-
రష్మికకు ఆఫర్ల వరద.. చేతిలో ఇన్ని సినిమాలున్నాయా?
కన్నడలో కిరాక్ పార్టీ అనే చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించిన రష్మిక మందన్నా తర్వాత నేషనల్ క్రష్గా మారారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రముఖ నటుల సరసన నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తున్నారు. చేతినిండా చిత్రాలు ఉన్నా మరిన్ని అవకాశాలు ఈమె వైపే చూస్తుండడం విశేషం. రష్మిక చేతినిండా సినిమాలు..ప్రస్తుతం పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో చావ, సికిందర్ చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా తెలుగులోనూ విజయ్దేవరకొండతో మరోసారి కొత్త చిత్రంలో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే తమిళంలో ఈమె నటించిన రెండు చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ఇక్కడ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న రష్మిక మందన్నకు అవకాశాలు తలుపు తడుతున్నాయి. కోలీవుడ్లో మరో ఛాన్స్అలా త్వరలో సూర్యకు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమెను మరో అవకాశం వరించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించనున్న నూతన చిత్రంలో రష్మికను హీరోయిన్గా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఫిల్మీదునియాలో టాక్. శివ కార్తికేయన్ ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మిస్తున్న అమరన్ చిత్రం పూర్తి చేసి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శివకార్తికేయన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో డాన్ ఒకటి. ఈ మూవీ ద్వారా సిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయమయ్యారు. శివకార్తికేయన్తో వన్స్మోర్ఆ తర్వాత ఆయన రజనీకాంత్కు కథను సిద్ధం చేశారు. ఆ చిత్రంలో రజనీకాంత్ నటిస్తారని ప్రచారం జరిగినా, అది కార్య రూపం దాల్చలేదు. ఆ తర్వాత టాలీవుడ్ హీరో నానికి కథ చెప్పారు, అదీ వర్కౌట్ కాలేదు. దీంతో సిబి చక్రవర్తి తన తొలి చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ తోనే మరో చిత్రం చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో రష్మికను భాగం చేయాలనుకుంటున్నారట!చదవండి: 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా ఎన్టీఆర్ ఎలా ఎదిగాడు..? -
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
మదుబాణకడై, వట్టం చిత్రాల ఫేమ్ కమల్ కన్నన్ తెరకెక్కించిన తాజా చిత్రం కొరంగు పెడల్. కాళీ వెంకట్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో సంతోష్ వేల్మురుగన్, వీఆర్.రాఘవన్, ఎం.జ్ఞానశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు రాశీ అళగప్పన్ రాసిన సైకిల్ అనే చిరు కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్జీ ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్, సవిత కలిసి నిర్మించారు. జిబ్రాన్ సంగీతం, సునీల్ భాస్కర్ ఛాయాగ్రహణం అందించారు.జీవితంలోని సంఘటనలు..హీరో శివకార్తికేయన్కు చెందిన ఎస్కే.ప్రొడక్షన్స్ సంస్థ సమర్పించడం విశేషం. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న కురంగు పెడల్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాళీవెంకట్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదన్నారు. తన జీవితంలోని పలు సంఘటనలను ఈ చిత్రం గుర్తు చేసిందన్నారు. కురంగు పెడల్ చిత్రంలోని కురంగు అనే పాట గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించడం విశేషం అన్నారు.కనెక్ట్ అయిపోయాచిత్ర నిర్మాత సవితా మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను వినగానే తాను దీనికి కనెక్ట్ అయిపోయానన్నారు. సైకిల్ అనేది మన ఎదుగుదలలో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు చాలా స్వతంత్రాన్ని ఇచ్చిందన్నారు. చిత్ర దర్శకుడు కమల్కన్నన్ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకుల్లోకి చేరడానికి ముఖ్య కారణం శివకార్తికేయన్. ఇందులో పని చేసిన వారంతా తమ సొంత చిత్రంగా భావించారని, వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. We have had a fantastic response to the special screening of our #KuranguPedal. Book your tickets now and experience the nostalgic ride in theaters starting tomorrow. #KuranguPedalFromTomorrowpic.twitter.com/TcD5vezHwz— Sivakarthikeyan Productions (@SKProdOffl) May 2, 2024 -
రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన హీరో శివకార్తికేయన్
తమిళ ప్రముఖ హీరో శివకార్తికేయన్ రూ.50 లక్షలు విరాళం అందించారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నుంచి శివకార్తికేయన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశారు. నడిగర్ భవన నిర్మాణ కోసం ఇప్పటికే కోలీవుడ్ టాప్ హీరోలు తమ వంతుగా సాయం చేస్తూనే ఉన్నారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న హీరో విశాల్.. భవన నిర్మాణం కోసం విరాళాలు సేకరించే పనిలో గత కొన్ని నెలలుగా ఉన్నారు. ఆయన పిలుపుతో కమల్ హాసన్,విజయ్,సూర్య,కార్తీ వంటి స్టార్ హీరోలు తమ వంతుగా సాయం అందించారు. తాజాగా శివకార్తికేయన్ కూడా రూ. 50 లక్షలు విరాళం అందించారు. ఇప్పటికే రూ.40 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి కాగా, నిర్మాణ పనులకు మరో రూ.25 కోట్లు అవసరం ఏర్పడటంతో నటీనటుల సంఘం తరపున బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే రూ.12.5 కోట్లు డిపాజిట్ చేస్తే రూ.30 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు సరిపడ మొత్తాన్ని ఏర్పాటు చేసే పనిలో విశాలు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. Actor #Sivakarthikeyan donated Rs 50Lakh from his personal fund towards the construction of New Nadigar Sangam Building. He handed the cheque to South Indian Artistes' Association President M.Nasser and Treasurer Si.Karthi.#NadigarSangam #siaa@actornasser @VishalKOfficial… pic.twitter.com/vGfoTURb0t — Ramesh Bala (@rameshlaus) April 23, 2024 -
ఈ ముగ్గురు సినిమా స్టార్స్ ధరించిన 'కరుంగలి దండ' గురించి తెలుసా..?
చాలామంది ప్రముఖులు తమ మెడలో స్పటిక,రుద్రాక్ష, కరుంగలి మాల ఇలా వారి నమ్మకం కొద్ది వివిధ దండలు ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోలీవుడ్కు చెందిన స్టార్స్ లోకేష్ కనగరాజ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి వారు కరుంగలి దండను తమ మెడలో ఎప్పటికి ధరించే ఉంటారు. వారు పలు వేదికల మీదికి వెళ్లినా సరే ఈ దండను మాత్రం తొలగించరు. అంతలా ఈ కరుంగలి దండకు వారు ప్రాముఖ్యత ఇస్తారు. అది ఎందుకు ధరిస్తున్నారో అనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కారణం ఏమిటంటే..: లోకేష్ కనగరాజ్ 'విక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఒక సందర్భంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాధానికి గురయ్యాను. అప్పుడు నా మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ నాకు ఈ కరుంగలి దండను ఇచ్చాడు. అప్పుడు ఈ మాల గురించి నాకు పెద్దగా ఎలాంటి సమాచారం తెలియదు. కానీ ఈ దండను ధరించమని అతను చెప్పడంతో నేను తీసుకున్నాను. ఇక నుంచి నీకు అన్నీ మంచే జరుగుతాయి.. ఎలాంటి ప్రమాధాలు జరగవు అని చెప్పాడు. నాకు అలాంటి వాటి పట్ల పెద్దగా నమ్మకం లేదు. కానీ ఆయన కోరిక మేరకు ఆ మాలను ధరించాను. కానీ ఆ సమయం నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎంతో పేరుప్రతిష్ఠలు వచ్చాయి. దీంతో ఆ దండను నేను ఎప్పడూ తొలగించలేదు.' అని ఆయన చెప్పారు. కరుంగాలి మాల అంటే.. కరుంగలి అంటే జమ్మి చెట్టు అని అర్థం. ఆ చెట్టు కాండం నుంచి ఈ దండను తయారు చేస్తారు. జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగాలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని జ్యోతిష్య నిపుణుల నమ్మకం. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాలన ధరిస్తారని చెబుతారు.వ్యాపారస్తులతో పాటు నిరుద్యోగులు, జాబ్ హోల్డర్లు కూడా ఈ దండను ధరిస్తారు. అందుకే ఈ దండలకు భారీ డిమాండ్ పెరిగింది. ఆన్లైన్లో దొరికే మాలలన్నీ డూప్లికేట్ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ ఆలయం దగ్గర మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తారు. తమిళనాడులోని సోలైమలై కొండల దిగువన ఈ ఆలయం ఉంది. మదురై నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయంలో సుబ్రమణ్య స్వామి ఉన్నారు. శివకార్తికేయన్, ధనుష్ కూడా కరుంగాలి అభిమానులే కరుంగలి మాలను కోలీవుడ నుంచి శివకార్తికేయన్, ధనుష్ కూడా ధరిస్తారు. ఒక ఇంటర్వ్యూలో ఈ దండ గురించి మాట్లాడుతూ.. 'ఈ కరుంగలి మాల ధరించిన సమయం నుంచి నా జీవితం మారిపోయింది. సినిమాల పరంగా మంచి అవకాశాలు దక్కాయి.' అని చెప్పాడు. పలుమార్లు ఈ ఆలయానికి ధనుష్ కాలినడక ద్వారా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. -
గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన హోమ్లీ హీరోయిన్
గ్లామర్ లేనిదే సినిమా లేదు అని చెప్పవచ్చు. ఇక చాలా మంది ఈతరం హీరోయిన్లు గ్లామర్ను నమ్ముకునే గడిపేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నటనకు అవకాశం ఉన్న పాత్రలకే తమ ప్రాధాన్యం అంటుంటారు. అయితే నటించేది మాత్రం గ్లామరస్ పాత్రల్లోనే. తాజాగా నటి ప్రియాంక మోహన్ కూడా ఇదే బాట పట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కన్నడ భామ మాతృభాషలో ఒకటి రెండు చిత్రాలు చేసిన తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నాని సరసన నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించింది. అందులోనూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈ అమ్మడిని అక్కడ పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్పై దృష్టి సారించింది. ఇక్కడ శివకార్తికేయన్కు జంటగా డాక్టర్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటు ప్రియాంక మోహన్కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం హిట్తో శివకార్తికేయన్తో మరోసారి డాన్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. ఈ చిత్రం సూపర్హిట్ అయ్యింది. అలా పాపులరైన ప్రియాంక మోహన్కు స్టార్ నటుడు సూర్యతో జతకట్టే అవకాశం వచ్చింది. ఆయనతో ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ET) చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాలన్నింటిలోనూ ఈ అమ్మడు హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది. దీంతో అలాంటి ఇమేజ్కు పరిమితమైంది. అలాంటిది ఇటీవల ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఒక సామాజిక బాధ్యత కలిగిన పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. తాజాగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి జయం రవికి జంటగా నటిస్తున్న బ్రదర్ చిత్రం. మరొకటి డాన్స్ మాస్టర్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే చాలా గ్యాప్ తరువాత తెలుగులో పవన్కల్యాణ్తో జత కట్టే అవకాశాన్ని పొందినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా ప్రియాంక మోహన్ గ్లామర్ గోదాలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రత్యేకంగా ఫొటో షూట్ చేసుకుని దిగిన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తోంది. అలా తాజాగా బెడ్ రూమ్లో ఫొటో షూట్ చేసుకున్న గ్లామరస్ చిత్రాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇవి గ్లామర్ పాత్రలకు గ్నీన్ సిగ్నలా అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు తమ ఇన్స్ట్రాగామ్లో ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇలాంటి గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. వీటి వల్ల కూడా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. నటి ప్రియాంక మోహన్ గ్లామరస్ ఫొటోలకు ఇది కూడా ఒక కారణం అయ్యింటుందనేది ట్రోల్ అవుతోంది. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
కోలీవుడ్ హీరోతో కుర్చీ మడతపెట్టిన శ్రీలీల
తమిళ హీరో శివకార్తికేయన్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కమల్ హాసన్ నిర్మాతగా తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న అమరన్ చిత్రం కాగా, మరొకటి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. అమరన్ చిత్రంలో శివకార్తికేయన్ సైనికుడిగా పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న SK23వ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ రెండూ కమర్షియల్ ఫార్మాట్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాలు కావడం గమనార్హం. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శివకార్తికేయన్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలతో డ్యాన్స్ చేశాడు. వీళ్లు డ్యాన్స్ చేసింది సినిమాలో కాదు.. ఓ స్టేజీపై! ఇటీవల తిరుచ్చిలోని ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న శివకార్తికేయన్, శ్రీలీల గుంటూరు కారంలోని కుర్చీని మడత పెట్టి అనే పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. #PrinceSK and #Sreeleela shakes legs for #KurchiMadathaPetti !🔥🕺🏻💃🏻 This combo would shatter the screens ! Make it happen @Siva_Kartikeyan naahh!💥❤️#Amaran #SK23 pic.twitter.com/Nya09oDRq9 — ꜰᴀᴢɪʟ🖤 (@SKFazil_) March 23, 2024 చదవండి: పెళ్లి తేదీతో పాటు కాబోయే భర్త ఎవరో చెప్పిన బర్రెలక్క -
తొలిసారి రొమాంటిక్ సాంగ్లో సాయిపల్లవి
మావీరన్, అయలాన్ చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్న నటుడు శివకార్తికేయన్. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే అంగీకరించే నటి సాయిపల్లవి. ఈ రేర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అమరన్. నటుడు కమలహాసన్ తన రాజకమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న అమరన్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో నటుడు శివకార్తికేయన్ సైనికుడిగా నటిస్తున్నారు. ఆయనకు సతీమణిగా సాయి పల్లవి నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ కాశ్మీర్లో 3 నెలల పాటు చిత్రీకరణను జరుపుకుంది. మరో పది రోజుల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి అవుతుందని యూనిట్ సభ్యుల సమాచారం. కాగా మిగిలిన షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాలలో నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఇందులోని ఒక రొమాంటిక్ గీతాన్ని శివకార్తికేయన్, సాయి పల్లవిపై చిత్రీకరించనున్నట్లు తెలిసింది. రొమాంటిక్ సాంగ్స్లలో సాయిపల్లవి ఇప్పటి వరకు కనిపించింది లేదు. కానీ ఇందులో కథ అవసరం మేరకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైన సాయిపల్లవి కొన్ని బార్డర్స్ ఎప్పటికీ దాటదని తెలిసిందే.తదుపరి నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్లో అమరన్ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో శివకార్తికేయన్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభమై చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా దీంతో పాటు శివకార్తికేయన్ మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం.Thank you for the wishes that came in today ❤️#VirataParvam will always be close to my heart ❤️And Vennela says hi 🥰 pic.twitter.com/aS4sqnTQLR— Sai Pallavi (@Sai_Pallavi92) June 17, 2023 -
నా బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు: స్టార్ హీరో ఎమోషనల్
కోలీవుడ్లో స్వయం కృషితో స్టార్గా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్. ఒక టీవీ యాంకర్గా కెరియర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నటుడిగా పరిచయమై సపోర్టింగ్ పాత్రలు చేస్తూ ఆపై హీరోగా ఎదిగారు. ధనుశ్ కథానాయకుడిగా నటించిన మూడో చిత్రంలో శివ కార్తికేయన్ ఆయనకు ఫ్రెండ్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మనం కొత్తి పరవై చిత్రం ద్వారా హీరోగా అవతారం ఎత్తారు. అలా ఇప్పటికి 20 చిత్రాల్లో కథానాయకుడుగా నటించారు. ఇందులో పలు చిత్రాలు సూపర్ హిట్ కాగా అభిమానులు మెచ్చిన స్టార్గా ఎదిగారు. తాజాగా నటిస్తున్న 21వ చిత్రం అమరన్. నటి సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో శివ కార్తికేయన్ సైనిక కమెండోగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం చాలా కసరత్తులు చేశారు. చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.60 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. శివ కార్తికేయన్ నటించిన చిత్రాలన్నింటిలో అత్యధిక మొత్తానికి ఓటీటీ హక్కులు అమ్ముడుపోయిన చిత్రం ఇదే కానుంది. ఇంతకుముందే శివ కార్తికేయన్ నటించిన మావీరన్ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ.33 కోట్లు చెల్లించింది. దీంతో అమరన్ చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. శివ కార్తికేయన్ ఆదివారం తన అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ‘మీరు దేని గురించి ఆలోచించకండి. మీ కోసం నేనున్నాను. నాకు అంతా మీరే. జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నా. వాటి బాధ ఉంటుంది. కొన్ని మీకు తెలిసినా, చాలా విషయాలు తెలియదు. సమస్యలు చెప్పుకోవడానికి నాకు నాన్న లేరు. సపోర్ట్ చేయడానికి అన్నయ్య లేరు. నాకిప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా అంతా మీరే’. అంటూ నటుడు శివకార్తికేయన్ భావోద్వేగానికి గురయ్యారు. -
తొలిసారి రొమాంటిక్ గా సాయి పల్లవి.. శివ కార్తికేయన్ తో కలిసి
-
మృణాల్ అనుకుంటే రుక్మిణి బంపరాఫర్ పట్టేసింది!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరి దశ తిరుగుతుందో అస్సలు చెప్పలేం. అలా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లక్ మారేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ప్లానింగ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్-హీరో కాంబోతో కలిసి నటించేందుకు ఓకే చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'సప్త సాగరాలు దాటి' సినిమాతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన భామ రుక్మిణి వసంత్. గతేడాది రెండు పార్టులుగా రిలీజైన ఈ సినిమాలో రుక్మిణి యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే తెలుగు నుంచి కూడా బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ వేటికి ఓకే చెప్పకుండా ఒక్కో అడుగు ఆచితూచి వేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా శివకార్తికేయన్ కొత్త మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తొలుత ఈ సినిమాలో పూజాహెగ్డే లేదా మృణాల్ ఠాకుర్ హీరోయిన్లుగా నటిస్తారనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రుక్మిణి బంపరాఫర్ కొట్టేసింది. ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఈ బ్యూటీ ఓ సినిమా చేస్తోంది. తెలుగు నుంచి ఆఫర్స్ వస్తున్నా సరే ఏ మాత్రం తొందరపడకుండా మూవీస్ చేయాలని చూస్తోంది. ఈమె ప్లానింగ్ చూస్తున్న నెటిజన్స్.. మరో రష్మిక అవుతుందని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) -
‘అరి’ రీమేక్పై స్టార్ హీరోల గురి?
తెలుగు దర్శకులు సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలిసిన కథలే అయినా..వాటికి కొత్త నేపథ్యాన్ని మేళవించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన పురాణాలు, ఇతిహాసాల కథల్ని వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలాంటి చిత్రాలకు టాలీవుడ్లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు నిదర్శనం కార్తికేయ, హనుమాన్, కాంతారా, ఓ మై గాడ్ సినిమాలే. ఇవన్నీ చిన్న సినిమాలే అయినా.. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాయి. అలాంటి కాన్సెప్ట్తో తాజాగా మరో చిత్రం రాబోతుంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఈ సినిమా విడుదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల కాకముందే దీని రీమేక్పై పలువురు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘అరి’పై శివకార్తికేయన్ గురి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శివకార్తికేయన్. ఆయన ఇటీవల అయలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్లో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ హీరో కన్ను ఇప్పుడు అరిపై పడింది. అయలాన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్కి వచ్చిన శివకార్తికేయన్కి దర్శకుడు జయశంకర్ ‘అరి’ ట్రైలర్ చూపించాడు. అది శివకార్తికేయన్కు విపరీతంగా నచ్చడంతో.. సినిమా మొత్తం చూశాడట. అందులోని కృష్ణుడు పాత్ర అతన్ని బాగా ఆకట్టుకుందట. ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తే.. కృష్ణుడు పాత్రలో తాను నటిస్తానని జయశంకర్కి చెప్పాడట. అరి తెలుగులో రిలీజై.. హిట్ అయితే మాత్రం అది కచ్చితంగా తమిళ్లో రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హిందీ రీమేక్లో అభిషేక్? ఒక హీరో మాస్ క్యారెక్టర్ చేయడానికి ఎంత ఇష్టపడతాడో అలాగే కృష్ణుడి పాత్రను చేయడానికి అంతే ఆసక్తి చూపుతాడు. ఇక నార్త్లో అయితే కృష్ణతత్వం కాన్సెప్ట్తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన కార్తికేయ 2 సౌత్లో కంటే నార్త్లో బాగా ఆడింది. ‘అరి’ కూడా అలాంటి చిత్రమే కావడంతో.. హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్లో నటించడానికి అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపుతున్నాడట. ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే అభిషేక్ని కృష్ణుడిగా చూడొచ్చు. ‘అరి’పై ప్రముఖుల ప్రశంసలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రీలీజ్కు రేడీగా ఉంది అరి సినిమా. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులకు చూపించారు మేకర్స్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్తో పాటు చినజీయర్ స్వామి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ట్రైలర్పై ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్( ఇస్కాన్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిత్ దాస ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపారు. -
గ్రహాంతరవాసి వస్తున్నాడు
తమిళ చిత్రం‘అయలాన్’ తెలుగులో విడుదల కానుంది. శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అయలాన్’. కోటపాడి జె. రాజేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న తమిళ్లో విడుదలైంది. ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు గంగ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ ప్రకటించింది. ‘‘ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘అయలాన్’. ఏలియన్ (గ్రహాంతర వాసి) ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి సినిమా మాదే. వీఎఫ్ఎక్స్ షాట్స్కి సుమారు రెండేళ్లు పట్టింది. తమిళ్లో కేవలం నాలుగు రోజుల్లో రూ. 50 కోట్లు వసూలు చేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చూపించాలని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కోటపాడి జె. రాజేశ్. -
ధనుష్, శివకార్తికేయన్, విజయ్ లో సంక్రాంతి విన్నర్ ఎవరంటే...?
-
పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్, అయలాన్ మూవీ
-
ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్: స్టార్ హీరో
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అయలాన్. ఈ చిత్రానికి రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా కనిపించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య అయలాన్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా శివకార్తికేయన్ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. శివకార్తికేయన్ మాట్లాడుతూ.. 'అయలాన్ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇతర చిత్రాలను బ్రహ్మాండంగా రూపొందించడం శంకర్ తరువాత రవికుమారే ఉంటారు. ఆర్థిక సమస్యల కారణంగా చిత్ర నిర్మాణం కాస్తా ఆలస్యమైంది. అయలాన్ చిత్ర షూటింగ్ను 75 శాతం పూర్తి చేసిన తరువాత ఈ చిత్రం ఎలా వస్తుందో మాకు అర్థమైపోయింది. దీంతో చిత్రాన్ని పక్కన పెట్టలేకపోయామని చెప్పారు. ఈ చిత్రాన్ని రాజీ పడకుండా చేశామని చెప్పారు. అయలాన్ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. కాగా.. ప్రస్తుతం రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో నటిస్తున్నట్లు శివకార్తికేయన్ వెల్లడించారు. ఈ సినిమాలో నటి సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తైనట్లు తెలిపారు. ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం త్వరలోనే సెట్పైకి వెళ్లనున్నట్లు శివకార్తికేయన్ చెప్పారు. ఇందులో మృణాల్ ఠాగూర్ నాయకిగా నటిస్తున్నారని తెలిపారు. కాగా.. రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో తాను నటించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని శివకార్తికేయన్ తెలిపారు. తాను రజనీకాంత్కు అభిమానిని అని వెల్లడించారు. అయితే ఆయనతో కలిసి నటించడం లేదని స్పష్టం చేశారు. -
స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్ చేతిలోకి 'అయలాన్'.. విడుదల తేదీ ప్రకటన
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'అయలాన్'. ఏలియన్స్ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా సిద్ధమైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా ఇందులో నటిస్తుంది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతికి తెలుగులో భారీగా సినిమాలు ఉన్నాయి. దీంతో కొద్దిరోజుల క్రితం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక సమావేశం నిర్వహించారు. అన్నీ సినిమాలు ఒకేసారి రావడంతో థియేటర్ల కొరత ఏర్పడుతుందనే కారణంతో రవితేజ ఈగల్ సినిమాను వాయిదా వేశారు. ఈగల్ సినిమాకు పోటీ లేకుండా సింగల్ తేదీని ఇస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అందుకు ఈగల్ టీమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా సంక్రాంతి రేసులోకి శివ కార్తికేయన్ అయలాన్ చిత్రం వచ్చేసింది. జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్లో నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని. ఆయనతో పాటుగా సీడెడ్లో ఎన్.వీ ప్రసాద్, వెస్ట్ ఉషా పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటూ.. ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయా ఏరియాల్లో వీరందరూ కూడా చాలా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్స్గా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. సంక్రాంతి రేసులో అయలాన్ చిత్రంతో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా ఉంది. థియటర్ల కొరతు ఉండటంతో ధనుష్ తెలుగులో వాయిదా వేసుకున్నాడు.. చివర్లో ఉనూహ్యంగా శివ కార్తికేయన్ రేసులోకి వచ్చేశాడు. ఇంతలా పోటీ పడతున్న ఈ చిత్రాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరో వేచి చూడాల్సిందే. -
సంక్రాంతి రేసు నుంచి రెండు టాప్ సినిమాలు ఔట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది 'సార్' చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇప్పుడు అదే జోష్ను 2024 కొత్త ఏడాదిలో కొనసాగించాలని ఆయన 'కెప్టెన్ మిల్లర్'గా సంక్రాంతి బరిలో దిగేందుకు ప్లాన్ వేసుకున్నాడు. ఇదే క్రమంలో ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కూడా ఇప్పటికే ప్రకటించింది. సంక్రాంతి బరిలోనే మరో తమిళ హీరో శివకార్తికేయన్ 'అయలాన్' చిత్రం కూడా ఉంది. (ఇదీ చదవండి: భారత్ సినిమాలపై పాక్ ప్రముఖ హీరో రియాక్షన్) ధనుష్, శివకార్తికేయన్ ఇద్దరు కూడా తెలుగులో గుర్తింపు ఉన్న హీరోలే.. దీంతో వీరి సినిమాలకు టాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఉంది. కానీ ఈ సంక్రాంతికి టాలీవుడ్లో తెలుగు స్ట్రైట్ చిత్రాలు గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టంగానే మారింది. అలాంటిది డబ్బింగ్ చిత్రాలు అయిన కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలకు థియేటర్లు దొరకడం కష్టంగానే ఉంది. దీంతో ఆ రెండు చిత్రాల మేకర్స్ సినిమా విడదల విషయంలో యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికే రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్ను మాత్రం వాయిదా వేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జనవరి నెలలోనే సంక్రాంతి తర్వాత ఈ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ మూవీల మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకడం కష్టంగా ఉందని ఆయన ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ఎలా థియేటర్లు ఇవ్వగలుగుతామని ఆయన అన్నారు. దీనిని బట్టి చూస్తే కెప్టెన్ మిల్లర్, అయాలాన్కు సంక్రాంతికి రావాడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. -
ఈ మూవీ కోసం ఒక్క పైసా తీసుకోని హీరో!
హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన చిత్రం అయలాన్. రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఆర్.రవికుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై కొటపాటి జయం రాజేశ్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని, నీరవ్షా చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రామాన్ని చైన్నెలో నిర్వహించారు. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరింది ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ.. తెలుగులో బాహుబలి, కన్నడంలో కేజీఎఫ్ చిత్రాల మాదిరి తమిళంలో అయలాన్ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో రక్తంతో కూడిన హింసాత్మక సంఘటనలు గానీ, తుపాకీ శబ్దాలు గానీ, అశ్లీల సన్నివేశాలు గానీ ఉండవన్నారు. ఆబాలగోపాలం చూసి ఆనందించే విధంగా సైంటిఫిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా అయలాన్ ఉంటుందన్నారు. అదే విధంగా ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని, ఈ చిత్రం కోసం తాను ఒక పాటను కూడా రాసినట్లు చెప్పారు.తనకు చిన్న తనం నుంచి కార్టూన్, గ్రాఫిక్స్ చిత్రాలంటే చాలా ఇష్టం అన్నారు. ఇతర సినిమాలతో పోల్చనుగానీ.. ఆ తరహాలో ఒక చిత్రాన్ని మనం చేయగలమా? అన్న ప్రశ్న ఎప్పుడూ తలెత్తేదన్నారు. దానికి సమాధానమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. ఇలాంటి చిత్రం చేస్తే ఆ తరువాత మరిన్ని ఇలాంటి చిత్రాలు వస్తాయని భావించామన్నారు. దురదృష్టవశాత్తు ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాతకు పలు సమస్యలు ఎదురయ్యాయని, వాటిని అధిగమించడానికి తాను పారితోషికం కూడా వద్దు.. చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేయమని చెప్పానన్నారు. ఇతర చిత్రాలతో పోల్చను కానీ, అయలాన్ తమిళ చిత్రపరిశ్రమలో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్ను జనవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు, టీజర్ కంటే ట్రైలర్ ఇంకా అదిరిపోతుందని శివకార్తికేయన్ పేర్కొన్నారు. చదవండి: విజయకాంత్ మరణం.. విశాల్ కన్నీటి పర్యంతం! -
ట్రెండ్ మార్చిన రజనీకాంత్
సూపర్స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ట్రెండ్ మార్చారు అనిపిస్తుంది. 50 ఏళ్ల సినీ పయనం, 170 చిత్రాల అనుభవం. ఈయన తాజాగా నటించిన జైలర్ చిత్రం కూడా అనూహ్య విజయాన్ని సాధించింది. రజనీకాంత్ హీరోగా నటించిన ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్, మలయాళం సూపర్స్టార్ మోహన్లాల్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్ అతిథులుగా మెరిశారు. ఒక సూపర్స్టార్ చిత్రంలో ఇందరు స్టార్లు నటించడం నిజంగా విశేషమే. ఇలా ఈ చిత్రం నుంచే రజనీకాంత్ ట్రెండ్ మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. జైలర్ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈయన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో షూటింగును ప్రారంభించనున్నట్లు దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. కాగా ఇందులో కూడా రజనీకాంత్తో పాటు యువ నటులు ముఖ్యపాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఇందులో శివకార్తికేయన్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం. ఇందులో మలయాళ భామ మంజువారియర్ రజనీకాంత్తో జతకట్టడానికి రెడీ అవుతున్నట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ క్రేజీ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
శివకార్తికేయన్ సినిమా.. రంగంలోకి పాన్ ఇండియా స్టార్లు!
ప్రస్తుతం మంచి రైజింగ్లో ఉన్న నటుడు శివకార్తికేయన్. ఇటీవల ఈయన నటించిన మావీరన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు.. విశ్వ నటుడు కమల్ హాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి శివకార్తికేయన్ సిద్ధమవుతున్నారు. కార్తికేయన్తో సీతారామం బ్యూటీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను గత సెప్టెంబర్లోనే నిర్మాతలు ప్రకటించారు. ఇందులో సీతారామం చిత్రం ఫేమ్ మృణాల్ఠాగూర్ కథానాయికగా నటించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, అదేవిధంగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నట్లు తాజా సమాచారం. నటుడు మోహన్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడు తుపాకీలో విలన్గా.. ఇప్పుడు.. ఇకపోతే విద్యుత్ జమ్వాల్ ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తుపాకీ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారన్నది గమనార్హం. కాగా అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: ‘మంగళవారం’ మూవీ రివ్యూ -
శివకార్తికేయన్ చేసిన పనివల్లే ప్రియాంకా మోహన్ బొద్దుగా అయిందా?
తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్న కన్నడ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. 2019లో ఒందు కథై హేల అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకగా పరిచయమైన నటి ఈమె. ఆ వెంటనే టాలీవుడ్లో నాని 'గ్యాంగ్ లీడర్' ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత కోలీవుడ్లో పాగా వేసింది. ఇక్కడ శివకార్తికేయన్ సరసన డాక్టర్ చిత్రంలో నటించి దాంతో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ఏకంగా సూర్యతో రొమానన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ET) చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశ పరిచినా ప్రియాంక మోహన్కు పెద్దగా నష్టం జరగలేదు. ఆ వెంటనే మరోసారి శివకార్తికేయన్తో డాన్ చిత్రంలో జతకట్టే అవకాశం వరించింది. లక్కీగా ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అలా లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ తాజాగా ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ అమ్మడికి మరోసారి తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా నానితో 'సరిపోదా శనివారం' అనే చిత్రం ద్వారా రెండో సారి జతకట్టనుంది. ఆ సినిమా పూజా కార్యక్రమంలో ఆమె కొంచెం బొద్దుగా కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు వస్తుండటంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. అందులో ముఖ్యంగా నటుడు శివ కార్తికేయన్ గురించి మాట్లాడుతూ ఆయనతో తాను రెండు చిత్రాలు చేసినట్లు చెప్పింది. శివ కార్తికేయన్కు ఒక ఎడిక్ట్ ఉందని, ఆయన స్వీట్స్ ఎక్కువగా తింటారని చెప్పింది. షూటింగ్ స్పాట్లో కూడా స్వీట్స్ తింటూ పక్కనున్న వారికి కూడా ఇస్తారని చెప్పింది. అలా ఆయన తనను కూడా స్వీట్స్ తినమని ఒత్తిడి చేసే వారని చెప్పింది. అలా ఒక హీరో అయ్యుండి కూడా బరువు పెరుగుతాననే భయం కూడా శివకార్తికేయన్కు ఉండదని నటి ప్రియాంకా మోహన్ పేర్కొంది. అలా పరోక్షంగా తను ఎందుకు బొద్దుగా అయిందో ఇలా చెప్పకనే చెప్పిందా బ్యూటీ.. కాగా దక్షిణాది భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తరచూ తన గ్లామరస్ ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ ట్రెండింగ్ అవుతోంది. -
శివకార్తికేయన్ నన్ను దారుణంగా మోసం చేశాడు: సంగీత దర్శకుడు
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్తో కలిసి పని చేసే ప్రసక్తే లేదంటున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్. గతంలో శివకార్తికేయన్కు ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడీ హీరో. అయితే వీరి మధ్య ఏమైందో ఏమో కానీ సడన్గా అతడి సినిమాలకు పని చేసేదే లేదంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'శివకార్తికేయన్తో ఈ జన్మలో కలిసి పని చేయను. వ్యక్తిగత కారణాల వల్ల అతడితో మళ్లీ కలిసి పని చేయలేను. ఎందుకంటే అతడు నాకు నమ్మకద్రోహం చేశాడు. తర్వాతి జన్మలో నేను మళ్లీ సంగీత దర్శకుడిగా, అతడు నటుడిగా పుడితే అప్పుడు కలిసి పనిచేస్తామేమో! ఈ జన్మకు మాత్రం అది జరగదు. అతడు నన్ను దారుణంగా మోసం చేశాడు. ఆ విషయం గురించి అతడిని నిలదీశాను కూడా! కానీ తనేమన్నాడనేది నేను చెప్పలేను. నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే అతడి గురించి ఏదీ చెప్పలేకపోతున్నాను. జనాలేమనుకుంటారన్న భయం నాకు లేదు. నేనేంటో నాకు పూర్తిగా తెలుసు' అని చెప్పుకొచ్చాడు. ఇతడి వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్కు గురి చేస్తున్నాయి. కాగా డి. ఇమ్మాన్ ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. విశ్వాసం సినిమాకుగానూ ఆయన ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా జాతీయ అవార్డు అందుకున్నాడు. తమిళన్, మైనా, కుంకీ.. ఇలా అనేక సినిమాలకు పని చేశాడు. శివకార్తికేయన్తో చివరగా 'నమ్మ వీటు పిల్లై' సినిమాకు పని చేశాడు. చదవండి: శుభశ్రీ అవుట్.. రతిక రోజ్కు గోల్డెన్ ఛాన్స్.. ఎలా వాడుకుంటుందో.. -
ఏలియన్ తో శివకార్తికేయన్..ప్రయోగం సక్సెస్ అవుతుందా..
-
ఇవి నా సంతోషకరమైన కన్నీళ్లు అంటూ భార్య ఫోటో షేర్ చేసిన శివకార్తికేయన్
శివకార్తికేయన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన భార్య ఆర్తి కోసం ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నారు. నటుడు శివకార్తికేయన్-ఆర్తి జంట ఈరోజు 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు, ఉదయం నుండి చాలా మంది వారికి శుభాకాంక్షలు తెలిపారు.రెమో, డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగ ఆయన 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (ఇదీ చదవండి; శేఖర్ మాస్టర్ విషయంలో చాలా బాధపడ్డాను: శ్రీలీల) కోలీవుడ్లో విజయ్ టీవీ ద్వారా బుల్లితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించి వెండితెరపై విజయవంతంగా అడుగుపెట్టిన నటుడు శివకార్తికేయన్ తన ఎదుగుదలతో యావత్ సినీ ప్రపంచం వెనక్కి తిరిగి చూసేలా చేశాడు. ఒకవైపు తన డ్రీమ్ వైపు పయనిస్తున్న నటుడు శివకార్తికేయన్ అదే సమయంలో 2010 ఆగస్టు 27న తన బంధువైన ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. శివకార్తికేయన్-ఆర్తి దంపతులకు ఒక కుమార్తెతో పాటు కుమారుడు ఉన్నారు. వారిద్దరూ కూడా తమ ఫ్యామిలీ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 13 సంవత్సరాల వైవాహిక జీవితం తన 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శివకార్తికేయన్ తన భార్య ఆర్తి కోసం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నాడు. తన భార్యతో కలిసి దిగిన సంతోషకరమైన ఫోటోను 'ఇవి నా సంతోషకరమైన కన్నీళ్లు... విష్ హ్యాపీ వెడ్డింగ్ డే' అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంలో, శివకార్తికేయన్ అభిమానులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నారు శివకార్తికేయన్ ప్రయాణం మిమిక్రీ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన శివకార్తికేయన్, బుల్లితెరపై పాపులర్ హోస్ట్గా ఉంటున్న సమయంలోనే మెరీనా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో వచ్చిన '3' సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత కేడి బిల్లా కిల్లాడి రంగా, మనంకోటి పక్షి, ఒప్పో నెచ్చిల వంటి హిట్లతో అంచెలంచెలుగా అభిమానులను సంపాదించుకున్నాడు. 2016లో రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు తదుపరి సినిమా ఏమిటి? సూపర్హిట్ చిత్రాలను అందిస్తూ అంచెలంచెలుగా తమిళ చిత్రసీమలో టాప్ స్టార్లలో ఒకరిగా ఎదిగిన శివకార్తికేయన్ తెలుగు పరిశ్రమలో కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఎస్కె 23 సినిమాపై దృష్టి సారించాడు. ఇంతకుముందు శివకార్తికేయన్-అదితి శంకర్ నటించిన మావీరన్ సూపర్ హిట్ అయ్యి 100 కోట్లు దాటింది. 'మండేలా' దర్శకుడు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన మావీరన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) -
సినిమా సూపర్ అంటూ రజనీ రివ్యూ.. ఆనందంలో హీరో
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన చిత్రం మావీరన్. హీరోయిన్ అదితి శంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్ మడోన్ దర్శకత్వంలో శాంతి పిక్చర్స్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ చిత్రం విడుదలై 25 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా శివకార్తికేయన్ బుధవారం ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో మావీరన్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సూపర్స్టార్ రజనీకాంత్కు ధన్యవాదాలు తెలియజేశారు. జైలర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ, చిత్ర విడుదల కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన మావీరన్ చిత్రాన్ని చూడలేకపోతారేమోనని చాలా నిరుత్సాహపడ్డానన్నారు. అయితే ఇటీవల మావీరన్ చిత్రాన్ని చూసిన రజనీకాంత్.. తనకు ఫోన్ చేసి చిత్రం చాలా బాగుందని అభినందించారన్నారు. ఇది తనతో పాటు యూనిట్ సభ్యులందరికీ ఆనందాన్ని కలిగించే విషయం అని చెప్పారు. మావీరన్ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశానని, చాలా గ్రాండ్గా, సూపర్బ్గా ఉందని రజనీ ప్రశంసించారన్నారు. చాలా డిఫరెంట్ కథా చిత్రాలను ఎంచుకుంటున్నావు కదా అని అభినందించారన్నారు. ఈ సందర్భంగా ఒక అభిమానిగా రజనీకాంత్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే తానీ రంగంలోకి ప్రవేశించినట్లు చెప్పారు. కాగా ఈయన ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతున్న తన 21వ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలిసింది. ❤️❤️❤️🙏🙏🙏#Maaveeran #JAILER #SuperstarRajinikanth @rajinikanth sir #VeerameJeyam #BlockBusterMaaveeran pic.twitter.com/0EMO7yUSI2 — Sivakarthikeyan (@Siva_Kartikeyan) August 9, 2023 చదవండి: స్నేహ చేసిన పనికి కంగారుపడుతున్న ఫ్యాన్స్.. అలాంటివి చేయొద్దని విజ్ఞప్తి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement