-
డోర్ నంబర్లూ డొల్లే !
ఒకే కుటుంబం.. కేంద్రాలు అనేకం!సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్ నంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్ నంబర్తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్నంబర్తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నంబర్లు వేయడమో చేసి ఆ ఇంటి నంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు పేర్కొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. నగర ఓటరు జాబితాలో వింతలెన్నో రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో వింత పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం -
నేనే చంపేశా..
చేవెళ్ల: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా తనకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో మేన బావను హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఊరేళ్ల సమీపంలోని ఓ ఫాంహౌస్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. చేవెళ్లకు చెందిన కడమంచి నారాయణదాస్(46) జాతీయ అంబేడ్కర్ అవార్డు గ్రహీత, రియల్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి ఊరేళ్ల సమీపంలో ఓ ఫాంహౌస్ ఉంది. కొద్ది రోజులుగా ఇందులో మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన మేన బావమర్ది తూర్పాటి భాస్కర్తో కలిసి ఫాంహౌస్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పాడు. చీకటి పడినా రాకపోవడంతో మృతుడి భార్య పలుమార్లు ఫోన్ చేసింది. ప్రతీసారి లిఫ్ట్ చేసిన భాస్కర్.. బావ దూరంగా ఉన్నాడని చెప్పాడు. అర్ధరాత్రి తర్వాత చేవెళ్ల పీఎస్కు వెళ్లిన భాస్కర్.. నారాయణదాస్ను గొడ్డలితో నరికి చంపానని చెప్పి లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూసే వరకు నారాయణదాస్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిజేశారు. మృతుడికి భార్య మాణెమ్మ, ఇద్దరు కుమారులున్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతోనే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నారాయణదాస్ చాన్నాళ్లుగా భాస్కర్ను తన వెంట తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో షాబాద్ మండలం నాగరకుంటలోని ఓ భూమికి సంబంధించిన డీల్లో రూ.25లక్షలు ఇస్తానని భాస్కర్కు చెప్పాడు. ఇది పూర్తయి చాలా రోజులైనా డబ్బు ఇవ్వకుండా దాటవేస్తున్నాడు. దీంతో కొద్ది రోజులుగా భాస్కర్ అతనికి దూరంగా ఉంటున్నాడు. మంగళవారం డబ్బు అడగ్గా ఇస్తాలే నేనెక్కడికి వెళ్లట్లేదుగా అని చెప్పిన నారాయణదాస్.. భాస్కర్ను తీసుకుని ఊరెళ్లలోని ఫాంహౌస్కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి అక్కడే మద్యం తాగారు. ఈ క్రమంలో డబ్బుల విషయం మరోసారి చర్చకు రావడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సమయంలో కింద పడిపోయిన నారాయణదాస్ లేస్తే తనను చంపేస్తాడని భావించిన భాస్కర్ అక్కడే ఉన్న గొడ్డలితో మెడపై దాడి చేశాడు. అతడు చనిపోయాడని నిర్ణయించుకుని ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు. హత్యపై అనుమానాలు నారాయణదాస్ హత్య ఒక్కడివల్ల జరగలేదని, దీనిపై నిజానిజాలు తేల్చాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. డబ్బుల విషయంలో గొడవ గొడ్డలితో దాడి చేసి మేన బావను హతమార్చిన నిందితుడు -
శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి
● సతీసమేతంగా హాజరైన కిషన్రెడ్డి ● స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, నాయకులు అమరేందర్రెడ్డి, నిరంజన్, భిక్షపతి, పాండు, రమేష్గౌడ్ తదితరులు ఉన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా విజయ్కుమార్ ఇబ్రహీంపట్నం రూరల్: భారతీయ జనతాపార్టీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా మైలారం విజయకుమార్ నియమితులయ్యారు. బీజేవైఎం రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు యాదీష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రానికి చెందిన విజయ్కుమార్ బీజేపీలో చురుకై నపాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం కార్యదర్శిగా నియమించింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కాలుష్యకారకాలపై చర్యలు రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు మెంబర్ సత్యనారాయణరెడ్డి చేవెళ్ల: ప్రజలకు ఇబ్బంది కలిగించే కాలుష్యకారకాలపై తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బోర్డు సెక్రటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన నగరంలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారని.. చేవెళ్ల ప్రాంతంలోని పలు సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాండూరులోని ఏసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని.. చందనవెల్లిలోని కుందన్ టైక్స్టైల్స్, శంషాబాద్ శ్రీకృష్ణ డ్రగ్స్తోనూ పర్యావరణం కాలుష్యమవుతోందని చెప్పానన్నారు. మోకిలలో నిర్మిస్తున్న విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణ వ్యర్థాలు గండిపేట చెరువులోకి వదులుతున్నారని ప్రస్తావించానన్నారు. మోకిలలోని నిర్మాణాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించిందని చెప్పారు. మొదటిసారి సమావేశానికి హాజరైన నూతన మెంబర్లను బోర్డు ఆధ్వర్యంలో సన్మానించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీబీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డూప్లికేట్ ఔట్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ప్రకటించారు. మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం గత సంవత్సరం ఆరంభం నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. -
ఎన్నికలకుసై
నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ ● ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్ల దాఖలుకు అభ్యర్థుల ఏర్పాట్లు సాక్షి, రంగారెడ్డిజిల్లా: సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లలో తలమునకలైంది. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై గట్టి నిఘా తదితర చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం మంచి ముహూర్తాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే పంతుళ్లను ఆశ్రయించి, ఏ రోజు నామినేషన్ వేయాలనే అంశంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. శుభ ముహూర్తాలు ● 18వ తేదీ గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 24న బుధవారం చైత్ర బహుళ పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే.. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలుకు మంచి రోజు. ● 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం.. పై ముహూర్తాల కంటే ఇది యోగ్యమైనది. కానీ ఆరోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు సైతం బయటికి వెళ్లేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు ఇలా ● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. ● అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో పెట్టాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైతే విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ వీఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్–3లో సి కాలం ఎదుట ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపరచాలి. ● పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు అనుమతి. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ల స్వీకరణ కోసం రాజేంద్రనగర్ తహహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, భద్రత కోసం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీని ఎంపిక చేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు 13,443 పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయనున్న తేదీ బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 19 బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25షెడ్యూల్ ఇలా.. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 6తో ఎన్నికల ప్రక్రియ ముగింపు -
ఓయూలో టెక్నోస్మానియా సందడి
ఉస్మానియా యూనివర్సిటీ: టెక్నాలజీ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో టెక్నోస్మానియా–2024 జాతీయ స్థాయి టెక్నోకల్చరల్ ఫెస్ట్తో ఓయూ క్యాంపస్లో సందడి వాతావరణం నెలకొంది. బుధవారం వర్సిటీ ప్రవేశ ద్వారం ఎన్సీసీ గేటు వద్ద ‘నీటి చుక్కను పొదుపుగా వాడుదాం.. ప్రొటెక్ట్ ఎర్త్ ప్రిషియస్ వాటర్’ నినాదంతో ఏర్పాటు చేసిన 3కే రన్ను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.చింత సాయిలు, టెక్నోస్మానియా కన్వీనర్ ప్రొ.శ్రీనునాయక్ జెండా ఊపి ప్రారంభించారు. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన జూక్ బాక్స్ మ్యూజిక్కు ఒకేసారి వందలాది మంది విద్యార్థులు సామూహిక నృతంతో అలరించారు. అనంతరం కాలేజీ ఎదుట విద్యార్థులు చేసిన బైక్ స్టంట్ చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.రమేష్కుమార్, ప్రొ.వీవీ బసవరావు, ప్రొ.రాజం, కోర్డినేటర్ డా.పరశురామ్, డా.సాదం ఐలయ్య, డా.వి భాస్కర్, డా.శ్రీనివాసులు, స్టూడెంట్స్ కోఆర్డినేటర్లు శ్యామ్ సుందర్, మాధవి, ఆకాష్, అఖిల, ముఖేష్, పాహిత్య, సూరిదుర్గ, అరవింద్ పాల్గొన్నారు. -
సివిల్స్లో గిరి పుత్రుడి సత్తా
షాద్నగర్: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వాసి సత్తా చాటాడు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 891వ ర్యాంకుతో మెరిశాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ పరిఽధిలో చాకలిదాని తండాకు చెందిన రాములు నాయక్, సీతమ్మ దంపతుల పెద్దకుమారుడు శశికాంత్. తండ్రి రాములు నాయక్ హాస్టల్లో వార్డెన్గా పని చేస్తూ షాద్నగర్ పట్టణంలోని విజయ్నగర్ కాలనీలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. ఆయన 2008లో అకస్మాత్తుగా మృతి చెందడంతో అప్పటి నుంచి తల్లి పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శశికాంత్ షాద్నగర్ పట్టణంలోని మరియారాణి ఉన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత నాగర్కర్నూల్ జిల్లా వట్టెం నవోదయలో 9, 10వ తరగతులు చదివారు. ఆ తర్వాత హైదరాబాద్లోని మియాపూర్ గుంటూరు వికాస్లో ఇంటర్, విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(ఈఈఈ) పూర్తి చేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన శశికాంత్ ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వాటిని వదలుకున్నారు. 2011లో ఇన్ఫోసిస్లో ఏడాదికి రూ.11లక్షల ప్యాకేజీతో, 2012లో పశ్చిమ బెంగాల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఏటా రూ.12లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అయినా వాటిల్లో చేరకుండా సివిల్స్ వైపు దృష్టి మళ్లించారు. 2013లో ఢిల్లీ వెళ్లి సివిల్స్కు సిద్ధం అయ్యారు. మూడుసార్లు ప్రిలిమినరీ వరకు వచ్చారు. 2019లో కేవలం 6 మార్కుల తేడాతో అవకాశం కోల్పోయారు. 2020లో ఆరో ప్రయత్నంలో సివిల్స్లో 695 ర్యాంకు సాధించిన శశికాంత్ను యూపీఎస్సీ అధికారులు ఐఆర్టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)కు కేటాయించారు. ప్రస్తుతం అస్సాంలో రైల్వేశాఖలో పని చేస్తున్నారు. చదువుతూ.. ఉద్యోగం చేస్తూ అస్సాం రాష్ట్రంలోని రింగియా డివిజన్లో రైల్వే విభాగంలో అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్గా శశికాంత్ విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో విధులు నిర్వర్తిస్తూనే మరోసారి సివిల్స్కు ప్రయత్నించారు. ఇప్పటి వరకు 8సార్లు పరీక్షలు రాసిన శశికాంత్ మూడు సార్లు ర్యాంకులు సాధించారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ సర్వీసెస్ తుది పరీక్ష ఫలితాలు మంగళవారం వెల్లడించింది. మొత్తం 1,016 మందిని ఎంపిక చేయగా శశికాంత్ 891వ ర్యాంకు సాధించి శెభాష్ అనిపించుకున్నారు. షాద్నగర్వాసికి 891వ ర్యాంకు అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగం సాధించాలని ఎందరో కలలు కంటారు. దానికి నిర్దిష్టమైన ప్రణాళిక రచించి, కఠోర సాధన చేస్తే తప్ప అందుకోవడం సాధ్యం కాదు. అలాంటి కలను షాద్నగర్వాసి సాకారం చేసుకున్నాడు. ఇటీవల వెల్లడించిన సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. -
సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు
మొయినాబాద్రూరల్: ప్రస్తుత కాలంలో సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని చెతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ పురుషోత్తమ్రెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేట్ అధికారి సాత్వికరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామ సమీపంలో గల యూనివర్సిటీలో భార్గవి, ప్రశాంత్రాజాలు డాక్టరేట్ పొందారు. సుక్ష్మ జీవశాస్త్ర విభాగంలో ‘ఎవాల్యూవేషన్ ఆఫ్ యాంటీ బ్యాక్టిరియా ఎన్డీ యాంటీ బయోఫిల్మి పొటెన్షియల్ ఆఫ్ సెలెక్టెడ్ ప్లాంటీ ఎక్స్లెన్స్ ఎగ్రినేస్ట్ డిగ్రీ రెసిస్టెంట్ పాతోజేన్స్’ అనే అంశంపై ప్రొఫెసర్ బి.శ్రీలత పర్యవేక్షణలో భార్గవి పరిశోధన చేశారు. అదే విధంగా రసాయన శాస్త్ర విభాగంలో ‘సిందాసిస్ అండ్ బయోలాజికల్ ఎలివేషన్ ఆఫ్ నైట్రోజన్ బెస్ట్ ఎటేరో సక్లిస్ట్’ అనే అంశంపై ప్రొఫెసర్ జగదీష్కుమార్ పర్యవేక్షణలో ప్రశాంత్రాజ్ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా వీరికి డాక్టరేట్ పట్టాను అందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రవీందర్, కవిత, రిసర్చ్ డీన్ కిష్టఫర్, డిన్ సైన్స్ ప్రొఫెసర్ సుందర్రామ్, అడ్మినిస్ట్రేషన్ రాజు, పబ్లిక్ రిలేషన్ అధికారి రాంబాబు పాల్గొన్నారు. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీచాన్స్లర్ డాక్టర్ పురుషోత్తమ్రెడ్డి -
యువతి అదృశ్యంపై కేసు నమోదు
మొయినాబాద్: ఆరుబయట బాత్రూంకు వెళ్లిన వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం, రాఘవరెడ్డి కాలనీకి చెందిన అతిపాటి ఆదిశేషయ్య కొంత కాలంగా మండల పరిధిలోని చిన్నషాపూర్గేటు సమీపంలో ఉంటున్నాడు. అతని సోదరుడి కూతురు లావణ్య(18) పది రోజుల క్రితం ఆదిశేషయ్య ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో బాత్రూంకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా రాఘవరెడ్డి కాలనీకి చెందిన ప్రసాద్ అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి షాద్నగర్రూరల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కందివనం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన సిద్ధార్ధ తుకారాం కడేకర్(24) కుటుంబంతో కలిసి క్రితం షాద్నగర్కు వలస వచ్చారు. కందివనం గ్రామంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో సిద్ధార్ధ వాచ్మెన్గా పని చేస్తూ కుటుంబంతో అక్కడే నివాసం ఉంటున్నాడు. బుధవారం వ్యవసాయ క్షేత్రంలోని నీటి ట్యాంకులో ఆయన పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ రాంచందర్ ఘటనా స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. చేపలు పట్టే విషయంలో ఘర్షణ ఇరువురిపై కేసు నమోదు యాచారం: చెరువులో చేపలు పట్టే విషయంలో ఇరు గ్రామాల వ్యక్తుల మధ్య ఘర్షణచోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తక్కళ్లపల్లి–తక్కళ్లపల్లి తండా గ్రామాల మధ్యన ఉన్న చెన్నరెడ్డిచెరువులో మంగళవారం రాత్రి తండాకు చెందిన కొంత మంది గిరిజనులు చేపలు పట్టడానికి వెళ్లారు. ఇది గమనించిన కొందరు తక్కళ్లపల్లి గ్రామస్తులు చేపలు పట్టే వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువురి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్కుమార్ తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత రూ.7.50 లక్షల విలువ ఉంటుందని పోలీసుల వెల్లడి షాద్నగర్రూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం సాయంత్రం ఎస్ఓటీ, షాద్నగర్ పోలీసులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి డీసీఎం వాహనంలో 26.2 టన్నుల రేషన్ బియ్యాన్ని నారాయణపేట జిల్లా మరికల్కు తీసుకెళుతున్నారు. ముందస్తు సమాచారంతో శంషాబాద్ ఎస్ఓటీ, షాద్నగర్ పోలీసులు మంగళవారం పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద మాటు వేసి పట్టుకున్నారు. రేషన్ బియ్యంతో పాటుగా డీసీఎంని పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. బియ్యం విలువ రూ.7.50 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఫరూఖ్నగర్ మండలం భీమారం గ్రామ పరిధిలోని మొల్లోనిగడ్డ తండాకు చెందిన పాత్లావత్ కిషన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు డీఐ రామిరెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్లో భారీ చోరీ రూ.70 లక్షల విలువైన నగలు మాయం బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో నివసించే ప్రముఖ వ్యాపారవేత్త డీవీఎస్ సోమరాజు నివాసంలో భారీ చోరీ జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–62లోని ప్లాట్నెంబర్ 1242 (బి)లో సోమరాజుతో పాటు ఆయన తల్లిదండ్రులు శివరామరాజు, అన్నపూర్ణ, భార్య పద్మసూర్య కుమారి, కుమారులు యశ్వంత్ వర్మ, శివ మితీష్వర్మ ఉంటున్నారు. ఈ నెల 4న వీరంతా ఓ వివాహానికి హాజరై సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత ఆభరణాలను బెడ్రూంలోని అల్మరాలో భద్రపరిచారు. ఈ నెల 15న రాత్రి మరో శుభకార్యానికి వెళ్లే క్రమంలో ఆభరణాలు కోసం చూడగా అల్మరాలో కనిపించలేదు. ఇందులో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్తో పాటు బంగారు గాజులు, చంద్రహారం, డైమండ్ నెక్లెస్, మరో మూడు గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.70 లక్షలు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంట్లో నలుగురు పని మనుషులు ఉంటారని, ఇందులో ఇద్దరు బయటి నుంచి వస్తారని, మరో ఇద్దరు సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపైనే అనుమానం ఉందన్నారు. చోరీకి గురైన ఆభరణాల పక్కనే ఉన్న రూ.40 లక్షల విలువ చేసే నగలు భద్రంగానే ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు సాక్షి, సిటీబ్యూరో: తమిళనాడు రాజధాని చైన్నె పల్లవరం ప్రాంతానికి చెందిన యువకుడు (35) స్కిజోఫేనియా అనే మానసిక వ్యాధి ప్రభావంతో 2020లో కుటుంబానికి దూరమయ్యాడు. ఎలా వచ్చాడో ఏమో కానీ అనాథగా సికింద్రాబాద్ వీధుల్లో సంచరిస్తూ రోడ్లపై జీవించాడు. అతడిని చూసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చలించిన మదర్ థెరిస్సా చారిటీ సంస్థకు సమాచారం ఇచ్చారు. అతడికి అక్కున చేర్చుకున్న ఆ సంస్థ ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ప్రొఫెసర్ డాక్టర్ అనిత రాయిరాల సహకారంతో వైద్యం చేయించారు. ఎట్టకేలకు కోలుకున్న ఆ యువకుడు తన వివరాలు చెప్పడంతో అతికష్టమ్మీద కుటుంబీకుల వివరాలు సేకరించి సమాచారం ఇచ్చారు. బుధవారం సికింద్రాబాద్లోని చారిటీ కార్యాలయానికి రప్పించి యువకుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. చారిటీ కార్యాలయంలో కోలుకున్న స్థితిలో ఉన్న తమ కుమారుడిని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. ఆ కార్పొరేటర్ ఆచూకీ దొరికేనా? నాగోలు: కార్పొరేటర్, ఓ మహిళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన బాలవర్ధన్ కేసులో నిందితులను నాగోలు పోలీస్లు గతంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఏ3గా ఉన్న గడ్డిఅన్నారం బీజేపీ కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్రెడ్డిపై కేసు నమోదయినప్పటినుంచి పరారీలో ఉన్నాడు. ఈ నెల 1 వ తేదీ నుంచి కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్రెడ్డి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో నాగోలు పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు పై స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చారు. నాగోలు పోలీసులుతో పాటు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను, ఇతర స్నేహితుల ద్వారా కార్పొరేటర్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రోగాలను ప్రాథమిక స్థాయిలో గుర్తించాలి డాక్టర్ నాగేశ్వర్రెడ్డి శంషాబాబాద్: ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షల ద్వారా ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే సరైన చికిత్సతో మేలు జరుగుతుందని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సీఐఎస్ఎఫ్ డీజీపీ శ్యామల ఆధ్వర్యంలో సుమారు 200 మంది సీఐఎస్ఎఫ్ ఉద్యోగులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమంతో వైద్యపరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీర్ణ సంబంధిత వ్యాధులను ఎలా గుర్తించాలనే విషయాలను వివరించారు. జీవనశైలితో వచ్చే కాలేయ సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించే మంచి చికిత్స అందుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, సీఐఎస్ఎఫ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
హోదా ఉన్నా.. నిఘా సున్నా!
సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్ల కోసం దేశ వ్యాప్తంగా వేట.. నకిలీ కరెన్సీ కేసుల్లో సరిహద్దుల ఆవలి వరకు ప్రయాణం.. ఉగ్రవాద కేసుల్లో ఫీల్డ్ ఆపరేషన్లు.. కేవలం ఇవేనా..? నగర వ్యాప్తంగా ఎలాంటి సంచలనాత్మక నేరం చోటు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చిన పేరు హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ విభాగం ప్రతిష్ట ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాస్పద అంశాలతో మసకబారుతోంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు, ఎన్నికల డబ్బు రవాణా, వ్యాపారుల కిడ్నాప్–బెదిరింపులు.. ఇలా అనేక వివాదాలు ఈ విభాగాన్ని చుట్టుముడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల నెలకొనడానికి నగరంలోని రెండు టాస్క్ఫోర్స్ కార్యాలయాల్లో సరైన నిఘా లేకపోవడమూ ఓ కారణంగా నిలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. కస్టోడియల్ మరణాలకు చెక్ చెప్పడం, మానవహక్కుల ఉల్లంఘనలు లేకుండా చూడటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచడం, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పోలీసింగ్లో పూర్తి పారదర్శకత కోసం ప్రతి పోలీసు స్టేషన్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్పీం కోర్టు దాదాపు పదేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. డీకే బసు వర్సస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో తీర్పు ఇస్తూ దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పలుమార్లు గడువు పెంచిన పోయిన సుప్రీం కోర్టు 2020 డిసెంబర్ను తుది గడువుగా నిర్దేశించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. పని చేస్తున్నాయా? లేదా? అనేది పక్కన పెడితే నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్లోనూ కనిష్టంగా 11 కెమెరాలు ఏర్పాటయ్యాయి. కేవలం పోలీసుస్టేషన్లో మాత్రమే కాదు.. ఠాణా హోదా ఉన్న సీసీఎస్, సైబర్ క్రైమ్ పీఎస్ల్లోనూ ఇవి ఉన్నాయి. 28 ఏళ్ల క్రితమే పోలీసుస్టేషన్ హోదా.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అధీనంలో పని చేసే కమిషనర్స్ టాస్క్ఫోర్స్కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది కేవలం యాంటీ గూండా స్క్వాడ్ మాదిరిగా కేవలం ఆపరేషనల్ విభాగంగా ఉండేది. కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, పోస్టులు పొండటంలో, జీతభత్యాల విషయంలో వస్తున్న సాంకేతిక సమస్యల నేపథ్యంలో 1996లో అప్పటి పోలీసు శాఖ ప్రభుత్వానికి కీలక నివేదిక పంపింది. దీని ఆధారంగా సర్కారు కమిషనర్స్ టాస్క్ఫోర్స్కు సైతం పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నెల వారీ నిర్వహణ ఖర్చులు కూడా దీనికి వస్తున్నాయి. ఇలా దాదాపు 28 ఏళ్లుగా ఠాణా హోదా ఉన్న టాస్క్ఫోర్స్ కార్యాలయాలు (సికింద్రాబాద్లో ఒకటి, పాతబస్తీలో మరోటి) సీసీ కెమెరాలు లేకుండానే కాలం గడిపేస్తున్నాయి. అన్నింటిలోనూ ఏర్పాటు చేయకుండా ప్రతి పోలీసుస్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయంటూ నివేదిక ఇవ్వడం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిఘా నేత్రాలు నేరాల నియంత్రణలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చాలా కేసుల్లో నిరూపితం అయింది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్కు పోలీస్ స్టేషన్ హోదా 1996లోనే జీవో జారీ చేసిన అప్పటి ప్రభుత్వం ‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం ఠాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏర్పాటు చేయని అధికారులు ఫిర్యాదు చేసే విధానానికీ స్వస్తి.. టాస్క్ఫోర్స్ విభాగం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తే దానిపై పని భారం పెరిగి, ఫలితాలు దెబ్బతింటాయనే వాదన ఉంది. దీన్ని అంగీకరించినప్పటికీ.. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు ఏంటనేది మాత్రం అంతు చిక్కట్లేదు. మరోపక్క టాస్క్ఫోర్స్ విభాగం పట్టుకునే నేరగాళ్లపై నమోదయ్యే వాటిలో అత్యధికం సుమోటో కేసులే. అంటే.. పోలీసులే ఫిర్యాదుదారుడిగా ఉంటారు. ఓ నేరగాడిపై సమాచారం అందుకుని, వలపన్ని పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారే సంబంధిత పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తుండేవారు. దీనివల్ల భవిష్యత్తులో సాక్ష్యం చెప్పడం వంటివి తప్పనిసరి కావడంతో ఈ విభాగం అధి కారు ల్లో జవాబుదారీతనం ఉండేది. 2015 నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో, పక్కాగా అమలు కావట్లేదు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ స్థానిక పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకొంటున్న సందర్భాలూ అనేకం ఉంటున్నాయి. ఈ కేసుల్లో ఆయా ఠాణాల అధికారులే ఫిర్యాదు చేస్తూ సుమోటో కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ కారణాలే టాస్క్ఫోర్స్ అభాసుపాలు కావడానికి మూలం అనే వాదన బలంగా వినిపిస్తోంది. -
నిఘా నీడలో లోక్సభ ఎన్నికలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.2.61 కోట్ల నగదు, రూ.4.18 లక్షల విలువ చేసే 5.30 కిలోల వెండి, రూ.69 లక్షలకుపైగా విలువ చేసే 1,2591.63 లీటర్ల మద్యం, రూ.3.28 కోట్లకుపైగా విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసినట్లు కలెక్టర్ శశాంక వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం రాజేంద్రనగర్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ● ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని, ప్రతి రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజేంద్రనగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉంటుందని చెప్పారు. ● 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణ, మే 13న ఎన్నికలు ఉంటాయన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ● కోడ్ ఉల్లంఘనలపై ప్రజలు నేరుగా 1950కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. సి–విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ● 85 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజుల్లోగా ఫాం12తో బీఎల్ఓలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ● చేవెళ్ల లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వీటిలో 29,28,186 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. 2,824 పోలింగ్ కేంద్రాలతో పాటు 53 సహాయక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 13,443 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు ప్రకటించారు. ● ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి ఫాం12 అందజేసి, వారు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ఉన్న చోటే.. రిసెప్షన్ సెంటర్ కూడా ఉంటుందన్నారు. ● కౌంటింగ్ కేంద్రం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి నామినేషన్ల స్వీకరణ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం విలేకరుల సమావేశంలో కలెక్టర్ శశాంక -
దారి తప్పిన ధరణి స్పెషల్ డ్రైవ్
యాచారం: పెండింగ్ భూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ దారి తప్పింది. ఇందులో ఏళ్లుగా మోక్షానికి నోచుకోని భూ సమస్యలు ఇక సత్వరమే పరిష్కారామవుతాయని ఎంతో ఆశపడిన అన్నదాతల ఆశ లు నీరుగారిపోయాయి. దీంతో తమ భూ సమస్య లు పరిష్కరించాలని రైతులు నిత్యం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన వెంటనే మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు పెండింగ్ భూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధరణి స్పెషల్ డ్రైవ్ పెట్టింది. యాచారం మండలంలోని 24 గ్రామాల్లో వివిధ రకాల భూ సమస్యలు 2,550 ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కానీ వాటిని పరిష్కరించేందుకుగాను తహసీల్దార్కు లాగిన్ ఇవ్వకపోవడం రైతులకు పెద్ద శాపంగా మారింది. కొన్నింటికే లాగిన్లు మండలంలోని మొత్తం భూ సమస్యలు 2,550 కాగా ఖాతా మర్జింగ్–9, జీఎల్ఎం–84, జీపీఏ–4 మ్యాడుళ్లలో కేవలం 97 భూ సమస్యలే ఉన్నాయి. వీటికి మాత్రమే లాగిన్లు చేయడానికి తహసీల్దార్కు అనుమతులు ఉన్నాయి. మార్చి 1 నుంచి నేటి వరకు తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు కేవలం 97 రకాల భూ సమస్యలే వెళ్లా యి. అవి కూడా పరిష్కారామయ్యాయా.. లేదా అనే విషయమై స్పష్టత లేకుండా పోయింది. వీటి లో అత్యధికంగా 1,557 టీఎం–33 భూ సమస్యలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి పరిష్కారం పట్ల రైతులు రెవెన్యూ అధికారులను కలిస్తే ఎన్నికల కోడ్ ఉన్నందు వల్ల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని దాటవేస్తున్నారు. సమావేశాలు నిర్వహించినా.. భూ సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడం కోసం లీఫ్స్ సంస్థ(లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మార్స్ సొసైటీ) అధ్యక్షుడు డాక్టర్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో యాచారం మండలాన్ని పైలెట్ కింద తీసుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో లీప్స్ సంస్థ ప్రతినిధుల బృందం భూ న్యాయ శిబిరాలు నిర్వహించి 2,075 భూ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని లీఫ్స్ సంస్థ ప్రతినిధుల బృందం నివేదికను తహసీల్దార్ అయ్యప్పకు అందజేసింది. ప్రభుత్వం నియమించిన ధరణి కమిటీ సభ్యులైన ముదిరెడ్డి కోదండరెడ్డి, సునీల్కుమార్, లచ్చిరెడ్డిలు పలుమార్లు మండలాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి, రెవెన్యూ అధికారులతో కూడా సమావేశమైనారు. కానీ పరష్కారం మాత్రం నేటికీ కాలేదు. పెండింగ్లో భూ సమస్యల పరిష్కారం యాచారంలో 2,550 భూ పంచాయితీలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు -
చెల్లని చెక్కులిచ్చిన వారిపై ఎఫ్ఐఆర్లు
సాక్షి,సిటీబ్యూరో: చెక్ ‘బౌన్సర్ల’పై జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఆస్తిపన్ను చెల్లింపుల కోసం చెల్లని చెక్కులిచ్చిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరానికి(2023–24) జీహెచ్ఎంసీకి మొత్తం రూ.1921 కోట్లు ఆస్తిపన్నుగా వసూలైంది. అందులో చెక్కుల ద్వారా జరిగిన చెల్లింపుల్లో రూ.11 కోట్ల మేర చెక్కులు బౌన్సయినట్లు అధికారులు గుర్తించారు. సర్కిళ్ల వారీగా అలాంటి చెక్కులిచ్చిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు కమిషనర్ రోనాల్డ్రాస్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ సర్కిల్లో 5, శేరిలింగంపల్లిలో 4, చందానగర్లో 13, యూసుఫ్గూడలో 8, కుత్బుల్లాపూర్లో 4, కూకట్పల్లిలో 1, మూసాపేటలో 4 ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వారు ఇంకా ఉన్నారు. జీహెచ్ఎంసీకి చెల్లని చెక్కులిచ్చిన వారు బౌన్సయిన చెక్ తాలూకు నగదును వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఎఫ్ఐఆర్లు దాఖలు చేయనున్నట్లు హెచ్చరించారు. ఇకపై ఆస్తిపన్ను చెల్లించే వారు చెక్బౌన్స్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆస్తిపన్ను బకాయిలున్న వారు వాటిని చెల్లించి ప్రస్తుతం అమల్లో ఉన్న ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎర్లీబర్డ్ ద్వారా 5 శాతం రాయితీకి ఈనెల 30 వరకు గడువు ఉంది. చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ -
‘ఎర్లీ’గా కట్టేయండి
షాద్నగర్: ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. పన్నులు చెల్లించే మొత్తం రాయితీని ప్రకటించింది. ఆస్తి పన్ను రాబట్టుకునేందుకు, మున్సిపాలిటీలకు ఆదాయాన్ని సమకూర్చేందుకు మున్సిపల్ శాఖ ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పథకంలో భాగంగా ముందస్తు పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పించింది. ఈనెల 30 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఆదాయ వనరులు కీలకం మున్సిపాలిటీ ద్వారా పౌరులకు అందించే సేవలు, నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ విభాగం ఒప్పంద కార్మికుల వేతనాలు, పారిశుద్ధ్య విభాగం నిర్వహణ, పౌర సేవలు సక్రమంగా కొనసాగాలంటే సొంత ఆదాయ వనరులు కీలకం. పన్నులు, ఇతర ఖాతాల ద్వారా సాధారణ నిధికి నిధులు జమకావాల్సి ఉంటుంది. ఇందులో జమయ్యే నిధుల్లో ప్రధాన వాటా ఆస్తి పన్నులదే. ఏటా ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఏడాది కాలవ్యవధితో ఆస్తి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులను రెండు విడతలుగా చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. పన్నుల రూపంలో వచ్చే నిధులను మున్సిపాలిటీ నిర్వహణతో పాటు అభివృద్ధి పనులు చేపట్టేందుకు వినియోగిస్తారు. ముందస్తుగా చెల్లిస్తే.. ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుదారుల కోసం పురపాలక శాఖ ఎర్లీ బర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఈనెల 1 నుంచే ప్రారంభమైంది. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ఐదుశాతం రాయితీ కల్పించింది. ఈనెల 30లోపు చెల్లించే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ పథకంపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆటోలను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. పెరగనున్న ఆదాయం ఇళ్ల నిర్మాణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పన్నులు చెల్లించే వారి సంఖ్య సైతం ఏటా పెరుగుతోంది. జిల్లాలో మూడు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఉన్న ఇళ్లు, వ్యాపార సముదాయాలకు ఎర్లీబర్డ్ పథకం వర్తిస్తుంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం పెరగనుంది. ఈ పథకానికి పట్టణాల్లో మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద సుమారు పదిహేను శాతం వరకు పన్నులు వసూలయ్యాయి. మున్సిపల్ శాఖ ఆన్లైన్లో పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ నెలాఖరు వరకు పెద్ద మొత్తంలో పన్నులు వసూలవుతా యని అధికారులు అంచనా వేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకం కింద ఐదు శాతం రాయితీ ఇస్తోంది. ఈ పథకంపై ఇళ్ల యజమానులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఈ నెల 30 వరకు చెల్లించే వారికి మాత్రమే రాయితీ లభిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వెంకన్న, మున్సిపల్ కమిషనర్, షాద్నగర్ సద్వినియోగం చేసుకోవాలి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ముందస్తు పన్నులు చెల్లించే వారికి ప్రభుత్వం ఇచ్చే రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. – కొందూటి నరేందర్, మున్సిపల్ చైర్మన్, షాద్నగర్ ఐదు శాతం రాయితీ పొందండి మున్సిపాలిటీల్లో ‘ఎర్లీ బర్డ్’ పథకం ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపునకు డిస్కౌంట్ ఈనెల 30 వరకు వినియోగించుకునే అవకాశం -
కూలీలందరికీ పని కల్పించాలి
కొందుర్గు: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలందరికీ పని కల్పించాలని డీఆర్డీఓ శ్రీలత సూచించారు. మండలంలోని పర్వతాపూర్, గంగన్నగూడ గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించి ఉపాధి పనులతోపాటు నర్సరీలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయం వేళల్లోనే పనులకు వెళ్లాలని సూచించారు. గతంలో రోజుకు రూ.272 కూలీ చెల్లించేవారని, ప్రస్తుతం ప్రభుత్వం రూ.300కు పెంచిందన్నారు. సరిపడా కొలతల ప్రకారం పనులు చేయాలని, నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలని, మొక్కలను సకాలంలో మల్చింగ్ చేయాలని సూచించారు. అనంతరం కొందుర్గు మండలపరిషత్ కార్యాల యంలో గ్రామ ప్రత్యేకారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండల ప్రత్యేకాధి కారి శివలాల్, ఎంపీడీఓ ఆంజనేయులు, తహసీల్దార్ రమేష్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, ఏపీడీ శరణ్ గౌతమ్, ఎంపీఓ లాలయ్య, ఏపీఓ నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఓ శ్రీలత -
బీఆర్ఎస్ ‘పట్నం’ సమన్వయకర్తగా యాదగిరిరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నియమించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడానికి యాదగిరిరెడ్డి పని చేస్తారని తెలిపారు. తనిఖీల్లో రూ.3.1 లక్షల పట్టివేత ఇబ్రహీంపట్నంరూరల్: వాహనాల తనిఖీలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి నగదు తరలిస్తుండగా ఆదిబట్ల పోలీసులు పట్టివేశారు. ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా బొంగ్లూర్ అండర్పాస్ వద్ద ఓ వ్యక్తి వద్ద లక్ష రూపాయలు, వండర్లా సమీపంలో మరో వ్యక్తి వద్ద రూ.2.10 లక్షలు పట్టుబడినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును సీఐ రాఘవేందర్రెడ్డికి అందజేశారు. అప్రమత్తతతో అగ్ని ప్రమాదాల నివారణ ఏడీఎఫ్ఓ రాజు షాద్నగర్: అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఏడీఎఫ్ఓ రాజు అన్నారు. అగ్నిమాపక వార్సోవాల్లో భాగంగా మంగళవారం షాద్నగర్ పట్టణంలోని పలు అపార్టుమెంట్లు, రద్దీ ప్రాంతాలో అగ్నిమాపక సిబ్బంది కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏడీఎఫ్ఓ రాజు మాట్లాడుతూ.. ఎండాకాలం నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలందరూ అప్రమత్తతతో ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ఏ చిన్న ప్రమాదం సంభవించినా వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. తద్వారా తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవిస్తుందని హెచ్చరించారు. అనుమానాస్పదస్థితిలో ఒకరి మృతి శంషాబాద్ రూరల్: అనుమానాస్పదస్థితిలో ఒకరు మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేబీ.దొడ్డి వాసి లక్ష్మణ్ (40) సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించగా.. అప్పటికే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భార్య, బంధువులపై అనుమానం.. లక్ష్మణ్ మృతిపై కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని భార్య, వరసకు వదిన అయ్యే మహిళ, మరో వ్యక్తిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు. రాత్రి మద్యం మత్తులో ఉన్న అతని మర్మాంగాలను గాయపర్చి చంపేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు లు పారదర్శకంగా విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే పోలీసులకు సమాచారం వెళ్లకుండా కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు మృతదేహానికి త్వరగా అంత్యక్రియలు నిర్వహించేందుకు పూనుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. చివరి సమయంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. ఇదిలా ఉండగా.. పోస్టుమార్టం రిపోర్టు వస్తే నిజాలు తెలుస్తాయని ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి అనుమానాస్పద కేసుగా విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దారిదోపిడీ నిందితుల అరెస్టుమణికొండ: పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ను తమ ఆటోలో ఎక్కించుకుని కొట్టి అతని వద్ద రూ. 5,500లు చోరీకి పాల్పడిన ఘటన నార్సింగిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం కొత్వాల్గూడకు చెందిన రాజు కోకాపేటలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం తన ఓనర్ వద్ద రూ. 5,500 తీసుకుని సాయంత్రం ఏడు గంటల సమయంలో నడుచుకుంటూ కోకాపేట నుంచి నార్సింగి వైపు వస్తున్నాడు. అదే సమయంలో శేరిలింగంపల్లి మండలం, హఫీజ్పేట్కు చెందిన సయ్యద్ ఫారూఖ్, సయ్యద్ మస్తాన్ అతడిని నార్సింగిలో దించుతామని ఆటోలో ఎక్కించుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే కొట్టి సెల్ ఫోన్, డబ్బును లాక్కుని ఆటోలో నుంచి కిందకు తోసి పారిపోయారు. దాంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి సెల్ఫోన్, డబ్బును రికవరీ చేసి, ఆటోను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
రౌడీషీటర్ల బైండోవర్
సాక్షి, సిటీబ్యూరో: గత ఎన్నికల సమయంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని రౌడీ షీటర్లతో పాటు సస్పెక్ట్, హిస్టరీ షీట్లు ఉన్న వారిని ముందస్తుగానే బైండోవర్ చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అధికారులను ఆదేశించారు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో విధిగా పర్యటిస్తూ నిఘా పెట్టాలని సూచించారు. త్వరలో జరగనున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లపై మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పని చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని సూచించారు. అక్రమం డబ్బు, మద్యం తరలింపు, ఉచితాలపై నిఘా పెట్టాలని, అవసరమైన చోట మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలన్నారు. సమావేశంలో జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవీస్, డీసీపీలు జీ వినీత్, నితికా పంత్, నారాయణరెడ్డి, శ్రీనివాసరావు, శ్రీనివాస్, కే ప్రసాద్, సృజన కర్ణం, నర్సింహా కొత్తపల్లి, సాయిశ్రీ, డీవీ శ్రీనివాసరావు, డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత అధికారులకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు -
వేడుకలకు వేళాయె..
మొయినాబాద్: వీసా దేవుడు.. కలియుగదైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యారు. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతూ.. తెలంగాణ తిరుపతిగా పేరొందిన ఆలయం వేడుకలకు ముస్తాబైంది. ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయంలో ఏటా శ్రీరామనవమి తరువాత దశమి రోజు నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదే ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 25 వరకు కొనసాగనున్నాయి. తగిన ఏర్పాట్లు చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో స్వామివారిని ఊరేగించే రథానికి మరమ్మతులు చేయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రతి రోజు అందించే వాహన సేవలకు అవసరమైన వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఆలయ గోడలకు సున్నం, రంగులు వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పిస్తున్నారు. 18న అంకురార్పణ.. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు ఈ నెల 18న (గురువారం) సెల్వర్ కూత్తుతో అంకురార్పణ జరగనుంది. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. 19న ధ్వజారోహణం, శేషవాహన సేవలు అందిస్తారు. 20 స్వామివారికి గోపవాహన, హనుమంత వాహన సేవలు ఉంటాయి. 21న సూర్యప్రభ వాహనం, గరుడ వాహన సేవలు అందిస్తారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 22 వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకీ సేవ, అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి దివ్యరథోత్సవం ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. 24న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వవాహన సేవ, దోప్సేవ, పుష్పాంజలి సేవలు చేస్తారు. 25న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. గరుడ ప్రసాదం వితరణ బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19న ధ్వజారోహణ కార్యక్రమం చేపడతారు. ఈ సందర్భంగా గరుత్మంతునికి పెట్టే నైవేద్యాన్ని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా వితరణ చేస్తారు. గరుడ ప్రసాదం తీసుకున్నవారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుండడంతో ప్రతి సంవత్సరం ఈ ప్రసాదానికి ఆదరణ పెరుగుతోంది. సుమారు 3వేల నుంచి 5 వేల మంది మహిళలు గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. రేపటి నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ముస్తాబవుతున్న ఆలయం ఈనెల 25వ తేదీ వరకు ఉత్సవాలు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు బాలాజీ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19న ధజారోహణం అనంతరం సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం అందిస్తాం. గరుడ ప్రసాదంకోసం వచ్చే మహిళలు ఉదయం 8 గంటలలోపే ఆలయానికి చేరుకోవాలి. – రంగరాజన్, ఆలయ అర్చకుడు -
బీజేవైఎం నూతన కార్యవర్గం నియామకం
మహేశ్వరం: బీజేవైఎం రంగారెడ్డి జిల్లా రూరల్ నూతన కార్యవర్గాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి మంగళవారం ప్రకటించారు. జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా టి.యాదీష్(మహేశ్వరం), ఉపాధ్యక్షులు బొధ యాదగిరిరెడ్డి(తుక్కుగూడ), బాతుకు శ్రీనివాస్ యాదవ్(శంషాబాద్), కండె సా యి(అమన్గల్),సూరంపల్లి రూపక్(ఇబ్రాహీంపట్నం) ర్యాకాల రాఘవేందర్(మీర్పేట్) బస్వ రాఘవేందర్(మహేశ్వరం), గోవర్ధన్రెడ్డి(శంషాబాద్) అమర్నాథ్రెడ్డి(మీర్పేట్), జనరల్ సెక్రటరీలుగా బూర దిలీప్ గౌడ్(కందుకూరు), రాజ మల్లేశ్(మెయినాబాద్), సెక్రటరీలుగా విజయ్(ఇబ్రహీంపట్న ం), మునావత్ దేవేందర్(మహేశ్వరం), ఓగ్గు ప్రభాకర్(ఆమన్గల్), శివ గౌడ్(మంచాల), మా రగోని శేఖర్(యాచారం), విశ్వనాథ్గౌడ్(బడంగ్పేట్), సందీప్ యాదవ్(షాద్నగర్), ఇంద్రాసేనారెడ్డి(చేవెళ్ల), నరేందర్ గౌడ్(యాచారం), అధికార ప్రతినిధులుగా కొత్తురు మహేందర్(షాబాద్), కారుకొండ ప్రదీప్(శంషాబాద్), జోల రమేష్ యా దవ్(మాడ్గుల), ప్రకాష్ గౌడ్(మహేశ్వరం), అగ్గి ప్రవీణ్( నందిగామ), దాసరి సందీప్ గౌడ్ (మంచాల), శివాజీ(కేశంపేట్), కోశాధికారులుగా మహేష్ చారి(ఆదిబట్ల), సాయిలు(మహేశ్వరం) నియమించారు. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి కార్యవర్గలను ఎకగ్రీవంగా ఎన్నిక చేశారు. బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా నూతన ఎస్టీ మోర్చా కమిటీని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బానావత్ సాయిలాల్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షుడిగా జర్పుల శ్రీనునాయక్, లక్ష్మణ్నాయక్, బానావత్ మోతీలాల్ నాయక్, మేగావత్ హనుమంతు నాయక్, జర్పుల లక్ష్మణ్నాయక్, కాట్రావత్ కృష్ణనాయక్, నేనావత్ రవినాయక్, ప్రధాన కార్యదర్శులుగా మునావత్ గణేష్నాయక్, జటావత్ వినోద్నాయక్, కార్యదర్శులుగా కేతావత్ కుమార్ నాయక్, రమావత్ బాలు నాయక్, జటావత్ పంతునాయక్, రాత్లావత్ చందునాయక్, మేగావత్ మోహన్ నాయక్, కోశాధికారిగాకేతావత్ మోహన్నాయక్, సోషల్ మీడియా కన్వీనర్గా నందురాథోడ్, మీడియా కన్వీనర్గా జటావత్ నిరంజన్నాయక్, మహిళా విభాగం కన్వీనర్గా ధారావత్ భాగ్యలక్ష్మి నాయక్, అదే విధంగా స్పోక్ పర్సన్స్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ను నియమించినట్లు సాయిలునాయక్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధిని బూత్ స్థాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలను సమన్వయం చేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడిగా టి.యాదీశ్ -
డీమ్డ్ వర్సిటీలో డాక్టరేట్ల ప్రదానం
చైతన్య యూనివర్సిటీలో కరుణశ్రీ, రేవతిలకు డాక్టరేట్ మొయినాబాద్రూరల్: కష్టపడి ఆవిష్కరించిన నూతన పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ కులపతి డాక్టర్ పురుషోత్తమ్రెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేట్ అధికారి డాక్టర్ సాత్వికరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని హిమాయత్నగర్లో ఆ యూనివర్సిటీలో మంగళవారం కరుణశ్రీ, రేవతిలకు డాక్టరేట్లు ప్రదానం చేశారు. కరుణశ్రీ ఆంగ్లంలో ‘ఎన్హాన్సింగ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎమంగ్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ త్రూ ఈ లర్నింగ్’ అనే అంశంపై ప్రొఫెసర్ జి.దామోదర్ పర్యవేక్షణలో ఆమె పరిశోధన చేశారు. అదే విధంగా సూక్ష్మ జీవశాస్త్రంలో ‘స్టడీస్ ఎట్ ఐసోలేషన్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ యాంటీ బయోఫిల్మీ మెటాబోలైటిస్ ప్రామ్సన్ సెలక్టడీ మెడిసినల్ ప్లాంట్స్ మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర’ అనే అంశంపై ప్రొఫెసర్ అనురాధ పర్యవేక్షణలో రేవతి పరిశోధన చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కులపతి డాక్టర్ పురుషోత్తమ్రెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అధికారి డాక్టర్ సాత్వికరెడ్డిలు వీరిని అభినందిస్తు డాక్టరేట్ పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య రవీందర్, ప్రొఫెసర్ కవిత, రిసర్చ్ డీన్ ఆచార్య కిస్టఫర్, డీన్ సైన్స్ ప్రొఫెసర్ సుందర్రామ్, అడ్మినిస్ట్రేషన్ రాజు, డిప్యూటీ కంట్రోలర్స్ పబ్లిక్ రిలేషన్ అఽధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ
రెండు తులాల వెండి సామగ్రిఅపహరణ షాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళా లు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ మహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంకెపల్లిగూడ గ్రామానికి చెందిన ముద్దెంగూడ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు లోపలికి చొరబడ్డారు. అర్ధరాత్రి బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తలపై టోపీలు ధరించి చేతిలో ఖట్టర్ పట్టుకొని మొదటగా సీసీ కెమెరా వైర్లను తొలగించారు. సీసీ పుటేజ్ పరిశీలించగా ఈ దొంగతనానికి ఇద్దరు వచ్చినట్లు గుర్తించారు. కింద అంతస్తుకు తాళం వేసి పైన అంతస్తులో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నారు. దుండగులు యజమానులు నిద్రిస్తున్న తలుపునకు బయటి నుంచి గడియ పెట్టారు. లోపలికి వెళ్లి బీరువా తాళం సైతం పగుల గొట్టి అందులో ఉన్న వస్తువులను చిందరవందరగా చేశారు. అందులో ఉన్న రెండు తులాల వెండి వస్తువులను అపహరించారు. మంగళవారం ఉదయం ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి క్లూస్టీం బృందం చేరుకొని ఆధారాల సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు. -
44.2
దారి తప్పిన స్పెషల్ డ్రైవ్ పెండింగ్ భూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ దారి తప్పింది. సూరీడు@భానుడి భగభగలు బుధవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 20248లోuసాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్నగర్: ఎండలు భగ్గున మండుతున్నాయి. మంగళవారం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫరూఖ్నగర్లో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, షాబాద్లో 42.7, మొయినాబాద్లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆమనగల్లు, నందిగామ, కడ్తాల్, కొందుర్గులో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు భగ్గున మండుతుండటంతో ఉపాధి హామీ కూలీలు, యాచకులు, టూ వీలర్పై ప్రయాణించే మార్కెటింగ్ సిబ్బంది, చిరుద్యోగులు, యాచకులు దాహంతో అల్లాడి పోతున్నారు. పలువురు వడదెబ్బకు గురయ్యారు. ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, ఇతర శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా భద్రాచలం, కొత్తగూడెం, నల్లగొండ జిల్లాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి మన జిల్లాలోనూ నమోదవుతుండడం విశేషం. బీర్లకు ఫుల్ డిమాండ్ సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం బీర్ల వినియోగం రెట్టింపైంది. వైన్స్ సహా బార్లలో చల్లని బీర్లు దొరకడమే కష్టమవుతోంది. రోజుకు సగటున 80 వేల కేసుల బీర్లు అవసరం కాగా, 70 వేల కేసులు మాత్రమే సరఫరా అవుతోంది. శీతల పానీయాల వినియోగం సైతం రెట్టింపైంది. సాధారణ రోజుల్లో రూ.30కే లభించిన కొబ్బరి బొండాం ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60కి విక్రయిస్తున్నారు. ఇక పండ్ల రసాల ధరలూ అదే స్థాయిలో పెంచేశారు. గిర్రున తిరుగుతున్న మీటర్లు పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉపశమనం కోసం ఇంట్లోని ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు రోజంతా ఆన్లో ఉంచుతుండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. సామర్థ్యానికి మించి విద్యుత్ను వినియోగిస్తుండటంతో సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. తరచూ ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో పాటు జంపర్లు కట్ అవుతున్నాయి. ఫలితంగా సరఫరాలో అంతరాయం తప్పడం లేదు. అధికారులు ఒత్తిడికి లోనవుతున్న ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లను పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. మండలం ఉష్ణోగ్రతలు ఫరూఖ్నగర్ 44.2 షాబాద్ 42.7 మొయినాబాద్ 42.3 కేశంపేట్ 42.2 ఇబ్రహీంపట్నం 42.0 కందుకూరు 42.0 సరూర్నగర్ 41.7 శేరిలింగంపల్లి 41.5 అబ్దుల్లాపూర్మెట్ 41.4 రాజేంద్రనగర్ 41.1 మంచాల 41.1 హయత్నగర్ 40.9 చేవెళ్ల 40.9 శంకర్పల్లి 40.8 మహేశ్వరం 40.7 యాచారం 40.7 చౌదరిగూడ 40.6 బాలాపూర్ 40.6 తలకొండపల్లి 40.4 శంషాబాద్ 40.3 మాడ్గుల 40.1 ఆమనగల్లు 39.9 కొత్తూరు 39.9 నందిగామ 39.7 గండిపేట్ 39.6 కడ్తాల్ 39.5 కొందుర్గు 39.5న్యూస్రీల్ రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు జిల్లాలోనే అత్యధికంగా ఫరూఖ్నగర్లో 44.2 డిగ్రీలు నమోదు ఎండలతో అల్లాడుతున్న జనం -
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
కడ్తాల్: మానవ అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐసీడీఎస్ సీడీపీఓ రోజా, ప్రజ్వల సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ బలరాం కృష్ణ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి, మహిళా శిశు సంక్షేమశాఖ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రెండు రోజులుగా అంగన్వాడీ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమం మంగళవారం ముగిసింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీఓ రోజా మాట్లాడుతూ.. నేటి సమాజంలో మానవ అక్రమ రవాణా కొత్త పద్ధతుల ద్వారా సైబర్ ట్రాఫికింగ్తో జరుగుతుందన్నారు. మొబైల్లో ఆన్లైన్ వాడుతున్న ఎవరైనా దీనికి గురయ్యే అవకాశం ఉందన్నారు. సమాజంలో ప్రధానంగా యువతతో పాటు, ప్రముఖులు కూడా ఇంటర్నెట్, మొబైల్ ద్వారా సైబర్ ట్రాఫికి ంగ్ బారిన పడుతున్నారన్నారు. యువతులు సెల్ఫోన్లో వచ్చే రకరకాల యాప్స్తో లైంగిక వ్యాపారానికి గురికావడం జరుగుతుందని, ఫొటోస్ మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో అంగన్వాడీలు ప్రత్యేక కృషి చేయాలన్నారు. మహిళలు, పిల్లలకు రక్షణ కవచంలా మారాలని సూచించారు. అనంతరం ప్రజ్వల సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ బలరాం కృష్ణ మాట్లాడుతూ.. ప్రజ్వల సంస్థ గత 28 ఏళ్లుగా లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుతుందని, ఇప్పటి వరకు 28,500 మంది మహిళలను కాపాడామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పద్మశ్రీ డాక్టర్ సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు శబరి, సరళ, ప్రజ్వల సిబ్బంది సురేశ్, అనిల్, అంబర్సింగ్, మిఽథాలీరాజ్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ రోజా -
హస్తం గూటికి డీసీసీబీ చైర్మన్
తుర్కయంజాల్: డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన తాండురు ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డితో కలిసి తుర్కయంజాల్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తరువాత తొర్రూర్లోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అనంతరం వారితో వెళ్లి సీఎంను కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం సాధ్యం అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి పంపించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి డీడబ్ల్యూఓ పద్మజారమణ చేవెళ్ల: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డీడబ్ల్యూఓ పద్మజారమణ అన్నారు. చేవెళ్లలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో భారత ఎన్నికల కమిషన్ ఓటరు భాగస్వామ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. నడవలేని స్థితిలో, బెడ్పై ఉండే వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. అలాంటి వారు ఉంటే 12డీ ఫారం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ సాయిరాం, తహసీల్దార్ కృష్ణయ్య, ఐసీడీఎస్ సీడీపీఓ శోభారాణి, ఐసీడీఎస్, రెవెన్యూ, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. అంబులెన్స్ల తనిఖీ కందుకూరు: మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆవరణలో 108, 102 అంబులెన్స్లను మంగళవారం 108 అంబులెన్స్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ల్లో అవరమైన పరికరాలు, మందులు ఉన్నాయా అని పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా, రికార్డులను తనిఖీ చేశారు. ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి, ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. వేసవిలో వడదెబ్బకు గురైన రోగులతో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కోఆర్డినేటర్ రాజాబాబు సూచించారు. ఈఎంటీ కుమార్, పైలెట్లు యాదయ్య, గణేశ్ పాల్గొన్నారు. భువనగిరి ఖిల్లాపై ఎర్రజెండా ఎగరేద్దాం సీపీఎం ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ యాచారం: భువనగిరి ఖిల్లాపై ఎర్రజెండా ఎగరేద్దామని, సీపీఎం గెలుపుతోనే పేదలకు న్యాయం, ప్రశ్నించే తత్వంపై చైతన్యం పెరుగుతుందని ఆ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ అన్నారు. మండల పరిధిలోని గునుగల్లో మంగళవారం నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి ఎంపీలుగా గెలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. భువనగిరి లోక్సభ పరిధిలో ప్రజలకు జీవనోపాధి కల్పించే ఏ ఒక్క ప్రాజెక్టు గానీ, పరిశ్రమ గానీ రాలేదన్నారు. ఏడేళ్ల క్రితం ప్రారంభించిన డిండి ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదని గుర్తు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో పేదలకు వ్యవసాయ భూములు, ఇళ్లు, ఇంటి స్థలాలు దక్కాయంటే సీపీఎం పోరాటాల ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పగుడాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈనెల చివరిలో షాద్నగర్కు సీఎం రేవంత్
షాద్నగర్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల చివరి వారంలో సీఎం రేవంత్రెడ్డి షాద్నగర్కు రానున్నట్లు సీడబ్ల్యూసీ సభ్యుడు, మహబూబ్నగర్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 29 లేదా 30వ తేదీల్లో విచ్చేస్తున్నట్లు చెప్పారు. కాగితాలకే పరిమితమైన కాంగ్రెస్ హామీలు బీజేపీ మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ కొందుర్గు: ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు బూటకపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని బీజేపీ మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమ వారం ఆమె చౌదరిగూడ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు రూ.1.80 కోట్లు అవసరమవుతాయని.. రాహూల్ ప్రధాని అయితేనే పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని.. ఆ మాటలే బూటకపు హామీలని అర్థమవుతున్నాయని పేర్కొన్నారు. రాహూల్ ప్రధాని అయ్యేది లేదు, ప్రజలకు పథకాలు అందేది లేదన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తే వచ్చిన ప్రజావ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకుందన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని కావాలని దేశ ప్రజలంతా కోరుతున్నారని, ఎవరు ఎన్ని చెప్పినా కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. సమావేశంలో నాయకులు నర్సింహ గౌడ్, అందె బాబయ్య, రవీందర్ రెడ్డి, అశోక్ గౌడ్, భూపాలచారి, విష్ణువర్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శ్రీని వాస్, లక్ష్మీకాంత్ రెడ్డి, కొందుర్గు, చౌదరిగూడ మండల కమిటీల అధ్యక్షులు కుర్మయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. బీజేపీతోనే సుపరిపాలన ● బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అనంతగిరి: దేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుతున్న ఏకైక నాయకుడు ప్రధాని మోదీనే అని, బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్లోని కొండా బాలకృష్టారెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీకి ఎవరూ సాటిలేరన్నారు. మూడోసారి పీఎం కావడం ఖాయమన్నారు. గ్రామాలకు నేరుగా కేంద్రం నిధులు వస్తున్నాయని తెలిపారు. కరోనా కాలం నుంచి నేటి వరకు పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నట్లు గుర్తు చేశారు. సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. మిగు లు బడ్జెట్గా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డి ఐదేళ్లు ఎంపీగా ఉన్నా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. ఈసారి ఆయన ఓటమి ఖాయమన్నారు. పగటిపూట సిటీ బస్సుల సంఖ్య తగ్గింపు సాక్షి, సిటీబ్యూరో: ఎండల తీవ్రత దృష్ట్యా నగరంలో మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలి పారు. కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో సిటీ బస్సుల ట్రిప్పులను తగ్గించనున్నారు. ఉదయంనుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లో బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. -
గురుదేవికి ‘తెలుగు వెలుగు’
షాద్నగర్రూరల్: పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు గురుదేవికి తెలుగు వెలుగు జాతీయ పురస్కారం వరించింది. సోమవారం నగరంలోని త్యాగరాయ గానసభలో తెలుగు వెలుగు సాహితీ వేదిక మహానంది జాతీయ పురస్కారాలకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యారంగంలో విషిష్ట సేవలు అందజేస్తున్న షాద్నగర్కు చెందిన ఉపాధ్యాయురాలు గురుదేవిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, సాహితీ వేదిక గౌరవ అధ్యక్షుడు శాంతికృష్ణ అవార్డు అందజేసి గురుదేవి దంపతులను ఘనంగా సన్మానించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అండమాన్కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే
Advertisement