-
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
-
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ బూత్లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు.టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగింది?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదు. దీంతో వారు పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేశారు. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథచ్చగా తిరగనిచ్చారు. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు. అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?. అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్టడం వలన హింస జరిగింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలు: మాజీ మంత్రి పేర్నిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?. రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది. బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు. పురంధేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు -
మీ ఆస్తిపత్రాలు ఎవరి వద్ద ఉన్నాయి చంద్రబాబూ?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఆస్తిపత్రాలు ఎవరివద్ద ఉన్నాయని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చారా? అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబు విషం గక్కుతున్నారని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో మోదీపై విమర్శలు చేస్తే ఈసీ ఆంక్షలు విధిస్తోందని, కానీ ఇక్కడ జగన్ని చంపేయండంటున్నా మిన్నకుంటుందని పేర్కొన్నారు. మే 14 తర్వాత పథకాలు అమలు చేయండని తెలంగాణలో ఈసీ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రామోజీ, రాధాకృష్ణలు.. చంద్రబాబు కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారని, తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పారు. పవన్కళ్యాణ్ను వాడుకుని జగన్కి కాపులను దూరం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నాడని, దళితులను చీల్చడానికి మంద కృష్ణమాదిగను తెచ్చాడని, కానీ బీసీలను చీల్చుదామంటే వారు ప్రశ్నించడం మొదలు పెట్టారని వివరించారు. ఎన్నిచేసినా పెద్ద గీత జగన్ పక్కన చంద్రబాబు చిన్న గీతగానే మిగిలాడని, ఇక ఏమీ చేయలేక భూములపై విషప్రచారం మొదలుపెట్టారని చెప్పారు. ఇవన్నీ ఆగాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..దుష్టచతుష్టయం కుటిల పన్నాగాలు ఫెయిల్ ఎన్నికలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పనితీరుపై జరగకూడదని రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్కళ్యాణ్ దుష్ట పన్నాగాలు పన్నారనేది స్పష్టం అవుతోంది. జగన్ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను చేపట్టిందని, అది దుర్మార్గమైన వ్యవస్థ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వలంటీర్ వ్యవస్థ పెద్ద మాఫియా అని, వలంటీర్లు అమ్మాయిలను రెడ్లైట్ ఏరియాకు అమ్మేస్తున్నారని పవన్కళ్యాణ్ మాట్లాడారు. ఏపీలో అమ్మాయిలు మిస్సయ్యారని, కేంద్ర నిఘావర్గాలు తనకు చెప్పాయని దుష్ప్రచారం చేశారు. ఈ సంచులు మోసే వలంటీర్లు మగవాళ్లు ఇంట్లోలేని సమయంలో తలుపులు కొట్టి ఆడవాళ్లను లోబరుచుకుంటారని చంద్రబాబు మాట్లాడాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వలంటీర్ వ్యవస్థపై నీచంగా వార్తలు రాశాయి. కానీ ప్రజల్లో ఈ వ్యవస్థపై ఇసుమంతైనా నమ్మకం సడలలేదు. కోవిడ్ సమయంలో దేశంలోనే అత్యద్భుతంగా సేవలందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. చంద్రబాబు, పవన్కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ హైదరాబాద్లో ఇళ్లల్లోంచి బయటకు రాలేదు. జగన్ ఇక్కడే ఉండి రూ.30 వేల కోట్లు కోవిడ్ కోసం ఖర్చుచేసి మందులు, వైద్యం అందించారు.కులాలను వాడుకుని దెబ్బతీయాలని బోర్లా పడ్డారు చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రానికి ఫలానా మేలు చేశానని చెప్పుకొనే పరిస్థితి ఉందా? చేసిందేమీ లేక కులాలను వాడుకుని జగన్ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడు. మహిళలనూ చీల్చుదామని చూశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.14 వేల కోట్ల రుణాలు బేషరతుగా మాఫీచేస్తానని, ప్రతి మహిళకు సెల్ఫోన్ కొనిస్తానని, పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.25 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. రాష్ట్రంలో ఉన్న సుమారు మూడు కోట్లమంది మహిళలు సీఎం జగన్కు అండగా ఉన్నారు.2019 నుంచీ ఎవరి ఆస్తిపత్రాలు వారి వద్దే..ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై వదంతులు సృష్టించారు. ఈ యాక్ట్ 2019లోనే వచ్చింది. ఇప్పుడు 2024లో దానిగురించి మాట్లాడుతున్నారు. 2019లో చట్టం వస్తే.. ఇప్పటివరకు చంద్రబాబు కొనుక్కున్న ఆస్తుల కాగితాలు అతని వద్దే ఎందుకు ఉన్నాయి? పవన్కళ్యాణ్ ఈ ఐదేళ్లలో మూడో, నాలుగో ఆస్తులు కొన్నారని చెబుతున్నారు. మరి ఆయన కాగితాలు ఆయన వద్దే ఎలా ఉన్నాయి? ఈ రాష్ట్రంలోని టీడీపీ, జనసేన నాయకులు కొనుక్కున్న ఆస్తుల ఒరిజనల్స్ ఎవరివి వారివద్ద ఎందుకున్నాయి?బరితెగించిన చంద్రబాబు తప్పుడు ప్రచారంపై ఎన్నికల కమిషన్ కేసులు పెడితే.. చంద్రబాబు బరితెగించి ఫుల్పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆయనకు వ్యవస్థలంటే లెక్కలేదు. రాష్ట్రంలోని 26 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటివరకు ఆరువేల గ్రామాల్లోనే సర్వే జరిగింది. అక్కడ టీడీపీ వారు లేరా? సర్వే సందర్భంగా ఒక్కరన్నా ఆరోపణలు చేశారా? అసెంబ్లీలో చట్టం చేసేటప్పుడు టీడీపీ సమర్థించింది. ఇప్పుడు ఎన్నికల కోసం విషం చిమ్ముతోంది. చంద్రబాబు బీసీ సర్టిఫికెట్ ఇస్తే.. దానిపై ఆయన బొమ్మ ఉంటే ఆ బీసీ.. కమ్మ ఆయిపోతారా? పాసు పుస్తకం లోపల తహసీల్దారు సంతకం ఉంటుంది. పైన ఫొటో ముఖ్యమా? లోపల సంతకం ముఖ్యమా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. -
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
-
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?
సాక్షి, కృష్ణా: చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా అంటూ రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్పై మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారని మంపడిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తన పొలం మ్యుటేషన్ జరగట్లేదని చేసిన ట్వీట్ను ప్రస్తావించారు. పెద్ద పెద్ద చదువులు చదువున్న మీరు ఇంత అసహ్యంగా, దిగజారి మీరు ప్రవర్తించాలా? అని ప్రశ్నించారు. పీవీ రమేష్ది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామమమని తెలిపారు. ఈ గ్రామంలో తన తండ్రి పేరుపై ఉన్న పొలం తన పేరుపైకి మార్చడం లేదంటూ అన్యాయంగా, కిరాతకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారని చెప్పారు.25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక చెరువు తవ్వి లీజుకు ఇస్తూ వస్తున్నారన్నారు పేర్ని నాని. ఏడాది క్రితం రమేష్ తండ్రి సుబ్బారావు మరణించారని, ఆయన మరణించిన తర్వాత రమేష్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశారని, అప్పటి నుంచీ విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి కూడా ఈ చెరువులో భాగస్వామి. ఆయనకు, రమేష్కు కోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.వివాదాల వల్లే..ఆ చెరువులో వీళ్లకి సంబంధించిన పొలం ఎంతో కొంత ఉంది.దీనికోసమే జనవరి నెలలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు అక్కడ విచారణ నిర్వహించారు. ఆ విచారణకు అందరు రైతుల్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని రమ్మని చెప్పారు. అయితే పీవీ రమేష్ మాత్రం తన గుమస్తాకు ఫోటోస్టాట్ కాపీలిచ్చి పంపారట. ఫోటోస్టాట్ కాదు..ఒరిజినల్స్ పంపండి అని చెప్పారు. ఆయన రాడు..సరే గుమస్తాను పంపినా ఒరిజినల్స్ కావాలి కదా?క్కడ ఉన్న వివాదాన్ని తీర్చడం కోసమే మూడు నెలలుగా ఆ చెరువును అధికారులు ఎండబెడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిహద్దులు ఫిక్స్ చేసి ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.ఇంత కథ నడుస్తుంటే ఇంత విషం చిమ్మడం ధర్మమా పీవీ రమేష్?మీ వివాదానికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి?అక్కడున్న రైతులందరికీ, మీకు తగాదా ఉండటం ఏంటి? అక్కడున్న ల్యాండ్ కన్నా మీరు అదనంగా లీజు పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితి. చెరువు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కదా కొలతలు వేసి ఎవరి హద్దు ఏంటో చెప్పేది?.ఎటువంటి వివాదం లేకపోతే, అది వ్యవసాయ భూమి అయి హద్దులు క్లియర్గా ఉంటే..ప్రభుత్వాన్ని విమర్శించినా ఒక అర్ధం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు మీ పొలానికి సంబంధం ఏంటి?చంద్రబాబు పంచన చేరి ఐఏఎస్ చదువుకుని పచ్చిగా రాజకీయాల కోసం దిగజారడం అవసరమా? చంద్రబాబు కోసం మీరు ఏ డాన్స్ కట్టమంటే ఆ డాన్స్ కడుతున్నారు. ఏ ట్వీట్ చేయమంటే ఆ ట్వీట్ చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం సంపాదించడం కోసం మీరు ఇలా తప్పుడు ప్రకటనలు చేసి జగన్గారి ప్రభుత్వంపై విషం చిమ్మడం దుర్మార్గమైన చర్య. మీరు విన్నకోట గ్రామం రండి.. అక్కడేం జరుగుతుందో చూడండి.మీ కోసమే.. ఆ వివాదం తేల్చడం కోసమే మూడు నెలలుగా వీఆర్వోలను కాపలా పెట్టి మరీ చెరువును కాళీ చేయిస్తున్నారు.పోలింగ్ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకు, మీ గుమస్తాకి కూడా సమాచారం అందించారు. ఆ చెరువు మధ్యలోనే ఆవుల దొడ్డి కింద ఓ 3.5 ఎకరాల వివాదాస్పద భూమి కూడా ఉంది. మీతో ఉన్న ఆ 25 మంది రైతులు కూడా ఆ ఆవుల దొడ్డి భూమి మాదంటే మాది అని క్లెయిమ్ చేస్తున్నారు.ఇలాంటి చరిత్ర కలిగిన భూమిని మీ నాన్నగారు మీకు అప్పజెప్పారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు మ్యుటేషన్ అవ్వడం లేదని ఇంతగా దిగజారడం అవసరమా? ’ అని మండిపడ్డారు పేర్ని నాని. -
నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం
-
కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్
-
మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
చిలకలపూడి (మచిలీపట్నం): ఇటీవల చంద్రబాబు, పవన్కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవటం.. ఇప్పుడు టీడీపీ తరఫున పత్రికల్లో ఇచ్చిన అడ్వరై్టజ్మెంట్స్లో పవన్కళ్యాణ్ ఫొటో లేకపోవటం చంద్రబాబు దగాకోరు విధానానికి అద్దం పడుతోందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురు వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అడ్వరై్టజ్మెంట్లో రూ.4 వేలు పింఛన్ ఇస్తామన్న హామీ కూడా లేకపోవటం చంద్రబాబు మాయమాటలకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కూటమి అధినేతల ఫొటోలు మాయమవడంతో పాటు హామీలను కూడా మాయం చేసే చంద్రబాబును ప్రజలు దగాకోరుగా అభివర్ణిస్తున్నారన్నారు. ఎన్నికలు రాకముందే మోసం మొదలైందని చెప్పుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ హామీలనూ తుంగలోకి తొక్కిన ఘనుడు బాబు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేదం హామీలను అమలు చేస్తే.. కుట్రలు పన్ని, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.50 చేయటంతో పాటు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారని పేర్ని నాని గుర్తు చేశారు. 1999లో ఇచ్చిన మేనిఫెస్టోలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 35 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని, ప్రతి పాఠశాలకు పక్కా భవనం నిరి్మస్తామని, మహిళలకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2014లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు.. ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించినప్పుడు ఆశకు హద్దుండాలని వ్యాఖ్యానించటం ఆయనకే చెల్లిందన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్న చంద్రబాబు తన కుమారుడు లోకేశ్కు మాత్రమే జాబు ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ, పవన్కళ్యాణ్తో కూటమి కట్టిన చంద్రబాబు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారిని ఆటలో అరటిపండులా వదిలేశాడన్నారు. ఎంతటి వారినైనా మోసం చేసే గుణం చంద్రబాబుకే ఉందన్నారు. ఇటువంటి చంద్రబాబు మాయమాటలను రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గ్రహించి నక్కజిత్తుల మాటలు నమ్మకుండా ఆలోచించాలన్నారు. వైఎస్ జగన్ అంటే నడిచే నమ్మకంగా చంద్రబాబు మాటలు అపనమ్మకంగా భావించి చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలని కోరారు. మే 13న చంద్రబాబుకు కర్రు కాల్చి వాత పెట్టే విధంగా తీర్పును ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దయనీయ పరిస్థితిలో పింఛన్ లబ్దిదారులు చంద్రబాబు, ఆయన బంధువు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుట్రల కారణంగా పింఛన్ లబ్దిదారులు దయనీయ స్థితిలో ఉన్నారని పేర్ని నాని అన్నారు. హైకోర్టులో పిటిషన్లు వేసి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి పింఛన్ లబ్దిదారులు గడప దాటేలా చేశారన్నారు. బ్యాంకులకు వెళ్లిన లబి్ధదారులకు మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాలను కట్చేసి పింఛన్లు ఇస్తుంటే వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితి తీసుకువచ్చిన చంద్రబాబుకు 66 లక్షల మంది పింఛన్దారుల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. -
దగాకోరు చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు చెప్పేవన్నీ మాయ మాటలేనని.. కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫొటో మాయమైందని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ జనం గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు.‘‘జగన్ను కూలదోయడానికి కూటమి జట్టు కట్టుకట్టారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేసేందుకు పక్కా ప్రణాళికతో వస్తున్నారు. చంద్రబాబు ముగ్గురు ఫోటోలతో కూటమి అని బయల్దేరాడు. మేనిఫెస్టో నాటికి మూడు ఫోటోలు కాస్తా రెండు ఫోటోలయ్యాయి. సూపర్ 6 అంటూ ఇంటింటికీ పాంప్లెట్లు పంచారు. ఇప్పుడేమో మేనిఫెస్టోకు బీజేపీ ఆర్ధిక అనుమతులు లేవంటున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ప్రకటనల్లో ఇప్పుడు పవన్ ఫోటో మాయం చేశాడు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఫోటోలతో పాటు హామీలు కూడా ఒక్కొక్కటి మాయమవుతున్నాయి. నాలుగు వేల పెన్షన్ అంటూ ఇంటింటికీ తిరిగి ఊదరగొట్టారు. ఇప్పుడు సూపర్ సిక్స్ నుంచి చివరి పేజీలోకి పోయింది. ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో అసలు పెన్షనే లేకుండా ఎత్తేశారు’’ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.పేర్ని నాని మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:నిన్న మోదీ..నేడు పవన్ కల్యాణ్ ఫోటోలు మాయం:⇒చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్లు ఈ రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని కూటమిగా ఏర్పడ్డారు. ⇒సీఎం జగన్ లాంటి జనం గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజా నాయకుడిని కూలదోయాలనే కుట్రతో ముగ్గురూ కలిశారు ⇒వారు జట్టు కట్టి మాయ మాటలతో ప్రజల్ని వంచించాలని పక్కా ప్రణాళికతో వస్తున్నారు⇒బీజేపీతో నేను కలిశానంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చంద్రబాబు అంటారు⇒జగన్ను కూలదోయడం కోసం పవన్ కల్యాణ్తో కలిశానని చెప్తున్నాడు⇒ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో విడుదలలో మూడు ఫోటోలు రెండు ఫోటోలు అయ్యాయి⇒మోదీ మాయమయ్యాడు. చంద్రబాబు, పవన్ కల్యాణే మిగిలారు⇒ముందు సూపర్ సిక్స్ అని చంద్రబాబు, వవన్, మోదీ ఫోటోలతో ఇంటింటికీ పాంప్లెట్ ఇచ్చారు⇒మేనిఫెస్టోలో మోదీ ఫోటో మాయమైంది. ఎందుకయ్యా అంటే మా మేనిఫెస్టోకి బీజేపీ ఆర్థిక పరమైన ఒత్తాసు లేదని చెప్తున్నారు⇒ఈ మేనిఫెస్టో అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల వరకూ కావాలి. .అంత మోసం మేం చేయలేం అని బీజేపీ తప్పుకుంది⇒ఈ రోజు చంద్రబాబు రాష్ట్రంలోని పత్రికలన్నిటికీ కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చుకున్నాడు⇒సరే పాపపు సొమ్ము ఉంది కాబట్టి ప్రకటనలు ఇచ్చుకుంటాడు. ఈ ప్రకటనలో పవన్ కల్యాణ్ మాయం⇒ముందు ముగ్గురం అన్నాడు.. మేనిఫెస్టోలో మోదీ మాయమయ్యాడు. ఎన్నికల దగ్గరయ్యే కొద్దీ పవన్ కల్యాణ్ కూడా మాయంఫోటోలే కాదు.. ఆయనిచ్చిన హామీలు మాయం:⇒ఫోటోలే కాదు..చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా మాయమై పోతున్నాయి. ⇒ఇంటింటికీ సూపర్ సిక్స్ పేరుతో ఊదరగొట్టారు. డబ్బా కబుర్లు చెప్పారు. ⇒ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో వారి సూపర్ సిక్స్లో నాలుగు వేల పింఛన్ ఎత్తేశారు.⇒రూ.4వేలు పింఛన్ అని ముందు ఊదరగొట్టారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ దాన్ని కనిపించకుండా చేస్తున్నాడు.⇒మేనిఫెస్టోలో నాలుగు వేల పింఛన్ చివరి పేజీకి వెళ్లిపోయింది. ఈ రోజు అసలు కనిపంచనే లేదు.⇒ఇవాళ అప్పుడే చంద్రబాబు దగాకోరుతనం, మోసం మొదలైపోయింది.⇒ఇంతకు ముందు చంద్రబాబు ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం మొదలు పెట్టేవాడు. ⇒ కానీ ఇప్పుడు ఇంకా పోలింగ్ కాకముందే మోసం మొదలుపెట్టాడు.⇒1994లో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే హార్స్పవర్ విద్యుత్, మద్యపాన నిషేదం అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.⇒1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఎగిరి ఆ కుర్చీలో కూర్చున్న చంద్రబాబు రెండు రూపాయల కిలో బియ్యాన్ని వెంటనే ఐదున్నర రూపాయలు చేశాడు.⇒వ్యవసాయ విద్యుత్లో హార్స్పవర్ రూ.50 ఉన్నదాన్ని రూ.650 చేశాడు.⇒రామారావు గారు పెట్టిన మద్యపాన నిషేదాన్ని ఎత్తేశాడు.⇒అంటే 1994 నుంచే మేనిఫెస్టోపై దగా చేయడం చంద్రబాబుకు అలవాటు.⇒1999లో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో 25 లక్షల ఉద్యోగాలిస్తాను..లేకపోతే కుటీర పరిశ్రమలు పెట్టుకోడానికి ఆర్థిక సాయం అన్నాడు.⇒బలహీనవర్గాలకు ఐదేళ్లలో 35 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తానన్నాడు.⇒ఏపీలో ఉన్న ప్రతి ఒక్క పాఠశాలను పక్కా భవంతిగా చేస్తానన్నాడు.⇒చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటాను అన్నాడు. ⇒ఆయన పోరాటం చేయలేదు.. కనీసం తన పార్టీలో పది శాతం మందికి కూడా టికెట్లు ఇవ్వలేదు.⇒మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఎక్కడున్నా చూశారా మీరు? ⇒పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయి వరకూ మహిళలకు ఉచిత విద్యాసౌకర్యం అన్నాడు. ఎక్కడన్నా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడా?⇒2009లో కూడా మేనిఫెస్టో ఇచ్చాడు కానీ ఆయన మాటలు ఎవరూ నమ్మలేదు.⇒వైఎస్సార్ ఆ రోజు రెండే హామీలిచ్చారు. ప్రతి వ్యక్తికి 6కేజీల బియ్యం, 7 గంటల నిరంతర విద్యుత్ ఇస్తానని చెప్పారు.⇒చంద్రబాబు ఆరోజు డబ్బులు వేస్తానని ఇళ్లలో డమ్మీ ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు.రైతు రుణమాఫీ చేయకపోగా... ఆశకు హద్దుండాలన్న వ్యక్తి చంద్రబాబు:⇒2014కు వచ్చే సరికి 600 హామీలు ఇచ్చాడు.. వాటిలో ఒక్కటీ అమలు చేయలేదు.⇒పేదవాళ్లకు మూడు సెంట్లు స్థలం అన్నాడు. అమలు చేయలేదు.⇒పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.25వేలు ఇస్తానన్నాడు. డ్వాక్రా రుణాలు రూ.14వేల కోట్ల రుణాల మాఫీ అన్నాడు. ఏదీ చేయలేదు.⇒రైతులకు రూ.85 వేల కోట్ల రుణమాపీ చేస్తాను అన్నాడు. ⇒వారి అడబిడ్డల నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి తెచ్చిస్తానన్నాడు. ⇒మాఫీ చేయకపోగా..ఆశకు హద్దుండాలయ్యా అన్నాడు.⇒మళ్లీ 2024 వచ్చింది. మళ్లీ బయలుదేరి మేనిఫెస్టో అంటాడు.⇒రెండు స్థలం అన్నాడు. 2014లో మూడు సెంట్లు అని మూడు గజాలు కూడా ఇవ్వలేదు.⇒ఇంటికో ఉద్యోగం చొప్పున 20 లక్షల ఉద్యోగాలట. 2014లో కూడా కోటి ఉద్యోగాలు..జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ⇒ఒక్క ఇంటికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు.⇒రాష్ట్రంలో ఒక్క బాబుగారి కొడుక్కి తప్ప ఎవరికి జాబు వచ్చింది?⇒లోకేశ్ బాబుకు తప్ప రాష్ట్రంలో ఏ బాబుకూ ఉద్యోగం రాలేదు⇒అందుకే ఈ దొంగ మేనిఫెస్టో నుంచి మోడీ తెలివిగా తప్పుకున్నాడని భావించాలి⇒ఇక పవన్ కల్యాణ్ ఫోటో కూడా మాయమైంది కాబట్టి ఆయననూ బాబు పక్కన పెట్టేసినట్లే⇒వీళ్ల ఫోటోలకు సూపర్ సిక్స్ లో ఇచ్చిన నాలుగు వేల పింఛన్ హామీ కూడా మాయమైపోయింది⇒మోదీ, పవన్ కల్యాణ్లు ఆటలో అరటిపండ్లు..⇒నేను ఎంతటి వాడినైనా మోసం చేయగలను అనే ధీమా చంద్రబాబుది⇒ఈ దగాకోరు, నక్కజిత్తుల చంద్రబాబునాయుడితో తస్మాత్ జాగ్రత్త!⇒ జనసేన కార్యకర్తలు కూడా ఈ రోజు చంద్రబాబు ఇచ్చిన ప్రకటన చూడండి⇒మేమందరం ఒకటే అన్నాడు. నేనూ పవన్ కల్యాణ్ కవల పిలల్లం అన్నాడు⇒పవన్ కల్యాణ్ వీరుడు, సూరుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాడు అన్నాడు..ఏకంగా ఫోటోనే లేపేశాడు⇒ఆంధ్రరాష్ట్ర ప్రజలారా..తస్మాత్ జాగ్రత్త⇒జగన్ అంటే ఒక నడిచే నమ్మకం. చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం⇒ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జాగ్రత్తపడండి⇒చంద్రబాబు కన్నా ఈ రాష్ట్ర ప్రజలు తెలివైన వారని నా నమ్మకం⇒కొడుకు కోసం ఈ మోసపు మాటలతో పిల్లమొగ్గలు వేస్తున్న చంద్రబాబును తెడ్డుకాల్చి వాతపెట్టి పంపిస్తారని నా బలమైన నమ్మకంచంద్రబాబు, నిమ్మగడ్డలకు వృద్ధుల ఉసురు తగలకమానదు:⇒చంద్రబాబు తన బంధువైన నిమ్మగడ్డతో కోర్టుల్లో కేసులు వేయించి పింఛన్ ఇంటికి ఇవ్వకుండా చేశాడు.⇒వాలంటీర్ల ద్వారా సాఫీగా పంచే పింఛను అందించకుండా వృద్ధులను ముప్పుతిప్పలు పెడుతున్న వ్యక్తి చంద్రబాబే.⇒మొన్న సచివాలయాలకు రావాల్సిన పరిస్థితి వస్తే..ఈ రోజు బ్యాంకులకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.⇒ఆ చంద్రబాబు బంధువు బ్యాంకుల్లో వేస్తే మంచిదే కదా అని చెప్పుకొస్తున్నాడు.⇒రాష్ట్రంలోని 65 లక్షల మంది పింఛన్దారుల్లో 45 లక్షల మంది ఎకౌంట్లు మైనస్లలో ఉన్నాయి. ⇒ఈ పింఛన్ డబ్బు పడగానే దానికి జమ అయిన పరిస్థితితో వృద్ధులంతా లబోదిబోమంటున్నారు.⇒చంద్రబాబు, ఆయన చుట్టమైన నిమ్మగడ్డకు కచ్చితంగా వృద్ధుల ఉసురు తగులుతుంది. -
టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు
-
కూటమిది అసత్యాల మేనిఫెస్టో
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. అధికారం కోసమే కూటమి అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. -
దొంగ హామీల ‘చంద్రబాబు’.. బీజేపీకి అర్థమైపోయింది: పేర్ని నాని
సాక్షి, మచిలిపట్నం: చంద్రబాబు, పవన్ చెప్పే మాటలు అమలయ్యేవి కావని బీజేపీకి అర్థమైపోయిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘అరచేతిలో వైకుంఠం చూపించే మాటలని కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడు. కూటమి మేనిఫెస్టోలో కనిపించింది మూడు కాదు.. రెండు ఫొటోలే. కూటమి సర్కస్ మొదలైంది’’ అంటూ ఎద్దేవా చేశారు.‘‘చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసింది. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారు?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.‘‘2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారు.. ఇప్పుడెందుకు కలిశారు. కళకళలాడుతుండే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయి. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే:⇒బాబూ...నీలో నిజాయితీ ఉంటే 2014 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశావో చెప్పు⇒జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన తీరు చూడండి. 2019లో నా మేనిఫెస్టో ఇదిగో.. దీనిలో 99 శాతం నేను అమలు చేశానని ధైర్యంగా చెప్పారు.⇒రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ..ఎన్ని ఇబ్బందులున్నా ఏటా రూ.71 వేల కోట్లు నేను పేదల కోసం ఖర్చు పెట్టానని చెప్పారు.⇒రెండు గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం చెప్పిన చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ అదేమీ చెప్పలేకపోయాడు. ⇒చంద్రబాబునాయుడు నిజంగా నిజాయితీపరుడైతే 2014లో మూడు పార్టీలు కలిసి సంతకం పెట్టి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమేమి అమలు చేశాడో చెప్పాల్సింది. ⇒ఇళ్లు లేని ప్రతి పేదవానికీ 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాం..ఎవరికన్నా ఇచ్చాడా? ఎన్ని లక్షల మందికి ఇచ్చాడు? ⇒ఇంట్లో ఆడపిల్ల పుడితే ప్రతి ఆడపిల్లకు రూ.25వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అన్నాడు. ఎంత మందికి చేశారు? ⇒డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తీసుకున్న రూ.14వేల కోట్లు బేషరతుగా రుణమాఫీ చేస్తాం అన్నారు. చేశారా? రైతులకు రూ.85 వేల కోట్ల అప్పులను తీర్చి బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని కూడా తెప్పిస్తానన్నారు. ఎంత మందికి చేశారు?⇒పాత మేనిఫెస్టో చూపించి ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడారా?⇒అదే ముగ్గురం మేం మళ్లీ వస్తున్నాం...ఇన్ని హామీలిచ్చాం..ఇన్ని నెరవేర్చాం..మళ్లీ హామీలు ఇస్తున్నాం..అని చెప్పే సత్తా లేకపోయింది⇒ఇదే మోసగాళ్లు ఈ రోజు మాట్లాడిన మాటలు కూడా మనం చూశాం⇒ఇప్పుడొచ్చి నేను పంచాయతీరాజ్ వ్యవస్థను ఉద్దరిస్తానంటున్నాడు. 2014–19 మధ్యలో ఆ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఎవరు? ⇒పంచాయతీల్లో సర్పంచ్లు, పాలకవర్గం ఉండగా..అధికారమంతా జన్మభూమి కమిటీలకు ఇచ్చి ఏ పథకం కావాలన్నా వారు టిక్ పెడితేనే కాని ఇవ్వకుండా ఆ పంచాయతీలను సర్వనాశనం చేసింది ఎవరు?మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు?⇒నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే బీజేపీతో కలిశాను అని చంద్రబాబు చాలా గర్వంగా చెప్పాడు. ⇒ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి నువ్వేం ఇచ్చావ్..? ⇒ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? విభజన హామీల గురించి ఏమైనా రాశావా? ⇒కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా రాశావా? విశాఖ స్టీల్స్ను అమ్మేయకుండా నిలబెడతాం అని ఏమైనా రాశారా? ⇒మరి మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు? ⇒కేవలం అధికారం కోసమే మీరు ముగ్గురు జట్టు కట్టారు. ⇒ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది మీ మేనిఫెస్టోలో ఏముంది? ⇒2019లో మీరంతా తిట్టుకున్నారు కదా.? నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ ఒకరినొకరు తిట్టుకున్నారు కదా!⇒మీకు మీరే ఒకర్ని ఒకరు దొంగలు అన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు?⇒అదేమంటే జనం కోసమే మేం ముగ్గురం కలిశాం అంటారు. మీరిచ్చిన మేనిఫెస్టోలో జనం కోసం ఏముంది? ⇒జగన్ అమ్మ ఒడి రూ.15వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.20వేలిస్తానంటాడు. ⇒జగన్ మహిళలకు చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా పెంచి ఇస్తానంటాడు. ⇒జగన్ మత్స్యకారులకు రూ.10 వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.15వేలు ఇస్తానంటాడు.⇒ ఇదే హామీలను 2014లో కూడా ఇచ్చారు కదా? అవేమయ్యాయి? ⇒ ఈ మేనిఫెస్టోలో 90 శాతం జగన్ గారి మేనిఫెస్టోను కాపీ కొట్టారు. 10 శాతం కర్నాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారు.⇒జగన్ ఆదాయం గురించి చెప్పిన విధంగా మీకు చెప్పే దమ్ముందా? ⇒ మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత..నేను ఖర్చు పెట్టింది ఎంత అని స్పష్టంగా జగన్ చెప్పారు. ⇒ ఇన్ని కష్టాలు పడి జగన్ గారే రూ.71 వేల కోట్లు ఏటా ఖర్చు చేశారు. ⇒ మీ మేనిఫెస్టో ప్రకారం ఏటా రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాలి. ⇒ 2014లో మూడు సెంట్లు స్థలం ఇస్తానని ఇవ్వకుండా..ఇప్పుడు రెండు సెంట్లు అంటున్నాడు. ⇒ జగన్ గారు 31 లక్షల మందికి స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్ను గుర్తుపెట్టుకుంటారో అని రెండు సెంట్లు ఇస్తానంటున్నారు. ⇒ పాత మూడు సెంట్లు సంగతి ఏంటి? అది కూడా కలిపి ఐదు సెంట్లు ఇస్తావా? ⇒ పాత మూడు సెంట్లు బాకీ ఉన్నావు కదా? డ్వ్రాక్రా అక్క చెల్లెమ్మలకు రూ.14వేల కోట్లు బాకీ ఉన్నావు కదా? ⇒ నీ మూలంగా పచ్చగా ఉన్న డ్వాక్రా సంఘాలు నాశనం అయ్యాయి కదా?సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రమేమన్నా అక్షయపాత్రా?⇒సరే హామీలిచ్చారు. ఈ హామీలకు ఎంత ఖర్చు అవుతుందని ఖర్చుల వివరాలు కూడా చెప్పాలి కదా? ⇒రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంత ఉంది? నువ్విచ్చిన హామీలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావ్? దొంగనోట్లు ముద్రిస్తావా? ⇒అప్పు తీసుకురాను అంటున్నాడు. మరి అప్పు తేకుండా రాబడి ఎంత?⇒ ఈ రోజుకీ ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్ ఉద్యోగుల పెన్షన్ కలిపి ఏటా రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతోంది.⇒రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పుల ఇన్స్టాల్మెంట్లు, వడ్డీలు అన్నీ కలిపి ఏటా రూ.55 వేలు కట్టాలి.⇒నీకు నిజాయితీ ఉంటే ఎంత ఆదాయం వస్తుంది..ఎలా ఖర్చు చేస్తావు అనేది చెప్పాల్సింది. ⇒అదేమంటే నేను సంపద సృష్టిస్తాను అంటాడు. ఆ సంపదలో నుంచి పథకాలు అమలు చేస్తాడట. ⇒సంపద సృష్టించాలంటే అదేమన్నా అక్షయపాత్రా? లంకెబిందెలా? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ⇒ ఈ పథకాలన్నీ అమలు చేయడానికి నువ్వు డబ్బెక్కడి నుంచి తెస్తావో ప్రజలకు చెప్పాలి కదా? ⇒ 2014లో ఎలాగైతే పచ్చి దగా, మోసం చేశావో..మళ్లీ ఈ మేనిఫెస్టోను అదే దగాతో విడుదల చేశావు.ఎన్డీయేకి 400 సీట్లు దేనికీ..? ఎవరి పౌరసత్వాలు తీసేయబోతున్నారు?:⇒ఎన్డీయేకి 400 సీట్లు కావాలట. దేనికోసం? ఎంత మందిని కాల్చుకు తినడానికి? ⇒ మైనార్టీలను ఈ దేశంలో లేకుండా తరిమేస్తారా? అత్యధిక మెజార్టీ దేనికి మీకు? ⇒ అత్యధిక మెజార్టీ ఇవ్వడం వల్ల మీరు ఏమేం చేయబోతున్నారు? ⇒ ఎవరివైనా పౌరసత్వాలు, ఓట్లు తీసేయబోతున్నారా? ఏం దుడుకు చర్యలు చేయడానికి 400 సీట్లు అడుగుతున్నారు? ⇒ మీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ⇒ నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు జన్మలో ఒక్కసారి కూడా జరగలేదు.⇒ ఎంత సేపు మోసం, దగా. అవసరం ఉన్నప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించడం..అవసరం తీరాక తగలబెట్టేయడం. ⇒ మనిషి అన్నాక వంద మాటలు చెప్తే కనీసం 90 మాటలన్నా అమలు చేయాలి కదా? ⇒ మనిషి అన్నాక కనీసం విశ్వసనీయత ఉండాలి కదా? ⇒ చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ లాంటి వల్లే కదా..దేశంలో, రాష్ట్రంలో రాజకీయ నాయకుల విలువ పోతున్నది? ⇒ అవసరం ఉంటే ఓట్ల కోసం ఎన్ని పచ్చి మోసపు మాటలైనా చెప్తారు అనే భావన ప్రజల్లో ఉన్నది మీలాంటి వాళ్ల వల్లనే.⇒ జగన్ పథకాలు అమలు చేయడానికి నువ్వెందుకు బాబూ?:⇒ మీ మేనిఫెస్టో అన్నీ జగన్ గారి పథకాలే కదా? జగన్ గారి పథకాలు అమలు చేయడానికి మీరు కావాలా? జగనే ఉన్నాడుగా..!⇒ మొన్నటి వరకూ వాలంటీర్లు అమ్మాయిలను అమ్మేస్తున్నారు..మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడు తలుపులు కొడుతున్నారు అన్నారు. ⇒ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాం అన్న వాళ్లు ఇప్పుడు వాళ్లను కొనసాగిస్తాం..పదివేలు గౌరవ వేతనం ఇస్తాం అంటున్నారు. ⇒ మీకు అధికారం ఇస్తే వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారో జనానికి తెలియదా? ⇒ ఈ రోజు చంద్రబాబుకు కొత్తగా ముస్లింలు, మైనార్టీలపై ప్రేమ వచ్చేసింది. ⇒ నీ ఐదేళ్ల పరిపాలనలో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేడు.⇒ అధికారంలో ఉంటే రాజ్యాధికారంలో మైనార్టీలకు వాటా ఇవ్వవు. ⇒ ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు సంక్షేమం చేసేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు.⇒ 2014 మేనిఫెస్టోలో రజకులు, మత్స్యకారులను ఎస్సీలుగా, బోయలను ఎస్టీలుగా, కాపులను బీసీలుగా చేస్తానన్నాడు. ఎవరినన్నా చేశాడా? ⇒ ఎస్సీ వర్గీకరణ చేస్తానంటూ మాల, మాదిగలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.⇒ 1999 నుంచి ఢిల్లీలో చక్రం తిప్పాను అంటావు..ఎస్సీల వర్గీకరణ చేశావా? ⇒ మళ్లీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ఎస్సీల వర్గీకరణ చేస్తానంటున్నాడు.⇒ మొన్నటి వరకూ రజకులకు ఇస్త్రీ పెట్టె ఇస్తానన్నాడు..ఇప్పుడు కరెంట్ ఇస్త్రీ పెట్టె ఇస్తాడట.⇒ మొన్నటి వరకూ వడ్డెరలకు డ్రిల్లింగ్ మిషన్ ఇస్తానన్నాడు. ఇప్పుడు కరెంట్ డ్రిల్లింగ్ మిషన్ ఇస్తాడట. ⇒ చేనేతలకు మరమగ్గాలు ఇస్తాడట. మరి యాదవులకు కూడా కరెంట్ గొర్రెలను ఇస్తావా?⇒ ఎంత సేపూ వెనుకబడిన వర్గాలు చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా కులవృత్తులు చేసుకుంటూనే ఉండాలా? ⇒అసలు ఈ వెనుకబడిన వర్గాలకు చదువు ఎందుకు చెప్పించవు? ⇒ఇంగ్లీషులో చదువు చెప్పించి మీ జీవితాలు బాగుచేస్తానని చెప్పాలి కదా? ⇒ నాయీ బ్రాహ్మణులకు అంతకు ముందు కత్తెర్లు ఇస్తానన్నాడు. ఇప్పుడు ట్రిమ్మర్లు ఇస్తాడట. ⇒వాళ్లకు నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించి దమ్ముగా పెద్దింటి పిల్లలతో పోటీ పడేటట్లు చేయాలి కదా?⇒ఎందుకు ఒక్క రోజన్నా జగన్ గారిలా ఆలోచించలేకపోతున్నావ్..?నీలో నిజాయితీ ఉంటే నీ దగా మేనిఫెస్టోకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు:⇒బుర్రకథ బ్యాచ్లా చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ తయారయ్యాయి. ⇒ఒకరు తానా అంటే మరొకరు తందానా అంటారు. ⇒ చంద్రబాబును నేను చాలెంజ్ చేస్తున్నా. నిజంగా నువ్వు నిజాయితీ గల రాజకీయ నాయకుడివైతే నా సవాల్ను స్వీకరించు.⇒ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత? నువ్వు చెప్పిన ఈ దగా మేనిఫెస్టోకు ఖర్చు ఎంతవుతుందో చెప్పాలి. ⇒ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో చెప్పే నిజాయితీ నీలో ఉందా?⇒అందుకే నువ్వు పింఛన్ 4వేలు ఇస్తానన్నా..జగన్ 3,500 ఇస్తానంటే జనం జగన్వైపే ఉన్నారు. ⇒ 4వేలు చెప్పినా ఇచ్చేది లేదని వాళ్లకి స్పష్టంగా తెలుసు.⇒ జగనంటే ఐదు పదుల నడుస్తున్న నమ్మకం. ⇒ ఈ బుర్రకథ బ్యాచ్ అంటే ఏడున్నర పదుల తిరుగాడే అపనమ్మకం. ⇒ మనకు వయసు ఎంత వచ్చిందనేది కాదు..ఒక్క రోజన్నా నిజాయితీగా బతికామా అన్నదే చూడాలి..⇒ దమ్ముగా జగన్ గారిలా దీనికి ఎంత ఖర్చు అవుతుందో నిజాయితీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ⇒పేదల్లో పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల చదువుల ద్వారానే పోతుందనేది జగన్ గారు గట్టిగా నమ్ముతారు.⇒ అందుకే ఆయన చదువు మీద దృష్టి పెట్టి నాణ్యమైన చదువును అందిస్తున్నారు.⇒ అందుకే ఇప్పటి వరకూ విద్యపై జగన్ గారు రూ.73వేల కోట్లు ఖర్చు చేశారు.⇒ నిజాయితీగా గత ఐదేళ్లలో నేనేం చేశానో మళ్లీ అదే చేస్తాను అని జగన్ చెప్తున్నాడు. దానికి ఎంత గుండె ధైర్యం కావాలి? ⇒ మోసం చేయడానికి ధైర్యం అవసరం లేదు. ఏ వెదవైనా మోసం చేయగలడు.⇒ అమ్మ ఒడి గతంలో కంటే నేను రెండు వేలు పెంచగలను అని చెప్తున్నాడు. చెప్తే నిజాయితీగా అమలు చేయాలి కదా?మోసం చేయడం కంటే చచ్చిపోవడం మేలన్నారు జగన్..!:⇒ పింఛన్ రూ.3,500 ఒకే సారి చెప్పు అంటే లేదంటే లేదన్నాడు జగన్.⇒ దమ్ముగా నేను రూ.3,500 వేలే ఇవ్వగలను. అది కూడా రెండు విడుతల్లో పెంచుతాను అని ఖచ్చితంగా చెప్పాడు.⇒ మోసం చేసే మాటలు చెప్పడం కంటే చచ్చిపోవడం మేలన్నాడు. అలాంటి మోసపు మాటలు నేను చెప్పను అన్నాడు.⇒ అలా చెస్తే ప్రజలు నమ్మకం పెంచుకుంటారు. జగన్ చెప్తే చేస్తాడని ఆశలు పెంచుకుంటారు. అలా మోసం చేయలేను అన్నాడు.⇒ ఈ రాష్ట్రంలో 80 శాతం కుటుంబాలకు మేలు జరిగేలా నేను పరిపాలన చేశానని జగన్ చెప్తున్నారు. ⇒ మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని కూడా దమ్ముగా చెప్తున్న నాయకుడు వైఎస్ జగన్. ⇒ చంద్రబాబుకు అలాంటి ధైర్యం ఉందా? 2014–19లో తానే పరిపాలన చేశాడో అదే పరిపాలన తెస్తానని చెప్పే ధైర్యం, దమ్ము ఉందా? ⇒ 2014–19 మధ్య ప్రజలు మీకు అధికారం ఇస్తే మేం దిక్కుమాలిన పరిపాలన చేశాం అని మీ నోటితో మీరే సాక్ష్యం చెప్తున్నారు.⇒ 2014లో కోటి పేద, మద్యతరగతి కుటుంబాలున్నాయి. ఇంటికో ఉద్యోగం అన్నాడు..లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు.⇒ ఎంత మందికి ఇచ్చారు..కోటి ఉద్యోగాలు ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అయినా ఇచ్చాడా? ⇒ నీ కొడుకు లోకేశ్కు ఉద్యోగం ఇచ్చుకున్నావు తప్ప ఎవరికి ఇచ్చావ్? ⇒ మళ్లీ ఇప్పుడు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాను..లేదంటే 3వేల నిరుద్యోగ భృతి అంటున్నాడు.⇒ అతని మేనిఫెస్టో అంతా పాపాల పుట్ట.. అసత్యాల బొంత. -
సూపర్-6.. సూపర్-10 పేరుతో ‘కూటమి’ మరో మోసం: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్-6, సూపర్-10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారు.. ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం: మంత్రి ధర్మానశ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తామన్నారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోను చంద్రబాబు హేళనగా తీసుకుంటారు. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 20 వేలు కూడా ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు మహిళల రుణాలు రద్దు చేస్తామన్నారు. నమ్మి ఓటేసిన మహిళలను చంద్రబాబు మోసం చేశారు’’ అని మంత్రి ధర్మాన మండిపడ్డారు.మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం: మంత్రి బొత్సవిశాఖపట్నం: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చారు. విద్యా, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పేద ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పథకాలు ఉన్నాయి. లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా అమలు చేశారు’’ అని మంత్రి బొత్స అన్నారు. ప్రజలను కష్టాల నుంచి బయట పడేసే మేనిఫెస్టో ఇది: తమ్మినేని సీతారాం సంస్కరణల దిశగా వైసీపీ విధానాలు వెళ్తున్నాయి. మేనిఫెస్టోలో విశాఖను క్యాపిటల్ టౌన్గా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబుది కాపీ మేనిఫెస్టో. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు. -
సీఎం జగన్ అంటే నడిచే నమ్మకం... మేనిఫెస్టో పేర్ని నాని స్పందన.
-
పేర్ని కిట్టు నామినేషన్ కార్యకర్తగా మారిన పేర్ని నాని
-
బాబు, పవన్కు పేర్ని నాని సవాల్.
-
రాష్ట్రానికి మీ కూటమి చేసిన మేలేమిటి?
సాక్షి, అమరావతి: 2014 నుంచి ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి రాష్ట్రానికి ఏం మేలు చేసిందో చెప్పే ధైర్యం ఉందా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్ విసిరారు. జన్మభూమి కమిటీలతో అద్భుతమైన పరిపాలన చేశామని, మళ్లీ అధికారంలోకి వస్తే ఆ కమిటీలు తెస్తామని చెప్పగలరా అని నిలదీశారు. ఆ దమ్ము లేకే సీఎం జగన్ ఏర్పాటు చేసిన ఉత్తమమైన వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారని అన్నారు. ఇదీ చంద్రబాబు, పవన్ దిగజారుడు రాజకీయమని చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్పై చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్రంలోని కోట్లాది మందికి రూ.2.70 లక్షల కోట్లు నేరుగా ఆరి్థక పరిపుష్టి కలగజేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందని, ఈ ప్రభుత్వం రద్దయిపోతుందని అన్న ఈ మూడు పార్టీలు ఇప్పుడు సీఎం జగన్ పథకాలనే కాపీ కొడుతున్నాయని చెప్పారు. ఇప్పటికే రూ.6 లక్షల కోట్ల హామీలు ఇచ్చారని, ఇంకా ఇస్తారని అన్నారు. 2014లో పవన్, మోదీ ఫోటోలేసి ఇంటింటికి వెళ్లి పంచిన హామీలన్నీ అమలు చేసినట్లు చంద్రబాబు ప్రజలతో చెప్పించగలరా అని ప్రశి్నంచారు. సీఎం జగన్ని వారు ఎంత మాటైనా అనొచ్చని, తిరిగి వారిని తాము ఏమైనా అంటే ఏడుపులా అని అన్నారు. ఆడియో ఫంక్షన్లో పవన్ ఎందుకు తన గురించి నోరు జారారని నిలదీశారు. మీరు చెప్పుతో కొడతానంటే, మాకూ రెండు చెప్పులున్నాయని చెప్పానని అన్నారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులుకి బెయిల్ ఇప్పించారని అబద్ధం చెప్పారన్నారు. శిరోముండనం కేసు 1996లో జరిగిందని, అప్పుడు తోట త్రిమూర్తులు ఉన్నది టీడీపీలోనే అని చెప్పారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి పోటీ చేశారన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు త్రిమూర్తులు మంచోడు, మా పార్టీలో ఉంటే చెడ్డోడా అని ప్రశి్నంచారు. నిజాయితీగా వాస్తవాలు చెప్పే సీఎం జగన్ కావాలా? పంజా చేతికి చిక్కే వరకూ సాధుజంతువులా నటించే చంద్రబాబు కావాలా ఉద్యోగులు ఆలోచించుకొని అడుగులు వేయాలని సూచించారు. వాసవీ అమ్మవారి వద్ద ప్రమాణం చేద్దామా? మచిలీపట్నంలో బాబు మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేని పేర్ని నాని చెప్పారు. తమ నియోజకవర్గ నేత కొల్లు రవీంద్ర ఏ అబద్ధం చెవిలో చెబితే బాబు అది మాట్లాడారన్నారు. రాం నితీష్ అనే వ్యక్తి మాల్ కట్టుకుంటే ఎన్వోసీ ఇవ్వడానికి తాను లంచం అడిగినట్లు అతనితో చెప్పించాలని చాలెంజ్ చేశారు. తమ్మని వారి సత్రం ఆక్రమించినట్లు ఆర్యవైశ్య సమాజంలో క్రియాశీలకంగా ఉన్న ఏ ఒక్క సభ్యుడితోనైనా చెప్పించాలని అన్నారు. కొల్లు రవీంద్ర, ఇతర నేతలు వస్తే వాసవీ అమ్మవారి వద్ద ప్రమాణం చేద్దామన్నారు. తన రాజకీయ జీవితంలో పాపపు సొమ్ము రూపాయి కూడా ముట్టుకోలేదన్నారు. కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్లలో డబ్బులు దండుకుంటున్నాడని అంధ్రజ్యోతి పత్రికలోనే రెండు సార్లు రాశారని చెప్పారు. కొల్లు లంచగొండితనాన్ని బాబే భరించలేకపోయారని, మంత్రి పదవి పీకేస్తానంటే.. కాళ్లపై పడటంతో ఎలాంటి ఫైల్స్ రాని న్యాయ శాఖ, స్పోర్ట్స్ మంత్రిగా ఇచ్చారన్నారు. కృష్ణమూర్తిపై కిరాతకంగా మాట్లాడతారా? 2019 ఎన్నికల షెడ్యూల్కు ముందు బందర్ పోర్టుకు చంద్రబాబు చేసింది మోసపు శంకుస్థాపన అని, ఆ పేరుతో రూ.8.60 కోట్లు దోచేశారని చెప్పారు. జీవో 217 ద్వారా మత్స్యకారులకు ఏం అన్యాయం జరిగిందో బాబు చెప్పాలన్నారు. తన కుమారుడు, నవ యువకుడు పేర్ని కృష్ణమూర్తి మొదటిసారి పోటీ చేస్తుంటే, అతన్ని ప్రజలు గుర్తిస్తే, 75 ఏళ్ల వయసొచి్చన చంద్రబాబు కిరాతకంగా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేయాలనే బలమైన ఆకాంక్షతో తన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చి నాలుగేళ్లవుతోందని, కరోనా సమయంలో ఎంతో సేవ చేసి ప్రజల మన్ననలు పొందాడని తెలిపారు. -
బూతులు మాట్లాడినట్లు నిరూపిస్తే.. బాబు, పవన్కు పేర్ని నాని సవాల్
సాక్షి, తాడేపల్లి: మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులుకి బెయిల్ ఇప్పించారని అబద్ధం చెప్పాడని మండిపడ్డారు. శిరోముండనం కేసు 1996లో జరిగిందని, ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 1995 నుంచి 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని గుర్తుచేశారు. చంద్రబాబులాగా అసహ్యంగా మాట్లాడే నాయకులు ఎవరైనా ఉంటారా అని మండిపడ్డారు. తనకు బూతులు తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని, తాను ఏనాడు చంద్రబాబు, పవన్లను బూతులు తిట్టలేదని చెప్పారు. ఒకవేళ తాను బూతులు మాట్లాడి ఉంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. బాబుకు వయసు పెరిగింది కానీ.. ఏం మాట్లాడాలో తెలియలేదని విమర్శించారు. 4 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్కు ఏం చేశారని ప్రశ్నించారు. బందర్కు పూర్వవైభవం రావడానికి కారణం సీఎం జగన్ అని పేర్ని నాని తెలిపారు. కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించామన్నారు. పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు. 26వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని పేర్కొన్నారు. కరోనా సమయంలో తన కొడుకు పేదలకు సేవ చేశాడని తెలిపారు. 75 ఏళ్ల వయసున్న చంద్రబాబువి అన్నీ పాపపు మాటలేనని దుయ్యట్టారు. తన కొడుకు గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తీరును ప్రశ్నిస్తే నతాను బూతులు నానినా? అని నిలదీశారు. పేర్ని నాని కామెంట్స్ చంద్రబాబు, పవన్ దిగజారి నా కొడుకును విమర్శిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రజాసేవ చెయ్యాలని తిరుగుతున్నాడు. కరోనాలో ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఐసీయూలో కూడా వెళ్లాడు. కొల్లు రవీంద్ర, చంద్రబాబు ఇంట్లో పడుకుంటే నా కొడుకు సేవ చేశాడు. మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తే.. ముసలి చంద్రబాబు ఇలా మాట్లాడతాడా? నేను ఏరోజైనా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశానా? చంద్రబాబుకు నిరూపించమని సవాల్ చేస్తున్నా. 5 ఏళ్లలో మచిలీపట్నానికి ఏం చేశానో చెప్పే దమ్ము ఉంది. మచిలీపట్నం అభివృద్ధి నాడు వైఎస్సార్, నేడు వై ఎస్ జగన్ హయాంలో జరిగింది. ఇద్దరిని ఒప్పించి అభివృద్ధి చేసింది నేనే. యూనివర్సిటీ, పోర్టు, మెడికల్ కాలేజీ, 26 వేల ఇళ్ల స్థలాలు తెచ్చింది మేమే. 2014 లో మచిలీపట్నానికి చెప్పిన ఒక్క హామీ అమలు చెయ్యలేదు చంద్రబాబు. చంద్రబాబు, పవన్, బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేశారో దమ్ముంటే చెప్పండి. జన్మభూమి కమిటీలను మళ్ళీ తెస్తాం అని చెప్పే దమ్ముందా?. సీఎం జగన్ చేసేవాన్ని మేము ఇంకా ఎక్కువ చేస్తానని చెప్తున్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నాడు చంద్రబాబు. మరి ఇప్పుడు 6 లక్షల కోట్ల పథకాలకు హామీలు ఇస్తున్నారు. రామ్ నితీష్ అనే వ్యక్తిని నేను లంచం ఆడిగానని నిరూపించండి కొల్లు రవీంద్ర ఎంత అవినీతి పరుడో వాళ్ళ ఆంధ్రజ్యోతి, పేపర్లోనే రాశారు 2014లో చంద్రబాబు, పవన్, మోడీ ఫోటో ల తో ఇచ్చిన హామీలు అమలు చేశానని చెప్పే దమ్ముందా? బందర్లో ఉండాల్సిన భెల్ కంపెనీ నిమ్మకూరుకు ఎందుకు తరలిపోయింది..? 1937 నుంచి నడుస్తున్న కంపెనీ ని కొల్లు రవీంద్ర తరలించలేదా? పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్లో నన్ను తిడితే నేను ఉరుకోవాలా? పవన్ ఒక మాట అంటే.. నేను తిట్టకుండా ఉరుకుంటానా? పవన్ చెప్పు తెగిపోద్ది అన్నాకే.. నేను చెప్పులు చూపించా. కాపులని చెప్పుతో కొడతా అని పవన్ అంటే నోరు అదుపులో పెట్టుకోమని అన్నాను చంద్రబాబు మేకవన్నె పులి, నమ్మితే నష్టపోతారు. ఎప్పుడైనా 5 ఏళ్ల కాలంలో 2.10.లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారా? కేవలం వంద కోట్లు మాత్రమే ఖజానాలో ఉంచి వెళ్ళాడు చంద్రబాబు. అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదని యనమల రామకృష్ణుడు చెప్పాడు. సీపీఎస్ రద్దు చెయ్యకపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులే. కానీ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించారు. వాస్తవాలు ఉద్యోగులకు చెప్పి చేశాడు. అలా నిజాయితీగా ఉండే దమ్మున్న నాయకుడు కావాలా? లేక ఉద్యోగులకు చుక్కలు చూపించే చంద్రబాబు కావాలా..ఆలోచించండి -
సీఎం జగన్పై దాడి: స్పందించిన ప్రధాని మోదీ..వైఎస్సార్సీపీ నేతలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగింది. అనంతరం వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లికి బయల్దేరారు. సీఎం జగన్తో పాటుగా వైఎస్ భారతీ ఉన్నారు. గాయం కారణంగా సీఎం వైయస్ జగన్ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాగా, సీఎం జగన్పై దాడి ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘జగన్ అన్నా జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు సంతోషం. సీఎం జగన్పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఎన్నికల సంఘం ద్వారా కఠినమైన చర్యలు చేపట్టాలని నేను ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. Glad you are Safe. Take care @ysjagan Anna Strongly condemn the attack on AP CM Jaganmohan Reddy Garu. Violence has no place in democracy and I hope strict preventive measures are put in place by ECI pic.twitter.com/fTBTe17I2T — KTR (@KTRBRS) April 13, 2024 మరోవైపు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘సీఎం జగన్పై దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు’ అని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం జగన్పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. I condemn the stone-throwing on Hon'ble Andhra Pradesh CM Thiru @ysjagan. Political differences should never escalate to violence. Let's uphold civility and mutual respect as we engage in the democratic process. Wishing him a quick recovery. https://t.co/YtYoOJbVy1 — M.K.Stalin (@mkstalin) April 13, 2024 సీఎం జగన్పై రాయితో జరిగిన దాడి ప్రధాని నరేంద్ర మోదీ స్పంధించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. I pray for the speedy recovery and good health of Andhra Pradesh CM @ysjagan Garu. — Narendra Modi (@narendramodi) April 13, 2024 అంబటి రాంబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్పై దాడి చంద్రబాబు పనే అన్నారు. ఈ ఘటన బాబు ప్రోద్భలంతోనే జరిగింది. చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం సరికాదు. చంద్రబాబు, పవన్, బిజెపి ముగ్గురూ కలిసినా జగన్ను ఏమీ చేయలేరు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని అంబటి రాంబాబు అన్నారు. పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇలా దాడులు చేయడానికి తెగబడ్డారు. ఎంతమంది కలి వచ్చినా జగన్ను ఏమీ చేయలేక రాళ్ల దాడి చేశారు. సీఎం జగన్కు లోతుగా గాయమైంది. రెండు కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. తల నుంచి రక్తం కారుతుంటే వైద్యులు ప్రధమ చికిత్స చేశారు. త్వరలోనే సీఎం జగన్పై ఎవరు దాడి చేయించారో అన్నీ బయటకు వస్తాయి అన్నారు. మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్పై జరిగిన దాడిని ఖండిస్తున్నా. సీఎంపై టీడీపీ గూండాలు దాడి చేయడం అమానుషం. ఇలాంటి దాడులు చేయడమే టీడీపీ పాలసీ. ఎన్నికల్లో ఓటమి తప్పదని టీడీపీ నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారు అని విక్రమ్రెడ్డి అన్నారు. ట్విట్టర్లో రాజ్యసభ సభ్యులు, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి.. ► రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ► చంద్రబాబు నాయుడు ఏనాడు అభివృద్ధి నమ్ముకుని రాజకీయాలు చెయ్యలేదు. ► హింస, కుట్రలు, కుతంత్రాలు నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారు. ► చంద్రబాబు పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని ఇవాళ జరిగిన దాడితో మరోసారి రుజువైంది. నారాయణ స్వామి,డిప్యూటీ సీఎం కామెంట్స్ ► మానవ జన్మ ఎత్తున చంద్రబాబు నాయుడు నరరూప రాక్షసుడు ► సిఎం జగన్ మోహన్ రెడ్డి కు బస్సు యాత్ర లో వస్తున్న ప్రజాభిమానం చూసి తట్టుకోలేక రాళ్ళ దాడి చేయించాడు ► నర హంతకుడు చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడు ప్రజాభిమానంతో దూసుకువెళ్తున్న జగన్ యాత్ర పై రాళ్ళ దాడి చేయించాడు ► చంద్రబాబు ను ప్రజలు క్షమించరు, రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ► మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో సహనంతో ఉండమంటున్నారు, చంద్రబాబుకు ప్రజలే మీ అంతుచూస్తారు ► మా ముఖ్యమంత్రి కి ఏదైనా జరిగితే మేమే మీ అంతు చూస్తాం అంటూ హెచ్చరిక మాజీమంత్రి బాలినేని కామెంట్స్ ► విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి హేయమైన చర్య ► దాడి వెనుక కుట్రకోణం ఉంది..పూర్తి స్థాయి విచారణ జరగాలి ► దాడులతో ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు ► దాడులు చేసి వైఎస్సార్సీపీని బయపెట్టాలనేది మీ భ్రమ ► చంద్రబాబు కి మతి భ్రమించింది....ప్రస్ట్రేషన్ లో చంద్రబాబు ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలియదు ► బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి కి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది ► టీడీపీ సభలకు జనం రాకపోవడం తో చంద్రబాబు కి ఫ్రైస్ట్రేషన్ ఎక్కువైంది సీఎం జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి.. ► పక్క ప్లాన్ ప్రకారమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై టిడిపి గుండాలు రాళ్లతో దాడి చేశారు ► సీఎం జగన్కు వస్తున్న ఆదరణను చూసి టిడిపి నేతల కడుపు మండుతోంది.. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు సీఎం జగన్ పై దాడిని ఖండించిన ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ► విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షాలు దాడి చేయడం దారుణం ► ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక ఇటువంటి దాడులు చేయడం సిగ్గుచేటు ► రాష్ట్రంలో 175 సీట్లకు గాను 175 సీట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటున్నారని అనేక సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వైసిపికి రాబోయే విజయాన్ని తట్టుకోలేకపోతున్నాయి ► ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి దిగిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముఖ్యమంత్రి మీద భౌతిక దాడులు చేసే స్థాయికి దిగజారిపోయారు: హోం మంత్రి తానేటి వనిత ► బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ పై టిడిపి నాయకులు చేసిన రాళ్లదాడిని ఖండిస్తున్నా ► జగనన్న బస్సు యాత్ర ఎంతో ప్రజాధరణ పొందడం చూడలేక దాడికి దిగారు ► ఒంటరిగా జగనన్నను ఢీకొట్టలేక నిన్న మొన్న జనసేన ను తెచ్చుకున్నా ఏమీ చేయలేకపోయారు ► తాజాగా బిజెపితో జతకట్టిన మైలేజ్ సాధించలేకపోయారు ► జగన్ను ఏమీ చేయలేని పరిస్థితుల్లో షర్మిలమ్మను ఇంటి నుంచి బయటకు లాగి కాంగ్రెస్లో పెట్టారు ► ఎంతసేపు జగన్ మీద రాజకీయంగా కుట్ర చేయాలి అదే వారి ఆలోచన సీఎం జగన్ పై దాడి పిరికిపంద చర్య: అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి ► సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ► దాడులు తెలుగుదేశం పార్టీ సంస్కృతి ► గత కొన్ని రోజుల నుంచి టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు లోకేష్ రెచ్చగొడుతున్నారు ► సీఎం జగన్ కు ప్రపంచవ్యాప్తంగా కరుడుగట్టిన అభిమానులు ఉన్నారు ► వారు కూడా తిరిగి దాడులు చేస్తే టిడిపి నేతలు పరిస్థితి ఏంటి ► దాడులు అనేవి వైఎస్ఆర్సిపి సంస్కృతి కాదు సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: గుడివాడ అమర్నాథ్ ► చంద్రబాబు పాతకాలపు రాజకీయాలను మానుకోవాలి ► సీఎం జగన్ పై దాడి చేస్తే భయపడతారని చంద్రబాబు భ్రమ పడుతున్నారు ► గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు కిరాతకంగా చంపించారు ► నేడు మళ్లీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి చేయించారు ► దాడులు చేయిస్తే సీఎం సభలు సమావేశాలు నిర్వహించరని చంద్రబాబు భ్రమ పడుతున్నారు ► మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదు ► ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులకు పాల్పడుతున్నారు ► చంద్రబాబు రోడ్లు మీద తిరుగుతున్నారు ► మేము దాడులు చేయాలంటే నిమిషం పని..దాడులు చేయడం వైఎస్ఆర్సిపి సంస్కృతి కాదు ► 2019 ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావతమవుతాయి -
చంద్రబాబు, ఈనాడుపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబును ఈనాడు జాకీలేసి లేపుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనాడుకు సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ తగిలిందని.. మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారని మండిపడ్డారు. వేలకోట్లు సేకరించి పేపర్లు.. టీవీలు నడుపుతున్నారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబును రాజ్యాధికారంలో ఉంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ విస్తరించుకున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్తో రామోజీ డొంకంతా కదిలింది. రోజూ పేపర్లో నీతి సూక్తులు రాసే ఈనాడు పాపాల పుట్ట. కోర్టులో కేసులు నడుస్తున్నా ప్రజల నుంచి డబ్బు వసూలు ఆపలేదు. సొమ్ము జనానిది.. సోకు రామోజీదీ.. చంద్రబాబుది. సీఎం జగన్ పేద, మధ్యతరగతి వారికి అత్యధికంగా టిక్కెట్లిచ్చారు. దళితుల్లోనూ డబ్బుంటేనే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు. కండువాలు కూడా వేసుకోకుండానే టిక్కెట్లిచ్చింది మీ కూటమి కాదా రామోజీ. టిప్పర్ డ్రైవర్కు టిక్కెట్ ఇచ్చారని అవమానించారు. రామోజీకి ఇవేమీ కనబడవు...తన పేపర్లో రాయడు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. ‘‘కోట్లు.. కోట్లు ఉన్నవాళ్లను తీసుకొచ్చి డబ్బున్నోళ్లకే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు. కూటమిలో నూటికి 95 శాతం సంపన్నులకే టిక్కెట్లిచ్చారు. మార్గదర్శిలోకి వచ్చిన డబ్బు ఎవరిదో చెప్పు రామోజీ. మార్గదర్శికి సంబంధించి 50 లక్షలు పట్టుకుంటే.. ఆ డబ్బు ఎలా వచ్చిందో క్లెయిమ్ చేసుకోలేదు. పాపపు సొమ్ము పోగేసి మూటలు కట్టి.. ఆ డబ్బుతో పేపర్లు పెట్టి మాపై విషం చిమ్ముతున్నారు. నిన్నటి వరకూ ఈనాడులో వాలంటీర్ల పై ఏం రాశారో మర్చిపోయారా?. వాలంటీర్ల పై అత్యంత దారుణంగా దారిసింది ఈనాడు కదా. ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా వాలంటీర్లకు పదివేలిస్తానని చంద్రబాబు చెప్పాడు.. ఈనాడు రాసింది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలన్నది మీరే కదా.. మా కార్యకర్తలకు మీరు ఇప్పుడు పదివేలివ్వాలనుకుంటున్నారా?. మార్గదర్శి మోసాలపై ఒక్కనాడైనా ఈనాడులో రాసుకోవచ్చు కదా’’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘అందరి బతుకుల గురించి రాసేవాడివి.. నీ బతుకు గురించి ఎందుకు రాయవు. చంద్రబాబు పదివేలు కాదు.. నెలకు లక్ష ఇస్తానన్నా.. ఓటర్లు.. వాలంటీర్లు నమ్మరు. ఓటరుకైనా...వాలంటీర్ కైనా జగన్ అంటేనే నమ్మకం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది దగా’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. ఇదీ చదవండి: బాబుది బోగస్ రిపోర్ట్.. జగన్ది ప్రొగ్రెస్ రిపోర్ట్: సీఎం జగన్ -
‘వలంటీర్లకు గాలం వేయడం నీ తరం కాదు’...
-
‘వలంటీర్లకు గాలం వేయడం నీ తరం కాదు’
కృష్ణా, సాక్షి: నాలుగున్నరేళ్లుగా క్షోభపెట్టి.. ఇప్పుడు వలంటీర్లకు గాలం వేస్తున్నావా? అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మండిపడ్డారు. అయితే వలంటీర్లంటే నిస్వార్ధ సేవకులని, వారికి గాలం వేయడం అంత సలువు కాదని బాబుకి పేర్ని నాని చురకలంటించారు. ‘‘నాలుగున్నరేళ్లుగా మీరు(బాబు అండ్ కో) పెట్టిన క్షోభంతా వలంటీర్లు మర్చిపోయారనుకుంటున్నారా?. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి.. బాంబే రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను అమ్ముతున్నారన్నారంటూ వలంటీర్లపై అడ్డగోలు ఆరోపణలు చేశారు. పైగా మూటలు మోసే ఉద్యోగం, మగవాళ్లు ఇంట్లో లేకుండా తలుపులు కొడతారని వ్యాఖ్యానించారు. మరి ఆ వ్యాఖ్యలన్నీ చంద్రబాబు మర్చిపోయారా?.. పొరపాటున రేపు నువ్వొస్తే నీ జన్మభూమి కమిటీలను వలంటీర్లుగా మారుస్తావని వారికి(వలంటీర్ల) తెలియదా?. చంద్రబాబూ.. నీ మోసాలు, కుట్రలు, కుయుక్తులు నమ్మేవారు ఎవరూ లేరు. రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల మంది వలంటీర్లందరికీ జగన్ గారంటే ఏంటో తెలుసు. వచ్చేది జగన్ ప్రభుత్వమే అనేదీ వలంటీర్లకు తెలుసు. జగన్ ప్రభుత్వంలో వారి సంక్షేమం, బాగోగులు ఎలా చూసుకోవాలో మాకు తెలుసు అని పేర్ని నాని అన్నారు. అంతలా క్షోభపెట్టి ఇప్పుడు.. బూటకాలకు, నయవంచనకు మారు పేరైన నారా చంద్రబాబునాయుడు వివిధ కులాలకు గాలం వేయడం అయిపోయింది. కులాలను వాడుకుని వదిలేసి మోసం చేయడం కూడా అయిపోయింది. రాష్ట్ర ప్రజలకు కూడా గాలం వేయడం, వారిని వాడుకోవడం, విసిరి పారేయడం అయిపోయింది. కొత్తగా ఇప్పుడు వలంటీర్లకు కూడా చంద్రబాబు గాలం వేస్తున్నాడు. ఆ గాలానికి ఎరగా గౌరవవేతనం పదివేలు చేస్తానంటున్నాడు. పదివేలు చేస్తానన్న పెద్ద మనిషి ఎవరయ్యా అంటే గత నాలుగున్నరేళ్లుగా వలంటీర్లను మానసికంగా క్షోభకు గురిచేసిన చంద్రబాబు వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. బాంబే రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను అమ్ముతున్నారని వాళ్ల పార్టనర్ అంటే..మగవాళ్లు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్లను లొంగదీసుకుంటారని మాట్లాడని వ్యక్తులు వీళ్లు. మూటలు మోసే వారని, డేటాను ఇతర దేశాలకు అమ్ముతారని వీళ్లంతా ఇష్టారీతిన మాట్లాడారు. తన రాజకీయం కోసం పట్టుమని ముప్పై ఏళ్లు కూడా నిండని ఆడ, మగ పిల్లల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ప్రజలు ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా జగన్ గారి ప్రభుత్వంలో పథకాలను వారి గుమ్మం వద్దకే తీసుకెళ్లిన వ్యవస్థ వలంటీర్ వ్యవస్థ. ముక్కలు చేయాలని కుయుక్తులు వలంటీర్ వ్యవస్థను ముక్కలు ముక్కలు చేద్దామని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా వారిని ఎంత దిగజార్చాలో అంత చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరిచాడు. చంద్రబాబు తాబేదారు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబు కోసం పనిచేశాడు. ఇప్పుడు ప్రజా స్వామ్య పరిరక్షణ అంటూ రిటైర్ అయిన తర్వాత కూడా చంద్రబాబు కోసం ఓ డమ్మీ సంస్థను ఏర్పాటు చేశాడు. చంద్రబాబు రాజకీయం కోసం ప్రజాస్వామ్యం అనే ముసుగు వేసుకుని ఈ నిమ్మగడ్డ పనిచేస్తున్నాడు. అలాంటి నిమ్మగడ్డ వలంటీర్లు పింఛన్లు పంచకూడదు, ప్రజలకు గుమ్మంలోకి సేవలు అందించకూడదని హైకోర్టులో కేసు వేశాడు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కూడా కేసులు వేశాడు. ఎక్కడా వీళ్ల ఆటలు సాగలేదని బీజేపీ పొత్తు ప్రభావంతో వలంటీర్ల సేవలు నిలిపివేయండి అని ఆదేశాలు తెచ్చారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు వలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వొచ్చు అంటే...మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం కుదరదని ఆదేశాలు ఇచ్చింది. ఎప్పుడైతే ఈ 66 లక్షల మంది పింఛన్దారులే కాకుండా, సామాన్య ప్రజానీకంలో తిరుగుబాటు వచ్చిందో అప్పుడు చంద్రబాబు మాటమారుస్తున్నాడు. వలంటీర్లు ఇస్తే తప్పేంటి..58 నెలలు ఇచ్చారు..ఈ రెండు మాసాలు ఇస్తేనే ప్రజలు మారిపోతారా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రజలు కాలర్ పట్టుకునే సరికి.. ప్రజలు కాలర్ పట్టుకుని ప్రశ్నించే స్థితికి వచ్చేసరికి వలంటీర్లు అందరూ మంచోళ్లు అంటూ కొత్త రాగం అందుకున్నారు. వలంటీర్లు ఇంటింటికి పింఛన్ పంచాలి, వారు మంచోళ్లు వారిని కొనసాగిస్తాం, వారికి పదివేలు ఇస్తాం అంటూ మాట్లాడుతున్నారు. మీరు పెట్టిన క్షోభంతా వలంటీర్లు మర్చిపోయారని మీరనుకుంటున్నారా? జగన్ గారి సారధ్యంలో ఏర్పాటైన ఈ వ్యవస్థలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా సేవే పరమావధిగా పనిచేస్తున్నారు. సేవ చేయాలని వారు ఈ బాధ్యతలు తీసుకున్నారు కానీ జీతం, డబ్బులు కోసం కాదని చంద్రబాబు గుర్తించాలి. డబ్బుతో వలంటీర్లను కొనలేవు చంద్రబాబూ..!: చంద్రబాబూ..నువ్వో, నీ దత్తపుత్రుడో డబ్బులకు అమ్ముడుపోతారేమో కానీ..వలంటీర్లు డబ్బులకు అమ్ముడు పోయేవారు కాదు. వలంటీర్లంటే నిస్వార్ధంగా పనిచేసే వారు. వారికి గాలం వేయడం నీ తరం కాదు. నీ నైజం వారికి తెలియంది కాదు. పొరపాటున రేపు నువ్వొస్తే నీ జన్మభూమి కమిటీలకు వలంటీర్లు అని పేరు తగిలిస్తావని వారికి తెలియంది కాదు. ఇప్పటికే మీ టీడీపీ కార్యకర్తలు గ్రామ గ్రామాన మాకు సహకరించండి మీ వాళ్లకి వలంటీర్ ఉద్యోగం ఇస్తామని గాలం వేస్తున్నారు. జనం ఒకసారి, రెండు సార్లకు నమ్ముతారు కానీ..మాటిమాటికీ నమ్మరు చంద్రబాబూ..! నీ మోసాలు, కుట్రలు, కుయుక్తులు నమ్మేవారు ఎవరూ లేరు. వలంటీర్లకు డబ్బు ఎర చూపితే నీకు లొంగే వాళ్లు కాదు. రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల మంది వలంటీర్లందరికీ జగన్ గారంటే ఏంటో తెలుసు. వచ్చేది జగన్ గారి ప్రభుత్వమే అనేదీ వారికి తెలుసు. ఆ ప్రభుత్వంలో వారి ఆలనా, పాలన ఎలా చూసుకుంటారో కూడా వారికి తెలుసు. నువ్వు కుట్రలు పన్నితే, ఎర వేస్తే డబ్బులుకు అమ్ముడుపోయే వారు కాదని చంద్రబాబు గుర్తెరగాలి. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలను చావబాదిన పోలీసులు
కోనేరు సెంటర్: టీడీపీ నేత సమక్షంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదిన కృష్ణా జిల్లా బందరు రూరల్ పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. బందరు మండలం ఉల్లిపాలెంలో ఇటీవల జరిగిన ఓ గ్రామ దేవత సంబరంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చేరారు. దీనిపై పరస్పర ఫిర్యాదులు అందుకున్న బందరు రూరల్ ఎస్ఐ చాణక్య ఆస్పత్రి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు డిశ్చార్జ్ అయ్యాక వారిని మంగళవారం స్టేషన్కు పిలిపించారు. మరో ఏఎస్సై, కానిస్టేబుల్తో కలిసి సుల్తానగరంకు చెందిన ఓ టీడీపీ నేత సమక్షంలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో ఎస్ఐ కుళ్లబొడిచారు. అంతేకాకుండా పిడిగుద్దులు గుద్ది, కార్యకర్తల ముఖాలను గోడకు బలంగా నొక్కి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ఒకరికి చేయి విరిగిపోగా, మరొకరికి తలపై గాయమైంది. ఇంకో కార్యకర్త వీపంతా రక్తపుమరకలతో నిండిపోయింది. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు, తదితర నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్కు చేరుకుని పోలీసుల తీరును ఖండించారు. కేసు నమోదు చేశాక తమ కార్యకర్తలను కొట్టే అధికారం మీకెవరిచ్చారంటూ పేర్ని నాని నిలదీశారు. టీడీపీ నేత సమక్షంలో తమ కార్యకర్తలను ఏకపక్షంగా కొట్టిన ఎస్ఐతోపాటు బాధ్యులందరినీ విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ సుభానీ, సబ్ డివిజన్కు చెందిన సీఐలు, ఎస్ఐలు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా వచ్చారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్ని నానికి హామీ ఇచ్చారు. దీంతో ఆయన శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఘటనపై డీఎస్పీ విచారణకు ఆదేశించారు. -
బీజేపీని బాబు జనతా పార్టీగా చేశావ్..అమ్మా
-
బాబును కాపాడేందుకు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకులు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కంటే చెల్లెలి భర్తకు మేలు చేసేలా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ను కూలదోసే సమయంలో బాబుకు పురంధేశ్వరి సపోర్టు చేశారని దుయ్యబట్టారు. బాబు కోసం పురంధ్వేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని విమర్శించారు. ఏపీలో బీజేపీలో బలం ఉందా లేదా అనే విషయం అందరికీ తెలుసన్నారు పేర్ని నాని. బీజేపీ టికెట్లను పురంధేశ్వరి ఎవరికి ఇప్పించారో చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీలో ఒరిజినల్ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారంతా టీడీపీ నేతలనేనని అన్నారు. అమిత్ షా దగ్గరకు చంద్రబాబును పురంధేశ్వరి తీసుకెళ్లారని ప్రస్తావించారు. మరిది కళ్లల్లో ఆనందం కోసం పోలీసు అధికారులపై పురంధేశ్వరి ఆరోపణలు చేశారని విమర్శించారు. ‘రామోజీరావు, చంద్రబాబు తప్పడు పనులు, పాపాలపై చర్యలు చేపట్టిన అధికారులపై పురంధేశ్వరి ఫిర్యాదులు చేశారు. 22 మంది నిజాయితీగల అధికారులపై ఫిర్యాదు చేస్తే ఈసీ ఎందుకు ప్రశ్నించలేదు. ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలో పురంధేశ్వరి ఈసీకి లిస్ట్ ఇచ్చారు. బదిలీ చేసిన వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా పేర్లు ఇచ్చారు. జాబితా ఇవ్వడానికి ఆమె ఎవరు? తప్పుడు ఆరోపణలకు ఏమైనా ఆధారాలు చూపించారా? ఇది బరి తెగింపు కాదా? పురంధేశ్వరి కావాలనుకున్న అధికారులకు ఎంత ఇచ్చారో చెప్పాలి. నిజాయితీగా పని చేసిన ఐపీఎస్ అధికారులపై విషం చిమ్మడం దారుణం. పురంధేశ్వరి జాబితా ఇస్తే ఈసీ ఎందుకు మాట్లాడటం లేదు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పురంధేశ్వరి వైఖరిపై రేపు సీఈఓకి ఫిర్యాదు చేస్తాం’ అని పేర్ని నాని పేర్కొన్నారు. చదవండి: మళ్లీ అధికారంలోకి రాగానే వలంటీర్ వ్యవస్థపై తొలి సంతకం: సీఎం జగన్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
Advertisement