-
సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: సోమిరెడ్డి నీతిమాలిన మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద చల్లుతున్నాడని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని.. అందుకే మాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ చేర్చిన ఎఫ్ఐఆర్లో మా పేరు ఉందని నిరూపించగలరా..?. గవర్నర్ పాలనలో కేసులు బుక్ అయ్యిందా.. లేక టీడీపీ వచ్చిన తర్వాత కేసు బుక్ అయ్యిందా..? చెప్పే దమ్ము నీకు ఉందా?. మద్యం దొరికిన రైస్మిల్ ఓనర్కి, నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా..?’’ అంటూ మంత్రి కాకాణి సవాల్ విసిరారు.‘‘ఓటమిని ముందుగానే అంగీకరించిన సోమిరెడ్డి నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతున్నాడు. పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5 వేల మంది వచ్చారని నిరూపిస్తే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా.. సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.. ఓటర్లకి డబ్బులు పంచుతున్న సోమిరెడ్డిని డీస్ క్వాలిఫై చెయ్యమని సీఈసీకి ఫిర్యాదు చేశాను. సోమిరెడ్డి సంస్కారంగా బతకడం నేర్చుకోవాలి..ఎక్కడో మద్యం దొరికితే డాన్ని కూడా నాకు ఆపాదిస్తారా..?. మా ఎలక్షన్ కూడా సోమిరెడ్డే చేస్తున్నాడు.. నేను ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెబుతున్నాడు’’ అంటూ మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. -
ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి నాపై బురద జల్లుతున్నాడు
-
నీకు నిజంగా సిగ్గు ఉంటే.. టీడీపీ సోమిరెడ్డికి కాకాని స్ట్రాంగ్ కౌంటర్
-
పట్టపగలే ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన సోమిరెడ్డి
-
పచ్చ ప్రలోభాలు.. పట్టపగలే టీడీపీ నేత సోమిరెడ్డి బరితెగింపు
సాక్షి, నెల్లూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో ఉన్న పచ్చపార్టీ నేతలు పట్టపగలే ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీడీపీ నేత ప్రచారంలో భాగంగా రోడ్డుపైనే ఓటర్లులకు డబ్బులు పంచారు. నెల్లూరు జిల్లాలోని సర్వేసల్లి నియజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి బరితెగించారు. అక్కడ ఉన్న ఓటర్లకు డబ్బులు పంచారు. సోమిరెడ్డి పట్టపగలే మహిళా ఓటర్లుకు డబ్బుల, చీరలు పంచుతూ అడ్డంగా దొరికి పోయారు. -
సర్వేపల్లి బరిలో మళ్లీ వారే..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: జిల్లాలో సర్వేపల్లి నియోజకర్గానికి అనేక ప్రత్యేకతలున్నాయి. విస్తారంగా సముద్ర తీరం ఉంది. వేలామందికి ఉపాధి కల్పిస్తున్న కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు మండలంలో ఉంది. దాని ఆధారంగా అనేక పరిశ్రమలున్నాయి. సర్వేపల్లిలో రాజకీయాలు హాట్హాట్గా ఉంటాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఉంటారని ఎప్పుడో నిర్ణయమైంది. అయితే టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారోనని కొద్దిరోజులు ఉత్కంఠ నెలకొంది. దీనికి చంద్రబాబు నాయుడు తెరదించారు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికే అవకాశం కల్పించారు. మూడోసారి పాత ప్రత్యర్థులైన మంత్రి కాకాణి, సోమిరెడ్డిల మధ్య మూడో పర్యాయం పోటీ నెలకొంది. జిల్లాలో చూస్తే పాతకాపుల మధ్య పోటీ సర్వేపల్లిలోనే నెలకొనడం విశేషం. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కాకాణి, టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి తలపడ్డారు. కానీ కాకాణి విజయం సాధించారు. 14లో 5,500 ఓట్లు, 19లో 14 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడినా సోమిరెడ్డిని చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన పదవిని అడ్డు పెట్టుకుని 2019 ఎన్నికల్లో సర్వేపల్లి బరిలో నిలబడి అస్త్రశస్త్రాలు ప్రయోగించి మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. అదే బలం కాకాణి సొంత మండలం పొదలకూరు ఆయనకు కంచుకోట. దీనిపై సోమిరెడ్డి మంత్రి హోదాలో ఫోకస్ పెట్టి ఎన్నో రాజకీయ విన్యాసాలు చేశారు. కాకాణి స్వగ్రామం తోడేరులో ఒకరిద్దరిని ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకున్నా తర్వాత వారు సొంత గూటికే చేరుకున్నారు. 2019లో ఎన్ని కుయుక్తులు పన్నినా ఒక్క పొదలకూరు నుంచి కాకాణి సోమిరెడ్డిపై 4,700 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పుడు కూడా సోమిరెడ్డి పొదలకూరు మండలంపైనే తన దృష్టిని నిలిపి గోవర్ధన్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. క్యూ కట్టి.. సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి వలసలు పెరిగాయి. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగూడూరు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టి మరీ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. వారిని సోమిరెడ్డి నిరోధించలేకపోతున్నారు. దీంతో తమ పార్టీకి చెందిన వారికే కండువాలు కప్పి వైఎస్సార్సీపీ నుంచి వలసలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేగంగా అభివృద్ధి అధికార పార్టీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్రెడ్డి సర్వేపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా చేశారు. పల్లెల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం జరిగింది. మౌలిక వసతులు కల్పించారు. పంటలకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భూపట్టాల పంపిణీ, చుక్కల భూముల సమస్యల పరిష్కారం, పరిశ్రమల స్థాపన, నాన్ఫిషన్మెన్ ప్యాకేజీ తదితర పనులను పూర్తి చేశారు. దశాబ్దాల నాటి సమస్యలకు గడప గడపకు మనప్రభుత్వంలో మంత్రి పరిష్కారం చూపారు. దీంతో సర్వేపల్లిలో మరోసారి కాకాణి విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్నికల ప్రచారంలో టీడీపీ సోమిరెడ్డి మంత్రి కాకాని అదిరిపోయే సెటైర్లు
-
నీకు టికెట్ ఇచ్చినందుకు నేను ఫుల్ హ్యాపీ..
-
సోమిరెడ్డిపై మంత్రి కాకాని సెటైర్లు
-
కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి హైడ్రామా
నెల్లూరు: అదాని కృష్ణపట్నంపోర్టులో ఆదివారం అధికారులు ఎవరూ ఉండరు. పోలీసు సిబ్బంది మొత్తం మేదరమెట్ల సిద్ధం సభ విధులకు వెళ్లారు. ఇదే అదనుగా రాజకీయ మైలేజీ సాధించవచ్చని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తలపెట్టిన కుట్ర భగ్నమైంది. కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ సాకుతో చేసిన హైడ్రామా నవ్వులపాలైంది. కృష్ణపట్నంపోర్టు కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ పేరుతో సోమిరెడ్డి ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకుని పోర్టు వద్దకు ప్రదర్శనగా వచ్చారు. కొంతమందిని ముందుంచి గోపాలపురం వద్దకు చేరుకున్నారు. పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోర్టులో ఉన్నతాధికారులు ఎవ్వరూ లేరని, ముందస్తు సమాచారం లేకుండా, వారి అనుమతి లేకుండా లోపలకు వెళ్లనిచ్చేది లేదని సెక్యూరిటీ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో సోమిరెడ్డి వర్గీయులు రెచ్చిపోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు పోర్టు సెక్యూరిటీపై విరుచుకుపడడంతో తోపులాట జరిగింది. కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సెలవు రోజు ఆందోళన చేయడం ఏమిటంటూ సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తూ వారి హైడ్రామాను భగ్నం చేశారు. దీంతో సోమిరెడ్డి చేసేది లేక పోర్టు సీఈఓ జీజే రావుకు ఫోన్ చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం కంటైనర్ టెర్మినల్ను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే కంటైనర్ టెర్మినల్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ఆదివారం కనుక తనతో పాటు అధికారులు ఎవరూ ఉండరని, పరిశీలనకు మరో మారు రావాలని సీఈఓ బదులు ఇచ్చారు. దీంతో ఎటూ పాలుపోని సోమిరెడ్డి తన కార్యకర్తలతో కొద్ది దూరం నడిచి, మీడియా ఎదుట అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేసి వెనుదిరిగారు. -
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి ఫైర్
-
సోమిరెడ్డి పిచ్చికుక్క కరిచినట్టు మాట్లాడుతున్నారు
-
సోమిరెడ్డికి బిగ్ షాక్?!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు దేశం పార్టీలో సీనియర్లకు వరుస ఝలక్లు తగులుతున్నాయి. ఈ బాటలోనే జిల్లా నడుస్తోంది. నెల్లూరులో టీడీపీ పరిస్థితి కరి మింగిన వెలగపండులా తయారైంది. ఓ వైపు అధిష్టానం అభ్యర్థిత్వాలపై ఎటూ తేల్చలేకపోతుండడం, మరో వైపు పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు వెరసి అంతర్గత విభేదాలను తారాస్థాయికి చేరుస్తున్నాయి. ఫలితంగా క్యాడర్ డోలాయమానంలో కొట్టుమిట్టాడుతోంది. వెంకటగిరిలో ఈనెల 19న చంద్రబాబు నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభ సాక్షిగా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పార్టీకి అవసరాలకు తగ్గట్లుగా పని చేయకపోతే.. దూరంగా ఉండాలంటూ సోమిరెడ్డికి చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే.. స్థానిక ఎమ్మెల్యే (వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత) ఆనం రామనారాయణరెడ్డిని సభకు సోమిరెడ్డి ఆహ్వానించలేదు. దీంతో ఆనం అలకబూనారు. ఈ విషయంపై చంద్రబాబుకు సమాచారం పంపారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆనం రామనారాయణరెడ్డిని చివరి నిమిషంలో సభకు పిలిపించుకున్నారు. సభలో ఆనం ప్రసంగిస్తున్నప్పుడూ ఓ పథకం ప్రకారమే కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు అడ్డుతగిలారు. దీంతో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని బస్సులోకి పిలిపించుకుని చర్చలు జరిపారు. నమ్మి వస్తే అవమానిస్తారా..! నమ్మి పార్టీ లోకి వస్తే తమకు సరైన గుణపాఠం చెప్పారని ఆనం, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ లోకి వస్తే జిల్లాపై పెత్తనంతోపాటు కోరుకున్న సీటు ఇస్తానని మాటిచ్చిన విషయాన్ని ఆనం బాబుకు గుర్తు చేశారట. ఆత్మకూరులో పరిస్థితి బాగాలేదని, వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని ఆనం కోరగా బాబు వారించి ఆత్మకూరు నుంచే పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పి పంపారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బీద రవిచంద్రల తీరుపై బాబుకు ఆనం, కోటంరెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ పెద్దలు చేసుకున్న లోపాయికారీ ఒప్పందాల నుంచి ఇటీవల చేసిన మైనింగ్ అక్రమాల వరకు అన్నింటిపైనా ఆధారాలతో సహా బాబుకు వివరించారని తెలిసింది. నెల్లూరు రూరల్ను జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆ సీటు తనకే ప్రకటించాలని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరగా, అలాగే.. అంటూ చంద్రబాబు మాట దాటేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం సోమిరెడ్డి, బీద రవిచంద్రలను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు చివాట్లు పెట్టారని తెలుస్తోంది. చిన్నబుచ్చుకున్న సోమిరెడ్డి! కడప జిల్లాలో జరిగే సభకు చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సోమిరెడ్డి హెలిప్యాడ్ వద్దకు చేరుకోగా బాబు వారించి ‘నీ అవసరం లేదులే’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో సోమిరెడ్డి చిన్నబుచ్చుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
కదలి..రావట్లేదు
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బహిర్గతమవుతున్నాయి. నియోజకవర్గ బాధ్యులకు అధినేత చంద్రబాబు పర్యటన శిరోభారంగా మారింది. ఈనెల 19న రా...కదలిరా కార్యక్రమం కమలాపురంలో నిర్వహించ తలపెట్టారు. ఏర్పాట్ల కోసం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, పొలిట్బ్యూరో సభ్యుడితో సహా నలుగురు ఇన్చార్జిలు డుమ్మా కొట్టారు. పొరుగు జిల్లాలకు చెందిన సమన్వయ నేతల ఎదుట కమలాపురం ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ఇక్కడ రద్దు చేసి కడపలో పెట్టుకోండంటూ నేతల మధ్య ఉన్న అనైక్యతను బాహాటపర్చారు. ► కమలాపురం టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రా...కదలిరా కార్యక్రమం కడప పార్లమెంట్ పరిధిలో ఏర్పాట్ల బాధ్యతను మాజీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డికి అప్పగించారు. సమన్వయకర్తలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (నెల్లూరు), ఏరాసు ప్రతాపరెడ్డి (కర్నూల్) ఉన్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం కోసం చర్చించేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్చార్జిలు హాజరు కావాలని ముందస్తుగా సమాచారం ఉంది. మైదుకూరు, కమలాపురం, బద్వేల్ ఇన్చార్జిలు పుట్టా సుధాకర్, పుత్తా నరసింహారెడ్డి, రితేష్రెడ్డి హాజరయ్యారు. కాగా, నలుగురు గైర్హాజర్ కావడం విశేషం. చంద్రబాబు పర్యటన అంటేనే నేతలకు శిరోభారంగా మారింది. జిల్లాలో ప్రజలను సమీకరించడం టీడీపీ నేతలకు బహుకష్టంగా మారింది. దీంతో బాధ్యతలు భుజస్కందాలపై వేసుకునేందుకు ఆయా నేతలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జ్వరం సాకు చూపెట్టిన నేతలు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితోపాటు ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, పులివెందుల ఇన్చార్జిలు వరుసగా ప్రవీణ్కుమార్రెడ్డి, మాధవీరెడ్డి, భూపేష్రెడ్డి, బీటెక్ రవిలు హాజరు కాలేదు. అనంతపురం, కర్నూలు, నెల్లూరు నుంచి సమన్వయకర్తలుగా ఉన్న నేతలు హాజరైనా జిల్లాకు చెందిన వారు గైర్హాజరయ్యారు. ఫోన్లో వాకబు చేస్తే జ్వరం కారణంగా హాజరు కాలేదన్న సమాధానం ఆయా నేతల నుంచి వచ్చినట్లు సమాచారం. అందరికీ ఒక్కసారిగా జ్వరం వస్తుందా...కావాలనే హాజరు కాలేదని, ప్రోగ్రామ్ విఫలం చేయాలని ఉన్నారని కమలాపురం ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి ఆయా నేతలపై ఆరోపణలకు దిగినట్లు తెలుస్తోంది. ఒకదశలో చంద్రబాబు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రమైన కడపలో పెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆయా ఇన్చార్జిలతో పర్సనల్గా మాట్లాడుతామని పుత్తాను శాంతింపజేస్తూనే, చంద్రబాబు కార్యక్రమం విజయవంతం చేసేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, దేవగుడి శివనాథరెడ్డి, మైనార్టీ నేతలు అమీర్బాబు, ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి ఆనం షాక్.. అయోమయ స్థితిలో కోటంరెడ్డి
వైఎస్సార్సీపీ కంచుకోటగా పేరొందిన నెల్లూరు జిల్లాలో పాగా వేయడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆది నుంచి బెడిసి కొడుతున్నాయి. పార్టీ సీనియర్లకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని, కొత్త వారికి ఇద్దామంటే అభ్యర్థులు దొరకడం లేదని అధిష్టానం తలలు పట్టుకుంటోంది. నెల్లూరు ఎంపీతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల నియామకం ఒక సమస్య అయితే జనసేనతో పొత్తు పచ్చనేతల్లో వర్గపోరుకు దారితీస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ నుంచి అసెంబ్లీ స్థానం వరకు ఎవరూ బరిలో దిగేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంట్ స్థానానికి కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషణ చేస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి చెందారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండడంతో నెల్లూరు పార్లమెంట్ సీటుకు టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదనేది భయంతో పలాయనం చిత్తగిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో పలు నియోజకవర్గాల నుంచి కొత్త ముఖాలను బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీ నేతలు నెల్లూరు సిటీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్యాకేజీ ఇచ్చి రూరల్ నియోజకవర్గం వైపు మళ్లించే ప్రయత్నాలు చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో నెల్లూరు రూరల్ తనకే అని అనుకుంటున్న వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. టికెట్ ఇస్తే టీడీపీ తరఫున... లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని శ్రీధర్రెడ్డి నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ► సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ వరుసగా ఐదుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి కొత్త వ్యక్తిని నిలబెట్టాలని టీడీపీ భావిస్తోంది. అందుకే ఇప్పటి వరకు సోమిరెడ్డి అభ్యర్థిత్వంపై స్పష్టత లేదని సమాచారం. ► కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ దఫా ఆయన కుమారుడు దినేష్రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీకి ఉన్న బలంతో పాటు పోలంరెడ్డిపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇక్కడ కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ► కావలిలో ఇప్పటికే నలుగురు నేతలు టికెట్ అడుగుతున్నప్పటికీ వీరందరూ మండలస్థాయి నాయకులే. కొత్తగా మైనింగ్ మాఫియా డాన్ డి.వెంకటకృష్ణారెడ్డికి సీటు ఇవ్వాలనుకున్నా ఓటమి తప్పదని సర్వేల్లో తేలింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తేలకుండా ఉంది. ► ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని, ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ టికెట్ మాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పనిలో పనిగా వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నాడు. ఇక బీసీ మార్కుతో చెంచలబాబు యాదవ్ సీటు ఆశిస్తున్నాడు. మరి చంద్రబాబు బ్యాగ్ బరువున్న వ్యక్తుల వైపే చూస్తాడా? సామాజిక న్యాయం వైపు చూస్తాడా అనేది తేలాల్సి ఉంది. ► ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని దింపాలని యోచిస్తున్న టీడీపీకి ఆయన బిగ్షాక్ ఇచ్చినట్లు తెలిసింది. ఆత్మకూరు నుంచి పోటీలో ఉండబోనని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవల వరుసగా రెండు దఫాలు ఆయన సొంతంగా సర్వే నిర్వహిస్తే ప్రజాదరణ తక్కువగా ఉన్నట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆనం సైతం ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. ► కందుకూరు నుంచి ఇంటూరి బ్రదర్స్ మధ్య పోటీ ఉంది. ఇందులో ఇంటూరు నాగేశ్వరరావుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే వైఎస్సార్సీపీ బలంగా ఉన్న కందుకూరులో టీడీపీ ఓటమి తప్పదని, దీంతో కొత్త వారికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురు పెట్టుబడికి సిద్ధంగా అధిష్టానం మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉండడంతో ఆ పార్టీ అధినేత తల పట్టుకున్నట్లు సమాచారం. సీట్ల కోసం డబ్బు మూటలతో వస్తారని ఆశించిన చంద్రబాబుకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు కావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అయితే సర్వేపల్లి, కోవూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నప్పటికీ కనీసం అధికార పార్టీకి ఏ మాత్రం పోటీ ఇచ్చే స్థాయి నేతలు కాకపోవడంతో వీరి స్థానంలో కొత్త వారిని రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత యోచన. ఇందుకు బడాబాబులను ఆహ్వానిస్తున్నప్పటికీ పోటీకి వారు కూడా సిద్ధంగా లేకపోవడంతో కొంచెం పెట్టుబడి మీరు పెట్టండి.. మిగతాది పార్టీ చూసుకుంటుందని హామీ ఇస్తున్నారంట. కొత్త వారు దొరక్కపోతే కోవూరు, కందుకూరు, ఉదయగిరిలో పాత వారికే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. సర్వేపల్లి, కావలి, ఆత్మకూరులో కచ్చితంగా కొత్త అభ్యర్థులు వస్తారని తెలుస్తోంది. -
AP: నెల్లూరులో టీడీపీకి షాక్.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు
సాక్షి,నెల్లూరు: మరి కొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ముత్తుకూరు మండల కేంద్రంలో 200 మంది యువకులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. యువకులందరికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ రెండు నెలల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కనుమరుగై పోతాడని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు శుభం కార్డ్ అయితే సోమిరెడ్డికి ఎండ్ కార్డు పడుతుందని కాకాణి అన్నారు. ఇదీచదవండి.. ఓం ప్రథమం.. ఎదురైంది దుశ్శకునం -
టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి వార్నింగ్
-
మహిళా ఉద్యోగినిపై నోరుపారేసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి
-
సోమిరెడ్డిని హీరోగా RGV సినిమా తీస్తే సూపర్ హిట్టు .. మంత్రి కాకాణి సెటైర్లు
-
Fact Check: నిబంధనలు పాటించినా ఏడుపే!?
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టుల కేటాయింపు, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కాంట్రాక్టు నిర్ధారణతో సహా అన్ని విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అత్యంత పారదర్శకతో వ్యవహరించాయి. అన్ని అంశాల్లో అత్యంత పకడ్బందీగా నిబంధలను పాటించినప్పటికీ ఈనాడుతో సహా కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వం, ఇంధన సంస్థలపై పదేపదే అసత్య ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించినట్లు శుక్రవారం వార్తలు ప్రచురించాయి. అయితే, సోమిరెడ్డి మాటల్లో నిజంలేదని, ఈనాడు, ఇతర పచ్చపత్రికల్లో రాతలన్నీ పచ్చి అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పద్మజనార్ధనరెడ్డి స్పష్టంచేశారు. ఆరోపణ : ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల పేరుతో జగన్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది.. వాస్తవం : కేంద్ర ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్, ఏపీ ప్ర భుత్వ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. దేశంలో అర్హత గల ప్రతి గుత్తేదారు (కాంట్రాక్టరు) పాల్గొనే అవకాశం కల్పించారు. రివర్స్ టెండరింగ్ జరిపిన తర్వాతే ఏపీఎస్పీడీసీఎల్ పరికరాలను కొనుగోలు చేస్తోంది. అన్ని నిబంధనలు పరిశీలించిన తరువాత, ఈ ప్రక్రియలో పాల్గొన్న అందరిలో ఎల్–1గా ఉన్న గుత్తేదారుని ఎంపిక జరుగుతుంది. నామినేషన్ పద్ధతిలో ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేయడమనేది అసలు వీలుపడదు. ఆరోపణ : ఎలాంటి అనుభవంలేని సంస్థకు ప్రభుత్వం వేల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టింది.. వాస్తవం : షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనేది చిన్న సంస్థ ఏమీకాదు. ఈ సంస్థకు 25 ఏళ్లుగా విద్యుత్ ట్రా న్స్ఫార్మర్ల తయారీలో అనుభవం ఉంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లే బొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపుతో ఆసియాలోనే అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు వచ్చిన విషయం బహుశా సోమిరెడ్డికి తెలియదేమో. ఆరోపణ : ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 611.40 కోట్ల విలువైన పనులకుగానూ రూ.380 కోట్ల విలువైన పనులకు షిరిడీ సాయికే కట్టబెట్టింది.. వాస్తవం : తక్కువ ధరకు కోట్చేసిన సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ కెపాసిటీల కు సంబంధించి 53,003 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లను షిరిడిసాయి సంస్థ దక్కించుకుంది. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 35,911 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లనూ పొందింది. గత ప్రభుత్వంలోనే హెచ్వీడీఎస్, వివిధ సబ్–స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించి రూ.2,799.38 కోట్ల విలువైన పనులను షిరిడిసాయి సంస్థ కైవసం చేసుకుంది. నిజంగా ఇది సీఎం జగన్మోహన్రెడ్డికి కావాల్సిన వారి సంస్థ అయితే గత ప్రభుత్వ హయాంలో ఎందుకు టెండర్లు కట్టబెట్టారు? ఆరోపణ : రామాయపట్నం పోర్టు దగ్గర రూ.42 వేల కోట్ల ప్రాజెక్టు షిరిడీ సాయికి ఇచ్చింది.. వాస్తవం : రామాయపట్నం పోర్టు దగ్గర సోలార్ ప్యానల్ తయారీ పార్కు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు. దీని కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంలేదు. దీనిబట్టే ఈ కంపెనీ అన్ని అర్హతలున్న పెద్ద సంస్థ అని, దిగ్గజ సంస్థలను కాదని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు దక్కించుకుందని అర్థమవుతోంది. రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులన్నీ పూర్తి చట్టబద్ధంగా జరిగాయి. ఆరోపణ : పక్కపక్క రాష్ట్రాలు కొన్న ట్రాన్స్ఫార్మర్ల ధరల్లో వ్యత్యాసం ఉందంటే దోపిడీ జరిగినట్లే కదా.. వాస్తవం : ట్రాన్స్ఫార్మర్ ధర దానిలో ఉపయోగించే వైండింగ్ వైర్ డయామీటర్, కాయిల్స్ డయామీటర్, ఇన్సులేషన్, క్లియరెన్స్, ట్యాంక్ డైమెన్షన్, ట్రాన్స్ఫార్మర్, ఆయిల్ క్వాంటిటీ, కోర్ సైజు వంటి నాణ్యతలను బట్టి ఉంటుంది. టెండర్లు వేసిన సమయంలో కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధంవల్ల ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే పరికరాల ధరలు అధికంగా ఉండేవి. ఏపీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేసిన నియంత్రికల్లో నష్టాలు ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్) కన్నా చాలా తక్కువ. వివిధ కంపెనీల ట్రాన్స్ఫార్మర్లను బెంగుళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఎస్ఐ) టెస్ట్చేసి షిరిడిసాయి, తోషిబా నియంత్రికల్లో నష్టాలు ఐఎస్ ప్రకారం వున్నాయని ధృవీకరించడం విశేషం. ఇతర కంపెనీల ఉత్పత్తిదారుల ట్రాన్స్ఫార్మర్లు ఈ టెస్టులో ఫెయిలయ్యాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నిర్ధేశించిన విధంగా మన డిస్కంలు ప్రస్తుతం ఫైవ్స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు బాగా తగ్గాయి. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా సమస్యలు తగ్గుముఖం పట్టాయి. కానీ, సోమిరెడ్డి మాత్రం టూ–స్టార్తో ఫైవ్స్టార్ ధరను సరిపోల్చారు. తెలంగాణ డిస్కంలు టూ స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశాయి. ఆరోపణ : కడప కంపెనీదే హవా.. వాస్తవం : ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు టెండరు పొందింది షిరిడిసాయి సంస్థ ఒక్కటే కాదు.. దీనితోపాటు హైపవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, కన్యకాపరమేశ్వరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (మెదక్ జిల్లా), బీఎస్సార్ పవర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (తెనాలి), సాయిబాబా ఫ్లేమ్ ఫ్రూఫ్ స్విచ్గేర్, ట్రాన్స్కాన్ ఇండస్ట్రీస్, తోషిబా ట్రాన్స్విుషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రినిటీ క్లీన్టెక్(హైదరాబాద్), ఎస్వీఆర్ ఎలక్ట్రికల్స్, విజయ్ ట్రాన్స్ఫార్మర్స్ (గుంటూరు) సంస్థలు కూడా కాంట్రాక్టు పొందిన వాటిలో ఉన్నాయి. ఆరోపణ : వ్యవసాయ మీటర్లకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు అమర్చుతామని చెబుతున్న ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేస్తోంది.. వాస్తవం : దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర ఇంధన శాఖ నిబంధనల మేరకే స్మార్ట్మీటర్ల ఏర్పాటుకు టెండరు నిబంధనావళి తయారైంది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్మీటర్లు ఉచితమే. ఇక ఏపీఈఆర్సీ నిర్ణయించిన దాని ప్రకారమే ట్రూఅప్ వంటి విద్యుత్ చార్జీలు ఉంటాయి. -
టీడీపీ హయాంలోనే అక్రమ తవ్వకాలు
రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఓవైపు అసత్య ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ‘ఈనాడు’ తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విషం చిమ్ముతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించగా.. రోడ్ల అభివృద్ధిపై ‘ఈనాడు’ తప్పుడు కథనం ప్రచురించింది. వాస్తవాలను పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డే గ్రావెల్ మాఫియాను ప్రోత్సహించారని వెల్లండైంది. అలాగే గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ‘ఈనాడు’ తప్పుడు కథనం ప్రచురించిందని స్పష్టమైంది. నెల్లూరు: గత టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అండతో వెంకటాచలం మండలంలో గ్రావెల్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోయింది. గ్రామాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. టీడీపీ నాయకులు తవ్వి న గ్రావెల్ గుంతలు వేసవిలో చిన్నారులను బలి తీసుకుంటున్నాయి. తాను చేసిన పాపాలను సోమిరెడ్డి ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ప్రజల ముందు నవ్వులపాలయ్యాడు. ఇలాంటి ఘటన తాజాగా వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామంలో వెలుగుచూసింది. అడ్డూఅదుపూ లేకుండా.. గత ప్రభుత్వంలో వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్, కనుపూరు చెరువులతోపాటు గ్రామాల్లోని అన్ని చెరువుల్లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. దీనిపై అప్పట్లో రైతులు, గ్రామస్తులు పలు దఫాలు ఆందోళనలు చేసినా సోమిరెడ్డి అండతో గ్రావెల్ అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా నిర్వి రామంగా సాగింది. వర్షాకాలంలో చెరువుల్లో నిండుగా నీరు చేరడంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను సైతం వదలకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. టీడీపీ నాయకుల ధనదాహం కారణంగా గ్రామానికి అనుకుని ఉన్న చెరువులు, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాల్లో 10 నుంచి 20 అడుగుల లోతుకు పైగా టీడీపీ నాయకులు తవ్విన గ్రావెల్ గుంతలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. సోమిరెడ్డి ధనదాహానికి విద్యార్థుల బలి 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన సోమిరెడ్డి దొడ్డిదారిన మంత్రి పదవి దక్కించుకుని అవినీతి, అక్రమ సంపాదనపై దృష్టి సారించారు. అందులో భాగంగానే వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రిజర్వాయర్, కసుమూరు, ఈదగాలి, తిక్కవరప్పాడు, కంటేపల్లి, కనుపూరు రిజర్వాయర్, సర్వేపల్లి గ్రామాల నుంచి రేయింబవళ్లు అక్రమంగా గ్రావెల్ తరలించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. సోమిరెడ్డి తవ్వించిన భారీ గ్రావెల్ గుంతలు గత నెలలో అనికేపల్లిలో ఒక విద్యార్థిని, మూడు రోజుల క్రితం గొలగమూడిలో మరొక విద్యార్థిని బలి తీసుకున్నాయి. అనికేపల్లి గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి తురకా వెంకయ్య తోటి విద్యార్థులతో కలిసి గ్రామానికి అనుకుని ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ వద్దకు ఈతకు వెళ్లి గ్రావెల్ గుంతలో పడి మృతిచెందాడు. ఇది సోమిరెడ్డి హయాంలో తవ్విన గ్రావెల్ గుంతే. కానీ ఈ మరకను సోమిరెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టే కుట్ర చేసి విఫలమయ్యాడు. గొలగమూడిలో టీడీపీ నాయకులు చాకలి చెరువులో తవ్విన గ్రావెల్ గుంతలో పడి మూడు రోజుల క్రితం 2వ తరగతి విద్యార్థి హిమాయితుల్లా మృతిచెందడంతో తన పాపాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ఆ గ్రామానికి వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులు తవ్విన గోతులని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు కొందరు అవి ఇప్పుడు తవ్విన గుంతలు కాదని, 2016–17లో తవ్వి న గుంతలని చెప్పడంతో అందరి ముందు నవ్వులపాలయ్యాడు. ఒకే పంచాయతీలోని అనికేపల్లి, గొలగమూడి గ్రామాల్లో సోమిరెడ్డి ధనదాహానికి ఇద్దరు చిన్నారులు బలయ్యారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డే కారణం గొలగమూడి, అనికేపల్లి గ్రామాల్లో ఇద్దరు చిన్నారులు గ్రావెల్ గుంతల్లో పడి చనిపోవడానికి సోమిరెడ్డే కారణం. టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి అండతో గ్రావెల్ తవ్వకాలు అడ్డూఅదుపూ లేకుండా సాగాయి. అప్పట్లో తవ్విన గ్రావెల్ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన విషయం వాస్తవం. కానీ సోమిరెడ్డి దిగజారి ఆ పాపాన్ని వైఎస్సార్సీపీపై వేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. – ఉడతా శ్రీనివాసులు, గొలగమూడి గత టీడీపీ ప్రభుత్వంలో గొలగమూడి గ్రామంలో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. సోమిరెడ్డి అండతో నాగులవరం, గొలగమూడి గ్రామాల చుట్టూ గ్రావెల్ అక్రమంగా తరలించడంతో ఎక్కడ చూసినా భారీ గుంతలు ఏర్పడ్డాయి. సోమిరెడ్డి హయాంలో తవ్విన చాకలి చెరువు గుంతలో పడి హిమాయితుల్లా మృతిచెందితే దానిని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడం సరికాదు. – అన్నపరెడ్డి శీనయ్య, గొలగమూడి -
సోమిరెడ్డి, టీడీపీ పై మంత్రి కాకాని సెటైర్లు మామూలుగా లేవు..
-
సోమిరెడ్డి.. ఇలా అయిపోయావేంటి?.. అభిమానులను అద్దెకు తీసుకొచ్చి..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులపై పార్టీ బలం పెంచాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు బలవంతంగా ఆ పార్టీ కండువాలు వేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉన్న క్రమంలో ఆ పార్టీ కార్యక్రమాలకు నలుగురిని పిలిచినా వచ్చే పరిస్థితి లేదు. అంతకంటే ముందు ఆ నియోజకవర్గ ఇన్చార్జి సోమిరెడ్డి గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ఇప్పటికే ఆ పార్టీ నేత చినబాబు ‘వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వాళ్లకు ఈ దఫా టికెట్ లేదని’ ప్రకటించడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ రావడంపై అనుమానాలు ఉండగా సరికొత్త డ్రామాకు తెర తీశాడు. ఇప్పటికే మండలస్థాయిలోని ద్వితీయ శ్రేణి నాయకులపై రోజు పక్క పార్టీల నుంచి జనం టీడీపీలో చేరుతున్నట్లు చేయాలని ఒత్తిడి పెంచారు. వెంకటాచలంలో మండలం టీడీపీ నాయకుల మధ్య అంతర్గతపోరు కొనసాగుతోంది. ఆ పార్టీ నాయకులు సోమిరెడ్డి వద్ద మెప్పు పొందేందుకు బయట నియోజకవర్గాల నుంచి అభిమానులను అద్దెకు తీసుకువచ్చి వెంకటాచలం మండలానికి సంబంధించిన వ్యక్తులుగా పరిచయం చేసి కండువాలు కప్పి టీడీపీలో చేరినట్లు చెప్పుకుంటున్నారు. గత ఏప్రిల్లో వెంకటాచలం వడ్డిపాళేనికి చెందిన రాజేంద్ర ఆధ్వర్యంలో వెంకటాచలంలో కార్యక్రమం నిర్వహించి నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు వందల మంది టీడీపీలో చేరినట్లుగా సోమిరెడ్డి ప్రకటించి నవ్వుల పాలయ్యారు. తాజాగా వెంకటాచలం మండలం కాకుటూరులో కొందరికి బలవంతంగా పార్టీ కండువాలు కప్పి వారంతా టీడీపీలో చేరినట్లు ప్రకటించుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. వెంటనే వారంతా వైఎస్సార్సీపీ నేత వెంకటశేషయ్య వద్దకు వెళ్లి తాము వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని, సోమిరెడ్డి బలవంతంగా కండువాలు వేశాడని తెలిపారు. ఇలా మరోసారి సోమిరెడ్డి నవ్వుల పాలయ్యాడు. -
టీడీపీ నేత దౌర్జన్యం.. ఛానల్ రిపోర్టర్పై దాడి!
సాక్షి, నెల్లూరు: వెంకటాచలంలో టీడీపీ నేత రాజేంద్ర దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలు కడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. వివరాల ప్రకారం.. వడ్డిపాలెంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్త రాజేంద్ర అనే వ్యక్తి వారికి అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం, ఇది కవర్ చేయడానికి వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్ వెళ్లడంతో అతడిపై రాజేంద్ర కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో రాజేంద్రను వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, రాజేంద్ర దొరక్కపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, టీడీపీ నేత సోమిరెడ్డి ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
టీడీపీపై ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం !
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'జబర్దస్త్' కమెడియన్కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
తెలంగాణాలో మరో 3 రోజులు వర్షాలు
పదేళ్లలో ఫస్ట్టైమ్! టీసీఎస్ను మించిన మరో టాటా కంపెనీ..
చిరుత కదలికలపై టీటీడీ స్పెషల్ ఫోకస్
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్
HYD: జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్లో రాశీఖన్నా సందడి (ఫొటోలు)
సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement