-
Manipur: శిబిరాల నుంచే ఓటు
ఇంఫాల్: గత ఏడాదంతా జాతుల వైరంతో అట్టుడికిపోయిన మణిపూర్ ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంతో మోతెక్కిపోయే రాష్ట్రాలకు భిన్న వాతావరణం మణిపూర్లో నెలకొంది. మెయితీ, కుకీ తెగల గొడవలతో 50,000 మందికిపైగా స్థానికులు సహాయక, పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న భావన వారిలో గూడుకట్టుకుంది. లోక్సభ ఎన్నికలపైనా వ్యతిరేక భావన నెలకొంది. దాంతో మరో రెండు వారాల్లో పోలింగ్ ఉన్నా ఎన్నికల హడావుడే కనిపించలేదు. ‘‘మణిపూర్లో 2,955 పోలింగ్ స్టేషన్లలో సగం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో వేరే ప్రాంతాలకు వలసపోయిన వారి కోసం 94 స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నాం. 24,000 మంది శిబిరాల నుంచే ఓటేయనున్నారు’’ అని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసీర్ ప్రదీప్ కుమార్ ఝా అన్నారు. ఓటర్లతో మాట్లాడి ఎన్నికలపై సదాభిప్రాయం పెంచి పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది మే మూడో తేదీన లోయ ప్రాంతాల్లో ఉండే మెజారిటీ జనాభా మైతేయ్లకు రాష్ట్రంలో ఎస్టీ హోదా డిమాండ్కు వ్యతిరేకంగా కుకీలు చేపట్టిన గిరిజనుల సంఘీభావ ర్యాలీ తర్వాత హింస ప్రజ్వరిల్లింది. మైతేయ్, కుకీల విద్వేషకాండలో 219 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ప్రాణభయంతో సొంతూరిని వదిలి పారిపోయి ఐదు లోయ జిల్లాలు, మూడు కొండ జిల్లాల్లోని శిబిరాల్లో దాక్కున్నారు. ఘర్షణలు పూర్తిగా సద్దుమణకముందే రాష్ట్రంలో ఎన్నికలు అవసరమా? అంటూ వేలాది మంది బాధితులు, కొన్ని పౌర సంఘాలు ప్రశి్నస్తూ ఎన్నికల బాయ్కాట్కు పిలుపునిచ్చాయి. ‘‘గత లోక్సభ ఎన్నికల్లో మణిపూర్లో చక్కటి పోలింగ్ శాతం నమోదైంది. ఇది ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఓటర్ల నమ్మకానికి అద్దంపడుతోంది. ఈసారి గణనీయమైన పోలింగ్కు కృషిచేస్తాం’’ అని ప్రదీప్ ఝా అన్నారు. -
కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా విపక్ష కూటమి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రతిపక్షాల ఓట్ల చీలిక ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అవే పక్షాలు వ్యూహాత్మకంగా ఏకమై సవాలు విసురుతుండడంతో ఆందోళన చెందుతోంది. బీజేపీ ఓట్లను కేజేపీ, తన వ్యతిరేక ఓట్లను జేడీఎస్ గణనీయంగా చీల్చినప్పటికీ కాంగ్రెస్ బొటాబొటి మెజారిటీతో అందలం ఎక్కింది. ముఖ్యంగా కేజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చీల్చిన ఓట్ల వల్ల బీజేపీ సుమారు 32 స్థానాల్లో ఓడిపోయింది. అందులో 26 చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. కనీస మెజారిటీ కంటే ఆ పార్టీకి తొమ్మిది స్థానాలు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఈ లెక్కలు చూసుకునే ఆ పార్టీ హైరానా పడుతోంది. ముఖ్యంగా జేడీఎస్కు సహకరిస్తున్నందుకు బీజేపీపై మండి పడుతోంది. మరో వైపు సెక్యులర్ పార్టీ అని పేరు పెట్టుకున్న జేడీఎస్, బీజేపీతో చేతులు కలపడాన్ని తూర్పారబడుతోంది. ప్రస్తుతం అధికారాన్ని చెలాయిస్తున్నప్పటికీ, ఈ మూడు పార్టీల సహకారం క్షేత్ర స్థాయిలో విజయవంతమైతే కాంగ్రెస్కు శృంగ భంగం తప్పక పోవచ్చు. అన్ని చోట్లా అవగాహన బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్సభ స్థానాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో ఈ రెండు స్థానాలూ జేడీఎస్వే. ప్రస్తుతం ఆ పార్టీకి అనుకూలంగా బీజేపీ తన అభ్యర్థులను బరి నుంచి తప్పించింది. సంప్రదాయికంగా ఈ రెండు స్థానాల్లో జేడీఎస్కు గట్టి పట్టుంది. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలో గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రెండున్నర లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు పార్టీల సర్దుబాటుకు ఓటర్ల ఆమోదం లభిస్తే కాంగ్రెస్కు చిక్కులు తప్పకపోవచ్చు. ధార్వాడ, మైసూరు, చిత్రదుర్గ శాసన మండలి స్థానాలకు ఈ నెల 22న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో జేడీఎస్ ఎక్కడా అభ్యర్థులను నిలపలేదు. చిత్రదుర్గ, ధార్వాడలలో బీజేపీ పోటీ చేస్తోంది. కేజేపీ మైసూరు నుంచి పోటీ పడుతోంది. ధార్వాడలో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా కేజేపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. మైసూరులో కేజేపీ అభ్యర్థికి అనుకూలంగా బీజేపీ తన అభ్యర్థిని రంగం నుంచి తప్పించింది. హఠాత్తుగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులను అప్రమత్తం చేశారు. ఈ ఉప ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. కాగా శాసన మండలి ఎన్నికల్లో గ్రామ పంచాయతీ, తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల సభ్యులు ఓటు వేయాల్సి ఉంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
Advertisement