే నిజామాబాద్ అర్బన్లో హవా నడిపిస్తుండటం పట్ల ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్లో ఉండి పనిచేసిన పలువురు రౌడీషీటర్లను సైతం షబ్బీర్ కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డిలోనూ పలువురు అవకాశవాదులను పార్టీలోకి చేర్చుకుని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు అన్యాయం చేస్తున్నారని కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు. మరోవైపు షబ్బీర్ తమ్ముడు, మేనల్లుడు, ఇతర బంధువులు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు సీనియర్ కార్యకర్తలు పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం గమనార్హం. -
వడగళ్ల వాన బీభత్సం
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయా యి. కోతకొచ్చిన మామిడి కాయలు రాలిపోయా యి. ఉరుములు మెరుపులతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు నందిపేట మండలం ఖుద్వాన్పూర్లో మూడు గేదెలు చనిపోయాయి. పలు మండలాల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది. వడగళ్లు, గాలుల ప్రభావంతో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో కోతదశకు వచ్చిన వరి గింజలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 25 శాతం పంట కోయాల్సి ఉంది. అకాల వర్షానికి వెయ్యి ఎకరాలకు పైగా వరికి నష్టం జరిగే అవకాశముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఎదిగిన నువ్వు పంట దెబ్బతిన్నది. కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దయింది. వరి కుప్పలపై కప్పిన టార్పాలిన్లు గాలులకు కొట్టుకుపోయాయి. వడగళ్ల వర్షానికి ఇందల్వాయి, ధర్పల్లి, నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్, మోపాల్, ఆలూ ర్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, రెంజల్ మండలాల్లోని కల్లాలు నీటమునిగాయి. పలుచోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. వారం రోజులుగా అకాల వర్షాలు పంటలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు తడిసిన వడ్లకు మొలకలు వచ్చే అవకాశముంది. కల్లాల్లో నేడో, రేపో అమ్ముడుపోయే ధాన్యం పూర్తిగా తడిసిముద్ద కావడంతో రంగుమారిన పంటను ఎలా అమ్ముడుపోతుందోనని రైతులు దిగులు చెందుతున్నారు. వర్షానికి నేల మెత్తగా మారడంతో వరికోతలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. 30 రోజుల్లో మూడుసార్లు... గత 30 రోజుల్లో మూడుసార్లు వడగళ్ల వర్షం పంటలను దెబ్బతీసింది. మార్చి 16న కురిసిన వానకు జిల్లాలో 6,058 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నెల 8న కురిసిన వర్షానికి 1,726 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ప్రస్తుతం కురిసిన వడగళ్ల వా నకు వరి, మామిడి, నువ్వు పంటలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యవసాయాధికారులు శని వారం పంటనష్టం వివరాలను సేకరించనున్నారు. వందల ఎకరాల్లో దెబ్బతిన్న వరి నీటమునిగిన కల్లాలు, తడిసిన ధాన్యం, రాలిన మామిడి కాయలు ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు -
ఇందూరు అందరిది!
నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ లోక్సభ స్థానానికి తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో 3,35,863 మంది ఓటర్లు ఉన్నారు. మొదట్లో ఈ నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఉండేవి. 2009లో ఏర్పడిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడిన జహీరాబాద్ లోక్సభ పరిధిలోకి వెళ్లాయి. దీంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చాయి. దీంతో నిజామాబాద్ లోక్సభ పరిధిలో ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం 14,96,593 మంది ఓటర్లు ఉన్నారు. 17 సార్లు జరిగిన ఎన్నికల్లో గెలుపు వీరిదే.. నిజామాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ బోణీ కొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎఫ్(పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థులు విజయం సాధించగా.. నిజామాబాద్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి హరీశ్చంద్ర హెడా విజయం సాధించాడు. 1957, 1962లో జరిగిన వరుస ఎన్నికల్లో ఆయనే విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.నారాయణరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1971, 1975, 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రాంగోపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1984, 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన టి.బాలాగౌడ్ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 1991లో టీడీపీ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి విజయం సాధించగా, 1996లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మచరణ్రెడ్డి గెలిచారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన గడ్డం గంగారెడ్డి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుయాష్కీగౌడ్ తొలిసారి గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగగా.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ పరిధిలోకి వచ్చి చేరాయి. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసిన మధుయాష్కీ గౌడ్ను ప్రజలు గెలిపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మారిన పరిస్థితి2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. నాడు జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బరిలో నిలిచి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టింది. ఈ ఎన్నికలు ప్రతిష్టత్మకంగా జరిగాయి. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇందూరు లోక్సభకు రాజకీయ ప్రాధాన్యం నెలకొంది. ఇక 2019లో జరిగిన ఎన్నిక చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఎలక్షన్ దేశం దృష్టిని నిజామాబాద్వైపు తిప్పింది. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 185 మంది పోటీ చేశారు. దీంతో ప్రత్యేకంగా బెంగళూరు నుంచి ఈవీఎంలను తెప్పించి ఎన్నికలు నిర్వహించారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్తో 173 మంది రైతులు నామినేషన్ వేసి పోటీకి దిగారు. ఇక బీఆర్ఎస్ నుంచి రెండో సారి కవిత బరిలో దిగగా.. కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ పోటీలో నిలిచారు. తొలిసారి ధర్మపురి అర్వింద్ బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఇక ప్రస్తుతం 18వ సారి ఎన్నికలు జరుగుతుండగా బీజేపీ నుంచి మరోసారి అర్వింద్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో నిలిచారు. మే 13న పోలింగ్ జరుగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరుగనుండడంతో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. అన్ని పార్టీలను ఆదరించిన పార్లమెంట్ ఓటర్లు ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన ఇద్దరు నేతలు ఇండిపెండెంట్నూ గెలిపించిన ప్రజలు 1952లో తొలిసారి ఎన్నికలు 2019 ఎన్నికల బరిలో 185 మంది దేశంలో హాట్టాపిక్గా మారిన నిజామాబాద్ పేరు నిజామాబాద్ లోక్సభ స్థానం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఓటర్లు అన్ని పార్టీలను ఆదరించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిని సైతం గెలిపించిన చరిత్ర ఇందూరుది. ఇద్దరు నేతలకు ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు. అయితే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. 1952లో తొలిసారి ఎన్నికలు జరగగా.. 1967 మినహా.. 1991 వరకు హస్తం పార్టీ హవాయే కొనసాగింది. అనంతరం టీడీపీ ఏర్పాటుతో ఆ పార్టీ విజయపరంపరకు గండిపడింది. 1996లో, 2004, 2009లో మళ్లీ గెలిచినా.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోయింది. 2014 బీఆర్ఎస్, 2019లో బీజేపీ గెలుపొందాయి. -
అర్వింద్, బాజిరెడ్డిల నామినేషన్
సుభాష్నగర్: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రెండోరోజు శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు మొత్తం ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెండు సెట్ల నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. వీరితోపాటు బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి శ్రీనివాస్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్, స్వతంత్ర అభ్యర్థిగా రాగి అనిల్, నామినేషన్ పత్రాలు సమర్పించారని రిటర్నింగ్ అధికారి వివరించారు. కాగా రెండు రోజులకు మొత్తం మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్ బీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలుచేశారు. బిగాల గణేశ్గుప్తా కారు నడపగా, అభ్యర్థి బాజిరెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ ఎంపీ సురేశ్రెడ్డితో కలిసి ఒక సెట్ నామినేషన్ వేశారు. మరో సెట్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో పాటు జగిత్యాల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బోధన్ బీఆర్ఎస్ ఇన్చార్జి అయేషా ఫాతిమాతో కలిసి దాఖలు చేశారు. బాజిరెడ్డి కుటుంబ సభ్యులతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నా.. ఈసీ నిబంధనల మేరకు వారు బయటే వేచి ఉన్నారు. పసుపు రైతులతో కలిసి బీజేపీ అభ్యర్థి.. బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్ ధర్మపురి పసుపు రైతులతో కలిసి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మెడలో పసుపు కొమ్ముల దండ, స్వయంగా కారు నడుపుతూ అర్వింద్ నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. పసుపు రైతుల సమక్షంలో, వారి ఆశీర్వాదంతో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. పసుపు రైతులు సమకూర్చి ఇచ్చిన డబ్బుతో నామినేషన్ డిపాజిట్ చెల్లించానని, చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైతులు పండించే పసుపు, వరి, మామిడి, మొక్కజొన్న, చెరుకు, ఇతరత్రా పంటలకు విత్తనాల నుంచి మార్కెటింగ్ సౌకర్యం వరకూ అన్ని చర్యలకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయా పంటల ప్రాసెసింగ్, ప్యాకేజీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని, స్వయం ఉపాధి మహిళలకు వాల్యూయాడెడ్ సర్వీస్లో భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. దేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మారుస్తామని, తద్వారా యువతకు ఉపాధి పెరుగుతుందని తెలిపారు. గల్ఫ్ వలసలు ఆపుతామని, అక్కడ ఉన్న వారందరికీ ఉపాధి కల్పించి వాపస్ వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పసుపు రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. రెండో రోజు ఆరుగురి నామినేషన్ ఇప్పటి వరకు 8 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు -
కాంగ్రెస్తోనే ప్రజా సంక్షేమ పాలన
బోధన్: ప్రజా సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతోనే సాధ్యమవుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగర కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో సాలూర మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి ఆమె భర్త పార్టీ సీనియర్ నాయకుడు బుద్దె రాజేశ్వర్, భవానీపేట మాజీ సర్పంచ్ కృష్ణ, 100 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బోధన్కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ సావిత్రి భర్త గంగాధర్ గౌడ్ కాంగ్రెస్లో శుక్రవారం చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్, పీసీసీ డెలిగెట్ గంగాశంకర్, పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వర్రావు, మందర్న రవి, నాయకులు గణపతిరెడ్డి, నరేందర్రెడ్డి, నాయకులు ఇల్తెపు రమేశ్, కేజీ గంగారాం తదితరులు పాల్గొన్నారు. ● బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ● కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ బోధన్ ఎంపీపీ సావిత్రి రాజేశ్వర్ -
బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆస్తులు
సుభాష్నగర్: బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తనతో పాటు కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తుల వివరాలను వెల్లడించారు.● బాజిరెడ్డి గోవర్ధన్ వద్ద ప్రస్తుతం రూ.2 లక్షల నగదు, ఆయన భార్య వినోద వద్ద రూ.2 లక్షల నగదు ఉంది. ● బాజిరెడ్డి గోవర్ధన్ పేరిట రూ.కోటి 96 వేల చరాస్తులు, స్థిరాస్తులు రూ.2.80 కోట్లు ఉన్నాయి. భార్య పేరుపై రూ.13.41 లక్షల చరాస్తులు, రూ.35.50 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. ● బాజిరెడ్డి పేరుపై ఎలాంటి అప్పులు, బ్యాంకు రుణాలు లేవు. ● బాజిరెడ్డి గోవర్ధన్తోపాటు ఆయన భార్య పేరుతో హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్లో ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. నిజా మాబాద్ జిల్లాలో వ్యవసాయ, నాన్ అగ్రికల్చర్ భూములు ఉన్నా యి. నిజామాబాద్, చీమన్పల్లిలో రెండు సొంత ఇండ్లు ఉన్నాయి. ● బాజిరెడ్డి గోవర్ధన్కు 50 తులాలు, ఆయన భార్యకు మరో 50 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ● బాజిరెడ్డికి రూ.30 లక్షల విలువ చేసే జీపు ఉంది. -
పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం
రెంజల్: పూడ్చిపెట్టిన మృతదేహానికి కొల్లూర్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండలంలోని సాటాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీరయ్య(48) బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లాడు. అక్కడ భవన నిర్మా ణ కార్మికుడిగా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పనిచేస్తున్న ప్రదేశంలో భవనంపై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనపై సైబరాబద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూర్ పీఎస్లో కేసు నమోదైంది. గాయపడిన గీరయ్యను కుటుంబీకులు గ్రామానికి తీసుకొచ్చి వైద్య చికిత్సలు అందించారు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ 15 రోజుల క్రితం మృతిచెందాడు. కుటుంబీకులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న కొల్లూర్ పోలీసులు శుక్రవారం గ్రామానికి చేరుకొని కేసు విషయమై పూడ్చిపెట్టిన మృతదేహానికి డాక్లర్లు, ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించారు. -
బోధన్–బీదర్ రైల్వే లైన్కు కృషి చేస్తా
రుద్రూర్: బోధన్–బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ అన్నారు. చందూర్, వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం నిర్వహించిన పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు బోధన్–బీదర్ రైల్వే లైన్ సర్వే చేయించి ఎస్టీమెట్ వేయించానని, ఆ తర్వాత ఎంపీగా వచ్చిన బీబీ పాటిల్ దాని గురించి పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బోధన్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పార్టీ బాన్సువాడ సెగ్మెంట్ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, పార్టీ మండలాల అధ్యక్షులు తోట అరుణ్కుమార్, సురేశ్బాబా, పుప్పాల శంకర్, షాహీద్, నాయకులు పాల్గొన్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ -
కూలిన చెట్లు.. విరిగిన స్తంభాలు
బోర్గాం శివారులో వర్షానికి తడిసిన ధాన్యం కుప్పలుసాక్షి, నెట్వర్క్: బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం జిల్లాలోని పలు గ్రామాల్లో శుక్రవారం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో భారీ చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో వైర్లు తెగిపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ధర్పల్లిలో విద్యుత్ స్తంభం విరిగిపోగా, గుడి తండాలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఆలూర్ మండల కేంద్రంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఇందల్వాయి మండల కేంద్రంలో వర్ష బీభత్సానికి వడ్లు, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్లపై వేసిన రేకులు ఎగిరిపోయాయి. నందిపేట మండంలోని కుద్వాన్పూర్లో పిడుగు పాటుకు మూడు గేదెలు మృతి చెందాయి. చింరాజ్పల్లిలో మామిడి చెట్లు నేలకొరిగాయి. వెల్మల్లో వడగళ్ల వానతో తాగునీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకు దెబ్బతింది. నవీపేట శివారులో చెట్టు విరిగిపడగా, అభంగపట్నం శివారులో ధాన్యం తడిసింది. రెంజల్ మండలం బోర్గాం శివారులో వర్షం తీవ్రంగా కురిసింది. ధాన్యం కుప్పలపై వేసిన టార్ఫాలిన్లు గాలులకు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసింది. దీంతో ధాన్యం కుప్పలో నిలిచిన నీటిని రైతులు తొలగించారు. నందిపేట మండలంలోని రైతుఫారం, ఎన్టీఆర్ కాలనీలో రెండు విద్యు త్తు స్థంబాలు విరిగిపోగా, వెల్మల్ శివారులో ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు విరిగిపోయాయి. మాక్లూర్ మండ లం వల్లభాపూర్ లో ధాన్యం కుప్పల్లోకి నీరు చేరడంతో రైతులు వాటి ని తొలగించారు. చింరాజ్పల్లిలో నేలకొరిగిన మామిడి చెట్టు పలు గ్రామాల్లో భారీ వర్షం తడిచిన ధాన్యం ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పు రేకులు కుద్వాన్పూర్లో పిడుగుకుపాటుకు మూడు గేదెలు మృతి -
అవిశ్వాసానికి ముందే నల్లవెల్లి చైర్మన్ రాజీనామా
ఇందల్వాయి: సొసైటీ సభ్యులు పెట్టిన అవిశ్వాసానికి ముందే నల్లవెల్లి చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. నల్లవెల్లి సొసైటీ చైర్మన్, ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్పై ఇటీవల నల్లవెల్లి సొసైటీ సభ్యులు అవిశ్వాసానికి దిగగా డీసీవో శ్రీనివాసరావు సొసైటీలో శుక్రవారం ఉదయం బలపరీక్ష నిర్వహించారు.ఇదిలా ఉండగా సొసైటీ కార్యా లయానికి చేరుకున్న సంబారి మోహన్ డీసీవోకు తన రాజీనామా లేఖను అందించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామాను ఆమోదించిన డీసీవో ఇన్చార్జి చైర్మన్గా ప్రస్తుత వైస్ చైర్మన్ రమేశ్ని నియమించారు. అనంతరం సంబారి మోహన్ మాట్లాడుతూ.. తన పదవి కాలంలో సంఘానికి, రైతులకు న్యాయం చేశానని, ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయలేదని అన్నారు. యూపీఎస్సీలో వేల్పూర్ వాసికి 196 ర్యాంకు వేల్పూర్: మండల కేంద్రానికి చెందిన జి అక్షయ దీపక్ ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియాలో 196వ ర్యాంకు సాధించాడు. దీపక్ తల్లిదండ్రులు వేల్పూర్ వాస్తవ్యులు కాగా చాలా ఏళ్ల క్రితం వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. అక్షయ దీపక్ బీటెక్, ఎంటెక్ ఐఐటీ ఖరగ్పూర్లో చదివి, సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధమై 196వ ర్యాంకు సాధించాడు. అక్షయ దీపక్ సివిల్స్లో ర్యాంకు సాధించడంపై వేల్పూర్ జెడ్పీటీసీ భారతి రాకేశ్చంద్ర, రిటైర్డు టీచర్లు గంగాధర్గౌడ్, సి.ప్రకాశ్, సయ్యద్ ఇస్మాయిల్, చంద్రశేఖర్గౌడ్, సుధాకర్, ప్రమోద్, మనోహర్, రవీందర్, సత్యనారాయణ, గంగాధర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
విద్యుత్ శాఖకు రూ.50 లక్షల ఆస్తి నష్టం
నిజామాబాద్నాగారం: వడగళ్ల వానతో విద్యుత్ శాఖకు సుమారు రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఎస్ఈ రవీందర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ దురు గాలులు, వడగళ్లకు గంటల వ్యవధిలో 10 ట్రాన్సుఫార్మర్లు, 150 వరకు విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి. కరెంట్ సరఫరాలో ఇక్కట్లు రావడంలో అధికారులు, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచే విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనిలో పడ్డా రు. పట్టణాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పల్లెలో అర్ధరాత్రి వరకు కరెంట్ సరఫరా అందిస్తామన్నారు. -
పన్నెండేళ్ల కల నెరవేరింది
సాక్షి, కామారెడ్డి: ‘ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఏపీఆర్జేసీలో స్టేట్ థర్డ్ ర్యాంకు సాధించా. నాగార్జునసాగర్లోని రెసిడెన్సియల్ కాలేజీలో సీటు వచ్చింది. 2012లో డిగ్రీ చదువుతున్నప్పుడు వ్యాసరచన పోటీలో ‘నా భారతం.. అమర భారతం’ అన్న వ్యాసం రాయగా స్టేట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరూ దేశానికి ఉపయోగపడతావంటూ మెచ్చు కున్నారు. ఐపీఎస్ కావాలని ఆరోజే నిశ్చయించుకున్నాను. పన్నెండేళ్ల నాటి కల ఇప్పుడు నిజం అయ్యింది’’ అని సివిల్స్లో 587 ర్యాంకు సాధించిన ఆర్.రజనీకాంత్ పేర్కొన్నారు. ఆరో ప్రయత్నంలో విజయం సాధించానన్నారు. ఐపీఎస్కు సెలెక్ట్ అయిన రజనీకాంత్ను శుక్రవారం కామారెడ్డి కల్కినగర్లోని ఆయన ఇంట్లో ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా రజనీకాంత్ తన సక్సెస్ వెనక శ్రమను, తన కోసం కుటుంబం చేసిన త్యాగాలను వివరించారు. రజనీకాంత్ తెలిపిన వివరాలు.. కుటుంబ నేపథ్యం.. మా సొంతూరు రాజంపేట మండలంలోని అర్గొండ. మా నాన్న రామారెడ్డిపేట సిద్దరాములు గంజ్లో గుమస్తాగా పనిచేశారు. ప్లంబర్గా, మెకానిక్గా, డ్రైవర్గా.. ఎన్నో వృత్తులు చేశారు. అమ్మ బీడీలు చుట్టేది. నాతోపాటు సోదరుడి కోసం వారు ఎంతో శ్రమించారు. చదువుల కోసం ఆస్తులు కూ డా అమ్మారు. బాగా చదివి మంచి కొలువు సాధించు బిడ్డా అంటూ నిరంతరం ప్రోత్సహించారు. విద్యాభ్యాసం.. ప్రాథమిక విద్య కామారెడ్డిలోని వాసవి స్కూల్లో, అనంతరం టెన్త్ వరకు మెదక్లో స్కూల్లో చదివా. ఏపీఆర్జేసీ రాసి ఉమ్మడి రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించి నాగార్జునసాగర్లోని రెసిడెన్షియల్ కాలేజీ లో ఇంటర్ పూర్తి చేశా. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ లో డిగ్రీ బీఏ హిస్టరీ, హానర్స్ చదివా. ఇగ్నో యూని వర్సిటీ నుంచి ఎంఏ హిస్టరీ పట్టా సాధించా. యూ జీసీ నెట్ కూడా పాసయ్యా. 2016 నుంచి 2018 వరకు హైదరాబాద్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచింగ్ ప్రొఫెషన్లో పనిచేశా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్కూళ్లలో టీచింగ్ ప్రొఫెషన్ కోసం నిర్వ హించిన పరీక్షల్లో పాసై, రూ.11 లక్షల ప్యాకేజీతో అవకాశం వచ్చినా.. సివిల్స్ మీద ఆసక్తితో దాన్ని వద్దనుకుని ఢిల్లీ బాట పట్టా. పరుగు పందెంలో స్టేట్ లెవల్లో ప్రతిభ కనబరిచా. 400 మీటర్లు, 800 మీటర్ల రన్నింగ్ పోటీల్లో స్టేట్ లెవల్లో పతకాలూ సాధించా. పోలీస్ ఆఫీసర్ కావాలనుకోవడాని కి అథ్లెటిక్స్ మీద ఉన్న ఆసక్తి కూడా ఓ కారణమే.. ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత.. పోలీసులంటే సామాన్యుడు భయపడే పరిస్థితి పోయి ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడాలి. అంతేగాక సామాన్యుడు కూడా నేరుగా పోలీస్ ఉన్నతాధికారిని కలిసే పరిస్థితి ఉండాలి. నేను పోలీస్ అధికారినైతే అలాగే వ్యవహరించాలని అనుకునేవాడిని. శిక్షణ పూర్తి చేసుకుని, పోలీస్ అధికారిని అయ్యాక నేను కోరుకున్న పద్ధతిలో నడుచుకుంటాను. పేద, ధనిక, సామాన్యుడు, వీఐపీ అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తా. ఆత్మవిశ్వాసంతో ముందుకు.. సివిల్స్కు ప్రిపేర్ అయ్యేందుకు 2018లో ఢిల్లీకి వెళ్లాను. అక్కడే ఉండి చదువుకున్నాను. వరుసగా ఐదు ప్రయత్నాలు చేసినా సక్సెస్ రాలేదు. అయినా కుంగిపోలేదు. మరింత పట్టుదలతో చదివాను. తొలినాళ్లలో కోచింగ్ కోసం జాయిన్ కాగా నచ్చకపోవడంతో మానేశా. సొంతంగా రోజూ ఎనిమిది గంటలు చదివా. ఆరేళ్ల పాటు చదువు మీదే ధ్యాస పెట్టా. సివిల్స్ కొట్టాలన్న లక్ష్యంతో చదివాను. అపజయం ఎదురైనప్పుడు సమీక్షించుకుని, మళ్లీ ఆ పొరపాటు జరగకుండా ముందుకు సాగు తూ వెళ్లాను. చివరి ప్రయత్నంలో 587 వ ర్యాంకు సాధించాను. ఆరేళ్ల శ్రమ ఫలితమిది ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్న లక్ష్యంతో చదివా.. చివరి ప్రయత్నంలో సక్సెస్ అయ్యా అమ్మానాన్నల త్యాగాలు మరువలేనివి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో సివిల్స్ విజేత రజనీకాంత్ఎంతో సంతోషంగా ఉంది పిల్లలు ఉన్నతంగా ఎదగాలని అందరు తల్లిదండ్రుల్లాగే మేమూ కోరుకున్నాం. వాళ్ల చదువులకు లోటు రాకుండా చూశాం. సివిల్స్కు ప్రిపేర్ అవుతుంటే అప్పులు చేసి కూడా సర్దుబాటు చేశాం. సివిల్స్కు ఎంపికవడం సంతోషంగా ఉంది. – పద్మ, సిద్ధరాములు, రజనీకాంత్ తల్లిదండ్రులు -
రూ. 60వేల నగదు పట్టివేత
భిక్కనూరు: మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో హైదరాబాద్కు చెందిన చందర్ హరిప్రసాద్ వాహనాన్ని తనిఖీ చేయగా రూ. 60వేలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్లో ముగ్గురికి జైలుఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షను జడ్జి సయ్యద్ ఖదీర్ విధించినట్లు ఏసీపీ నారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 మందికి రూ. 17,600 జరిమానా విధించగా ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. యువతి అదృశ్యం ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. శుక్ర వారం కుటుంబ సభ్యులు నిద్రలేచే సరికి అమ్మాయి తన గదిలో కనిపించకపోవడంతో కుటుంబీకులు పలు చోట్ల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పిడుగుతో ఐదుగురికి గాయాలుమాక్లూర్: మండలంలోని ధర్మారంలో శుక్రవారం సాయంత్రం చలి పిడుగు తగిలి ఐదుగురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో గ్రామ శివారులో ఆరబెట్టిన ధాన్యంపై పట్టాలు కప్పేందుకు వెళ్లిన సుంకరి ధర్మారం, సుంకరి నారాయణ, బన్నీ, సాకలి శంకర్పై చలిపిడుగు పడింది. దీంతో వారికి తిముర్లు వచ్చి అపస్మారకస్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వారికి చికిత్స నిమిత్తం అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చెరువులో పడి యువకుడి మృతి
మాచారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్సై రామేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గజ్జనాయక్ తండాకు చెందిన లక్ష్మణ్(36) గురువారం బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. మండల కేంద్రంలోని ఊర చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వివాహిత..ఎడపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మంగళ్పాడ్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వంశీచందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెపల్లి ఇంద్రజ(48)కు ముగ్గురు సంతానం. వీరు ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతక్రుదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఇంద్రజ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
దొంగతనం కేసులో ముగ్గురికి జైలుశిక్ష
ఖలీల్వాడి: బంగారు ఆభరణాలు దొంగిలించిన ఘటనలో ముగ్గురికి జైలు శిక్షను విధించినట్లు జిల్లా జడ్జి సునీత కుంచాల శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లి మండలం సుద్దులంకు చెందిన నీరడి అరుణ్, నీరడి రాజమణి, రెంజల్ మండలం కుర్నాపల్లికి చెందిన కొండపల్లి సావిత్రి, కోటగిరి మండలం కల్లూరుకు చెందిన సాయిలు 2022 మే 8న నగరంలోని గౌతంనగర్లో ఉన్న బోయిని పోచమ్మ ఇంటికి వెళ్లి ఇల్లు అద్దెకు కావాలని ఇంట్లోకి ప్రవేశించారు. వీరు పోచమ్మపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించి గొంతు నులిమి హత్య చేశారు. నిందితులపై సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. విచారణలో అరుణ్, సాయిలు, రాజమణి దొంగతనం చేసినట్లు రుజువు కావడంతో వీరికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు దొంగసొత్తు కలిగి ఉన్నందున మరో రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. వేయి జరిమానా విధించారు. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. కాగా పోచమ్మ పోస్టుమార్టంలో సహజ గుండెజబ్బుతో మృతి చెందినట్లు రిపోర్టు రావడంతో నిందితులపై హత్య నేరం కాకుండా దొంగతనం, దొంగసొత్తు కలిగి ఉన్నందున కేసు నమోదు చేసి శిక్షను విధించినట్లు జడ్జి పేర్కొన్నారు. -
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరు పరిశీలన
సుభాష్నగర్: పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును వ్యయ పరిశీలకులు డీఎం నిమేజీ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాధవనగర్, ఇందల్వాయి తదితర ప్రాంతాల్లో ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న తనిఖీలు, ఇతర కార్యకలాపాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. అలాగే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, గట్టి నిఘా కొనసాగించాలని ఈ సందర్భంగా అబ్జర్వర్ సూచించారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య తదితరులున్నారు. 21న టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష నిజామాబాద్అర్బన్: టీఎస్ ఆర్జేసీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఈనెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 32 సెంటర్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 7,607 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో సూచించారు. పూర్తి వివరాలకు 99854 32021 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బాన్సువాడ రూరల్: బంధువుల విందుకు హాజరైన ఓ మహిళను మృత్యువు కబళించింది. కిరాణ దుకాణంలో పూజకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వస్తున్న వాహనం సదరు మహిళను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలం తాడ్కోల్లో చోటు చేసుకుంది. సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం కుర్తి గ్రామానికి చెందిన పోతరాజు గంగవ్వ(60) బాన్సువాడ మండలంలోని తాడ్కోలో తమ బంధువులు నిర్వహించిన కందూరు విందుకు శుక్రవారం హాజరైంది. పెద్దదేవుని దర్గాలో పూజకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో బాన్సువాడ వైపు వేగంగా వెళ్తున్న తుఫాను వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో గంగవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తమ్ముడు సాయిలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
ఐడీసీఎంఎస్ ఇన్చార్జి చైర్మన్గా ఇంద్రసేనారెడ్డి..?
సుభాష్నగర్: ఇందూరు జిల్లా కో–ఆపరేటీవ్ మార్కెటింగ్ సొసైటీ (ఐడీసీఎంఎస్) ఇన్ఛార్జి చైర్మన్గా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డికి (బీబీపేట్ సొసైటీ చైర్మన్) బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారు మోహన్ నల్లవెల్లి సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయగా, డీసీవో శ్రీనివాస్రావు ఆమోదం తెలిపారు. దీంతో ఐడీసీఎంఎస్ చైర్మన్, మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ పదవులను సాంబారు మోహన్ కోల్పోయారు. చైర్మన్ స్థానం ఖాళీ కావడంతో నూతన చైర్మన్ను ఎన్నుకునే వరకూ ఇన్చార్జి చైర్మన్గా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి వ్యవహరించనున్నారు. అధికారిక ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. చైర్మన్ పదవికి పోటీ..! ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవిని ముగ్గురు డైరెక్టర్లు ఆశిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు జిల్లాకు చెందిన వారు కాగా, మరొకరు కామారెడ్డి జిల్లాకు చెందిన వారు. ప్రస్తుతం వారంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్నికలకు మరో 10 నెలలు మాత్రమే గడువుంది. కాగా ఎన్డీసీసీబీ, ఐడీసీఎంఎస్ ఉమ్మడి జిల్లాల పరిధిలోకి వస్తాయి. ఒక పదవి నిజామాబాద్, మరో పదవి కామారెడ్డి జిల్లా వారిని ఎన్నుకోవడం ఆనవాయితీ. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్గా నిజామాబాద్కు చెందిన కుంట రమేశ్రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవిని కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిని ఎన్నుకుంటారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు చెరో పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ నాయకులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. చైర్మన్ రాజీనామాతో ఖాళీ అయిన పదవి నేడో, రేపో అధికారికంగా అందనున్న ఉత్తర్వులు -
No Headline
హోల్సేల్ రిటైల్ హోల్సేల్ రిటైల్టమాట 10 20 బెండకాయ 35 60 బీరకాయ 45 70 దొండకాయ 20 40 బీర్నిసుకాయ 30 60 కాకరకాయ 50 70 వంకాయ 25 50 పాలకూర 35 60 మెంతికూర 20 40 కొత్తిమీర 25 50 పుదీనా 35 50 క్యాప్సికం 50 80 గాజరుగడ్డ 40 60 పచ్చిమిర్చి 50 70 దోసకాయ 20 40 ఆలుగడ్డ 30 50 గోబిగడ్డ 25 50 గోబిపువ్వు 35 60 బీట్రూట్ 20 40 కరివేపాకు 40 60 చామగడ్డ 50 70 గోరుచిక్కుడు 45 60 చిక్కుడుకాయ 60 80 – సుభాష్నగర్కూరగాయల ధ రలు(రూ.) -
డిచ్పల్లిలో వైద్య శిబిరం
డిచ్పల్లి: మండల కేంద్రంలోని సీఎంసీలో బుధవారం సీఎస్ఐ మెదక్ డయాసిస్ సహకారంతో హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలున్న వారికి అద్దాలు ఉచితంగా అందజేశారు. వైద్యశిబిరాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సందర్శించారు. గురువారం కూడా వైద్య శిబిరం కొనసాగుతుందని రోగులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. వైద్యులు జేమ్స్, భక్త్సింగ్, వాసవి, సంధ్యారాణి, స్వరూప్ కుమార్, ఆసిఫ్, జవహర్ కెన్నడి, జయరాజ్ ఉన్నారు. -
కొబ్బరికాయల గోవిందుడు
నిజామాబాద్ సిటీ: ప్రతి సంవత్సరం ఖిల్లా రామాలయంలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో ఓ వ్యక్తి చేసే సేవను పలువురు అభినందిస్తున్నారు. నగరంలోని గాజుల్పేట్కు చెందిన గోవింద్ గతంలో మున్సిపల్ కార్పొరేషన్లో జవాన్గా పనిచేశాడు. గోవింద్ శ్రీ రాముడిపై భక్తితో ప్రతి సంవత్సరం ఖిల్లా రామాలయంలో జరిగే రామనవమి రోజున ఆలయానికి వచ్చే భక్తుల కొబ్బరి కాయలు కొడుతుంటాడు. బుధవారం ఆలయానికి వేలాది భక్తులు తరలిరాగా, భక్తుల కొబ్బరికాయలు అలుపెరగకుండా కొట్టాడు. ఇలా గత 30 సంవత్సరాలుగా నిరంతరంగా సేవ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 24 క్యారెట్స్ 76,600 22 క్యారెట్స్ 70,670 వెండి (కిలో) 88,500 – నిజామాబాద్ బిజినెస్బంగారం ధరలు (10గ్రాములు)ఆధ్యాత్మికం -
No Headline
నారాయణస్వామి ఆలయ ఉత్సవాలు ప్రారంభం సిరికొండ: మండల కేంద్రంలోని శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 61వ వార్షికోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వస్తి పుణ్యహవచనం, నవగ్రహ పూజ, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు లింబాద్రి, శ్రీనివాస్, గంగయ్య, రంజిత్, భూషణ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి సిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు నిజామాబాద్ సిటీ: నగరంలోని గాయిత్రీనగర్ సిద్ధి, బుద్ధి సహిత వినాయక స్వామి ఆలయ 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు మచ్చ చంటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వినాయక స్వామి శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
అగ్నిప్రమాదాలపై అవగాహన
ఖలీల్వాడి: నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద మహిళలకు అగ్నిప్రమాదాల నివారణపై బుధవారం అగ్నిమాపకశాఖ అధికారి నర్సింగ్ రావు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సిలెండర్లో మంటలు వస్తే ఎలా ఆర్పివేయాలో అవగాహన కల్పించారు. అలాగే మనోరమ హాస్పిటల్లో షార్ట్సర్క్యూట్ వస్తే ఎలా స్పందించాలి అనే అంశాల గురించి వివరించారు. మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తా జన్మదిన వేడుకలు నిజామాబాద్నాగారం: నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ నీతూకిరణ్, నగర అధ్యక్షుడు సిర్పరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్కట్చేసి సంబురాలు చేసుకున్నారు. స్నేహసొసైటీలో మానసిక వికలాంగుల మధ్య గణేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. బస్టాండ్ వద్ద పార్టీ నాయకుడు సుజిత్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కేక్కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. నాయకులు ఫయాజుద్దీన్, సుదాం రవిచందర్, మురళి, ధర్మపురి, గాండ్ల లింగం, మహేష్, సత్యపాల్, చింతకాయల రాజు, ప్రసాద్, కరిపే రాజు, శంకర్, శివకుమార్ పాల్గొన్నారు. బీఆర్ఎస్లో పలువురి చేరిక నిజామాబాద్నాగారం: నగరంలోని పలు వార్డులకు చెందిన సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నగరంలో బుధవారం వారికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఇండియా జైహింద్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఆల్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు నరసింహచారీ, ప్రధాన కార్యదర్శి షేక్ షాబాద్, కోశాధికారి షేక్ కాసిం తదితరులు ఉన్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహించొద్దు నిజామాబాద్అర్బన్: వేసవి సెలవుల్లో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల నిర్వాహకులు తరగతులు నిర్వహించొద్దని, ఒకవేళ నిర్వహిస్తే విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు గణేష్ డిమాండ్ చేశారు. నగరంలోని సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని, నిబందనలు పాటించకుండ కొనసాగుతున్నాయన్నారు. సంఘ ప్రతినిధులు ఆజాద్, కటారి కార్తీక్, అభిలాష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా సుమన్ నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ తరపున కండెల సుమన్ పోటీచేయనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసి, ఎస్సీ, ఎస్టీ సమాజాన్ని అప్రమత్తం చేసి సమాయత్తం చేయడానికి ధర్మసమాజ్ పార్టీ సిద్ధపడిందని విశారదన్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలంతా ధర్మ సమాజ్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. మునీర్ సంతాప సభ ఖలీల్వాడి: నగరంలోని బహుజన కాలనీలో బుధవారం ఉద్యమ నాయకుడు సీపీఎం నగర కమిటీ సభ్యుడు మునీర్ హైమద్ సంతాప సభను పార్టీ నాయకులు నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్బాబు మాట్లాడుతూ.. మునీర్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడారన్నారు. నగర కార్యదర్శి సూరి, సుజాత, విగ్నేష్, మహేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఎమ్మెల్సీ రఘురాజు కొత్త డ్రామా..
చరిత్రలో అనేక ముఖ్యమైన సంఘటనలకు సాక్షి 'మే 31'!
తెలంగాణ రాష్ట్ర గీతం ఖరారు
'భజే వాయువేగం' సినిమా రివ్యూ
T20 World Cup 2024: రేపు (జూన్ 1) బంగ్లాదేశ్తో తలపడనున్న భారత్
మళ్లీ జగనే సీఎం..బెజవాడ గడ్డ వైఎస్ఆర్ సీపీ అడ్డా
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్నర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
పొద్దున్న పోస్టింగ్.. సాయంత్రం ఊష్టింగ్
సజ్జల అరెస్ట్ అంటూ ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్...దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయ్ బాబు
యాంకర్ శ్రీముఖి ఫ్యాషన్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
Advertisement