-
రెచ్చిపోతున్న పచ్చమూక పల్నాడులో ఆగని విధ్వంసం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడు జిల్లాలో టీడీపీ మూకల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ మూకలు బుధవారం దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ దాడుల నుంచి తప్పించుకొని గ్రామాలు వదిలివెళ్లిపోయిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా ఇళ్లకు పూర్తిగా చేరుకోలేదు. తెలిసిన వారి ఇళ్లల్లో దూరప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కుటుంబంలోని మహిళలు, పిల్లల బాగోగుల గురించి వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే గ్రామాలకు తిరిగిరావాలని చూస్తున్నారు. మరోవైపు మాచర్ల, గురజాల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీడీపీ మూక స్వైరవిహారం.. మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా గ్రామాలకు చేరలేదు. పోలీస్ పికెటింగ్ ఉన్నా మళ్లీ టీడీపీ మూకలు దాడులు చేస్తాయనే అభద్రతాభావంతో గ్రామానికి దూరంగా ఉంటున్నారు. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో టీడీపీ మూకలు విధ్వంసకాండ కొనసాగిస్తుండటంతో పోలీసులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ విధించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో దుకాణాలను మూసివేయించారు. చివరకు కొన్నిచోట్ల మెడికల్, కూరగాయలు, పాల దుకాణాలు, టీస్టాల్స్ను కూడా తెరవలేదు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి మించి గుమిగూడకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ టీడీపీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటు వేయని వారిపై దాడులు కొనసాగిస్తున్నారు. గ్రామానికి తిరిగిరాగానే పచ్చ మూకల దాడి.. గురజాల నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. పల్లెల్లో టీడీపీ ఫ్యాక్షన్ చిచ్చురేపుతోంది. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలింగ్ రోజునే ఆదిరెడ్డితో టీడీపీ నాయకులు వాగి్వవాదానికి దిగారు. పోలింగ్ ముగిశాక గ్రామంలో పరిస్థితి బాగోలేకపోవటంతో రెండు రోజులపాటు వేరే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటిలో ఆయన తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం మాదినపాడు చేరుకున్న వెంటనే 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కర్రలు, ఇనుపరాడ్లతో ఆదిరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని ఆదిరెడ్డిని పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆదిరెడ్డి తలలో నరాలు తెగి రక్తప్రసరణ నిలిచిపోయిందని.. రెండు మేజర్ సర్జరీలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం.. నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షుడు కోవెలమూడి సాంబశివరావుపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. పోలింగ్ రోజు పన్నెండో బూత్లో ఎస్సీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో బారులు తీరి రాత్రి 7 గంటల వరకు ఓట్లేశారు. వీరికి సాంబశివరావు అండగా ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు ఆయనపై దాడికి దిగారు. మరికొంతమందిపై కూడా దాడి చేసేందుకు కారులో వెంటపడ్డారు. అలాగే పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణç³ల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెంకయ్య, విజయేంద్రబాబుల ఇళ్లపై దాడి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గురజాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్.. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారిని ఇంటికే పరిమితం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను హౌస్ అరెస్ట్లో ఉంచారు. మరోవైపు అల్లర్లకు కారణమైన టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జిల్లావ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా నేరస్వభావం ఉన్న వారిని బైండోవర్ చేశారు. దీంతో వందలాది మంది గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు మకాం మార్చారు. -
బడుగులపై బరితెగింపు
అయ్యన్న గ్యాంగ్ అరాచకంఎన్నికల్లో చురుగ్గా పని చేసిందనే క్షక్షతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో ఓ ఒంటరి మహిళ పట్ల అయ్యన్నపాత్రుడి అనుచరులు దుశ్శాసనుల్లా వ్యవహరించారు. మంగళవారం అర్థరాత్రి బాధితురాలి ఇంట్లోకి చొరబడి జుత్తు పట్టుకొని ఈడ్చుకొచ్చి కాళ్లతో తన్నుతూ.. తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దుశ్చర్యను అడ్డుకోడానికి ప్రయత్నించిన స్థానికులపై పచ్చముఠాలు విరుచుకుపడ్డాయి. బాధితురాలు పొలమూరి రాజకుమారి 13 ఏళ్ల తన కుమారుడితో కలసి జీవిస్తోంది. కొన్నాళ్లు వలంటీరుగా పని చేసింది. పోలింగ్ రోజు ఓటర్లకు స్లిప్లు రాసిచ్చి వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేయడం అయ్యన్న పాత్రుడి అనుచరులకు మింగుడు పడలేదు. పోలింగ్ మర్నాడు బాధితురాలు అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో టీడీపీకి చెందిన రెడ్డి రాజేష్, రెడ్డి సత్యసాయి, కామిరెడ్డి శివ, సుకల రాజేష్, పెట్ట గంగాధర్, అల్లు రాజు, వానపల్లి రాజేష్, సొర్ల రఘు, నందిపల్లి బోయిల నాయుడు ఆమె ఇంటిని చుట్టుముట్టి తలుపులు బాదటంతో బయటకు వచ్చింది.రౌడీ మూకలు ఆమె మొబైల్ను లాక్కుని భౌతిక దాడికి పాల్పడ్డాయి. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. దీన్ని ప్రతిఘటించిన వృద్ధురాలు సీతమ్మ చెంపపై కొట్టి చెవి దుద్దులు లాక్కున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడి అనుచరురాలు, జెడ్పీటీసీ సుకల రమణమ్మ తన అనుచరులను దాడికి పురిగొల్పినట్లు బాధితురాలు పేర్కొంది.సాక్షి, అమరావతి/విశాఖ సిటీ/ఉంగుటూరు, నెట్వర్క్: ‘ఈసీ’ ఉదాసీనతతో పేట్రేగుతున్న పచ్చ ముఠాలు రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై పాశవికంగా దాడులకు తెగబడుతున్నాయి. గ్రామాల్లో హింసను ప్రేరేపిస్తూ దమనకాండకు తెర తీశాయి. అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి అనుచరులు ఒంటరి మహిళపై కీచక పర్వానికి తెగబడగా కృష్ణా జిల్లా ఉంగుటూరులో ఫ్యాన్కు ఓటేసిందనే కక్షతో ఓ మహిళను ట్రాక్టర్తో తొక్కించి హత్యాయత్నానికి తెగబడ్డాయి. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా పని చేయడమే ఈ అక్కచెల్లెమ్మలు చేసిన నేరం! తాజాగా పల్నాడులోనూ టీడీపీ మూకల దాష్టీకాలకు బడుగు, బలహీన వర్గాలు ఓ రాత్రంతా దేవాలయంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఓట్ల లెక్కింపు వరకు విధ్వంసకాండ కొనసాగించే ప్రణాళికను టీడీపీ మూకలు అమలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు చేపట్టే జూన్ 4వరకు రాష్ట్రం రావణకాష్టంగా రగులుతూ ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనికనుగుణంగానే టీడీపీ గూండాలు, రౌడీ మూకలు స్వైర విహారం చేస్తుండటంతో ఏపీలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల కమిషన్ ఈ దాడుల పట్ల నిర్లిప్తంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. సమస్యాత్మక జిల్లాల్లో బదిలీలపై వచ్చిన పోలీసు అధికారులు పచ్చమూకల దౌర్జన్యకాండకు కొమ్ము కాస్తున్నారు.బెదిరించి.. భయపెట్టిప్రజాబలంతో టీడీపీ నెగ్గలేదని స్పష్టం కావడంతో పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, మహిళలను బెదిరిస్తూ దాడులతో హడలెత్తించే కుట్రలను చంద్రబాబు అమలు చేశారు. పోలింగ్ రోజు మొదలైన ఈ విధ్వంస కాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు పథకాలను రచిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తూ గ్రామాల్లో లేకుండా చేయాలని, జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల వద్దకు సైతం రాకుండా భయోత్పాతం సృష్టించాలని చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు.పల్నాడులో చల్లారని ఉద్రిక్తతలుఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడులో ఉద్రిక్తతలు చల్లబడలేదు. టీడీపీ మూక దాడులతో ఎస్టీ, బీసీ వర్గాలు గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్నాయి. పోలింగ్ రోజు రాత్రి అరాచక ముఠాల దాడులతో మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంతవరకు స్వగ్రామాలకు చేరుకోలేదు. పల్నాడులో 144 సెక్షన్తో దుకాణాలు మూతబడ్డాయి. మాచర్ల, గురజాల, నరసరావుపేట ఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్లో ఉన్నారు. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేయడంతో గాయపడ్డాడు. తాడిపత్రిలో పట్టణాన్ని వీడి వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసంలో చొరబడ్డ పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. కంప్యూటర్లను పగులగొట్టారు.ఫ్యాన్కు ఓటేసిందని.. మహిళను ట్రాక్టర్తో తొక్కించబోయాడు!వైఎస్సార్సీపీకి ఓటు వేసిందని కక్షగట్టి ఓ మహిళను టీడీపీ నాయకుడు ట్రాక్టర్తో తొక్కించబోగా తృటిలో తప్పించుకుంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణి వైఎస్సార్ సీపీకి ఓటు వేసిందని టీడీపీ నాయకుడు ఏడుకొండలు కక్ష పెంచుకున్నాడు. బుధవారం ఉద్దేశపూర్వకంగా ఆమెతో ఘర్షణ పడి తన ట్రాక్టర్తో ఢీకొట్టాడు. పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గన్నవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీమోహన్ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దన్ను... ఈసీ ఉదాసీనత టీడీపీ మూకలు బరితెగించి దాడులు, విద్వంసానికి పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో డీఐజీ నుంచి ఎస్సై వరకూ పోలీసు అధికారులను పోలింగ్కు ముందు ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారి స్థానంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఏమాత్రం అవగాహనలేని అధికారులను నియమించింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను కూడా ఈసీ బదిలీ చేసింది. చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి అందచేసిన జాబితాలో సూచించిన వారినే నియమించింది. అదే దన్నుగా టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారు. ఈసీ టీడీపీకి అనుకూలంగా ఉందనే సంకేతాలు వెలువడటంతో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ఈసీ ఈ దాడుల పట్ల బుధవారం వరకూ స్పందించలేదు. ఎస్పీలు, డీఐజీలకు ఆదేశాలు ఇవ్వలేదు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లతో చర్చించలేదు. ఈసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గట్టిగా నిలదీయడంతో ఇక తప్పదన్నట్లుగా సమీక్షకు ఉపక్రమించింది. -
వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
మైదుకూరు: పోలింగ్ రోజు ఏజెంట్గా కూర్చున్నాడనే అక్కసుతో వైఎస్సార్ జిల్లా మైదుకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డిపై బుధవారం సాయంత్రం టీడీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. బాధితుడి కథనం ప్రకారం... చాపాడు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి సమగ్ర శిక్ష అభియాన్లో ఏఈగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన మైదుకూరులోని బద్వేలు రోడ్డులో నివాసముంటున్నారు. ఈ ఎన్నికల్లో స్వగ్రామం విశ్వనాథపురంలో పోలింగ్ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరపున ఏజెంట్గా కూర్చున్నారు.అంతకుముందు రోజు టీడీపీ వర్గీయులు ఏజెంట్గా కూర్చోవద్దని బెదిరించారు. వారి బెదిరింపులకు తలొగ్గక ఆయన వైఎస్సార్సీపీ ఏజెంట్గా కూర్చున్నారు. ఆ కడుపుమంటతో టీడీపీ వర్గీయులు చంద్ర ఓబుళరెడ్డి ప్రొద్దుటూరు రోడ్డులోని బైపాస్ వద్దకు రోజూ వాకింగ్కు వస్తుంటారని తెలుసుకుని.. బుధవారం సాయంత్రం అదే రోడ్డులోని ఏవీఆర్ స్కూల్ వద్ద కాపు కాశారు. వాకింగ్ ముగించుకుని వస్తున్న చంద్ర ఓబుళరెడ్డిపై విశ్వనాథపురం గ్రామానికి చెందిన కార్తీక్ రెడ్డి, ఇల్లూరు సుబ్బారెడ్డి, బొచ్చు సుబ్బారెడ్డి, మరో ముగ్గురు దాడి చేసి బీర్ బాటిళ్లతో తలపై కొట్టారు.‘చెప్పినా వినకుండా ఏజెంట్గా కూర్చుంటావా...ఇప్పుడే నిన్ను చంపుతాం..’ అంటూ కేకలు వేశారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన చంద్ర ఓబుళరెడ్డి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అయినా విడిచి పెట్టకుండా నిందితుల్లో కొందరు బండరాయిని ఎత్తి తలపై మోదేందుకు ప్రయత్నించారు. సమీపంలో ఉన్న కొందరు మహిళలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అతన్ని వదిలేసి తమ వెంట తెచ్చుకున్న బైకులపై పరారయ్యారు. తలపై తీవ్ర గాయాలైన చంద్ర ఓబుళరెడ్డిని మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు.సంఘటన గురించి తెలియగానే ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్కు ముందు రోజే టీడీపీ వారు బెదిరించారని బాధితుని భార్య, కుమారుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు. పథకం ప్రకారమే దాడి చేసి హత్యాప్రయత్నం చేశారని వారు చెప్పారు. దాడి సమాచారం తెలియగానే చాపాడు ఎంపీపీ తెలిదేల లక్ష్మయ్య, మండల నాయకులు, మైదుకూరు సింగిల్ విండో చైర్మన్ మూలె సుధాకర్రెడ్డి, ఖాజీపేట వైఎస్సార్సీపీ నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, మైదుకూరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్య తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశులు, రూరల్, అర్బన్ సీఐలు శ్రీనాథరెడ్డి, ఏపీ మస్తాన్ ఆస్పత్రికి వచ్చి చంద్ర ఓబుళరెడ్డితో మాట్లాడారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. -
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు.రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు.‘‘రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరయ్యారు. పోలింగ్కు ముందే పోలీస్ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది. పురందేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు. వారు కోరిన అధికారులను వేశారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు. విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు. విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి. అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?. టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరుసపెట్టి ట్రాన్సఫర్ చేశారు. ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు. ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు. అక్కడే ఎక్కువ హింస చెలరేగింది’’ అని సజ్జల ధ్వజమెత్తారు.జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి. ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది. కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది’’ అని సజ్జల చెప్పారు.‘‘సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం. పోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్గా నియమించటం ఏంటి?. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. -
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
-
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేసింది. పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.పోలింగ్ కు మూడు రోజుల ముందు విజయవాడలో టీడీపీ నేత విష్ణువర్ధనరావు ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తించారు. ఆ తర్వాత నుండి భారీగా పోలీసు అధికారుల మార్పులు జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల, గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐలను మార్చేశారు.చివరికి సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జోక్యం చేసుకున్నట్లు వైఎస్సార్సీపీ చెబుతోంది. ఆ మేరకు ఆధారాలు కూడా ఉన్నాయని వైసీపి నేతలు తెలిపారు. కేసులోని A2 నిందితుడిని అరెస్టు చేయవద్దని విచారణ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ఆధారాలను సేకరించి డీజీపి, ఈసీలకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. -
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ బూత్లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు.టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగింది?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదు. దీంతో వారు పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేశారు. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథచ్చగా తిరగనిచ్చారు. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు. అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?. అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్టడం వలన హింస జరిగింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలు: మాజీ మంత్రి పేర్నిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?. రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది. బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు. పురంధేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు -
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
-
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
-
టీడీపీ నాయకుల దాష్టీకం..
-
ఘొల్లుమనే జోకులేసిన రఘురామ
పశ్చిమ గోదావరి, సాక్షి: ఓడలు ఏదో ఒకనాటికి బండ్లు అవుతాయంటే ఇదేనేమో. తొమ్మిదేళ్లలో ఐదుసార్లు పార్టీలు మార్చిన కనుమూరి రఘురామకృష్ణంరాజు.. చివరకు అనుకున్న సీటు దక్కించుకోలేక, ఓ అసెంబ్లీ సీటు సంపాదించుకోవడం కోసం ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేశారో తెలుగు రాష్ట్రాలు కళ్లారా చూశాయి.ఈ ఐదేళ్లలో రఘురామ వెలగబెట్టింది ఏంటో అందరికీ తెలిసిందే. చంద్రబాబు డైరెక్షన్లో నిత్యం సీఎం జగన్ను, ఏపీ సర్కార్ను విమర్శిస్తూ.. ఢిల్లీలో ఉంటూ కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేస్తూ కాలం వెల్లదీశారు. అయితే ఎన్నికలు ముగిసినా కూడా రఘురామ తన డ్యూటీని ఇంకా మానలేదు. పాపం స్పీకర్ సీటు మీద ఆయనకు ఆశలున్నాయేమో కదా. అందుకే.. పుట్టినరోజున కూడా ఘొల్లుమనే జోకులేశారు. జోస్యం పేరిట రఘురామ పేల్చిన ఆ జోకులనే యెల్లో మీడియా తెగ ప్రచారం చేసుకుంటోంది. నిన్న(మే 14న) రఘురామ పుట్టినరోజు. పాపం.. పెద అమిరంలోని తన ఆఫీస్లో రచ్చబండ పెట్టారుకానీ జనాలు మాత్రం రాలేదు. అయినా రఘురామ తగ్గలేదు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందంటూ బిగ్గరగా మాట్లాడారు. ఏపీ కూటమి ఏకంగా 150కిపైగా సీట్లు దక్కించుకుందట. అధికారంలోకి వస్తుందట. ఆ మాటకు పక్కనున్న టీడీపీ నేతలు బయటకే నవ్వుకోవడం కనిపించింది. రఘురామ జోకులు అంతటితో ఆగలేదు.తనపై మత వ్యతిరేకుడనే ముద్ర వేయించారని తెగ ఫీలైపోయారు. అంతేకాదు.. తన శపథం నెరవేరిందని, పోలింగ్కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే కూటమి గెలుస్తుందనడానికి సంకేతమంటూ మాట్లాడారు. అయితే రఘురామ వాస్తవాల్ని గ్రహించలేకపోతున్నారు. పోటెత్తిన ఓటర్లలో జగనన్న పాలనలో సంక్షేమం అందుకున్న లబ్ధిదారులు, ఆ సంక్షేమం కొనసాగాలని కోరుకుంటున్న మహిళా ఓటర్లు.. అదే టైంలో ఇంకోవైపు పెన్షన్లు ఇంటికే అందక ఇబ్బందులు పడి చంద్రబాబును తెగ తిట్టుకున్న అవ్వాతాతలు.. అధికంగా ఉన్నారు. మరి వాళ్లంతా తిరిగి ఎవరికి పట్టం కడతారో ఊహించలేమా?. అయినా.. రాబోయేది జగన్ సర్కారే అని చెప్పడానికి గోదావరి జిల్లాల సిద్ధం సభలకు లభించిన స్పందన చాలాదా?. -
టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీ కొత్త చరిత్ర సృష్టించబోతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని వ్యాఖ్యలు చేశారు.కాగా, మంత్రి మేరుగ నాగర్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధం. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు. జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీ సునామీ రాబోతుంది. పేదలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్ట్రేషన్లోకి వెళ్లాడు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. కేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు. పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాం. ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారు. డీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
-
పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ తన విజయాన్ని ధృవీకరించుకున్నారు. సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, అక్కచెల్లెమ్మలకు అంటూ వివిధ వర్గాలను ప్రస్తావిస్తూ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఆ కామెంట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ ఏపీ శాసనసభ ఎన్నికలలో గెలవబోతున్నదన్న స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇప్పటివరకు సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల పోలింగ్ పెరగడాన్ని ఆయన పాజిటివ్ ఓటింగ్గా భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కూడా తమ కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి దృష్టిలో పెరిగిన ఓట్ల శాతం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత. ఓట్ల శాతం పెరిగినంతమాత్రాన అది పాజిటివ్ అనో, నెగిటివ్ అనో నిర్ధారించవచ్చా? గతంలో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వాటిని కూడా పరిశీలిద్దాం.ఏపీలో సుమారు ఎనభై ఒక్క శాతం వరకు ఓట్ల పోలింగ్ నమోదు అయింది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు పోలైతే ఎవరికి అడ్వాంటేజ్ అన్నదానిపైనే అందరి ఆలోచన. ప్రతిపక్ష తెలుగుదేశం కూటమివారు ఇందుకు ఒక భాష్యాన్ని చెబుతూ, ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేయడానికి తరలివచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు.మహిళలు, వృద్దులు ఉదయానే వచ్చి ఓట్లు వేయడంపై స్పందిస్తూ, మద్య నిషేధం చేయలేదన్న అసంతృప్తితో వారు అలా వచ్చారని చెప్పేవరకు వెళ్లారు. మిగిలిన 99 శాతం హామీలు అమలు చేయడన్ని విస్మరించి ఈ ఒక్క కారణంకోసం వ్యతిరేకత వచ్చిందంటే అది హాస్యాస్పదం.నిజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఎక్కువగా ఉంటేనే పోలింగ్ అదికంగా జరుగుతుందా అన్నది ప్రశ్న! కొన్నిసార్లు అది వాస్తవం కావచ్చు. మరికొన్నిసార్లు అది నిజంకాదు అని చెసప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. 1967లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సిండికేట్ నాయకుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కున్నారు. ఆమె చేయదలచుకున్న బ్యాంకుల నేషనలైజేషన్ , రాజభరణాల రద్దు వంటి వివిధ సంస్కరణలను సిండికేట్ నేతలు వ్యతిరేకించారు. ఆ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలలో అధికారిక కాంగ్రెస్ అభ్యర్ధి నీలం సంజీవరెడ్డిని వ్యతిరేకించి, తిరుగుబాటు అభ్యర్ధి వి.వి.గిరిని బలపరిచారు. దాంతో పార్టీ కూడా కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ గా చీలిపోయింది. 1971లో ఆమె పార్లమెంటు ఎన్నికలకు వెళ్లినప్పుడు గరీబీ హటావో నినాదం ఇచ్చారు. అప్పుడు విపరీతమైన స్పందన ఆమెకు లభించింది. అప్పుడు ప్రజలలో సానుకూల ఓటింగ్ పడింది. 1967లో 61 శాతం ఓట్లు పోలైనా కాంగ్రెస్ పార్టీకి 283 సీట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ చీలికతో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అయినా ఆమె డి.ఎమ్.కె.,వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 1971లో ఎన్నికలకు వెళ్లినప్పుడు 55 శాతం ఓట్లే పోలైనప్పటికీ, ఇందిరాగాంధీ ఆద్వర్యంలోని కొత్త కాంగ్రెస్కు 352 సీట్లు రావడం విశేషం. అలాగే 1967 కాంగ్రెస్కు 40 శాతం ఓట్లు వస్తే, 1972లో ఇందిరాగాంధికి 43 శాతం ఓట్లు లబించాయి. అంటే ఓట్ల శాతం తగ్గినా, పెరిగినా, ఆనాటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, నాయకత్వం వీటన్నిటి ఆదారంగా గెలుపు, ఓటములు ఉంటాయని తేలుతుంది.ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయం చూద్దాం. 1982 లో టీడీపీ ఆవిర్బావం తర్వాత రెండు పార్టీల వ్యవస్థ వేళ్ళూనుకుంది. 1983 లో జరిగిన ఎన్నికలలో 67.70 శాతం ఓట్లు పోల్ కాగా, కొత్తగా ఆవిర్భవించిన టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. 1985లో శాసనసభను రద్దు చేసి మద్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కూడా దాదాపు ఇదే శాతం ఓట్లు పోలయ్యాయి.ఆ ఎన్నికలలో 67.60 శాతం ఓట్లు పోల్ కాగా టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 1984లో జరిగిన ప్రయత్నాల కారణంగా ఆయనకు సానుభూతి వచ్చి మళ్లీ గెలిచారు. 1989 లో జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓటమిపాలైంది. ఆ ఎన్నికలలో 70.40 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కొంత ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్పుటించిందనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కి 181 సీట్లు, టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. 1994లో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతం పెద్దగా పెరగలేదు. ఆ ఎన్నికలలో కేవలం 0.60 శాతం పోలింగ్ పెరిగింది. అయినా టిడిపికి 216 సీట్లు, మిత్రపక్షాలకు మరో 34 సీట్లు వచ్చాయి. దీనిని ఏ విధంగా అర్దం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, టీడీపీ వామపక్షాల కూటమిని ప్రజలు ఆదరించారు. ఆనాడు ఎన్.టి.ఆర్.ఇచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం వంటి హామీలు బాగా పనిచేశాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లే వచ్చాయి. తదుపరి 1995లో ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు . ఆ తర్వాత 1999 ఎన్నికలలో సుమారు రెండు శాతం పోలింగ్ తగ్గినా టిడిపి 180 సీట్లతో అధికారంలోకి రాగా, కాంగ్రెస్ కు 91 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ టీడీపీ వ్యూహాత్మకంగా బిజెపితో పొత్తు పెట్టుకోవడం కలిసి వచ్చింది. అంతే తప్ప అది ప్రభుత్వానికి పూర్తి సానుకూల ఓటు కాదని చెప్పవచ్చు. కాంగ్రెస్ అంతకుముందున్న 26 సీట్లనుంచి 91 సీట్లకు పెరగడమే నిదర్శనం. 2004 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా పోలింగ్ పెద్దగా పెరగలేదు. 69.8 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అంటే కేవలం 0.7 శాతం పోలింగ్ పెరిగిందన్నమాట. కాని ఈసారి కాంగ్రెస్ 185 సీట్లతో అధికారంలోకి రాగా, మిత్ర పక్షమైన టిఆర్ఎస్ కు 26 సీట్లు, వామపక్షాలకు 15 సీట్లు లబించాయి. టీడీపీకి కేవలం 47 సీట్లే వచ్చాయి. పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోయినా టిడిపి ఎందుకు అంత తక్కువ సీట్లకు పడిపోయిందన్నది పరిశీలిస్తే, దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్,టిఆర్ఎస్,వామపక్షాలు పొత్తు పెట్టుకోవడమే అని చెప్పవచ్చు.వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర,రైతులకు ఉచిత విద్యుత్ వంటివి ఉపకరించాయి.2009 నాటి అనుభవం మరింత ఆసక్తికరమైంది.ఆ ఎన్నికలలో కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీలు స్వతంత్రంగా పోటటీచేశాయి. టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం లు మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో తలపడ్డాయి. ఈ ఎన్నికలలో ఓట్ల శాతం 72,70 శాతంగా ఉంది. అంటే అంతకు ముందు ఉన్న పోలింగ్ శాతం కన్నా మూడు శాతం పెరిగిందన్నమమాట. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 156 సీట్లను సాధించింది. తెలుగుదేశంకు 92, టీఆర్ఎస్కు పది, వామపక్షాలకు ఆరు సీట్లు వచ్చాయి. ప్రజారాజ్యం కు 18 సీట్లు రాగా, లోక్ సత్తా ఒక సీటుకే పరిమితం అయింది. ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అని వాదించేవారికి ఇది సమాధానం అవుతుంది. ఓట్ల శాతం పెరిగినా అది పాజిటివ్ ఓటు కావచ్చనడానికి ఈ ఫలితం ఒక ఉదాహరణ అవుతుంది. అయితే ఇది పూర్తి పాజిటివ్ ఓటా అంటే ఔనని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ టీడీపీ 47 నుంచి 92 కి పెరిగింది. కాని ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీల వల్ల కాంగ్రెస్, టీడీపీలు కొంత నష్టపోయాయి. నాలుగు పార్టీలు కూటమి కట్టాయి. అయినా దానిని తట్టుకుని కాంగ్రెస్ కొంత పాజిటివ్ ఓటు సాదించడం వల్ల బయటపడిందని చెప్పాలి. 2014 లో విభజిత ఏపీలో 76.80 శాతం ఓట్ల పోలింగ్ జరిగింది. అప్పటికి కాంగ్రెస్ పూర్తిగా ప్రజా మద్దతు కోల్పోవడం టీడీపీకి కలిసి వచ్చింది. గతంతో పోల్చితే నాలుగు శాతం ఓట్లు పెరిగినా, టీడీపీ, బిజెపి కూటమికి 106 సీట్లే వచ్చాయి. ప్రతిపక్షంగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్కు 67 సీట్లు దక్కాయి. టీడీపీకి పాజిటివ్ ఓటు అయి ఉంటే ప్రతిపక్షానికి ఈ స్థాయిలో సీట్లు రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రదాని అభ్యర్ధిగా రావడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి కాపు వర్గాన్ని ఆకర్షించడం, చంద్రబాబు రైతుల రుణమాఫీ వంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వంటి వాటివల్ల అధికారంలోకి రాగలిగారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అప్పట్లో రుణమాఫీ హామీ ఇచ్చినా, కొందరు కీలక నేతలుపార్టీలో చేరడానికి వచ్చినప్పుడు అంగీకరించినా, ఆయనకే ప్రజలు పట్టం కట్టేవారన్న అభిప్రాయం కూడా ఉంది. 2019 ఎన్నికలలో 79.80 శాతంం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. అదే టైమ్లో జగన్ ఇచ్చిన హామీలు కూడా పనిచేశాయని చెప్పవచ్చు. అందువల్లే వైఎస్సార్సీపీకి 151 సీట్లు, టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. 2024 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా సుమారు రెండు శాతం పెరిగినట్లు లెక్కలు గడుతున్నారు. దీనివల్ల వైఎస్సార్సీపీకి నష్టం అని టీడీపీ కూటమి మద్దతుదారులు వాదిస్తున్నా, ఓట్ల పోలింగ్ శాతం పెరిగినంతమాత్రాన అన్నిసార్లు అది ప్రభుత్వ వ్యతిరేకత అని అనుకోనవసరం లేదనడానికి పైన ఇచ్చిన గణాంకాలు తెలుపుతాయి. పైగా ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పుడు కూడా ఓట్ల శాతం పెరగవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం కనుక గెలవకపోతే పేదవర్గాలకు నష్టం కలుగుతుందన్న భావన బాగా ప్రబలితే కూడా ఓట్ల శాతం పెరుగుతుంది. అయితే ప్రభుత్వం మీద అసలు వ్యతిరేకత ఉండదని ఎవరూ చెప్పరు. కాని దానికన్నా ప్రభుత్వంపై సానుకూలత ఎక్కువగా ఉందనడానికి పలు ఆధారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదవర్గాలు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీకి పట్టణ ప్రాంతాలలో కొంత అనుకూలత ఉన్నా, అక్కడ కూడా ఉండే పేద వర్గాలు సీఎం జగన్ వైపే మొగ్గుచూపుతాయి. దానికితోడు ఎస్సి, బిసి, ఎస్టి, మైనార్టీ, రెడ్డి వర్గాలు బలంగా ఉంటే వైఎస్సార్సీపీ ఓడించడం కూటమికి సాధ్యం కాదనిపిస్తుంది. 2019లో ఏ సామాజిక సమీకరణలు ఉన్నాయో,దాదాపు అవే ఇప్పటికే కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన ద్వారా కాపు వర్గాన్ని కొంత ఆకర్షించినా, అధికారంలోకి రావడానికి అది సరిపోదనిపిస్తుంది. జగన్ పేదలు vs పెత్తందార్ల స్లోగన్ బాగా పనిచేసినట్లు కనిపిస్తుంది. అది కరెక్టు అయితే సీఎం జగన్కు వేవ్ వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఒకవేళ వేవ్ రాకపోయినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్కు డోకా ఉండదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. స్థూలంగా చెప్పాలంటే ఆయా ఎన్నికలలో అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, వాగ్దానాలు, సామాజిక సమీకరణలు, నాయకత్వంపై విశ్వాసం మొదలైన అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇవి ఈ ఎన్నికలలో సీఎం జగన్కు ఎక్కువగా అనుకూలంగా ఉండడం వల్లే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న భావన బలీయంగా ప్రజలలో నెలకొంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పచ్చ ముఠా మంటల్లో ‘పల్నాడు’
పల్నాడు, సాక్షి: పోలింగ్ రోజున చెలరేగిన హింస మూడు రోజులైనా చల్లారడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతూ.. టీడీపీ శ్రేణులు అవకాశం దొరికినప్పుడల్లా దాడులకు తెగబడుతున్నాయి. దీంతో.. మూడు రోజులుగా జిల్లా అట్టుడుకి పోతోంది.హింసను కట్టడి చేయడంలో తొలి రెండు రోజులు విఫలమైన పోలీస్ యంత్రాంగం.. ఆలస్యంగా మేల్కోంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. పల్నాడు కేంద్రంలో 800 మందితో కూడిన కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. అయినా కూడా టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ‘‘ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారా?’’.. అంటూ దాడులు చేస్తూ పల్నాట మంటల్ని రాజేస్తున్నాయి.మరోవైపు టీడీపీ నేతలను, శ్రేణుల్ని కట్టడి చేయలేని పోలీసులు.. మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలను మాత్రం హౌజ్ అరెస్ట్ చేశారు. మాచర్లలో ఇప్పటికీ షాపులుతెరచుకోలేదు. అక్కడ 2 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని అడుగడుగునా మోహరించారు. అంతటా వాహనాలను పోలీసులు జల్లెడ పుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. మాచర్లలోనే మకాం వేసిన డీఐజీ త్రిపాఠి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
ఏలూరులో చల్లారని రగడ...
-
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
-
పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ
-
కడప గడపలో టీడీపీ ఆశలు గల్లంతే!
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ సీపీ అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలల్లో వైఎస్సార్సీపీ రికార్డులు తిరగరాయనున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్సార్సీపీ పదికి పది సీట్లు సాధించి, ఐదుగురికి హాట్రిక్ రికార్డు కట్టబెట్టనుందా? గ్రామీణ ఓటర్లు ఏకపక్షంగా తీర్పు అప్పగించనున్నారా?.. అరకొరగా ఉన్న టీడీపీ ఆశలు ఆవిరి అయ్యాయా?.. పుత్తా, పుట్టాకు మరోమారు చేదు అనుభవం తప్పదా..? వయో వృద్ధుడు వరదకు ఈసారీ ఆశాభంగం తప్పదా? .. అంటే.. విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజంపేట, కడప పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా టీడీపీ ఖాతాలో పడే అవకాశమే లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు..ఎన్నికలకు నోటిఫికేషన్ ఖరారు కాకముందు నుంచే తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా వైఎస్సార్సీపీ అభ్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఓటర్లు చెవులు తూట్లు పడేలా దుష్ప్రచారం చేపట్టారు. పోలింగ్లో ఇవేవి పట్టించుకోకుండా ఓటర్లు తీర్పు కట్టబెట్టారు. ‘ఈ ఐదేళ్లలో నా పాలనలో లబ్ధి చేకూరింటేనే నాకు ఓట్లు వేయండి, మీ చుట్టు పక్కల వారికి చెప్పి ఓట్లు వేయించండ’ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పీల్ చేశారు. రాష్ట్రం నలుమూలల తిరుగుతూ మీకు మంచి చేసింటేనే ఓట్లు వేయాలని కోరారు. ఇలా అడిగిన దమ్మున్న నాయకుడు చరిత్రలో లేరని రాజకీయ విశ్లేషకుల మాట. మరోవైపు చంద్రబాబు అండ్కో అమలు కానీ హామీలు ఇస్తోందని, ఇదే కూటమి 2014లో 600 పైగా హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సవివరంగా వివరిస్తూ, చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కూడా చెప్పారు. ఇలాంటి విషయాలన్నీ బేరీజు వేసుకున్న గ్రామీణ ఓటర్లు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి అండగా నిలిచారు. వీరిలో మహిళల మద్దతు పాళ్లు మరింత ఎక్కువగా ఉందని పరిశీలకుల అంచనాకు వచ్చా రు. కాగా, ఉద్యోగుల్లో మాత్రమే టీడీపీకి మెరుగైన అవకాశం ఉందని, అయితే అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్ చేయదగ్గ స్థాయిలో లేవని కూడా వివరిస్తున్నారు.ఓటమికి ముందే సాకులు వెతుకుతున్న వాసుకడప గడపలో ఈమారు ఎలాగైనా గెలవాలనే దృక్పథంతో టీడీపీ పనిచేసింది. ఇన్చార్జిగా మాధవీరెడ్డి నియామకం తర్వాత పథకం ప్రకారం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. మరోవైపు విద్వేషాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలని అడుగులేశారు. పోలింగ్లో ఇవేవీ కన్పించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. నగరంలో మాస్ ఓటర్లు ఉదయం నుంచే గణనీయంగా పాల్గొన్నారు. సాయంత్రం వరకూ మాస్ పోలింగ్ కన్పిస్తూ వచ్చింది. మిడిల్, అప్పర్ క్లాస్ ఓటర్లు పోలింగ్లో తక్కువగా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి ఓటింగ్ సరళి సానుకూలంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఊహించిన వర్గం ఓటర్లు పోలింగ్లో తక్కువగా పాల్గొన్నారు. వెరసి టీడీపీ ఓటమి ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ వెన్నుపోటుదారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని పరోక్షంగా ఆలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డికి హెచ్చరికలు పంపారు. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎస్బీ అంజాద్బాషా దొంగ ఓట్లుకు పాల్పడుతుంటే అడ్డుకున్నామని ఆరోపించారు. కడపలో టీడీపీ తీరు చూస్తుంటే ఓటమికి ముందే సాకులు వెతికే పనిలో నిమగ్నమైనట్లు స్పష్టమౌతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.వరదకు ఆశాభంగంచివరి అవకాశం కల్పించాలని ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి విన్నవించినా ఆశాభంగం తప్పడం లేదు. దాదాపు 80శాతం ఓటింగ్ నమోదు కావడం వెనుక పోల్ మేనేజ్మెంట్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నట్లుగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఓటింగ్ సరళిని బట్టి మరోమారు ఎమ్మెల్యేగా అవకాశం దక్కనున్నట్లు రాచమల్లు శివప్రసాద రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాజంపేటలో స్థానికుడైన ఆకేపాటి అమర్నాథరెడ్డి విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాయచోటికి చెందిన బాలసుబ్రమణ్యంను పోటీ చేయించడ మే టీడీపీ చేసిన అతిపెద్ద పొరపాటుగా పలువురు వివరిస్తున్నారు. రైల్వేకోడూరు, బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాలు ఎన్నికల పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు కేటాయిడం మరో పెద్ద తప్పిదంగా పలువురు వివరిస్తున్నారు. ఆ మూడు నియోజకవర్గాలల్లో వైఎస్సార్సీపీకి ఎదురు లేకుండా పో యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్, రాయచోటిలో శ్రీకాంత్రెడ్డి విజయానికి ఎలాంటి ఢోకా లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అక్కడ మెజార్టీపైనే లెక్కల చర్చలు సాగుతున్నాయి.ఐదుగురికి హ్యాట్రిక్ఉమ్మడి కడప జిల్లాలో 2024 ఎన్నికల ఫలితాలల్లో ఐదుగురికి హ్యాట్రిక్ దక్కనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలుపొందిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎస్బీ అంజాద్భాషా, రాచమల్లు శివప్రసాదరెడ్డిలు విజ యం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకునే దశలో ఉన్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రజాతీర్పు అందుకు అనుగుణంగా ఉన్నట్లు జిల్లా వాసులు భావిస్తున్నారు.పుట్టా...పుత్తాకు చేదు అనుభవం ‘అందని ద్రాక్ష పుల్లనా’ అన్నట్లుగా మైదుకూరు, కమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పుట్టా సుధాకర్యాదవ్, పుత్తా చైతన్యరెడ్డిల పరిస్థితి ఉత్పన్నం కానున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు నుంచి ఉన్న అంచనాలు పోలింగ్లో తలకిందులయ్యాయి. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు రద్దు అయితాయనే భావనతోనే గ్రామాల్లో సామాన్య మహిళలు, వృద్ధులు, మైనార్టీలు పోలింగ్లో పోటాపోటీగా పాల్గొన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలన్న పుట్టా సుధాకర్ యాదవ్కు అనువుగా ఓటింగ్ కొనసాగలేదనే భావనే మైదుకూరులో వ్యక్తమౌతోంది. రెడ్డి, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఓటర్లు అత్యధికంగా వైఎస్సార్సీపీకీ అండగా నిలిచారని పలువురు వివరిస్తున్నారు. కమలాపురం టీడీపీ అభ్యర్థిగా పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పోటీ చేశారు. వరసగా నాలుగు పర్యాయాలు ఈయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి ఇక్కడి నుంచి ఓడిపోయారు. సానుభూతి వ్యక్తం అవుతోందనుకున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్పు చేసింది. ఈ పరిణామం పార్టీకి నష్టం చేసిందనే చెప్పాలి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, సాయినాథశర్మ ఫ్యాక్టర్ వైఎస్సార్సీపీకి కలిసి వచ్చింది. ఎన్నికలు దగ్గర పడే కొద్ది వైఎస్సార్సీపీ ఊపు మీదకు వచ్చింది. వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, కమలాపురం మండలాలపై టీడీపీ పెట్టుకున్న ఆశలు ఆవిరి అయ్యాయి. మరోవైపు పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె మండలాలు వైఎస్సార్సీపీ ఆధిపత్యం మరోమారు నిరూపితం కానుంది. ఆ నాలుగు మండలాలల్లో కూడా పైచేయి సాధించే దిశగా వైఎస్సార్సీపీ వ్యవహారాలు నడిపింది. వెరసి కమలాపురం ఓటర్లు మరోమారు వైఎస్సార్సీపీ అభ్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి విజయం కట్టబెట్టనున్నట్లు ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్
-
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
-
టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
చంద్రగిరిలో చిత్తూరు రౌడీయిజం
సాక్షి, తిరుపతి: ఓటమి భయంతో కూటమి అభ్యర్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ శాతాన్ని తగ్గించాలని పక్కా ప్లాన్తో విధ్వంసాలు సృష్టించారు.అల్లర్లు సృష్టించి..అసత్యాలకు పదును పెట్టి ఎన్నికల్లో అల్లర్లు, విధ్వంసాలు సృష్టించేందుకు కూటమి అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే విధ్వంసాలకు పథక రచన చేశారు. అందులో భాగంగానే నామినేషన్ రోజున ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వాహనంపై దాడికి తెగబడ్డారు. ఆపై విచక్షణారహితంగా పోలీసులపైన, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం కురిపించారు. మరోవైపు తిరుపతి నగరంలో జరుగుతున్న ప్రచారంలో జనసేన రౌడీలు స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులపైన దాడులకు తెగబడ్డారు. ఇదంతా కుట్రలో భాగమేనని ఓటర్లు చర్చించుకుంటున్నారు. రిగ్గింగ్ని అడ్డుకున్నందుకే విధ్వంసాలు పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గ ఓటర్లంతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డికే పట్టం కడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన కూటమి అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రామంద్రాపురం మండలం, బ్రాహ్మణకాలువ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్కు యతి్నంచారు. తమకు అడ్డుగా ఉన్న దళిత ఏజెంట్ని బయటకు లాక్కొచ్చి అతనిపై దాడిచేశారు. వైఎస్సార్సీపీ పాకాల మండల పార్టీ అధ్యక్షులు నంగా నరే‹Ùరెడ్డి కుమారుడు లవంత్రెడ్డిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తర్వాత పులివర్తివారి పల్లెలో రిగ్గింగ్కు యతి్నంచారు. వైఎస్సార్సీపీ ఏజెంట్పై మాజీ జెడ్పీటీసీ సురేష్ చౌదరి, పులివర్తి నాని కుమారుడు వినీల్ దాడికి దిగారు. నారావారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్పైనా టీడీపీ మూకలు దాడిచేశారు. అదేవిధంగా కూచువారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్కి అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్ రాజశేఖర్ని, రిలీవ్ ఏజెంట్గా ఉన్న సర్పంచ్ కొట్టాల చంద్రశేఖర్రెడ్డిపై దాడి చేశారు. చంద్రశేఖర్రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. గ్రామానికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్రెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. మోహిత్రెడ్డి వాహనానికి నిప్పు పెట్టి, మరో ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. కార్యకర్తలపై దౌర్జన్యం చేశారు. కూచువారిపల్లెలో కార్యకర్తలను బేడ్లతో కోసి రక్త గాయాలు చేశారు.అక్కడే ఎందుకు తిష్ట? పోలింగ్ రోజున ఎటూ ఓటింగ్ శాతాన్ని తగ్గించలేకపోయామని భావించిన కూటమి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోతున్నారు. మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉండగా స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో పులివర్తి నాని అనుచరులు మారణాయుధాలతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఉన్న రౌడీ మూకలు మహిళా యూనివర్సిటీ సమీపంలో వైఎస్సార్సీపీ స్టిక్కర్తో ఉన్న ద్విచక్ర వాహనాన్ని కిందపడేసి ధ్వంసం చేశారు. ఆపై దానికి నిప్పంటించారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నాయకుడికి కారును కూడా ధ్వంసం చేశారు. -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
జూన్ మొదటి వారంలో నైరుతి
Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
రుణమాఫీకి రూ.40 వేల కోట్లు!
మాఫీకి మార్గం చూడండి
Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
పట్టభద్రుల ఎన్నిక ప్రతిష్టాత్మకం
రైతు సమస్యలుపక్కనపెట్టి రాజకీయాలా?
సన్న వడ్లకే బోనస్సా?
Lok Sabha Election 2024: సెన్స్క్స్ డౌట్!
అమెరికా బెదిరింపు ధోరణి
తప్పక చదవండి
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
- సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
- రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
- USCIS: హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
- Amit Shah: కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ !
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
- గ్లోబల్ వార్మింగ్పై ఫైటర్.. ది మమ్మోత్
- Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
- Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
Advertisement