-
జూన్ 1న బంగ్లాదేశ్తో భారత్ వార్మప్ మ్యాచ్
దుబాయ్: ఇప్పుడైతే భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఆడుతున్నారు. అయితే టి20 ప్రపంచకప్కు ముందు కలిసి కట్టుగా, భారత జట్టుగా రోహిత్ శర్మ బృందం ఏకైక వార్మప్ మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్లలో జరిగే ప్రపంచకప్లో టీమిండియా లీగ్ దశ పోటీలన్నీ అమెరికాలోనే షెడ్యూల్ చేశారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అక్కడే ఆడుతుంది. అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది. పోటీపడే మొత్తం 20 జట్లలో 17 జట్లు మే 27 నుంచి జూన్ 1 వరకు వార్మప్లో పాల్గొంటుండగా... డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు లేకుండానే నేరుగా టోర్నీలోనే బరిలోకి దిగనున్నాయి. ఈ మూడు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల వల్లే బహుశా వార్మప్ మ్యాచ్లకు దూరంగా ఉండొచ్చు. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ నాలుగు టి20 మ్యాచ్లు ఆడనుంది. -
Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
‘‘క్రీడాకారులుగా మన కెరీర్కు కచ్చితంగా ఆఖరి తేదీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నేను నా ఆటలో లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడంపైనే ఎల్లప్పుడూ దృష్టి సారిస్తాను.కెరీర్ ముగిసి పోయిన తర్వాత.. ‘ఓహ్.. ఆరోజు నేను అలా చేస్తే బాగుండు.. ఇలా చేస్తే ఇంకా మెరుగ్గా ఉండేది’ అని పశ్చాత్తాపపడాలని అనుకోవడం లేదు. కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఎల్లకాలం గతం గురించే ఆలోచిస్తూ కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రతీ పని ఇప్పుడే పూర్తి చేసుకుంటాను.పశ్చాత్తాపపడేందుకు ఏదీ మిగలనివ్వను. కచ్చితంగా నేను ఇది సాధిస్తాననే అనుకుంటున్నా’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.మీ కంటికి కూడా కనిపించనుఆర్సీబీ రాయల్ గాలా డిన్నర్ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత తాను చేయాలనుకుంటున్న పనుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మీ కంటికి కూడా కనిపించను(నవ్వుతూ).అందుకే ఇక్కడ ఉన్నంతసేపు నా శాయశక్తులా, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తపిస్తున్నా. ఆ తపనే నన్ను ఇప్పుడు ముందుకు నడిపిస్తోంది’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా 2008లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.రికార్డుల రారాజుగా పేరొంది కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్లో ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అత్యధిక పరుగుల వీరుడుపదహారేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా గాయాల బెడదతో కోహ్లి జట్టుకు దూరం కాలేదంటే ఫిట్నెస్ మీద అతడికి ఉన్న శ్రద్ధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 35 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్లో 13 మ్యాచ్లలో ఆడి 661 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి.. అత్యధిక పరుగుల వీరుడి(ఆరెంజ్ క్యాప్ హోల్డర్)గా కొనసాగుతున్నాడు. లీగ్ దశలో ఆర్సీబీ తమ ఆఖరి మ్యాచ్లో మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే ఆర్సీబీ ఇంటిబాట పడుతుంది. కాగా బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేదన్న సంగతి తెలిసిందే.చదవండి: IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్ View this post on Instagram A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru) -
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
బంగ్లాదేశ్ జట్టు స్టార్ ఆల్రౌండర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా తొమ్మిదోసారి టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్న రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షకీబ్ కంటే ముందుగానే తన పేరును లిఖించుకున్నాడు.కాగా జూన్ 1 నుంచి వరల్డ్కప్-2024 టోర్నీ ఆరంభం కానుంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న భారత క్రికెట్ నియంత్రణ మండలి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యుల పేర్లు వెల్లడించింది.కాగా 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభించగా రోహిత్ శర్మ అప్పటి నుంచి ఈ మెగా టోర్నీ ఒక్కసారి కూడా మిస్ కాలేదు. వరుసగా తొమ్మిదో ఎడిషన్లోనూ ఆడేందుకు హిట్మ్యాన్ సిద్దమయ్యాడు. ఈసారి.. రెండో దఫా కెప్టెన్ హోదాలో అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఐర్లాండ్తో ఆడనుంది.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ వరల్డ్కప్ కోసం మంగళవారం తమ జట్టును ప్రకటించింది. ఇందులో షకీబ్ అల్ హసన్కు స్థానం దక్కింది. ఇక జూన్ 7 న బంగ్లాదేశ్ శ్రీలంకతో మ్యాచ్తో ప్రపంచకప్ జర్నీ ఆరంభించనుంది.ఈ నేపథ్యంలో పొట్టి క్రికెట్ ప్రపంచకప్లో వరుసగా ఆడుతున్న క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ ముందంజలో నిలవగా.. షకీబ్ రెండోస్థానం ఆక్రమించాడు. కాగా ఇప్పటి వరకు ప్రపంచకప్లలో 36 మ్యాచ్లు ఆడిన షకీబ్ 742 పరుగులు చేయడంతోపాటు 47 వికెట్లు పడగొట్టాడు.టీ20 ప్రపంచకప్లో ఇప్పటి వరకు అత్యధికసార్లు పాల్గొన్న/పాల్గొనబోతున్న ఆటగాళ్లు👉రోహిత్ శర్మ- 9- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.👉షకీబ్ అల్ హసన్- 9- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.👉మహ్మదుల్లా- 8- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2024.👉డేవిడ్ వార్నర్- 8- 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.👉క్రిస్ గేల్- 7- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021.👉డ్వేన్ బ్రావో- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ (కెపె్టన్), టస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తన్జిద్ హసన్, షకీబ్, తౌహిద్, మహ్ముదుల్లా, జాకీర్ అలీ, తన్వీర్ ఇస్లామ్, మెహదీ హసన్, రిషాద్, ముస్తఫిజుర్, షోరిఫుల్, తన్జీమ్ హసన్. చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాఒకవేళ సెమీఫైనల్ చేరితే ఆ మ్యాచ్ ‘రిజర్వ్ డే’ లేకుండానే జరగనుంది. తొలి సెమీఫైనల్, ఫైనల్కు మాత్రమే ‘రిజర్వ్ డే’ ఉంచుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా ఈ మెగా టోర్నీలో తొలి సెమీఫైనల్ తరూబా (ట్రినిడాడ్)లో జూన్ 26న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి గం. 8:30కు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు అంతరాయం కలిగితే తర్వాతి రోజు రిజర్వ్ డే మ్యాచ్ కొనసాగుతుంది. కానీ రెండో సెమీఫైనల్ పరిస్థితి అలా లేదు. పటిష్ట భారత జట్టు సెమీస్ చేరవచ్చని భావిస్తున్న రెండో సెమీస్ ప్రొవిడెన్స్ (గయానా)లో జరుగుతుంది. ఇది జూన్ 27న స్థానిక కాలమానం ఉదయం గం.10:30కి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభమవుతుంది. టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునేభారత్లోని టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే ఈ సమయాన్ని ఖరారు చేశారు. డే మ్యాచ్ కాబట్టి ఆ రోజంతా చాలినంత సమయం ఉంటుంది. దానిని మరుసటి రోజుకు కొనసాగించడంలో అర్థం లేదని ఐసీసీ భావించింది.పైగా జూన్ 29న ఫైనల్ కాబట్టి రెండో సెమీస్లో గెలిచిన జట్టు వరుసగా మూడో రోజులు ఆడాల్సిన స్థితి వస్తుంది. ఇది సరైంది కాదని, ఫైనల్కు ముందు ఒక రోజు ప్రయాణం ప్లస్ విరామం ఉండాలి కాబట్టి అదే రోజు ఫలితాన్ని తేల్చాలని నిర్ణయించింది.అదనపు సమయం..అయితే ‘రిజర్వ్’కు బదులుగా రెండో సెమీస్కు 250 నిమిషాల అదనపు సమయాన్ని ఇస్తారు. వర్షం లేదా ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఆట పూర్తిగా జరగకపోతే మరో నాలుగు గంటల పాటు వేచి చూస్తారు. అయితే ఆట జరగకపోతే నిబంధనల ప్రకారం ‘సూపర్ ఎయిట్’లో ఎక్కువ పాయింట్లు సాధించిన టీమ్ ఫైనల్ చేరుతుంది. ఏ గ్రూపులో ఏ జట్టు?👉గ్రూప్-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్, పాకిస్తాన్(ఏ2), యూఎస్ఏ👉గ్రూప్-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్(బీ1), నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.👉గ్రూప్-సి: అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్ ఇండీస్(సీ2).👉గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2).సూపర్-8కు అర్హత సాధించిన జట్లు👉ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక. కాగా జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్కప్-2024కు అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఈ మెగా టోర్నీకి రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.ఎంపికైన కొత్త హెడ్ కోచ్ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది నవంబర్లో వన్డే వరల్డ్కప్ అనంతరం ముగిసింది.అయితే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ పదవి కోసం ద్రవిడ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. నో చెప్పిన ద్రవిడ్అయితే, ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్ల నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్ పదవికి గుడ్బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మణ్కు ఆ ఛాన్స్ లేదుమరోవైపు.. ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఫ్లెమింగ్ లేదంటే రిక్కీ పాంటింగ్?ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్కోచ్ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు హెడ్కోచ్లుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం) జట్లకు కోచ్గా పనిచేసిన అనుభవం పాంటింగ్కు ఉంది.అది సాధ్యం కాదన్న పాంటింగ్అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్కోచ్ పదవి ఆఫర్ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ -
మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది.భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2017- 2021 మధ్య టీమిండియా హెడ్ కోచ్గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడంసహా నంబర్ వన్ జట్టుగా ఎదిగింది.అయితే, వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గలేకపోయింది టీమిండియా. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియగా.. కెప్టెన్గా విరాట్ కోహ్లి యుగానికి తెరపడింది. ఈ క్రమంలో కోహ్లి రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతుండగా.. రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్గా మారాడు.ఈ నేపథ్యంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్తో మాట్లాడుతూ రవిశాస్త్రి.. హెడ్కోచ్గా పనిచేయడంపై తనకున్న ఆసక్తిని వివరించాడు. భవిష్యత్తులో తాను ఐపీఎల్ జట్టు కోచ్గా పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేనని తెలిపాడు.భారత్లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారని.. వారిని మెరికల్లా తీర్చిదిద్దే అవకాశం తనకు వస్తే కచ్చితంగా మళ్లీ కోచ్గా మారతానని రవిశాస్త్రి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే సూపర్ స్టార్లుగా ఎదిగిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అయితే, కొత్త టాలెంట్ను ప్రోత్సహించేందుకు తనకు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని స్పష్టం చేశాడు.ఏడేళ్లు టీమిండియాతో పనిచేసిన తర్వాత .. తిరిగి కామెంటేటర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న రవిశాస్త్రి.. తదుపరి ఐపీఎల్ కోచ్గా మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేశాడు. కాగా రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
టీ20 వరల్డ్ కప్ 2024తో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెచ్ కోచ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన మరోసారి దరఖాస్తు చేసుకుంటారా? లేదంటే ఆ అవకాశం మరొకరిని వరిస్తుందా?.. టీమిండియాకు కాబోయే హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ లోపే హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది.కొత్త కోచ్ పదవీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉంటుందని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అంటే కొత్తగా కోచ్ పదవికి ఎంపికయిన వ్యక్తి 2027 వన్డే ప్రపంచకప్ వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్గా కొనసాగుతారన్నమాట. అలాగే.. కొత్త కోచ్కు దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. పారితోషికం అనుభవాన్ని బట్టి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. వీటితో పాటు.. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్ కోచ్ గా కొనసాగుతాడు. కోచ్కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. టీమ్ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడు. అలాగే స్పెషలిస్ట్ కోచ్లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యతఅర్హతలుకనీసం 30 టెస్ట్ మ్యాచ్లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదంటే.. టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్గా కనీసం 2 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ అ జట్లకు ప్రధాన కోచ్గా కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాలి.బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.పై కండిషన్లలో ఏది ఉన్నా సరే.. దరఖాస్తు చేసుకోవచ్చు.ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్లేయర్టీమిండియా హెడ్ కోచ్ దరఖాస్తుల నేపథ్యంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఉన్నాడు‘‘టీమిండియా హెచ్ కోచ్ పదవిపై నేను ఆసక్తిగా ఉన్నాను. దీని గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. ప్రతి అంతర్జాతీయ కోచ్ పై నాకు అమితమైన గౌరవం ఉంది. ఎందుకంటే అందులో ఉండే ఒత్తిడి నాకు తెలుసు. కానీ ఇండియన్ టీమ్ కోచింగ్ అద్భుతమైన జాబ్. ఈ దేశంలో ఉన్న టాలెంట్ చూసిన తర్వాత కోచ్ పదవి అనేది ఆకర్షణీయంగా కనిపిస్తోంది’’ అని లాంగర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.లాంగర్ కెరీర్జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45 సగటుతో 7696 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ కోచ్ గా ఉన్నాడు. అతని కోచింగ్ లోనే 2021లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా కోచ్ గా ఉన్నాడు. గత రెండు సీజన్లలోనూ ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుకుంది.ఫారినర్కు ఛాన్స్ దక్కేనా?డంకన్ ఫ్లెచర్ తర్వాత గత పదేళ్లలో మరో విదేశీ కోచ్ ను నియమించలేదు. కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ ఈ బాధ్యతను చేపట్టారు. దీంతో.. బీసీసీఐ మరోసారి విదేశీ కోచ్ ను నియమిస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే ఈసారి ఓ విదేశీ కోచ్ ను నియమించే అవకావాలను కూడా కొట్టిపారేయలేం అన్నట్లుగా బీసీసీఐ సెక్రటరీ జై షా మాటలను బట్టి అర్థమవుతోంది. -
కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్లోనూ అలా!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. భార్య ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధావన్ కొడుకు జొరావర్కు కూడా దూరమయ్యాడు.జొరావర్ ప్రస్తుతం తన తల్లి దగ్గరే ఆస్ట్రేలియాలో ఉంటున్న కారణంగా ధావన్ కనీసం అతడిని నేరుగా కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కుమారుడిని తలచుకుంటూ ధావన్ భావోద్వేగ పోస్టులు పెడుతూ ఉన్నాడు. మరోవైపు.. టీమిండియాలోనూ ధావన్కు చోటు కరువైంది.యువ ఓపెనర్లు శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లతో పోటీలో వెనుకబడ్డ ధావన్.. 2022లో ఆఖరిసారిగా బంగ్లాదేశ్తో సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున వన్డే ఆడాడు.ఆ తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత ఆసియా క్రీడలు- 2023 జట్టులో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహిస్తాడని విశ్లేషకులు భావించగా.. బీసీసీఐ మాత్రం మరోసారి ఈ ఢిల్లీ బ్యాటర్కు మొండిచేయి చూపింది.ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. అతడి నేతృత్వంలో భారత్ స్వర్ణం సాధించింది. ఇదిలా ఉంటే.. అసలే కొడుకుకు దూరమై.. టీమిండియాలో చోటు కరువైన శిఖర్ ధావన్కు ఐపీఎల్-2024లోనూ కష్టాలే ఎదురయ్యాయి.పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ తొలి ఐదు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండగలిగాడు. భుజం నొప్పి కారణంగా మిగతా మ్యాచ్లకు గబ్బర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ పంజాబ్ను ముందుకు నడిపించాడు.అయితే, ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఇదిలా ఉంటే.. గబ్బర్ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘జీవితంలోని చిన్న సంతోషాలు ఇలా వీటితో కలిసి ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ధావన్ క్యాప్షన్ ఇచ్చాడు.ఇది చూసిన గబ్బర్ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘పైకి నవ్వుతున్నా.. నీ మనసు లోతుల్లో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోగలం’’ అంటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో ధావన్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి కామెంట్లు చేస్తున్నారు. -
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
సన్రైజర్స్ మాజీ పేసర్, టీమిండియా బౌలర్ సిద్దార్థ్ కౌల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2024 సీజన్ కోసం నార్తంప్టన్షైర్ కౌంటీ ఇతన్ని ఎంపిక చేసుకుంది. ఈ మేరకు నార్తంప్టన్షైర్ కౌంటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మే 10 నుంచి గ్లోసెస్టర్షైర్తో జరుగబోయే మ్యాచ్లో సిద్దార్థ్ నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. సిద్దార్థ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ ట్రెమెయిన్కు ప్రత్యామ్నాంగా సిద్దార్థ్ను నార్తంప్టన్షైర్ ఎంపిక చేసుకుంది. 33 ఏళ్ల సిద్దార్థ్ 2023 సీజన్ వరకు ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. గత సీజన్లో అతను ఆర్సీబీకి ఆడాడు. సిద్దార్థ్ ఐపీఎల్ అరంగేట్రం సీజన్లో కేకేఆర్కు, ఆతర్వాత 2013-2014 వరకు ఢిల్లీ డేర్డెవిల్స్కు.. 2016-2021 వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. సన్రైజర్స్కు ఆడుతున్నప్పుడు సిద్దార్థ్ చాలా పేరు వచ్చింది. అక్కడి ప్రదర్శనలతోనే అతను టీమిండియాకు ఎంపికయ్యాడు. దేశవాలీ క్రికెట్లో పంజాబ్కు ఆడే సిద్దార్థ్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇతను పంజాబ్ తరఫున 59 మ్యాచ్ల్లో 205 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. సిద్దార్థ్ టీమిండియా ఛాంపియన్గా నిలిచిన 2008 అండర్-19 ప్రపంచకప్లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మెగా టోర్నీలో యువ భారత్ విరాట్ కోహ్లి సారథ్యంలో టైటిల్ గెలిచింది. టీమిండియా తరఫున 3 వన్డేలు, 2 టీ20లు ఆడిన సిద్దార్థ్ ఐపీఎల్ కెరీర్లో 55 మ్యాచ్లు ఆడి 58 వికెట్లు పడగొట్టాడు. -
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టును ఏప్రిల్ 30న ప్రకటించారు. ఈ జట్టులో 15 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఈ జట్టుకు సారధిగా వ్యవహరించనుండగా.. హార్దిక్ అతనికి డిప్యూటీగా ఎంపికయ్యాడు. రెగ్యులర్ జట్టులో విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లు ఉండగా.. శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. అందరూ ఊహించిన విధంగానే ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబేలకు చోటు దక్కింది. యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చహల్, అర్షదీప్ సింగ్, సిరాజ్ మిగతా సభ్యులుగా ఎంపికయ్యారు.ఈ జట్టును ప్రకటించిన అనంతరం పలువురు ఆటగాళ్లకు అన్యాయం (19 మంది సభ్యుల జట్టులో చోటు దక్కక పోవడంపై) జరిగిందని సోషల్మీడియా గగ్గోలు పెట్టింది. మాజీలు, విశ్లేషకులు రింకూ సింగ్, కేఎల్ రాహుల్, రుతురాజ్, రియాన్ పరాగ్, నటరాజన్, రవి భిష్ణోయ్ లాంటి ఆటగాళ్లను పక్కకు పెట్టడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రింకూ సింగ్ విషయంలో కొందరు మాజీలు ఏకంగా సెలక్టర్లనే తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ గైడ్ విజ్డన్ ప్రపంచకప్కు ఎంపిక కాని అర్హులైన ఆటగాళ్లతో ఓ జట్టును ఎంపిక చేసింది.ఈ జట్టుకు కేఎల్ రాహుల్ సారధిగా ఎంపికయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆయా ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా మిగతా జట్టు సభ్యుల ఎంపిక జరిగింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, వన్డౌన్లో రుతురాజ్ గైక్వాడ్, నాలుగో స్థానంలో రియాన్ పరాగ్, ఐదో ప్లేస్లో తిలక్ వర్మ, ఆరో స్థానంలో శశాంక్ సింగ్, ఆల్రౌండర్ కోటాలో విశాఖ చిన్నోడు నితీశ్ కుమార్ రెడ్డి, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.. పేసర్లుగా హర్షిత్ రాణా, నటరాజన్ ఎంపికయ్యాడు. ఈ జట్టుకు విజ్డన్ భారత-బి జట్టుగా నామకరణం చేసింది. -
పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐ కండిషన్ ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్.. మెగా టోర్నీని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే కరాచీ, లాహోర్, రావల్పిండిలను వేదికలుగా ఖరారు చేసింది.అవకాశమే లేదుఈ నేపథ్యంలో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? అన్న సందేహాలు తలెత్తాయి. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత జట్టు పాక్లో పర్యటించే అవకాశమే లేదని విశ్లేషకులు అంటున్నారు.గతంలో ఆసియా వన్డే కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దక్కించుకున్నప్పటికీ.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా ఆసియా కప్లో భారత జట్టు తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడిన విషయం తెలిసిందే.బీసీసీఐ స్పందన ఇదేఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత ప్రభుత్వం ఎలా చెబితే మేము అలా నడుచుకుంటాం.కేంద్రం అనుమతినిస్తేనే టీమిండియాను పాకిస్తాన్కు పంపిస్తాం. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టే మేము ముందుకు వెళ్తాం’’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో రోహిత్ సేన విజేతగా నిలవగా.. శ్రీలంక రన్నరప్తో సరిపెట్టుకుంది.ఇక ఆఖరిసారి 2017లో నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్గా నిలిచిన పాకిస్తాన్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై ఈవెంట్ జరుగనుండటం బాబర్ ఆజం బృందానికి సానుకూలాంశంగా పరిణమించింది.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్#WATCH | Delhi: On the Champion Trophy to be held in Pakistan next year, BCCI vice-president Rajeev Shukla said, "In the case of the Champion Trophy, we will do whatever the Government of India will tell us to do. We send our team only when the Government of India gives us… pic.twitter.com/TeA3dZ5Twn— ANI (@ANI) May 6, 2024 -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
టీమిండియా సారధి రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకోనున్నాడు. త్వరలో ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్కప్కు ఎంపికైన హిట్మ్యాన్ ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్లకు ఎంపికైన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. 2007 ఎడిషన్ నుంచి వరుసగా అన్ని ఎడిషన్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. తొలి ప్రపంచకప్ ఛాంపియన్ జట్టైన టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఆతర్వాత 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ఎడిషన్లలోనూ భాగమయ్యాడు. తదుపరి ప్రపంచకప్ ఎడిషన్ హిట్మ్యాన్కు తొమ్మిదో ఎడిషన్ కానుంది. ప్రపంచ క్రికెట్లో బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ ఉల్ హసన్ కూడా తొలి ఎనిమిది ఎడిషన్లలో పాల్గొన్నాడు. బంగ్లా ప్రపంచకప్ జట్టును ప్రకటించాల్సి ఉంది. రాబోయే ప్రపంచకప్లో షకీబ్ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. వయసు పైబడిన రిత్యా అతను ప్రపంచకప్ ఆడతాడో లేదో తెలీదు. టీ20 ప్రపంచకప్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఘనత కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది. హిట్మ్యాన్ ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 39 మ్యాచ్లు ఆడాడు. పొట్టి ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత విరాట్ కోహ్లి.. అత్యధిక వికెట్ల రికార్డు షకీబ్ పేరిట ఉన్నాయి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ తొమ్మిదో ఎడిషన్ ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ఈ టోర్నీ జరుగనుంది.తొలి మ్యాచ్ యూఎస్ఏలోని డల్లాస్ నగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్లో ఆతిథ్య యూఎస్ఏ జట్టు.. కెనడాతో తలడనుంది.మెగా టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో టీమిండియా.. ఐర్లాండ్తో తలపడుతుంది. ప్రపంచకప్లో బిగ్ ఫైట్, దాయాదుల సమరం జూన్ 9న జరుగునుంది. ఈ మెగా సమరానికి న్యూయార్క్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. -
రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో రోహిత్ ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడని.. దాంతో సరదాగా అతడిని తాము ఏడిపించేవాళ్లమని పేర్కొన్నాడు.అయితే, రోహిత్కు మాత్రం అందరితో కలిసి ఉండటం ఇష్టమని.. అతడు గొప్ప మనసున్న వ్యక్తి అంటూ యువీ కొనియాడాడు. ఈసారి రోహిత్ శర్మ కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఇంత వరకూ నో ఐసీసీ టైటిల్స్!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ టైటిల్ అందించలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2022 టీ20 ప్రపంచకప్లో సెమీస్లోనే ఇంటిబాట పట్టిన భారత్.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ చేతులెత్తేసింది.ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లోనూ బోల్తాపడి తృటిలో ట్రోఫీని చేజార్చుకుంది. ద్వైపాక్షిక సిరీస్లు, ఆసియా వన్డే కప్-2023 మినహా ఒక్క మెగా ఈవెంట్లోనూ రోహిత్ సేన ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.రోహిత్కు ఇంగ్లిష్ రాదుఈ క్రమంలో ప్రస్తుతం అందరి కళ్లు టీ20 ప్రపంచకప్-2024 మీదే ఉన్నాయి. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఈసారైనా టైటిల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలుకానున్న ఈ ఐసీసీ టోర్నీకి యువరాజ్ సింగ్ అంబాసిడర్గా ఎంపికైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడుతూ యువీ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి అసలు ఇంగ్లిష్ రాదు. ముంబైలోని బోరివలీ వీధుల నుంచి వచ్చిన వాడు. చాలా సరదాగా ఉంటాడు.ఇంగ్లిష్ విషయంలో మాత్రం అతడిని మేము ఏడిపించేవాళ్లం. భాష సంగతి పక్కనపెడితే అతడి మనసు మాత్రం వెన్న. ఎంత ఎదిగినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. రోహిత్ శర్మలో గొప్ప గుణం అదే.నా బెస్ట్ ఫ్రెండ్ తాను సరదాగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న వాళ్లకు కూడా వినోదం పంచుతాడు. గొప్ప నాయకుడు. క్రికెట్ రంగంలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో రోహిత్ కూడా ఒకడు.ఈసారి రోహిత్ శర్మ వరల్డ్కప్ ట్రోఫీ ఎత్తాలని.. వరల్డ్కప్ మెడల్ మెడలో వేసుకుంటే చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇందుకు వందకు వంద శాతం అర్హుడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.అతడే సరైన కెప్టెన్ ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా ఉండటం బీసీసీఐ తీసుకున్న సరైన నిర్ణయమని ఈ సందర్భంగా యువీ అన్నాడు. ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు గెలిచిన రోహిత్ లాంటి వ్యక్తి టీ20 వరల్డ్కప్-2024లోనూ భారత్ను ముందుకు నడిపించడం సానుకూలాంశమని పేర్కొన్నాడు.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే! -
వరుసగా నాలుగో టీ20లో టీమిండియా జయకేతనం
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్లో జయకేతనం ఎగురవేసింది. నిన్న (మే 6) జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 56 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ (39), స్మృతి మంధన (22), హేమలత (22), రిచా ఘోష్ (24) రాణించడంతో 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్ అనంతరం మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 125 పరుగులుగా నిర్దారించారు. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన బంగ్లాదేశ్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వరుసగా నాలుగో మ్యాచ్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లు దీప్తి శర్మ (3-0-13-2), ఆశా శోభన (3-0-18-2), రాధా యాదవ్ (3-1-12-1), పూజా వస్త్రాకర్ (3-0-15-1) బంగ్లా బ్యాటర్లను వణికించారు. ఆ జట్టు ఇన్నింగ్స్లో దిలారా అక్తెర్ (21) టాప్ స్కోరర్గా నిలిచింది.నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ మే 9న జరుగనుంది. ఈ మ్యాచ్లో కూడా భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. టీ20 ప్రపంచకప్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈ సిరీస్ విజయం మాంచి బూస్టప్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. -
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
మహిళల టీ20 వరల్డ్కప్ 2024 ఎడిషన్ ఫిక్చర్లు, గ్రూప్ల వివరాలను ఐసీసీ ఇవాళ (మే 5) ప్రకటించింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్తో మొదలవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడతాయి.గ్రూప్-ఏలో చిరకాల ప్రత్యర్దులు భారత్, పాక్లతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, క్వాలిఫయర్-1 ఉండగా.. గ్రూప్ బిలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్-2 జట్లు పోటీపడనున్నాయి. రెండు గ్రూప్ల్లోని జట్లు తమతమ గ్రూప్ల్లోని ఇతర జట్లతో చెరో మ్యాచ్ ఆడతాయి. గ్రూప్ దశ అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరుగుతుంది. రెండు సెమీస్లకు, ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డేస్ ఉన్నాయని ఐసీసీ ప్రకటించింది. 19 రోజుల పాటు జరిగే ఈ మెగా సమరం ఢాకా, సిల్హెట్ మైదానాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్లు జరుగనున్నాయి. ఫిక్చర్స్ లాంచింగ్ ప్రోగ్రాంను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్, బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తాన్ ప్రారంభించారు.దాయాదుల సమరం ఎప్పుడంటే.. పొట్టి ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. ఈ మ్యాచ్కు సిల్హెట్ మైదానం వేదిక కానుంది. భారత్ మ్యాచ్లు అక్లోబర్ 4 (న్యూజిలాండ్), 9 (క్వాలిఫయర్-1), 13 (ఆస్ట్రేలియా) తేదీల్లో జరుగనున్నాయి.మరోసారి హాట్ ఫేవరెట్గా ఆసీస్..డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. మహిళల పొట్టి ప్రపంచకప్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు జరగగా.. ఆసీస్ ఏకంగా ఆరుసార్లు జగజ్జేతగా నిలిచింది. 2009లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాగా.. తొలి ఎడిషన్లో ఇంగ్లండ్.. 2016 ఎడిషన్లో వెస్టిండీస్ విజేతలుగా నిలిచాయి. 2016 ఎడిషన్లోనూ ఆసీస్ ఫైనల్ వరకు చేరింది అయితే తుది సమరంలో విండీస్ ఆసీస్కు ఊహించని షాక్ ఇచ్చి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఆసీస్ 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఎడిషన్లలో విజేతగా నిలువగా.. భారత్ 2020లో ఫైనల్ దాకా వెళ్లి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. -
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
ఐసీసీ మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. టీమిండియాను వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23 టైటిల్ గెలిచిన కంగారూ జట్టు 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రన్నరప్ టీమిండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.ఇక ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయినా వన్డే, టీ20లలో మాత్రం టాప్ ర్యాంకు పదిలంగా ఉంది.పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ సేన ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-51. ఆస్ట్రేలియా- 124 రేటింగ్ పాయింట్లు2. ఇండియా- 120 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 105 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 103 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 96 రేటింగ్ పాయింట్లు.మెన్స్ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా -122 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 116 రేటింగ్ పాయింట్లు3. సౌతాఫ్రికా- 112 రేటింగ్ పాయింట్లు4. పాకిస్తాన్- 106 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 101 రేటింగ్ పాయింట్లుమెన్స్ టీమ్ టీ20 ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా- 264 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 257 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 252 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 250 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 250 రేటింగ్ పాయింట్లుచదవండి: -
సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాను అనుకోని దుర్ఘటనలు వెంటాడుతూ ఉన్నాయి. 2020 ఐపీఎల్ సీజన్ జరుగుతుండగా.. రైనా మేనమామ కుటుంబం మొత్తాన్ని దోపిడి దొంగలు అతి కిరాతకంగా చంపేయగా.. తాజాగా మరో మేనమామ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా జిల్లా పఠాన్కోట్-మండియా జాతీయ రహదారిపై రైనా కజిన్ (మామ కొడుకు) సౌరభ్ కుమార్ (29) స్కూటర్పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ట్యాక్సీ ఇతని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌరభ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాద సమయంలో సౌరభ్తో పాటు ఉన్న మరో వ్యక్తి కూడా చనిపోయాడు.సౌరభ్తో పాటు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పేరు శుభమ్ (19) అని సమాచారం. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ పేరు షేర్ సింగ్. ప్రస్తుతం షేర్ సింగ్ స్థానిక పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. -
గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాలపై మాజీ కెప్టెన్ క్రిష్టమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. తమకు ఇష్టమైన ఆటగాళ్ల ప్రదర్శన బాగా లేకపోయినా వారికి వరుస అవకాశాలు ఇస్తోందంటూ మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.తమకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసేందుకు.. అర్హత కలిగిన ఆటగాళ్లను పక్కనపెట్టడం ద్వంద్వనీతికి నిదర్శనం అంటూ బీసీసీఐ విధానాలను విమర్శించాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది.ఐర్లాండ్తో జూన్ 5 నాటి మ్యాచ్తో ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.శుబ్మన్ గిల్ అసలు ఫామ్లోనే లేడుఇందులో ఓపెనర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చోటు దక్కించుకోగా.. శుబ్మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘‘శుబ్మన్ గిల్ అసలు ఫామ్లోనే లేడు.అయినా అతడికి జట్టులో స్థానం కల్పించారు. నిజానికి రుతురాజ్ గైక్వాడ్కు టీమ్లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. 17 ఇన్నింగ్స్లో 500 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టు మీద సెంచరీ చేశాడు.కానీ సెలక్టర్లకు శుబ్మన్ గిల్ మాత్రమే కనిపిస్తాడు. వరుసగా విఫలమైనా అతడికే ఛాన్సులు ఇస్తారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఏ ఫార్మాట్లోనైనా వరుస వైఫల్యాలు జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నార్థకం చేయలేవు.తమకు నచ్చిన ఆటగాళ్లకేసెలక్షన్ విషయంలో ఫేవరిటిజం ఉంది. తమకు నచ్చిన ఆటగాళ్లకే సెలక్టర్లు అవకాశం ఇచ్చారు’’ అంటూ తూర్పారబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ చీకి చిక్కా వేదికగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్లో కలిపి 509 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు.మరోవైపు.. శుబ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా, ఆటగాడిగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 320 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో చిక్కా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. వెంటనే డకౌటయ్యాడు! వీడియో “Gill playing ahead of Rutu baffles me. Be is out of form and Rutu has had a better t20i career than gill. Gill will keep failing and he ll keep getting chances, he has favouritism of the selectors, this is just too much of favouritism” Krishnamachari Srikanth in his YT vid pic.twitter.com/PJmeiihxVx— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 (@SergioCSKK) May 1, 2024 -
చైనాతో భారత్ ‘ఢీ’
చెంగ్డూ (చైనా): ప్రతిష్టాత్మక థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీఫైనల్ బెర్త్ కోసం 10 సార్లు చాంపియన్ చైనాతో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 1–4తో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో భారత నంబర్వన్ ప్రణయ్ 61 నిమిషాల్లో 13–21, 21–12, 21–12తో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఆంథోనీ సినిసుక జిన్టింగ్ను ఓడించాడు. రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 77 నిమిషాల్లో 22–24, 24–22, 19–21తో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ జంట చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్లో లక్ష్య సేన్ 65 నిమిషాల్లో 18–21, 21–16, 17–21తో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీ చేతిలో ఓటమి పాలయ్యాడు. నాలుగో మ్యాచ్లో ధ్రువ్ కపిల–సాయిప్రతీక్ జోడీ 20–22, 11–21తో లియో కార్నాండో–డేనియల్ మార్టిన్ జంట చేతిలో పరాజయం పాలైంది. చివరిదైన ఐదో మ్యాచ్లో శ్రీకాంత్ 21–19, 22–24, 14–21తో ద్వి వర్దాయో చేతిలో ఓడిపోయాడు. గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గి అగ్రస్థానంలో నిలువగా... భారత్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో చైనాతో భారత్; మలేసియాతో జపాన్; కొరియాతో ఇండోనేసియా; చైనీస్ తైపీతో డెన్మార్క్ తలపడతాయి. మరోవైపు మహిళల టీమ్ టోర్నీ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్స్లో నేడు జపాన్తో భారత్; డెన్మార్క్తో చైనా... శుక్రవారం ఇండోనేసియాతో థాయ్లాండ్; చైనీస్ తైపీతో కొరియా పోటీపడతాయి. -
నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
టీ20 వరల్డ్కప్ 2024 కోసం టీమిండియాను నిన్న (ఏప్రిల్ 30) ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే మెజార్టీ శాతం ఎంపికలు జరిగినప్పటికీ.. రింకూ సింగ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిపై శీతకన్ను చూపడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సెలెక్టర్లు రింకూను ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారు. రింకూ సింగ్కు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై చాలామంది మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రింకూ లాంటి మ్యాచ్ ఫినిషర్ను వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయనందుకు సెలెక్టర్లను నిందించారు. ఈ క్రమంలో రింకూ సింగ్ తండ్రి ఖన్చంద్ర సింగ్ స్పందించాడు.A heartbreaking video. 💔Rinku Singh's father talking about the exclusion of Rinku from the main squad. pic.twitter.com/Q2MuBmx2rp— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2024 ఓ స్థానిక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ ఇలా అన్నాడు. రింకూ వరల్డ్కప్ జట్టులో ఉంటాడని మాకు పూర్తి నమ్మకం ఉండింది. సంబురాలు చేసుకునేందుకు స్వీట్లు, టపాసులు కూడా తెచ్చుకున్నాం. రింకూ వరల్డ్కప్ జట్టుకు ఎంపికవడమే కాకుండా తుది జట్టులో కూడా ఉంటాడని ఊహించాం. మా దురదృష్టం కొద్ది అలా జరగలేదు. రింకూ గుండె పగిలిపోయినంత పనైపోయింది. రింకూ ఈ విషయంలో తన తల్లికి చాలా సర్దిచెప్పాడు. 15 మందిలో లేనపోయినా జట్టుతో పాటు వెళ్తానని ఆమెతో చెప్పాడు. కాగా, 26 ఏళ్ల రింకూ టీమిండియా తరఫున 15 టీ20ల్లో 176.2 స్ట్రయిక్రేట్తో 89 సగటున 356 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.టీ20 వరల్డ్కప్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాట్రావెలింగ్ రిజర్వ్: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ -
టీమిండియాకు నో ఛాన్స్.. వరల్డ్కప్ సెమీస్కు చేరేది ఆ నాలుగు జట్లే: మైఖేల్ వాన్
టీ20 వరల్డ్కప్ 2024 ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టోర్నీ విజేతపై క్రికెట్ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు తమతమ అంచనాలను, అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పలానా జట్టు జగజ్జేతగా నిలుస్తుందని కొందరంటుంటే.. ఈ ఈ జట్లు సెమీస్కు చేరతాయని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా చాలామంది వ్యాఖ్యాతల లాగే వరల్డ్కప్పై తన అంచనాలను వెల్లడించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఈసారి సెమీఫైనల్స్కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఈసారి ఫైనల్ ఫోర్కు చేరడం కష్టమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వాన్ చెప్పిన జోస్యంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వాన్కు టీమిండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని కొట్టిపారేస్తున్నారు. టీమిండియా లాంటి పటిష్టమైన జట్టు ఏ ప్రాతిపదిన సెమీస్కు చేరదో విశ్లేషించాలని సూచిస్తున్నారు. వరల్డ్కప్లో పాల్గొనే టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని.. సెమీస్కు కాదు, ఈసారి ఏకంగా టైటిలే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాపై అవాక్కులు చవాక్కులు పేలడం అలవాటుగా మార్చుకున్న వాన్కు తగు రీతిలో చురకలంటిస్తున్నారు. వాస్తవానికి ఈసారి వరల్డ్కప్ సెమీఫైనలిస్ట్లకు అంచనా వేయడం చాలా కష్టం. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వరల్డ్కప్లో టఫ్ ఫైట్ నెలకొంది. అన్ని జట్లు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా, అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. దీంతో ఏ జట్టు సెమీఫైనల్కు చేరుతుందో చెప్పడం చాలా కష్టం. వాన్ లాంటి అనుభజ్ఞులైన వ్యాఖ్యాతలు అశాస్త్రియమైన అంచనాలు వేసి క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ కోసం న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లను ఇదివరకే ప్రకటించారు. జట్ల ప్రకటనకు ఇవాళే ఆఖరి తేదీ (మే 1) కావడంతో మరికొన్ని గంటల్లో అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించవచ్చు. పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఉగాండ, వెస్టిండీస్, పపువా న్యూ గినియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ దేశాలు తమ వరల్డ్కప్ జట్లు ప్రకటించాల్సి ఉంది. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు
కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా జూన్ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్పై వేటు పడింది. చాలాకాలం తర్వాత చహల్ టీ20 జట్టులోకి రాగా.. సిరాజ్, అర్ష్దీప్ తమ స్థానాలు నిలుపుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయని యశస్వి జైస్వాల్పై సెలెక్టర్లు విశ్వాసముంచగా.. వరల్డ్కప్ బెర్త్పై గంపెడాశలు పెట్టుకున్న రింకూ సింగ్ ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపియ్యాడు. శుభ్మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ కూడా ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపియ్యారు.టీ20 వరల్డ్కప్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాట్రావెలింగ్ రిజర్వ్: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ -
T20 WC: కోహ్లి ఒక్కడు ఉంటేనే గెలుస్తారా?.. అతడి కంటే..
‘‘విరాట్ కోహ్లి ఒక్కడే టీమిండియాకు వరల్డ్కప్ అందించగలడా? గతేడాది వన్డే ప్రపంచకప్ టోర్నీలో అతడు అద్భుతంగా ఆడాడు. గణాంకాలు సైతం చాలా బాగున్నాయి.ఎన్నో రికార్డులు సాధించాడు కూడా. ఏ టోర్నీలోనైనా అతడికి ఇవి అలవాటే. అయితే, సెలక్టర్లు అతడి అనుభవానికి ఓటేస్తారా?.. నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తారా? అన్నదే ప్రశ్న.నిజానికి ఈసారి వరల్డ్కప్ టోర్నీ అమెరికా- వెస్టిండీస్లో జరుగనుంది. కరేబియన్ దీవుల్లోనైనా పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. కానీ అమెరికా పిచ్లపై ఏ జట్లకు పెద్దగా అవగాహన లేదు.ఇక విండీస్ పిచ్లపై మిడిల్ ఓవర్లలో కచ్చితంగా ఎక్కువ శాతం స్పిన్నర్లే అటాక్కు దిగుతారు. పవర్ ప్లే ముగిసిన వెంటనే వారు వరుస ఓవర్లు బౌల్ చేసే అవకాశం ఉంటుంది. నిజం చెప్పాలంటే.. అక్కడ స్పిన్నర్లను ఎదుర్కోవడం విరాట్ కోహ్లికి సవాలే.అలాంటపుడు శివం దూబే, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు మనకు గుర్తుకు వస్తారు. స్పిన్ బౌలింగ్లో వీళ్లు చితక్కొట్టగలరు. టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాను ఓడించిన విషయం గుర్తుండే ఉంటుంది.గతేడాది నవంబరులో వరల్డ్ చాంపియన్స్ అయిన మమ్మల్ని 4-1తో వాళ్లు చిత్తు చేశారు. అప్పుడు రాణించిన రుతురాజ్ గైక్వాడ్ గురించి కనీసం ఒక్కరు కూడా చర్చించకపోవడం విచారకరం.నాటి సిరీస్లో జైస్వాల్ సైతం సెంచరీలు బాది సత్తా చాటాడు. కేవలం అనుభవానికి పెద్ద పీట వేయకుండా.. ఎవరైతే వరల్డ్కప్ టోర్నీలో గెలిపించగల సత్తా కలిగి ఉంటారో వారినే ఆస్ట్రేలియా క్రికెట్ ఎంపిక చేస్తుంది.మరి బీసీసీఐ అనుభవం వైపు మొగ్గు చూపుతుందా? లేదంటే యువ హిట్టర్లకు అవకాశం ఇస్తుందో తెలియదు’’ అంటూ ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.వరల్డ్కప్లో టీమిండియా ఓపెనింగ్ జోడీగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేస్తాడన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు హెడెన్.అనుభవం కంటే కూడా ప్రస్తుతం జట్టుకు అవసరమైన ఆటగాళ్లను ఏ స్థానంలో ఆడిస్తే బాగుంటుందో బీసీసీఐ సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. కాగా కోహ్లి ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరఫున ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్లో కలిపి 500 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ శతకం కూడా ఉండటం విశేషం. అయితే, స్ట్రైక్రేటు 147.49గా నమోదైన నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
HBD Rohit Sharma: హిట్మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే!
-
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్ కూడా కాదనలేడు!
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం నాటి మ్యాచ్లో 20 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(98), డారిల్ మిచెల్(52)తో కలిసి చెన్నై సూపర్ కింగ్స్కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్-2024లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్కే తరఫున మిడిలార్డర్ బ్యాటర్గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్పై స్పందించిన భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్ ఎలెవన్లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్గానీ.. మేనేజ్మెంట్ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్గా హిట్టింగ్ ఆడే బ్యాటర్ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement