-
నామినేషన్ వేసిన టీడీపీ రెబల్ షాక్ లో రఘురామ కృష్ణం రాజు
-
టీడీపీ తనను గుర్తించలేని ఆవేదన వ్యక్తం చేసిన శివరామరాజు
-
'104' మధ్యలోనే ఆగిపోతున్నాయి
హైదరాబాద్ : 104 వాహనాల సమస్యలను టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజు బుధవారం అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాహనాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆరోపించారు. సిబ్బంది, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోందని చెప్పారు. మందల పంపిణీ కూడా పూర్తీగా జరగడం లేదంటూ సభకు వివరించారు. 30 ట్యాబ్లెట్లు అవసరమైతే ... 10 ట్యాబ్లెట్లు మాత్రమే ఇచ్చి మిగతావి బయట కొనుక్కోమని చెబుతున్నారని సోదాహరణగా తెలిపారు. 104 వాహనాల్లో బీపీ, షుగర్, ఆస్తమాకు మందులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 104 వాహనాలకు వెంటనే మరమ్మత్తులు చేయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
రచ్చబండలో నిరసనల హోరు
ఉండి, న్యూస్లైన్ : ఉండి మార్కెట్యార్డులో గురువారం జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిరసనలతో హోరెత్తింది. ఇళ్లస్థలాలు మంజూరు చేయాలంటూ సీపీఎం కార్యకర్తలు ఎంపీ బాపిరాజు, ఎమ్మెల్యే శివరామరాజు, ఆప్కాబ్ వైస్ చైర్మన్ ముత్యాల రత్నంను నిలదీశారు. ఈనేపథ్యంలో అక్కడ ఘర్షణ ఏర్పడి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో సీపీఎం కార్యకర్తలను, నాయకులను పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళనకారులు ఉండి ప్రధాన సెంటర్ వద్ద రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఇదిలా ఉండగా సభలో వైసీపీ మండల కన్వీనర్, గ్రామ ఉపసర్పంచ్ ఏడిది వెంకటేశ్వరరావు ప్రజాప్రతినిధుల తీరుపై మండిపడ్డారు. నియోజకవర్గంలోని సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని ధ్వజమెత్తారు. ఉండి అక్విడెక్టు నిర్మించేందుకు 2009లో శంకుస్థాపన చేయగా నేటికి అక్విడెక్టు నిర్మించలేదన్నారు. దీనివల్ల మండలంలోని సుమారు 7 గ్రామాల్లో పొలాలు ముంపునకు గురై సార్వా పంటను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పంట ఖర్చులకు అనుగుణంగా రుణాలు పంపిణీ చేయడం లేదని, రైతులనుంచి పెద్ద మొత్తంలో బీమా సొమ్ము చెల్లించుకొని ఆ స్థాయిలో నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. అన్ని వర్గాల వారికి విద్యుత్ చార్జీలు మోయలేని భారంగా మారాయన్నారు. ఉండిలో కళాశాల, కల్యాణ మండపం నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాప్రతినిధుల చెవులకు ఎక్కడం లేదని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలు ఎల్లకాలం ఉండేవి : ఎంపీ బాపిరాజు ప్రజా సమస్యలు ఎల్లకాలం ఉంటాయని నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాల సమస్య చాలా జఠిలమైందని, వాటిని పరిష్కరించడం కష్టదాయకమన్నారు. ఆందోళన నిర్వహించి ప్రజాప్రతినిధులను నిలదీసినా చేసేదేమిలేదన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించి తమకు లేదా అధికార బృందానికి తెలియజేస్తే వెంటనే ఆ స్థలాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలనేవి నిత్యం పునరావృతం అవుతాయన్నారు. తాను సమైక్యవాదినే అని ఈ సభలో కూడా తెలియజేశారు. ఆప్కాబ్ ఉపాధ్యక్షుడు ముత్యాల రత్నం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే శివ మాట్లాడుతూ అక్విడెక్టు నిర్మాణం, జూనియర్ కళాశాల కళాశాల స్థాపన వంటి సమస్యలు పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నామన్నారు. ఉండి ప్రధాన సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణకు కాలువపై రెండో వంతెన నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. రచ్చబండ కమిటీ సభ్యులు చిక్కాల జగదీష్, రుద్రరాజు రంగరాజు, ముదునూరి రమాదేవి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముదునూరి కొండ్రాజు, వైసీపీ టౌన్ అధ్యక్షుడు గుల్లిపల్లి అచ్చారావు, కొత్తపల్లి రమేష్రాజు, పొత్తూరి వెంకటేశ్వరరాజు, బీసీ సెల్ మండల కన్వీనర్ కె.శివనాగరాజు, మహిళా విభాగం కన్వీనర్ గడి జయలక్ష్మి, కమతం బెనర్జీ, శేషాద్రి శ్రీను, కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి గాదిరాజు లచ్చిరాజు, ఏఎంసీ వైస్ఛైర్మన్ కరిమెరక రామచంద్రరావు, సర్పంచ్ ముదునూరి విజయ, ప్రత్యేక అధికారి ప్రసాద్, ఎంపీడీవో రమాదేవి, ఎంఈవో బీఐఐ న్యూటన్, తహసిల్దార్ వై.దుర్గాకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement