-
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఐపీఎల్-2024లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది పంజాబ్ కింగ్స్. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ జట్టు.. ఈసారి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది.కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం బారిన పడటం.. కొన్ని మ్యాచ్లలో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడం ప్రభావం చూపింది. ధావన్ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సామ్ కరన్ ఫర్వాలేదనిపించినా.. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్లలో పంజాబ్ కేవలం నాలుగే గెలిచింది.ఇంకో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ విమర్శనాస్త్రాలు సంధించాడు.‘‘మైదానం లోపలా.. వెలుపలా నాయకత్వ మార్పులే వాళ్ల పేలవ ప్రదర్శనకు కారణం. అదే నిలకడలేమి కూడా ఓ కారణం. మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే మైదానంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి’’ అని టామ్ మూడీ పంజాబ్ కింగ్స్ను విమర్శించాడు.కాగా 58 ఏళ్ల టామ్ మూడీ 2008లో పంజాబ్ కోచ్గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో ఆ ఏడాది జట్టు సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోంది. ఇక పంజాబ్ను వీడిన తర్వాత 2013- 2019 వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు కోచ్గా ఉన్నాడు. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది. చదవండి: IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా -
కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్లోనూ అలా!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. భార్య ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధావన్ కొడుకు జొరావర్కు కూడా దూరమయ్యాడు.జొరావర్ ప్రస్తుతం తన తల్లి దగ్గరే ఆస్ట్రేలియాలో ఉంటున్న కారణంగా ధావన్ కనీసం అతడిని నేరుగా కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కుమారుడిని తలచుకుంటూ ధావన్ భావోద్వేగ పోస్టులు పెడుతూ ఉన్నాడు. మరోవైపు.. టీమిండియాలోనూ ధావన్కు చోటు కరువైంది.యువ ఓపెనర్లు శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లతో పోటీలో వెనుకబడ్డ ధావన్.. 2022లో ఆఖరిసారిగా బంగ్లాదేశ్తో సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున వన్డే ఆడాడు.ఆ తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత ఆసియా క్రీడలు- 2023 జట్టులో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహిస్తాడని విశ్లేషకులు భావించగా.. బీసీసీఐ మాత్రం మరోసారి ఈ ఢిల్లీ బ్యాటర్కు మొండిచేయి చూపింది.ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. అతడి నేతృత్వంలో భారత్ స్వర్ణం సాధించింది. ఇదిలా ఉంటే.. అసలే కొడుకుకు దూరమై.. టీమిండియాలో చోటు కరువైన శిఖర్ ధావన్కు ఐపీఎల్-2024లోనూ కష్టాలే ఎదురయ్యాయి.పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ తొలి ఐదు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండగలిగాడు. భుజం నొప్పి కారణంగా మిగతా మ్యాచ్లకు గబ్బర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ పంజాబ్ను ముందుకు నడిపించాడు.అయితే, ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఇదిలా ఉంటే.. గబ్బర్ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘జీవితంలోని చిన్న సంతోషాలు ఇలా వీటితో కలిసి ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ధావన్ క్యాప్షన్ ఇచ్చాడు.ఇది చూసిన గబ్బర్ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘పైకి నవ్వుతున్నా.. నీ మనసు లోతుల్లో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోగలం’’ అంటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో ధావన్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి కామెంట్లు చేస్తున్నారు. -
IPL 2024: కేకేఆర్ను ఢీకొట్టనున్న పంజాబ్.. స్టార్క్ ఔట్, ధవన్ ఇన్..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 26) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. టేబుల్ సెకెండ్ టాపర్ అయిన కేకేఆర్ను వారి సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పంజాబ్కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది.లేకపోతే మరో సీజన్లో టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్పై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.బలాబలాల విషయానికొస్తే.. పంజాబ్తో పోలిస్తే కేకేఆర్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పెట్టి సొంతం చేసుకున్న మిచెల్ స్టార్క్ మినహా కేకేఆర్కు పెద్ద సమస్యలేమీ లేవు. స్టార్క్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో తేలిపోయాడు. వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నరైన్, రసెల్తో పాటు కుర్ర బౌలర్లు రాణిస్తుండటంతో స్టార్క్ వైఫల్యాలు హైలైట్ కావడం లేదు.పంజాబ్తో నేటి మ్యాచ్లో స్టార్క్ పక్కకు కూర్చోవాల్సి రావచ్చు. అతను ఆర్సీబీ గత మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు (వేలికి). స్టార్క్ గత రెండు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్లోనూ కనబడలేదు. దీన్ని బట్టి చూస్తే.. పంజాబ్తో మ్యాచ్లో అతను ఆడకపోవచ్చని తెలుస్తుంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మపై అందరి చూపు ఉంది. ఈ సీజన్లో ఈ ఇద్దరు అద్భుతమైన పోరాటాలతో పంజాబ్ ఆడిన ప్రతి మ్యాచ్ను రక్తి కట్టించారు. వీరిద్దరి నుంచి అభిమానులు మరోసారి సంచలన ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు. వీరిద్దరు మినహా ఈ సీజన్లో పంజాబ్కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. ఈ మ్యాచ్లో పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా శిఖర్ తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్స్లో యాక్టివ్గా కనిపించాడు. దీన్ని బట్టి అతని రీఎంట్రీ ఖాయమని తేలిపోయింది. నేటి మ్యాచ్లో స్టార్క్ ఆడకపోతే అతడి స్థానంలో దుష్మంత చమీర ఆడే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)..కేకేఆర్: ఫిల్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్/దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ. [ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్]పంజాబ్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), లియామ్ లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్దీప్ సింగ్] -
IPL 2024: పంజాబ్ కింగ్స్కు భారీ ఎదురుదెబ్బ
వరుసగా రెండు మ్యాచ్ల్లో చివరి ఓవర్లో ఓటములు ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ధవన్ పంజాబ్ తదుపరి ఆడబోయే ఒకట్రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బాంగర్ తెలిపాడు. రాజస్తాన్ రాయల్స్తో నిన్నటి (ఏప్రిల్ 13) మ్యాచ్కు ముందు చివరి నిమిషంలో ధవన్ డ్రాప్ అయ్యాడు. ధవన్ ఏప్రిల్ 26న కేకేఆర్తో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది. ఈ మధ్యలో పంజాబ్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీలతో కీలక మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లకు ధవన్ దూరం కావడం పంజాబ్కు భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ధవన్ గైర్హాజరీలో పంజాబ్ను సామ్ కర్రన్ ముందుండి నడిపించనున్నాడు. రాయల్స్తో మ్యాచ్, గత ఐపీఎల్ సీజన్లోనూ కర్రన్ పంజాబ్ కెప్టెన్గా వ్యవహరించాడు. కాగా, రాయల్స్తో నిన్నటి మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో చివరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ కొట్టి హెట్మైర్ (10 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) రాయల్స్ను గెలిపించాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో హెట్మైర్ మరో సిక్సర్ కూడా బాదాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఆఖర్లో అశుతోష్ శర్మ (16 బంతుల్లో 31; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ను ఝులిపించడంతో పంజాబ్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. రాయల్స్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో రాయల్స్ కూడా తడబడింది. అయితే హెట్మైర్ మెరుపులు మెరిపించి రాయల్స్ను గెలిపించాడు. రాయల్స్ ఇన్నింగ్స్లో కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు లేవు. 39 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ (4-0-18-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. -
ఆ ఇద్దరితో రూమ్ అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్.. హిట్మ్యాన్, శ్రేయస్లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వీటికి రోహిత్, శ్రేయస్ తమదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా రోహిత్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ ఇద్దరు పరమ గలీజ్గాళ్లు.. షో సందర్భంగా కపిల్ హిట్మ్యాన్తో సంభాషిస్తూ ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగాడు. రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలసి షేర్ చేసుకుంటారని రోహిత్ను అడిగాడు. ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే శిఖర్ ధవన్, రిషబ్ పంత్లతో మాత్రం అస్సలు ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆ ఇద్దరు గదిని చాలా మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్ నుంచి వచ్చాక బట్టలను మంచంపైనే పడేస్తారు. వారి గది తలపుపై ఎప్పుడూ డు నాట్ డిస్టర్బ్ (DOD) అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఇద్దరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడుకుంటారు. ఉదయమే రూమ్ క్లీనింగ్కు వచ్చే వాళ్లు DOD బోర్డును చూసి వెనక్కు వెళ్లిపోతారు. మూడు నాలుగు రోజుల వరకు వాళ్ల రూమ్ చండాలంగా ఉంటుంది. ఈ కారణంగా వీళ్లతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నేను కూడా వారితో ఉండాలని అస్సలు అనుకోనంటూ హిట్మ్యాన్ బదులిచ్చాడు. ఇదే సందర్భంగా రోహిత్ మరిన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి అనంతరం అభిమానుల కోపానికి గురవుతానని భయపడ్డానని తెలిపాడు. కానీ ప్రజలు తమను బాగా ఆడామని ప్రశంసించడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ (మధ్యాహ్నం 3:30).. లక్నో-గుజరాత్ (రాత్రి 7:30) తలపడుతున్నాయి. -
IPL 2024 GT vs PBKS : గుజరాత్పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..
IPL 2024 GT vs PBKS Live Updates: గుజరాత్పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. పంజాబ్ విజయంలో శశాంక్ సింగ్(61) కీలక పాత్ర పోషించాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్ను కొనసాగించి పంజాబ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఆశుతోష్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 31 పరుగులు చేసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి పంజాబ్ ఛేదించింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, మొహిత్ శర్మ, నల్కండే తలా వికెట్ సాధించారు. 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6. క్రీజులో శశాంక్ సింగ్(57), అశుతోష్ శర్మ(31) పరుగులతో ఉన్నారు. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాలి. ఆరో వికెట్ డౌన్.. జితేష్ శర్మ ఔట్ 150 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన జితేష్ శర్మ.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 15. 3 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 150/6. క్రీజులో శశాంక్ సింగ్(33) పరుగులతో ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. 111 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సికిందర్ రజా.. మొహిత్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 119/5. క్రీజులో శశాంక్ సింగ్(33), జితేష్ శర్మ(1) ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. సామ్ కుర్రాన్ ఔట్ 71 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. ఒమర్జాయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. మూడో వికెట్ డౌన్.. ప్రభు సిమ్రాన్ ఔట్ ప్రభు సిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 35 పరులు చేసిన ప్రభు సిమ్రాన్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 7.2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 65/3. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.. బెయిర్ స్టో ఔట్ పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. నూర ఆహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. సామ్ కుర్రాన్ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 54/2. క్రీజులో ప్రభ్ సిమ్రాన్ సింగ్(29), సామ్ కుర్రాన్(1) పరుగులతో ఉన్నారు. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ 200 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రాహుల్ తెవాటియా ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 23 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. నాలుగో వికెట్ డౌన్.. 164 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన విజయ్ శంకర్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 166/4 శుబ్మన్ గిల్ ఫిప్టీ.. శుబ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 31 బంతుల్లో గిల్ 5 ఫోర్లు, 2 సిక్స్లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 134/3 మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాయి సుదర్శన్ ఔట్ 123 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్మన్ గిల్(46) ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. కేన్ మామ ఔట్ 69 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్.. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్ల్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్ : 52/1 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(16), శుబ్మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వృద్దిమాన్ సాహా.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఓవర్లకు గుజరాత్ స్కోర్: 29/0 2 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 18/0 టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ రెండు ఓవర్లు ముగిసే వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(8), వృద్దిమాన్ సాహా(6) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్ జట్టులోకి కేన్ విలియమ్సన్ రాగా.. పంజాబ్ జట్టులోకి సికిందర్ రజా వచ్చాడు. తుది జట్లు పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్) జానీ బెయిర్స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్ గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే -
IPL RCB Vs PBKS Highlights Photos: పంజాబ్ కింగ్స్పై బెంగళూరు విజయం (ఫొటోలు)
-
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. ఇందులోనైనా ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 25) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ భావిస్తుండగా.. పంజాబ్ సీజన్లో వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ఆర్సీబీ సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓటమిపాలు కాగా.. పంజాబ్ తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఆయా జట్ల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.. ఆర్సీబీ కంటే పంజాబ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపించింది. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పేపర్పై బలంగా కనిపించినప్పటికీ తొలి మ్యాచ్లో స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. 8 ఫోర్లు బాది డుప్లెసిస్ (35) ప్రమాదకరంగా కనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ముస్తాఫిజుర్ అతన్ని పెవిలియన్కు పంపాడు. విరాట్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్లో అతని బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. అతను 20 బంతులను ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటిదార్, మ్యాక్స్వెల్ డకౌటై దారుణంగా నిరాశపర్చగా.. కోట్లు పెట్టి అరువు తెచ్చుకున్న కెమారూన్ గ్రీన్ తుస్సుమనిపించాడు. వికెట్కీపర్లు అనూజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడకపోయుంటే ఆర్సీబీ 100 పరుగులు చేయడం కూడా కష్టంగా ఉండేది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు కూడా తేలిపోయారు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అల్జరీ జోసఫ్, కర్ణ్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మయాంక్ డాగర్ కాస్త పర్వాలేదనిపించగా.. గ్రీన్ 2 వికెట్లు తీసి నాట్ బ్యాడ్ అనిపించాడు. పంజాబ్తో ఇవాల్టి మ్యాచ్లో ఆర్సీబీ అదనపు పేసర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. కర్ణ శర్మ స్థానంలో ఆకాశదీప్ తుది జట్టులోకి రావచ్చు. పంజాబ్ విషయానికొస్తే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి విజయం సొంతం చేసుకుంది. అర్ష్దీప్ సింగ్, రబాడ, రాహుల్ చాహర్ తమ కోటా ఓవర్లు పూర్తి చేసి పర్వాలేదనిపించగా.. హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. హర్ప్రీత్ బ్రార్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ ఒకే ఓవర్ బౌల్ చేశాడు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. కర్రన్ (63) అర్దసెంచరీతో రాణించగా.. లివింగ్స్టోన్ (38 నాటౌట్), శిఖర్ ధవన్ (22), ప్రభ్సిమ్రన్ సింగ్ నాట్ బ్యాడ్ అనిపించారు. ఆర్సీబీతో ఇవాల్టి మ్యాచ్ పంజాబ్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఢిల్లీతో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఆర్సీబీ తుది జట్టు (అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్కీపర్), అల్జరీ జోసెఫ్, ఆకాశ్దీప్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్ పంజాబ్ తుది జట్టు (అంచనా): శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ -
PBKS Vs DC Photos: ఢిల్లీపై పంజాబ్ ఘన విజయం (ఫొటోలు)
-
PBKS vs DC: బోణీ కొట్టిన పంజాబ్.. ఢిల్లీపై ఘన విజయం
IPL 2024 PBKS vs DC- Updates: బోణీ కొట్టిన పంజాబ్.. ఢిల్లీపై ఘన విజయం ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. చంఢీఘర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కుర్రాన్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లివింగ్ స్టోన్(38) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖాలీల్ అహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షాయీ హోప్ 33 పరుగులతో ఢిల్లీ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ►100 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జితేష్ శర్మ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. మూడో వికెట్ డౌన్.. 84 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ప్రభు సిమ్రాన్ సింగ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి జితేష్ శర్మ వచ్చాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఒకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో శిఖర్ ధావన్(22) బౌల్డ్ కాగా.. బెయిర్ స్టో(9) రనౌటయ్యాడు. 5 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 53/2. క్రీజులో ప్రభ్ సిమ్రాన్ సింగ్(16), సామ్ కుర్రాన్(3) పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఆహ్వానం మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షాయీ హోప్ 33 పరుగులతో ఢిల్లీ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అభిషేక్ పోరెల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 32 పరుగులతో 21 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ కారణంగా ఢిల్లీ ఈ మేరకు స్కోరు చేయగలిగింది. తొమ్మిదో వికెట్ డౌన్ 19.6: హర్షల్ పటేల్ బౌలింగ్లో అభిషేక్తో సమన్వయలోపంతో కుల్దీప్ యాదవ్(1) రనౌట్ 18.3: ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ అర్ష్దీప్ బౌలింగ్లో సుమిత్ కుమార్(2) వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఫలితంగా ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 149-8(19) 17.1: ఏడో వికెట్ డౌన్ అక్షర్ పటేల్(21) రనౌట్ కావడంతో ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. అభిషేక్ పోరెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 138/7 (17.1) 15.4: ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ రాహుల్ చహర్ బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్(5) శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చాడు. సుమిత్ కుమార్క్రీజులోకి వచ్చాడు. అక్షర్ 12 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 128-6(16) 13.2: ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో రికీ భుయ్(3) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 117-5(14). అక్షర్ ఐదు, స్టబ్స్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 12.4: నాలుగో వికెట్ డౌన్ దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పంత్ హర్షల్ పటేల్ బౌలింగ్లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 13 బంతుల్లో 18 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఫలితంగా ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోగా ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 111-4 (13) మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ షాయీ హోప్(33) మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు. కగిసో రబడ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అతడి స్థానంలో రికీ భుయ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 95-3(11). పంత్ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నాడు. పది ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 86-2 షాయీ హోప్ 26, పంత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. క్రీజులోకి పంత్ 7.6: హర్షల్ పటేల్ బౌలింగ్లో వార్నర్(29) అవుట్. పంత్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 74-2(8) పవర్ ప్లేలో స్కోరు? ఓపెనర్ వార్నర్ దంచి కొడుతున్నాడు. పవర్ ప్లే ముగిసే సరికి అతడు 14 బంతుల్లో 22 రన్స్, హోప్ 10 బంతుల్లో 4 పరుగులు చేశాడు. స్కోరు: 54-1(6 ఓవర్లలో). 3.2: తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ అర్ష్దీప్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ తొలి వికెట్(20(12)గా వెనుదిరిగాడు. షాయీ హోప్ క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్లుగా వార్నర్, మార్ష్ ఢిల్లీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి ఓవర్ ముగిసే సరికి స్కోరు: 10-0 రిషభ్ పంత్ రీఎంట్రీ ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో రెండో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. చండీగఢ్లో కొత్తగా నిర్మించిన ముల్లన్పూర్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. టాస్ గెలిచిన ఆతిథ్య పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డిసెంబరు 2022లో ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాలపాలైన రిషబ్ పంత్ ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ కెప్టెన్గా, వికెట్ కీపర్గా తన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరోవైపు.. పంజాబ్ శిఖర్ ధావన్ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. ఇక ఇరుజట్లు గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాయి. పంజాబ్ కింగ్స్ పద్నాలుగింట కేవలం ఆరు గెలిచి ఎనిమిదో స్థానంలో.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచాయి. తాజా ఎడిషన్ను గెలుపుతో ఆరంభించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ. పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, సామ్ కరన్, లియామ్ లివింగ్స్టోన్, జితేశ్ శర్మ( వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి? -
విధ్వంసం సృష్టించిన శిఖర్ ధవన్.. ఐపీఎల్కు ముందు ప్రత్యర్దులు హడల్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఫామ్లోకి వచ్చాడు. డీవై పాటిల్ టీ20 టోర్నీలో డీవై పాటిల్ బ్లూ జట్టుకు ఆడుతున్న గబ్బర్.. సీఏజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన శిఖర్ కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా డీవై పాటిల్ బ్లూ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గబ్బర్ తాజా ప్రదర్శనతో ఐపీఎల్ జట్లు హడలిపోతున్నాయి. ధవన్ ఇదే భీకర్ ఫామ్ను కొనసాగిస్తే తిప్పలు తప్పవని మదనపడుతున్నాయి. బ్లూ జట్టులో గబ్బర్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. ఓపెనర్ అభిజిత్ తోమర్ (20 బంతుల్లో 31 పరుగులు), అయాజ్ ఖాన్ (9 బంతుల్లో 16), పరిక్షిత్ (6 బంతుల్లో 11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సీఏజీ బౌలర్లలో సన్వీర్ సింగ్, రిత్విక్ చటర్జీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రధాన్, అంకిత్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సీఏజీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరుణ్ లవండే (70) అర్దసెంచరీతో రాణించగా.. సన్వీర్ సింగ్ (48 నాటౌట్), ఆబిద్ ముస్తాక్ (17 నాటౌట్) సీఏజీని విజయతీరాలకు చేర్చారు. సీఏజీలో సంజయ్ 11, సేనాపతి 4, సచిన్ బేబీ 20 పరుగులు చేశారు. బ్లూ బౌలర్లలో విపుల్ కృష్ణన్ 2, కర్ష్ కొఠారి ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో సీఏజీ సెమీఫైనల్కు చేరుకుంది. ఇవాళే జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో ఇండియన్ అయిల్ జట్టు టాటా స్పోర్ట్స్ క్లబ్పై గెలుపొంది సెమీస్కు చేరింది. ఈ టోర్నీలో మరో రెండు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఇవాళే జరుగనున్నాయి. -
శిఖర్ ధావన్ విధ్వంసం.. చెలరేగిన దినేష్ కార్తీక్
డివై పాటిల్ టీ20 కప్-2024లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి చెలరేగాడు. ఈ టోర్నీలో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐతో జరిగిన మ్యాచ్లో ధావన్ సత్తాచాటాడు. డివై పాటిల్ బ్లూ జట్టు విజయంలో గబ్బర్ కీలక పాత్ర పోషించాడు. 9 వికెట్ల తేడాతో ఆర్సీఐని బ్లూ జట్టు చిత్తు చేసింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ధావన్ కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 45 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్బీఐ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆర్బీఐ బ్యాటర్లలో ప్రణయ్ శర్మ(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. పాటిల్ బ్లూ జట్టులో పరీక్షిత్ వల్సంకర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. కొథారీ 3 వికెట్లు పడగొట్టాడు. -
రీ ఎంట్రీలో చెలరేగిన శిఖర్ ధావన్.. అయినా పాపం! ఒకే ఒక్క పరుగు
టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖన్ ధావన్ ఏడాది తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. డివై పాటిల్ టీ20 కప్లో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం పూణే వేదికగా టాటా స్పోర్ట్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ధావన్ సత్తాచాటాడు. ఈ మ్యాచ్లో ధావన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లుతో 39 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ధావన్ ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది. ఈ మ్యాచ్లో డివై పాటిల్ బ్లూ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టాటా స్పోర్ట్స్ క్లబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టాటా బ్యాటర్లలో అపూర్వ వాంఖడే(83) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. డివై పాటిల్ బ్లూ బౌలర్లలో కెప్టెన్ విపుల్ కృష్ణణ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో తమ విజయానికి కేవలం ఒక్కపరుగు దూరంలో డివై పాటిల్ బ్లూ జట్టు నిలిచిపోయింది. చదవండి: Babar Azam AFG Captain Photo Viral: అఫ్గానిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం..!? -
BCCI Central Contracts: ఆ నలుగురి ఖేల్ ఖతమైనట్లేనా..?
2023-24 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్ అయితే మొత్తానికే క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ అజింక్య రహానేను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. రహానే రంజీల్లో పూర్తి స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి చొప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టి ఉంటుంది. ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరీర్లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య చాంతాండంత ఉంది. వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. పై పేర్కొన్న నలుగురితో పాటు సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా బీసీసీఐ వేటు వేసింది తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ , అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్ , జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్లకు కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. -
అత్యంత అరుదైన ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్
అండర్-19 వరల్డ్కప్లో సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తూ, పరుగుల వరద పారిస్తున్న యంగ్ ఇండియా బ్యాటర్ ముషీర్ ఖాన్.. న్యూజిలాండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్కప్లో ఇప్పటికే ఓ సెంచరీతో (ఐర్లాండ్పై 106 బంతుల్లో 118 పరుగులు) చెలరేగిన ముషీర్.. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మరో సెంచరీతో (126 బంతుల్లో 131 పరుగులు) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో ముషీర్ సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ముషీర్కు ముందు టీమిండియా తరఫున సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ మాత్రమే సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో ముషీర్.. శిఖర్ సరసన నిలిచాడు. న్యూజిలాండ్పై సెంచరీతో ముషీర్ మరో ఘనతను కూడా సాధించాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్కప్లో లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించాడు. ముషీర్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేశాడు. అన్న అడుగుజాడల్లో.. ఇటీవలే టీమిండియాకు ఎంపికైన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు సొంత తమ్ముడైన ముషీర్ అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. 2016 అండర్-19 వరల్డ్కప్లో సర్ఫరాజ్ కూడా లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్న ముషీర్.. తర్వలో టీమిండియా తలుపులు కూడా తట్టే అవకాశం ఉంది. తాజా ప్రదర్శనలతో ముషీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని సైతం ఆకర్శించాడు. 2024 సీజన్ వేలంలో అన్ సోల్డ్గా మిగిలిపోయిన ముషీర్ను అవకాశం ఉంటే పంచన చేర్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన 18 ఏళ్ల ముషీర్.. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసిన ముషీర్.. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి కేవలం 96 పరుగలు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో నిన్న జరిగిన గ్రూప్-1 సూపర్ సిక్స్ మ్యాచ్లో యువ భారత్ 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 2న ఆడనుంది. ఆ మ్యాచ్లో భారత్.. నేపాల్తో తలపడుతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న భారత్.. సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
ఆ జట్టులోనూ నా పేరు లేదు.. షాకయ్యాను! అందుకే: ధావన్
"ఆ జట్టులో నా పేరు లేకపోవడంతో షాక్కు గురయ్యాను. కానీ అంతలోనే మనసుకు సర్దిచెప్పుకొన్నాను. వాళ్ల ఆలోచనా విధానం మరోలా ఉందేమో అని నన్ను నేను తమాయించుకున్నాను. ఏదేమైనా సెలక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప నేనేమీ చేయలేను కదా! నిజానికి నా భవితవ్యం గురించి సెలక్టర్లతో నేను ఇంత వరకు మాట్లాడింది లేదు. ఇప్పటికీ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి వెళ్తూ ఉంటాను. అక్కడ క్వాలిటీ టైమ్ ఎంజాయ్ చేస్తాను. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నా కెరీర్ రూపకల్పనలో ఎన్సీఏది కీలక పాత్ర. నిజానికి అక్కడి నుంచే నా కెరీర్ మొదలైంది. అందుకే నేనెల్లప్పుడూ ఎన్సీఏ పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాను" అని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆసియా క్రీడలు-2023 జట్టులో తనకు చోటు లభిస్తుందని ఆశించానని.. కానీ అలా జరుగలేదంటూ గబ్బర్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా టీమిండియా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ బ్యాటర్ శిఖర్ ధావన్కు ఏడాదికి పైగా జట్టులో చోటు కరువైంది. యువ ఓపెనర్లకు పెద్దపీట బంగ్లాదేశ్తో 2022, డిసెంబరు వన్డేలో ఆఖరిసారిగా అతడు టీమిండియాకు ఆడాడు. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఓపెనర్లకు పెద్దపీట వేస్తున్న సెలక్టర్లు ధావన్ను పక్కనపెట్టేశారు. ఈ నేపథ్యంలో.. వన్డే ప్రపంచకప్-2023కి ముందు జరిగిన ఆసియా క్రీడలతో అతడు రీఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరిగింది. చోటు ఆశించి భంగపడ్డా మెగా టోర్నీ నేపథ్యంలో చైనాకు వెళ్లే భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ధావన్ ఉంటాడనే వార్తలు వినిపించాయి. కానీ.. అనూహ్యంగా రుతురాజ్కు పగ్గాలు అప్పగించిన మేనేజ్మెంట్ ధావన్కు మొండిచేయి చూపింది. ఇక ఆ తర్వాత మళ్లీ అతడికి టీమిండియాలో చోటు దక్కనేలేదు. ఈ నేపథ్యంలో.. 38 ఏళ్ల ధావన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డానని తెలిపాడు. అయితే, తాను సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానన్నాడు. అందుకే ఇలా ఇక వన్డేలు, టీ20లు ఆడేందుకే టెస్టు క్రికెట్కు పూర్తిగా దూరమయ్యానని ధావన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ధావన్ది కీలక పాత్ర. నాటి ఐసీసీ టోర్నీలో 363 పరుగులతో ఈ లెఫ్టాండర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. -
జొరావర్..నిన్ను చూసి ఏడాదవుతోంది : శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన కెరీర్తో పాటు.. తన వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోల్పోయిన ధావన్.. తన భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవలే ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు శిఖర్ దావన్, ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజారు చేసింది. అప్పటి నుంచి తన కుమారుడు జొరావర్ను శిఖర్ కలుసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన కుమారుడి పుట్టిన సందర్భంగా ధావన్ ఎమోషనల్ అయ్యాడు. జొరావర్కు బర్త్డే విషెస్ చెప్తూ ఇన్స్టాగ్రామ్లో ధావన్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం జొరావర్ ఆస్ట్రేలియాలో అయేషాతో కలిసి ఉన్నాడు. 'నిన్ను నేరుగా చూసి ఏడాదవుతోంది. దాదాపు మూడు నెలలుగా అన్ని చోట్లా (సోషల్ మీడియాలో) నన్ను బ్లాక్ చేశారు. నీ నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీతో వీడియో కాల్లో కూడా మాట్లాడి చాలా రోజులైంది. అందుకే నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి పాత ఫోటోనే పోస్ట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే మై డియర్ బాయ్. నేను నీతో నేరుగా మాట్లాడలేకపోయినా.. ఎల్లప్పుడూ టెలీపతి(కమ్యూనికేషన్) ద్వారా నేను నిన్ను కనెక్ట్ అవుతాను. నిన్ను చూసి గర్విస్తున్నా.. నువ్వు బాగున్నావని నాకు తెలుసు. ఈ నాన్న నిన్నెప్పుడూ మిస్సవుతాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ దేవుని దయతో మనం మళ్లీ కలుసుకునే సమయం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాను. లవ్ యూ జొరా అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. కాగా ఈ ఏడాది ఆక్టోబర్లో ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ధావన్- అయేషా విడాకులు మంజూరు చేసింది. జనవరిలో ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో ధావన్ విడాకుల పిటిషన్ ధాఖలు చేశాడు. అనంతరం తన భార్యపై ధావన్ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవమైనవని విశ్వసించిన న్యాయస్దానం విడాకులు మంజూరు చేసింది. ధావన్, ఆయేషా దంపతుల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ధావన్కు భారత్ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా వీడియో కాల్ ద్వారా కూడా ధావన్ తన కుమారుడితో మాట్లాడవచచ్చని పేర్కొంది. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
IPL 2024: సామ్ కర్రన్ కొనసాగింపు.. భారీ హిట్టర్కు షాకిచ్చిన పంజాబ్
ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించి కొనసాగించే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. పంజాబ్ కింగ్స్ మొత్తంగా 5 మంది ఆటగాళ్లను విడుదల చేసి, 19 మందిని కొనసాగించింది. పంజాబ్ కెప్టెన్గా శిఖర్ ధవన్ను కొనసాగించింది. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. షారుఖ్ ఖాన్ భానుక రాజపక్స మోహిత్ రతీ బల్తేజ్ ధందా రాజ్ అంగద్ బవా పంజాబ్ కింగ్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. శిఖర్ ధవన్ (కెప్టెన్) జానీ బెయిర్స్టో జితేశ్ శర్మ ప్రభ్సిమ్రన్ సింగ్ మాథ్యూ షార్ట్ హర్ప్రీత్ బ్రార్ అథర్వ తైడే రిషి ధవన్ సామ్ కర్రన్ సికంబర్ రజా లియామ్ లివింగ్స్టోన్ గుర్నూర్ సింగ్ బ్రార్ శివమ్ సింగ్ రాహుల్ చాహర్ అర్షదీప్ సింగ్ హర్ప్రీత్ బ్రార్ విధ్వత్ కావేరప్ప కగిసో రబాడ నాథన్ ఇల్లిస్ -
జద్రాన్ సూపర్ ఇన్నింగ్స్.. అఫ్గన్ రికార్డు స్కోరు..
ICC WC 2023- Ibrahim Zadran: వన్డే వరల్డ్కప్-2023లో అఫ్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పటిష్ట పేస్ దళం ఉన్న కంగారూ జట్టు బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని అజేయ శతకంతో మెరిశాడు. మొత్తంగా 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 129 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో అఫ్గన్ తరఫున ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసి తొలి బ్యాటర్గా నిలిచిన 21 ఏళ్ల ఇబ్రహీం.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలో ధావన్ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో జింబాబ్వే ఆటగాడు నీల్ జాన్సన్ 132* పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ హ్యారిస్ 130 పరుగులతో రెండో స్థానం ఆక్రమించాడు. కష్టాల్లో ఆసీస్ కాగా అఫ్గనిస్తాన్ విధించిన 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతోంది. 25 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుత ఆట తీరుతో అర్ధ శతకం పూర్తి చేసుకుని ఆసీస్ శిబిరంలో ఆశలు రేకెత్తిస్తున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన టాప్-5 క్రికెటర్లు 1. నీల్ జాన్సన్(జింబాబ్వే)- 132* పరుగులు- 1999లో లార్డ్స్ మైదానంలో 2. క్రిస్ హ్యారిస్(న్యూజిలాండ్)- 130 పరుగులు- 1996లో చెన్నైలో 3. ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్)- 129* పరుగులు- 2003 ముంబైలో 4. శిఖర్ ధావన్(ఇండియా)- 117 పరుగులు- 2019లో ది ఓవల్లో 5. రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్)- 116 పరుగులు- 2023లో ధర్మశాలలో. అఫ్గనిస్తాన్కు ఇదే భారీ స్కోరు: ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. అఫ్గనిస్తాన్ వరల్డ్కప్ టోర్నీలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. జద్రాన్ అజేయ శతకం కారణంగా 291 పరుగులు సాధించి ఈ మేరకు తమ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. వరల్డ్కప్ టోర్నీలో ఇప్పటి వరకు అఫ్గనిస్తాన్ సాధించిన టాప్-5 స్కోర్లు ఇవే ►ఆస్ట్రేలియా మీద- 2023లో ముంబైలో- 291/5. ►వెస్టిండీస్ మీద- 2019లో లీడ్స్లో- 288. ►పాకిస్తాన్ మీద- 2023లో చెన్నైలో- 286/2. ►ఇంగ్లండ్ మీద- 2023లో ఢిల్లీలో- 284. ►టీమిండియా మీద- 2023లో ఢిల్లీలో- 272/8. చదవండి: వరల్డ్కప్లో అఫ్గన్ తరఫున ఒకే ఒక్క సెంచరీ.. సచిన్, కోహ్లికి కూడా సాధ్యం కాని రికార్డు View this post on Instagram A post shared by ICC (@icc) -
Pak Vs Aus: మాకిది అలవాటే! పాక్పై ధావన్ సెటైర్లు.. వీడియో వైరల్
ICC Cricket World Cup Warm-up Matches 2023- Pakistan vs Australia: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పాకిస్తాన్- ఫీల్డింగ్.. ఈ జంట ప్రేమకథ ఎప్పటికీ ముగిసిపోదంటూ సెటైర్లు వేశాడు. వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో బాబర్ ఆజం బృందం ఇప్పటికే భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్లో సన్నాహక మ్యాచ్లు ఆడుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో తొలి వార్మప్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓడిన పాక్.. మంగళవారం(అక్టోబరు 3) ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (77), కామెరాన్ గ్రీన్(50- నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడం సహా మిగతా బ్యాటర్లలో అలెక్స్ క్యారీ మినహా మిగతా వాళ్లంతా రాణించారు. మిస్ఫీల్డింగ్.. వీడియో వైరల్ ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది కంగారూ జట్టు. పాక్ బౌలర్ల, ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకుని పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్తో మ్యాచ్లో పాక్ ఫీల్డర్లు మహ్మద్ వాసిం జూనియర్, మహ్మద్ నవాజ్ సమన్వయలోపంతో ఎక్స్ట్రా పరుగులు ఇవ్వడం ఆ జట్టు అభిమానులకు చిరాకు తెప్పించింది. పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్స్టోరీ ఇందుకు సంబంధించిన వీడియోను హైలైట్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్స్టోరీ’’ అంటూ ధావన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. గబ్బర్ కామెంట్ నెట్టింట వైరల్గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. కాగా పాక్ టీమ్కు ఇలాంటివి కొత్తేం కాదు. మిస్ఫీల్డింగ్ కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 భారత జట్టులో శిఖర్ ధావన్కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువకులతో పోటీలో ఈ వెటరన్ ఓపెనర్ వెనుబడిపోయాడు. ఇక అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. టీమిండియా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో పోటీ పడనుంది. ఇక అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. చదవండి: 1987లో జన్మించిన కెప్టెన్దే ఈసారి వరల్డ్కప్ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే! Pakistan & fielding never ending love story 🥰😄😄 #PakistanFielding #PakCricket pic.twitter.com/AJzT90hgNM — Shikhar Dhawan (@SDhawan25) October 3, 2023 -
Asia Cup 2023: ఆశావహులతో భారత జట్టు.. కెప్టెన్గా ధవన్..!
ఆసియా కప్-2023 కోసం సెలెక్టర్లు నిన్న (ఆగస్ట్ 21) 17 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో చోటు కోసం ధవన్, చహల్, శాంసన్, యశస్వి లాంటి ఆశావహులు ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ.. వీరికి నిరాశే మిగిలింది. గాయాల నుంచి కోలుకున్న సీనియర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్లకు సెలెక్టర్లు పెద్దపీట వేశారు. ట్రావెలింగ్ రిజర్వ్గా సంజూ శాంసన్ను ఎంపిక చేసినప్పటికీ.. ఈ ఎంపిక నామమాత్రమే. ఇదిలా ఉంటే, ఆసియా కప్ ఆశావహులతో రూపొందించబడిన ఓ నమూనా భారత జట్టు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ జట్టు ఆసియా కప్ను ఎంపిక చేసిన 17 మంది సభ్యుల భారత జట్టుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఈ జట్టుకు శిఖర్ ధవన్ కెప్టెన్గా ఉంటే.. చహల్, శాంసన్ లాంటి ఆసియా కప్ ఆశావహులు మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ జట్టుకు ఓపెనర్లుగా ధవన్, రుతురాజ్ ఉండగా.. వన్డౌన్లో యశస్వి జైస్వాల్, నాలుగో స్థానంలో సంజూ శాంసన్, ఆతర్వాత రింకూ సింగ్, శివమ్ దూబే, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, పేసర్ల కోటాలో దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. ఆసియా కప్ ఆశావహులతో రూపొందించబడిన ఈ జట్టును చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధవన్ నేతృత్వంలోని ఈ జట్టు బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్లను సునాయాసంగా ఓడిస్తుందని, ఈ జట్టు టీమిండియాకు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే, ఆసియా కప్కు ఎంపిక చేసిన భారత జట్టుతో పోలిస్తే ఈ జట్టు చాలా సమతూకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ సభ్య దేశాలైన చాలా జట్లకంటే ఈ జట్టు మెరుగ్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జట్టు సోషల్మీడియాలో నెటిజన్లకు మాంచి టాపిక్గా మారింది. ఆసియాకప్ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ట్రావెలింగ్ రిజర్వ్: సంజూ శాంసన్ ఆసియా కప్ ఆశావహుల భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (వికెట్కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్ -
WC 2023: ధావన్ కెరీర్కు ఎండ్కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్
End of road for Shikhar Dhawan! Ajit Agarkar confirms: వన్డేల్లో అద్భుత రికార్డులు.. ద్వితీయ శ్రేణి జట్టు కెప్టెన్గా టీమిండియాను ముందుకు నడిపించి చరిత్ర సృష్టించిన సందర్భాలు.. మేటి ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు.. కానీ.. ఇవేమీ వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ పొడిగించుకునేందుకు దోహదం చేయలేదు.. కొత్త నీరు వచ్చె.. పాత నీరు పోయె! కొత్త నీరు రాగానే.. పాత నీరు పోవాలన్న చందంగా.. శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువ బ్యాటర్ల నుంచి ఎదురైన పోటీ ముందు 37 ఏళ్ల గబ్బర్ నిలవలేకపోయాడు. మెరుగైన ప్రదర్శనలతో వీరిద్దరు ఓపెనర్లుగా స్థానం సుస్థిరం చేసుకుంటున్న క్రమంలో ధావన్కు అవకాశాలు కరువయ్యాయి. వాళ్లు ముగ్గురే మా ప్రాధాన్యం అయితే.. ఇటీవల వీరిద్దరు విఫలమవుతున్న తరుణంలో ఆసియా కప్-2023 రూపంలో గబ్బర్కు మరో ఛాన్స్ దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. కానీ.. బీసీసీఐ సెలక్టర్లు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మకు జోడీగా శుబ్మన్ గిల్ను ఎంపిక చేశారు. ఇషాన్ కిషన్కు కూడా జట్టులో చోటిచ్చారు. ఈ క్రమంలో గబ్బర్కు నిరాశే మిగిలింది. జట్టు ప్రకటన సమయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. కానీ ప్రస్తుతం.. రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్లకు మాత్రమే ఓపెనర్లుగా మా ప్రాధాన్యం ఉంటుంది’’ అని కుండబద్దలు కొట్టాడు. ధావన్ కెరీర్కు ఎండ్కార్డ్? ఇక ఆసియా కప్ జట్టే వన్డే వరల్డ్కప్ ప్రొవిజినల్ టీమ్ అన్న అంచనాల నడుమ ధావన్ కెరీర్ ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో.. ‘‘అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడు. ఎప్పుడూ ఎవరినీ నిందించలేదు. సెలక్టర్ల విషయంలో ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. జట్టుకు అవసరమైన సమయంలో 100 శాతం కష్టపడ్డాడు. గబ్బర్ను తలచుకుంటే బాధేస్తోంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టీమిండియా తరఫున శిఖర్ ధావన్.. 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేశాడు. ఇందులో17 సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 143. చదవండి: అందుకే చహల్పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు Asia Cup: వరల్డ్కప్లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్న్యూస్.. Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మ ఇన్.. పాపం సంజూ! #WATCH | At the moment, Rohit Sharma, Shubman Gill and Ishan Kishan are our preferred openers...Shikhar Dhawan has been a terrific player for India, says BCCI chief selector Ajit Agarkar. pic.twitter.com/TqF6gV4869 — ANI (@ANI) August 21, 2023 -
ఆసియా కప్, వరల్డ్కప్లలో రోహిత్కు జత ఎవరు..? కొత్తగా రేసులోకి మరో ఆటగాడు
టీమిండియాను ఓపెనర్ల సమస్య చాలా కాలంగా వేధిస్తూనే ఉంది. సచిన్-గంగూలీ, సచిన్-సెహ్వాగ్, గంభీర్-సెహ్వాగ్ల శకం ముగిసాక కొంతకాలం పాటు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్ల జోడీ విజయవంతంగా సాగింది. అయితే కాలక్రమంలో ధవన్ ఫామ్ కోల్పోవడం, కేఎల్ రాహుల్ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ధవన్ క్రమేనా కనుమరుగైపోయాడు. రాహుల్ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధవన్ స్థానాన్ని ఆక్రమించాడు. అయితే ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్కు ఓ జట్టును ప్రకటిస్తుండటం.. సిరీస్, సిరీస్కు కీలక ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెడుతుండటం.. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో రాహుల్కు ప్రత్యామ్నాయంగా ఐపీఎల్ హీరో శుభ్మన్ గిల్ తెరపైకి వచ్చాడు. రోహిత్కు జతగా గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి రాహుల్ను మరిపించాడు. అయితే గిల్ ఫామ్ కూడా ఇటీవలికాలంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య పునరావృతం అయ్యింది. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్కప్ లాంటి మెగా ఈవెంట్లు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్-2023కి ముందు ఆతర్వాత జరిగిన సిరీస్ల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత తీవ్రతరమైంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్లో మరో యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటం (డబుల్ సెంచరీ, సెంచరీ) బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు వెటరన్ శిఖర్ ధవన్కు ఆఖరి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా తీవ్రతరమవుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోక స్తబ్ధతలో ఉండిపోయింది. ప్రస్తుతం లైమ్లైట్లో ఉన్న అందరు ఓపెనర్లను పరిగణలోకి తీసుకుంటే 90 శాతం అర్హులే ఉండటంతో సెలక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓపెనింగ్ స్థానాల కోసం రోహిత్తో పాటు మొత్తం 8 మంది (పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్) లైన్లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్లు మేము సైతం అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్, వన్డే వరల్డ్కప్లకు రోహిత్కు జతగా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. -
'నా పేరు లేకపోవడం చూసి షాక్ అయ్యా.. కానీ ఆ విషయంలో మాత్రం హ్యాపీ'
టీమిండియా వెటరన్ వికెట్ ఓపెనర్ శిఖర్ ధావన్ గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్కు వెళ్లే భారత జట్టుకు ధావన్ సారధ్యం వహిస్తాడని అంతా భావించారు. కానీ గబ్బర్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఆసియా క్రీడల్లో పాల్గోనే భారత జట్టుకు యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ను సారధిగా ఎంపిక చేశారు. కాగా గతంలో చాలా సిరీస్ల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావనే నాయకత్వం వహించాడు. ఇక ఆసియాగేమ్స్కు చోటు దక్కకపోవడంపై ధావన్ తాజాగా స్పందించాడు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో నా పేరు లేకపోవడం చూసి నేను షాక్ అయ్యాను. అయితే సెలక్టర్లు వేరే ఆలోచనతో జట్టును ఎంపిక చేశారని నేను భావించాను. దాన్ని మనం అంగీకరించక తప్పదు. రుత్రాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జట్టు మొత్తం యువకులతో కూడి ఉంది. వారు బాగా రాణిస్తారని ఆశిస్తున్నాను.. జట్టుకు అవసరమైతే ఇప్పుడైనా రీఎంట్రీ ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పటికప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తూనే ఉంటాను. అక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి. నేను ఇప్పటికీ ఫిట్నెస్గా ఉన్నాను. అయితే నా ఫ్యూచర్ కోసం ఏ సెలక్టరు కూడా ఇప్పటివరకు నాతో ఏమి మాట్లాడలేదు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్కు టైటిల్ను అందించడమే నా లక్ష్యమని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ పేర్కొన్నాడు. చదవండి: 'అతడొక అద్భుతం.. కచ్చితంగా కోహ్లి అంతటివాడవుతాడు' -
తిలక్ వద్దు!? వరల్డ్కప్ టోర్నీలో నంబర్ 4లో సూర్య సరైనోడు! అతడిని ఆడిస్తే..
World Cup 2023: మిడిలార్డర్లో కీలక స్థానమైన నాలుగో నంబర్పై టీమిండియాలో నెలకొన్న అనిశ్చితి గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ నం.4లో సమస్య ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత అక్కడ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారని పేర్కొన్నాడు. అయ్యర్ గాయాల బారిన పడటం వల్ల ఇక శ్రేయస్ అయ్యర్ ఆ లోటును భర్తీ చేయగల సత్తా ఉన్నవాడే అయినా.. గాయాల బెడద వల్ల అతడు అందుబాటులో లేకపోవడం అనిశ్చితికి కారణమైందని పేర్కొన్నాడు. అయ్యర్ జట్టుకు దూరమైన తరుణంలో వేర్వేరు ఆటగాళ్లతో ప్రయోగాలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్కప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో టీమిండియాను వేధిస్తున్న ఈ ప్రధాన సమస్య గురించి వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ టోర్నీలో నాలుగో స్థానంలో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ను ఆడించాలని సూచించాడు. నా ఛాయిస్ సూర్యనే.. ఎందుకంటే ‘‘నేనైతే నం.4లో సూర్యనే ఎంచుకుంటాను. గత కొంతకాలంగా అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అనుభవజ్ఞుడు. కాబట్టి నా ఛాయిస్ సూర్యనే’’ అని వ్యాఖ్యానించాడు. కాగా టీ20లలో సుదీర్ఘకాలంగా ప్రపంచ నంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్న ముంబై బ్యాటర్ సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. వన్డేల్లో సో సోగా.. వెస్టిండీస్తో సిరీస్లోనూ వచ్చిన అవకావాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడు వన్డేల్లో వరుసగా 19, 24, 35 పరుగులు చేయగలిగాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మొత్తంగా 26 వన్డే మ్యాచ్లు ఆడిన సూర్య 511 పరుగులు మాత్రమే చేశాడు. తిలక్ గురించి మాట్లాడుతుంటే! ఈ నేపథ్యంలో 50 ఓవర్ ఫార్మాట్లో తన గణాంకాలు చెప్పుకోదగినవిగా లేవని, ఈ విషయం చెప్పేందుకు సిగ్గుపడనని సూర్య వాస్తవాన్ని అంగీకరించాడు కూడా! ఇదిలా ఉంటే.. విండీస్తో టీ20 సిరీస్తో ఎంట్రీ ఇచ్చిన యువ సంచలనం తిలక్ వర్మ నాలుగో స్థానంలో మెరుగ్గా ఆడుతున్న వేళ అతడిని వన్డేల్లోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, ధావన్ మాత్రం అనుభవం పేరిట సూర్య పేరును ఎంచుకోవడం విశేషం. ఇక భారత్ వేదికగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది. అంతకంటే ముందు టీమిండియా.. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఆసియా వన్డే కప్-2023లో పోటీపడనుంది. చదవండి: దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అలాగే పెళ్లి కూడా చేసిపెట్టమని అడగండి మేడం!
ఆనంద్ మహీంద్రా సండే ట్వీట్.. 'సిటీ ఆఫ్ సీ' వీడియో
ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్ సూచనతోనే కేన్స్లో మెరిసిందా?
రెడ్ కార్పెట్పై తెలుగందం.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు! (ఫోటోలు)
టీడీపీ అరాచకం.. సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి
సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్
నేనే హీరో..నేనే విలన్..తగ్గేదేలే అంటున్న స్టార్స్
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement