-
Lok sabha elections 2024: మూడో దశలో మహా ఫైట్
మహారాష్ట్రలో మూడో దశ లోక్సభ ఎన్నికల సమరం మహాయుతి, మహా వికాస్ అగాడీ రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. పశి్చమ మహారాష్ట్రలో ఏడు స్థానాలు, కొంకణ్, మరాఠ్వాడా నుంచి రెండేసి చొప్పున మొత్తం 11 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేనతో కూడిన అధికార మహాయుతి కూటమి ఒకవైపు.. కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన ఎంవీఏ మరోవైపు మోహరించాయి. పలుచోట్ల రెబెల్ అభ్యర్థులూ వాటికి సవాలు విసురుతున్నారు. ఉద్ధవ్, శరద్ వర్గాలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి... ఉస్మానాబాద్ మరాఠ్వాడా ప్రాంతంలో ప్రముఖ పట్టణం. దీని పేరును సర్కారు ఇటీవలే దారాశివ్గా మార్చింది. సిట్టింగ్ ఎంపీ ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్ శివసేన (ఉద్ధవ్) తరఫున పోటీలో ఉన్నారు. తుల్జాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాణా జగ్జీత్ సిన్హా భార్య అర్చనా పాటిల్ను మహాయుతి కూటమి బరిలో దింపింది. ఆమె ఇటీవలే ఎన్సీపీ (అజిత్) పారీ్టలో చేరి లోక్సభ టికెట్ సంపాదించారు. అర్చన మామ పదమ్సిన్హా పాటిల్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అజిత్ పవార్ భార్య సునేత్రకు సోదరుడు కూడా. నింబాల్కర్ కుటుంబంతోనూ వీరికి దగ్గరి బంధుత్వముంది. కానీ వీరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నింబాల్కర్ తండ్రిని చంపించినట్టు పదమ్సిన్హాపై ఆరోపణలున్నాయి! 2019 లోక్సభ ఎన్నికల్లో నింబాల్కర్ ఈ స్థానంలో రాణా జగ్జీత్ సిన్హాను ఓడించడం విశేషం. ఈసారి మహిళల ఓట్లు తనను గెలిపిస్తాయని అర్చన నమ్మకం పెట్టుకున్నారు.సాంగ్లి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్ కాక పాటిల్ మళ్లీ బరిలో ఉన్నారు. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ టికెట్ ఆశించగా పొత్తులో భాగంగా ఈ స్థానం శివసేన (ఉద్ధవ్)కు వెళ్లింది. దాంతో ఆయన రెబెల్గా పోటీకి దిగారు. శివసేన (ఉద్ధవ్) నుంచి రెజ్లర్ చంద్రహర్ పాటిల్ బరిలో ఉన్నారు. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లను విశాల్ చీలుస్తారని, అది బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.సోలాపూర్ 2014, 2019ల్లో ఇక్కడ వరుసగా బీజేపీయే నెగ్గింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతీ షిండే బరిలో ఉండటమే అందుకు కారణం. నిజానికి ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చివరిదాకా ప్రయత్నించి విఫలమైంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సాత్పుతే రంగంలోకి దిగారు. ప్రణతి కూడా సోలాపూర్ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కావడం విశేషం! ఆమె తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా బీజేపీ కొనసాగించింది. 2014లో శరద్ బాన్సోడ్, 2019లో జైసిద్ధేశ్వర్ స్వామి బీజేపీ తరఫున గెలిచారు. ఆ రెండుసార్లూ ఓటమి చవిచూసింది సుశీల్కుమార్ షిండేనే! ఈసారి మజ్లిస్ ఇక్కడ అభ్యర్థిని ఉపసంహరించుకోవడం కాంగ్రెస్కు కలిసొచ్చే అంశం. సోలాపూర్, మాధా స్థానాల్లో విజయం కోసం చెమటోడ్చాల్సిందేనని బీజేపీ నేతలే అంగీకరిస్తుండటం విశేషం!సతారా మహాయుతి కూటమి తరఫున ఎన్సీపీ (శరద్ పవార్) నేత, కారి్మక నాయకుడు, ఎమ్మెల్సీ శశికాంత్ షిండే బరిలో ఉన్నారు. దాంతో కొల్హాపూర్ మాదిరిగానే ఇక్కడ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా ఛత్రపతి శివాజీ వంశీయుడు, రాజ్యసభ ఎంపీ ఉదయన్రాజే భొసాలేకు టికెటిచి్చంది. మహాయుతి కూటమి నుంచి ఈ స్థానంలో పోటీ చేయాలని తొలుత ఎన్సీపీ (అజిత్) భావించింది. ఉదయన్రాజే భోసాలే పోటీకి ఆసక్తి చూపడంతో ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది.రత్నగిరి–సింధుదుర్గ్ సిట్టింగ్ ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత వినాయక్ రౌత్ మళ్లీ బరిలో ఉన్నారు. ఆయనపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను బీజేపీ పోటీకి దింపింది. శివసేన రెండుగా చీలిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో రెండుసార్లుగా గెలుస్తూ వస్తున్న రౌత్కు ఈసారి విజయం తేలిక కాదంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గానికి చెందిన స్థానిక నేతలు, శ్రేణుల ఐక్యతకు ఈ ఎన్నిక పరీక్షగా మారింది.రాయగఢ్ ఇక్కడ పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కారే, శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి అనంత్ గీతే మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో అనంత్ గీతేపైనే తత్కారే 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు రెండు పర్యాయాలు వరుసగా అనంత్ గీతేనే ఇక్కడ గెలిచారు.మాధా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ సిన్హా నాయక్ నింబాల్కర్ మళ్లీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సంజయ్మామ విఠల్రావు షిండేపై 86 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ మళ్లీ నింబాల్కర్కు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ జిల్లా కార్యదర్శి ధైర్యశీల్ మోహిత్ పాటిల్ ఇటీవలే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి రంగంలోకి దిగి బీజేపీకి గట్టి సవాలు విసురుతున్నారు. మోహిత్కు స్థానికంగా బాగా పట్టుండటంతో ఇక్కడ బీజేపీ ఎదురీదుతోందని చెబుతున్నారు.అజిత్కూ ప్రతిష్టాత్మకమే ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బాబాయి శరద్ పవార్తో విభేదించి పార్టీని చీల్చి తన వర్గానికే అసలు ఎన్సీపీగా అధికారిక గుర్తింపు సాధించుకోవడం తెలిసిందే. రాయగఢ్, ఉస్మానాబాద్తో పాటు బారామతిలో విజయం ఆయనకు సవాలుగా మారింది. బారామతిలో అజిత్ భార్య సునేత్ర బరిలో ఉన్నారు. తన మరదలు, శరద్ పవార్ కూతురైన సిట్టింగ్ ఎంపీ సుప్రియా సులేతో ఆమె తలపడుతుండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘శివసేన, ఎన్సీపీ పార్టీల చీలికకు కారణం వారిపై ప్రేమ’
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీల చీలికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు తమ సొంత పార్టీల నుంచి చీలిపోవడానికి కోడుకు, కూతురి మీద చూపించిన ప్రేమే కారణమని అన్నారు. ఆదివారం భండారా జిల్లాలోని సకోలి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకంలో విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ పార్టీలను విభజిస్తుందన్న ఆరోపణలపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ‘శివసేన, ఎన్సీపీల్లో చీలికలు రావడానికి కారణం ఉద్ధవ్కు కొడుకు మీద, శరద్ పవార్కు కూతురు మీద ప్రేమే కారణం. కూటమిలోని మూడు పార్టీ మహారాష్ట్రకుఘ ఏం మంచి చేశారు’ అని అమిత్ షా ధ్వజమెత్తారు. మరోవైపు.. ఇటీవల ప్రధాని నరేంద్ర ఎన్నికల ప్రచారం పాల్గొని శివసేన(ఉద్ధవ్) పార్టీపై నకిలీ శివసేన అంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవల అమిత్ షా.. మహా వికాస్ ఆఘాడీను సరిపోలని విడి భాగాలతో కూడిన ఆటో రిక్షాతో పోల్చుతూ విమర్శలు చేశారు. ఇక.. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సాంగ్లీ, భీవండి, ముంబై సౌత్ సెంట్రల్ స్థానాలను కాంగ్రెస్ వదులుకున్న విషయం తెలిసిందే. సీట్ల పంపకంలో భాగంగా శివసేన(ఉద్ధవ్) 21 స్థానాలు,ఎన్సీపీ 10 స్థానాలు, కాంగ్రెస్ పది స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
శివసేన మోదీ డిగ్రీలా నకిలీ కాదు: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన నకిలీ శివసేన ఆరోపణలపై శివసేన( ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. మరాఠా భూమి పుత్రుల హక్కుల కోసం పోరాడటానికి బాలా సాహేబ్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారని అన్నారు. ‘మరాఠా భూమి పుత్రుల హక్కుల పోరాటం కోసం దివంగత నేత బాల్ ఠాక్రే శివసేనను స్థాపించారు. శివసేన పార్టీనే నకిలీ అంటే.. నరేంద్ర మోదీకి ఉన్న డిగ్రీ కూడా నకిలీనే’ అని ఉద్ధవ్ మండిపడ్డారు. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి 300 సీట్లను గెలుచుకుందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మహారాష్ట్రలోని ఓ ర్యాలీలో పాల్గొని ఉద్ధవ్ (శివసేన)పై విమర్శలు చేశారు. ఉద్ధవ్ శివసేన.. నకిలీ శివసేన పార్టీ అని అన్నారు. ‘ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పార్టీ డీఎంకే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చింది. కాంగ్రెస్, నకిలీ శివసేన(ఉద్ధవ్) కూడా మహారాష్ట్రలో ర్యాలీల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు’ అని ప్రధాని మండిపడ్డారు. ఇక..2022లో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసింది. ఏక్నాథ్ షిండే పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. అతనోపాటు వచ్చిన కొందరికి మంత్రి పదవులు కూడా కేటాయించారు. అసలైన శివసేన పార్టీ ఎవరిదని ఉద్ధవ్, షిండే వర్గాలు పిటిషన్లు వేశాయి. దీంతో కోర్టు అనుమతిలో ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. -
అందుకే ఉద్ధవ్కు రెబల్గా మారా: సీఎం ఏక్నాథ్ షిండే
నాగ్పూర్: బాలా సాహేబ్ ఠాక్రే స్థాపించిన శివసేనలో ఏక్నాథ్ షిండే రెబల్ నేతగా మారి.. బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. తాను ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్ నేతగా మారడానికి గల కారణాన్ని సీఎం ఏక్నాథ్ షిండే వివరించారు. ఆదివారం పార్టీ కార్యకర్తల మీటింగ్లో సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదు. కానీ, శివసేన పార్టీలో బాలా సాహేబ్ ఠాక్రే సిద్ధాంతాలకు రాజీపడటం వల్లే ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్గా మారాను. బాల సాహేబ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ స్నేహితుల్లా భావించేవారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం పార్టీ కార్యకర్తలను పని మనుషులుగా చూశారు’ అని సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. బలమైన నేతగా ఎదగాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేయాలన్నారు. ఇంట్లో కూర్చుంటే గొప్ప నేతగా ఎదగలేమని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. అదేవిధంగా ప్రతిపక్ష మహావికాస్ ఆఘాఢీకి అభివృద్ది చేయాలనే అజెండా లేదని అన్నారు. అధికార కూటమిలోని ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వస్తుందన్నారు. అలాగే విదర్భలోని అన్ని సీట్లను అధికార కూటమి కైవసం చేసుకుంటుందని సీఎం షిండే తెలిపారు. ఇక.. 2022 జూన్లో పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. అసలు శివసేన పార్టీ ఎవరిదని శివసేన చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బీజేపీకి షాక్.. శివసేనలోకి(ఉద్దవ్) సిట్టింగ్ ఎంపీ
ముంబై: లోక్సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. నార్త్ మహారాష్ట్రలోని జల్గావ్ ఎంపీ ఉన్మేష్ పాటిల్ ప్రతిపక్ష శివసేనలో(ఉద్ధవ్ వర్గం) చేరారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ వద్ద తన సహచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే జల్గావ్ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన ఉన్మేష్కు ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. స్మితా వాఘ్ను సీటు కేటాయించడంతో బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా శివసేన(ఉద్దవ్ వర్గం) ఇప్పటికే జల్గావ్ లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థుల రెండో జాబితాలో భాగంగా కరణ్ పవార్ను జల్గావ్ నుంచి బరిలోకి దింపింది. అతని పేరుతో పాటు మరో మూడు నియోజకవర్గాల అభ్యర్థులను(కళ్యాణ్ నుంచి వైశాలి దారేకర్, హత్యనంగలే నుంచి సత్యజీత్ పాటిల్, పాలఘర్ నుంచి భారతి కమ్డి) ప్రకటించింది. దీంతో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో భాగమైన ఈ పార్టీ ఇప్పటి వరకు 21 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పు కోసమే తాను శివసేనలో చేరినట్లు వెల్లడించారు. ప్రతీకారం కోసం కాదని అన్నారు. బీజేపీ యూజ్ అండ్ త్రో విధానాన్ని పాటిస్తుందని మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేసింది శివసైనికులేనని అన్నారు. అయితే జల్గావ్ లోక్సభకు శివసేన పటీ చేయడం ఇదే తొలిసారి అని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. 2019 వరకు అవిభక్త శివసేన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో భాగంగా ఉన్నప్పుడు బీజేపీ ఇక్కడి నుంచి పోటీ చేసిందని తెలిపారు. కాగా 48 లోక్సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు అయిదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
అభ్యర్థుల ప్రకటన.. ఉద్ధవ్ వర్గంపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు
ముంబై: మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శివసేన (ఉద్దవ్ వర్గం)పై కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ సంజయ్ నిరుపమ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. శివసేన వాయువ్య ముంబై అభ్యర్ధిని కిచిడీ ఛోర్ అంటూ మండిపడ్డారు. కాగా మహా వికాస్ అఘాడి కూటమిలో, ఎన్సీపీ(శరద్చంద్ర పవార్), కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పార్టీలు ఉన్నాయి. ఈ క్రమంలో శివసేన బుధవారం 17 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్ కూడా పట్టుబడుతున్న ముంబై సౌత్ సెంట్రల్ స్థానాన్ని అనిల్ దేశాయ్కి కేటాయించింది. వాయువ్య ముంబై నుంచి ఎంపీ గంజనన్ కీర్తికర్ కుమారుడు అమోల్ను శివసేన పోటీలోకి దింపింది. ఈ విషయంపై నిరుపమ్ స్పందిస్తూ.. అమోల్కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముంబై నార్త్-వెస్ట్ స్థానానికి అమోల్ కీర్తికర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం కూటమి ధర్మ ఉల్లంఘనగా పేర్కొన్నారు. శిసేన అభ్యర్థిని ‘కిచిడి చోర్గా అభివర్ణించారు. అలాంటి వారి కోసం తాము పనిచేయమని పేర్కొన్నారు. ‘ముంబైలోని ఆరు లోక్ సభ స్థానాల్లో అయిదు చోట్ల శివసేన పోటీ చేస్తుంది. కేవలం ఒక సీటును కాంగ్రెస్కు కేటాయించింది. దీన్ని బట్టి ముంబైలో కాంగ్రెస్ను మట్టికరిపించేందుకు శివసేన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఉండకూడదు. దీని వల్ల కాంగ్రెస్కు భారీ నష్టం జరుగుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవాలి. లేకపోతే శివసేనతో పొత్తు విరమించుకునే ఆలోచన చేయాలి. ఒకవేళ శివసేన తాము ఒంటరిగా పోరాడగలమని భావిస్తే అది తమ అతిపెద్ద తప్పు. శివసేన ఇలా జాబితాను ప్రకటించడం కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం కోసం వారం రోజులు వేచిచూస్తా. ఆ తర్వాత తను చేయాల్సింది చేస్తా’ నని పేర్కొన్నారు. చదవండి: లిక్కర్ స్కాం కేసు: కేజ్రీవాల్ పిటిషన్పై తీర్పు రిజర్వు.. కిచిడీ స్కామ్లో అమోల్కు సమన్లు అయితే శివసేన టికెట్ ఇచ్చిన అమోల్కు కిచిడీ కుంభకోణంలో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. కరోనా సమయంలో వలస కూలీలకు కిచిడీ పంపిణీ చేసేందుకు ఇచ్చిన కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆ కుంభకోణం విచారణలో భాగంగా తాజాగా చర్యలు చేపట్టింది. ఇక మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో 44 స్థానాలకు మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్ 16, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈలోపే శివసేన బుధవారం 17 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. అంతేగాక తమ పార్టీ 22 చోట్ల పోటీ చేయనున్నట్లు సంజయ్ రౌత్ ప్రకటించారు. -
శివసేన(యూబీటీ) తొలి జాబితా విడుదల.. 17 మందికి చోటు
ముంబై:లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ శివసేన (యూబీటీ) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే.. 17 మంది అభ్యర్థులను శివసేన(యూబీటీ) బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీనేత సంజయ్ రౌత్ జాబితాను ఎక్స్లో పోస్ట్ చేశారు. కీలకమైన ముంబై సౌత్ సెంట్రల్ పార్లమెంట్ స్థానాన్ని శివసేన (యూబీటీ) అనిల్ దేశాయ్కి కేటాయించింది. ఐదు సిట్టింగ్ అభ్యర్థులకు శివసేన(యూబీటీ) మళ్లీ అవకాశం కల్పించింది. ముంబై సౌత్- అరవింద్ సావంత్, ముంబై నార్తీస్ట్- సంజయ్ పాటిల్, ముంబై నార్ట్ వెస్- అమోల్ కిర్తికార్, థానే- రాజన్ విచారే, వినాయక్ రౌత్- రత్నగిరి సింధ్దుర్గ్, పర్బానీ-సంజయ్ జాదవ్, ఉస్మానాబాద్- ఓంరాజే నింబాల్కర్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా శివసేన (యూబీటీ) ఔరంగాబాద్లో మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరేను బరిలోకి దింపుతోంది. మాజీ కేంద్ర మంత్రులు అనంత్ గీతే( రాయ్గఢ్), అరవింద్ సావంత్(దక్షిణ ముంబై) నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.మహావికాస్ ఆఘాడీ భాగస్వామి కాంగ్రెస్ పట్టుబట్టిన సాంగ్లీ స్థానం నుంచి ఇటీవల పార్టీలో చేరిన రెజ్లర్ చంద్రహర్ పాటిల్ను పోటీకి దింపింది శివసేన(యూబీటీ). ముత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమై.. ఐదు విడతల్లో పోలింగ్ జరగనుంది. हिंदूहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या आशीर्वादाने आणि शिवसेना पक्ष प्रमुख श्री.उद्धवजी ठाकरे यांच्या आदेशाने शिवसेनेच्या 17 लोकसभा उमेदवारांची यादी जाहीर करण्यास येत आहे.. *मुंबई दक्षिण मध्य:श्री अनिल देसाई यांच्या उमेदवारीची घोषणा करण्यात येत आहे. इतर 16 उमेदवार… pic.twitter.com/nPg2RHimSF — Sanjay Raut (@rautsanjay61) March 27, 2024 -
బీజేపీ అవమానిస్తే.. మాతో చేరండి: నితిన్ గడ్కరీకి ఉద్ధవ్ సూచన
ముంబై: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరికి వచ్చే ఎన్నికల్లో లోక్సభ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో కాషాయ పార్టీ ఆయన్ను పక్కకు పెట్టేసిందా అనే ఊహాగానాలు లేవనెత్తుతున్నాయి. కనీసం రెండో జాబితాలో చోటు దక్కనుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో మహరాష్ట్ర ప్రతిపక్ష నేత, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే నితిన్ గడ్కరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవమానం జరిగితే ఆ పార్టీలో నుంచి బయటకు రావాలని సూచించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో విపక్షాలు విజయం సాధించనున్నాయని ఆశాభవం వ్యక్తం చేశారు. యవత్మాల్ జిల్లాలోని పూసాద్లో మంగళవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు బీజేపీని లక్ష్యంగా చేసుకొని అవినీతి ఆరోపణలు చేసిన మాజీ కాంగ్రెస్ నాయకుడు(ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు) కృపాశంకర్ సింగ్ వంటి వ్యక్తులు, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కాషాయ పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో ఉన్నారని... అదే నితిన్ గడ్కరీ పేరు మాత్రం లేదని అన్నారు. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం గడ్కరీతో మాట్లాడినట్లు చెప్పారు. ‘మళ్లీ చెబుతున్నా.. మిమ్మల్ని అవమానిస్తే.. బీజేపీని వీడి మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)లో చేరండి.. మీకు విజయాన్ని మేము అందిస్తాం.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిమ్మల్ని మంత్రిని చేస్తాం. అధికారులు కలిగిన పదవి ఇస్తాం’ అని పేర్కొన్నారు. కాగా ప్రతిపక్ష ఎంవీఏలో శివసేన(యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. చదవండి: ‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్’.. డీంఎంకే కొత్త ప్లాన్? -
ఉద్ధవ్ ఠాక్రేకు రాహుల్ గాంధీ ఫోన్.. సీట్ల పంపకంపై చర్చ!
ముంబై: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకం కసరత్తు విషయంలో వేగం పెంచుతోంది. ఈ క్రమంలో శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసిన సుమారు గంటసేపు మాట్లడినట్లు తెలుస్తోంది. భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ మాట్లాడటంపై ఇరు పార్టీల్లో సీట్ల పంపంకంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ముంబైలోని ఆరు లోక్సభ స్థానాల్లో.. ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్త్ సగ్మెంట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ సెంట్రల్ సీట్లను కలుపుకొని మొత్తం 18 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ సీట్ల సర్దుబాటు ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) మధ్య సీట్ల పంపకంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సీట్ల పంపకంపై మాట్లాడినట్లు సమాచారం. మహారాష్ట్రలోని 48 సీట్లలో 8 సీట్ల విషయంలో ఉన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఉద్ధవ్కు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి శివసేన గత 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో 48 సీట్లకు గాను 22 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. శివసేనలో చీలిక వచ్చి కొంత మంది ముఖ్యనేతలు ఏక్నాథ్షిండే వర్గంలో ఉండి బీజేపీలో చేరారు. అదే విధంగా మహాఘట్బంధన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఎన్సీపీలో సైతం చీలికలు వచ్చి అజిత్ పవార్ వర్గం బీజేపీలో చేరింది. మరోవైపు ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అశోక్ చవాన్, మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శివసేనతో సీట్ల పంపకం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్తో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఠాక్రేకు రాహుల్ కాల్ చేయటం చర్చనీయాంశంగా మారింది. -
చవాన్కు బీజేపీ రాజ్యసభ సీటు! ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరితే బీజేపీ ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చవాన్కు రాజ్యసభ సీటిస్తే బీజేపీ సైనికులను అవమానపరిచినట్లేనన్నారు. గతంలో ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ కుంభకోణంలో చవాన్పై ఆరోపణలు వచ్చినపుడు ప్రధాని మోదీ, ప్రస్తుత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సైనికులను చవాన్ అవమానపరిచారని చేసిన విమర్శలను ఉద్ధవ్ థాక్రే గుర్తు చేశారు. భారతరత్న అవార్డులపైనా థాక్రే స్పందించారు. బీజేపీ భారతరత్న దుకాణం పెట్టిందని, ఓట్ల కోసం పలు వర్గాలకు చెందిన వారికి ఆ పురస్కారం ఇస్తోందని విమర్శించారు. స్వామినాథన్కకు భారతరత్న ఇస్తే సరిపోదని వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సిఫారసులను అమలు చేయాలని కేంద్రానికి సూచించారు. ఇదీ చదవండి.. దీదీకి మద్దతుగా ప్రధానికి రాహుల్ లేఖ -
మహారాష్ట్ర పాలిటిక్స్లో మరో ట్విస్ట్.. థాక్రే వర్గానికి ఎదురుదెబ్బ?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో 14 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన (షిండే) చీఫ్ విప్ భరత్ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్పై ముంబై హైకోర్టు థాక్రే వర్గానికి, స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి హీటెక్కింది. వివరాల ప్రకారం.. 2022లో చీలిక తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని నిజమైన రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు, సీఎం ఏక్నాథ్ షిండే వర్గం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రతివాదులందరూ తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని గిరీష్ కులకర్ణి, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. 2022లో పార్టీ చీలిక తర్వాత ఫిరాయింపుల నిరోధక చట్టాల కింద ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలనే డిమాండ్ వచ్చింది. షిండేతో సహా అధికార వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాక్రే బృందం పిటిషన్లో డిమాండ్ చేసింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని షిండే డిమాండ్ చేశారు. అయితే, షిండే వెంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతూ శాసన సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ స్పీకర్ తిరస్కరించారు. శివసేన మొత్తం ఎమ్మెల్యేలు 57 మంది కాగా వారిలో అత్యధికులు (37 మంది) షిండేతో పాటే ఉన్నారని స్పీకర్ నిర్ధారించారు. ఉద్ధవ్ థాక్రే సవాల్.. ఇదిలా ఉండగా.. ఏది అసలైన శివసేననో బహిరంగ చర్ చద్వారా తేల్చుకుందామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, స్పీకర్ రాహుల్ నర్వేకర్లకు ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ఇచ్చిన రూలింగ్పై ఆయన మంగళవారం స్పందించారు. ‘నేను ఈ పోరాటాన్ని ప్రజా కోర్టులోకి తీసుకెళ్తా. ఈ పోరాటం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా అనేది తేలుతుంది’ థాక్రే స్పష్టం చేశారు. -
Shivsena Row: స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ థాక్రే
ముంబై: ఉద్ధవ్ థాక్రే శివసేన, షిండే శివసేన మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనే అసలైన శివసేన పార్టీ అని ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకార్ ఇటీవల రూలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ ఇచ్చిన రూలింగ్పై తాజాగా ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో పాటు పార్టీ వీడి షిండేతో పాటు వేరు కుంపట్టి పెట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని కూడా ఉద్ధవ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాగా, జూన్ 2022లో పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత రెండు శివసేన వర్గాలు ఒకరిపై ఒకరు స్పీకర్కు అనర్హత పిటిషన్లు ఇచ్చారు. షిండేతో పాటు వెళ్లిన మొత్తం 40 మంది ఎమ్మెల్యేలపైనా ఉద్ధవ్ వర్గం అనర్హత పిటిషన్లు వేయగా ఉద్ధవ్ వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలపై షిండే వర్గం అనర్హత పిటిషన్లు ఇచ్చింది. షిండే నేతృత్వంలోని పార్టీయే అసలైన శివసేన అని గుర్తిస్తూ ధనుస్సు బాణం గుర్తును ఎన్నికల కమిషన్ గతేడాది వారికే కేటాయించడం గమనార్హం. ఇదీచదవండి.. విమాన ప్రయాణికులు మాతో సహకరించాలి : సింధియా -
విధేయతే లేదు.. కేవలం రాజకీయమే: సంజయ్ రౌత్
ముంబయి: కాంగ్రెస్ పార్టీని వీడిన మిలింద్ దేవరాపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. ప్రస్తుత రోజుల్లో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీకి విధేయత అనేది ఉనికిలో లేదని చెప్పారు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరా గురించి కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం ఏం చేయాలో తెలిసిన గొప్ప నాయకుడని కొనియాడారు. " విధేయత, భావజాలం వంటి అంశాలు ఇప్పుడు లేవు. రాజకీయాలు ఇప్పుడు కేవలం అధికారం గురించి మాత్రమే నడుస్తున్నాయి. నాకు మిలింద్ దేవరా తెలుసు.. ఆయన పెద్ద నాయకుడు. కాంగ్రెస్తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు." అని కాంగ్రెస్కు మిలింద్ దేవర రాజీనామా చేయడంపై రౌత్ మాట్లాడారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా నెలరోజుల ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడు మిలింద్ దేవరా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, శివసేన (యుబిటి)ల మధ్య సీట్ల పంపకాల చర్చలపై ఆయన కలత చెందినట్లు సమాచారం. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మిలింద్ దేవరా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
ప్రజాస్వామ్యమే గెలిచింది: ఏక్నాథ్ షిండే
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తేల్చేశారు. ఈ తీర్పుపై స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే.. శివ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరోసారి విజయం సాధించిందని అన్నారు. శివ సేన- బీజేపీ సంకీర్ణ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షల మంది ఓటర్లు గెలుపొందారని తెలిపారు. "రాష్ట్రంలోని శివసైనికులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేడు ప్రజాస్వామ్యం మరోసారి గెలిచింది. 2019లో శివసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షలాది మంది ఓటర్లు ఈరోజు విజయం సాధించారు. ఇది శివుడి విజయం. హిందూ హృదయ చక్రవర్తి బాలాసాహెబ్ థాక్రే భావాజాలంతో ఉన్న శివసైనికుల విక్టరీ ఇది." అని ఏక్నాథ్ షిండే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. "బాలాసాహెబ్, ధర్మవీర్ ఆనంద్ దిఘేల హిందుత్వ భావాజాలానికి మేమే నిజమైన వారసులమని మరోసారి రుజువైంది. నేటి విజయం సత్యం విజయం. సత్యమేవ జయతే." అని అన్నారు. "నేటి ఫలితం ఏ పార్టీ విజయం కాదు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ముఖ్యం. శివ సేనాను ఎలక్షన్ కమిషన్ మనకు కేటాయించింది. ఇప్పుడు విల్లు, బాణాలు కూడా మన చేతికి వచ్చాయి. నేటి ఫలితాల నుంచి నియంతృత్వం, రాజవంశం అంతమైంది." "పార్టీని తన ఆస్తిగా భావించి ఎవరూ తన మనసుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేరు. ప్రస్తుత తీర్పు పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తి కాదని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా ఉండకూడదు. ఈ తీర్పు అందుకు ఉదాహారణగా ఉంది.' అని షిండే ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన -
Uddhav Thackeray: స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య హత్య
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేనపార్టీ అని స్పీకర్ రాహుల్ నర్వాకర్ స్పష్టం చేశారు. దీనిపై శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ ఠాక్రే స్పదిస్తూ.. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటమేనని అన్నారు. స్పీకర్ నిర్ణయం వెల్లడించిన అనంతరం ఉద్ధవ్ మీడియాతో మట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వాకర్ తమ వర్గం మెజర్టీని సరిగా అర్థం చేసుకోలేకపోయరని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇది చాలా సులువైన కేసు అని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా సరైన తీర్పు వెల్లడిస్తే.. స్పీకర్ మాత్రం తాను సుప్రీంకోర్టు కంటే ఉన్నతుడిగా భావించాడని తెలిపారు. తమకు వ్యతిరేకంగా స్పీకర్ తన నిర్ణయం వెల్లడించారని చెప్పారు. అయితే స్పీకర్ రాహుల్ నర్వాకర్ వెల్లడించిన నిర్ణయాన్ని తమ వర్గం(యూబీటీ) తీవ్రంగా తిరస్కరిస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై తాము మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. తమకు వ్యతిరేకంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునే ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు.. కోర్టు ధిక్కార కేసు వేస్తుందా? లేదా? అనేది చూడాలని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ స్పష్టం చేయటంతో సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏక్నాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు. శివసేన నుంచి సీఎం ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన (యూబీటీ) వర్గం నేత అయిన ఉద్ధవ్ ఠాక్రేకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఇక.. 2022 జూన్లో ఏక్నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు శివసేన పార్టీ చీల్చి బయటకు వచ్చారు. దీంతో మహా వికాస్ అఘడి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇక.. ఏక్నాథ్ షిండే, పలువురి రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చేరాడు. బీజేపీ మద్దతు ఆయన మహారాష్ట్ర సీఎంగా అధికారం చేపట్టారు. అయితపాటు శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే మంత్రుల పదవలు దక్కటం గమనార్హం. చదవండి: Ram Mandir: ‘కాంగ్రెస్ రాముడి ఉనికినే తిరస్కరిస్తోంది’ -
Maharashtra: ఉద్దవ్ ఠాక్రేకు షాక్.. షిండేదే అసలైన శివసేన!
ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ కీలక నిర్ణయం వెల్లడించారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏక్నాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు. 2013 తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగలేదని అన్నారు. శివసేన నుంచి సీఎం ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన (యూబీటీ) వర్గం నేత అయిన ఉద్ధవ్ ఠాక్రేకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఏ వర్గం నిజమైన పార్టీ అని తెలపడానికి నిర్ణయించే జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినట్లు శివసేన(యూబీటీ) వర్గం ఎటువంటి ఆధారం సమర్పించలేదని తెలిపారు. శివసేన పార్టీ చీఫ్గా ఉద్దవ్ ఠాక్రే కొనసాగాలని ఆ వర్గం నేతల ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ రాహుల్ నార్వేకర్ తిరస్కరించి.. శివసేన పార్టీకి చీఫ్గా సీఎం ఏక్నాథ్ షిండేను అడ్డుకోలేమని తెలిపారు. మహారాష్ట్రలో 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హతపై ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుప్రీకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నానని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ అన్నారు. పార్టీ నాయకత్వంపై శవసేనలోని ఇరు వర్గాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ మేజార్టీ ఒక్కటే ప్రధామైన అంశమని అన్నారు. నాయకత్వ నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకోని సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల సంఘానికి షిండే, ఉద్దవ్ వర్గాలు సమర్పించిన ఫిర్యాదుల్లో ఏకాభిప్రాయం లేదని తెలిపారు. మహారాష్ట్రలోని శివసేనకు చెందిన 34 ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు గడువు బుధవారం ముగిసింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ప్రస్తుత సీఎం ఎక్నాథ్ షిండే వర్గాల ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఈ వ్యవహారంలో స్పీకర్ రాహుల్ నార్వేకర్ నిర్ణయంపై ఇరు వర్గాల్లో ఆసక్తి నెలకొనగా.. స్పీకర్ నిర్ణయంతో ఏక్నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 2022 జూన్లో ఏక్నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు శివసేన పార్టీ చీల్చి బయటకు వచ్చారు. దీంతో మహా వికాస్ అఘడి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇక.. ఏక్నాథ్ షిండే, పలువురి రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చేరాడు. బీజేపీ మద్దతు ఆయన మహారాష్ట్ర సీఎంగా అధికారం చేపట్టారు. అయితపాటు శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే మంత్రుల పదవలు దక్కటం గమనార్హం. చదవండి: భారీ స్థాయిలో కమలం ఆపరేషన్.. 1984 తర్వాత సాధించని ఫీట్ కోసం..! -
ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరిగే ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలకు ఆహ్వానం అందలేదన్న శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. ఆలయ మహా సంప్రోక్షణకు శ్రీరాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశామని తెలిపారు. రాముని పేరు చెప్పుకుని ప్రతిపక్షాలే రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రామున్ని నమ్మినవారే ప్రస్తుతం అధికారంలో ఉన్నారని అన్నారు. "రాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయి. రాముని పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తున్నారని చెప్పడం పూర్తిగా తప్పు. మన ప్రధానిని ప్రతిచోటా గౌరవిస్తారు. ఆయన తన హయాంలో ఎనలేని కృషి చేశారు. రాజకీయాలు కాదు.. ఇది ఆయన భక్తి” అని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. రామ మందిర ప్రారంభ వేడుకలను బీజేపీ రాజకీయం చేస్తుందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఇటీవల ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల్లో రాముడిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆచార్య సత్యేంద్ర దాస్.. సంజయ్ రౌత్, ఉద్ధవ్ థాక్రేపై విరుచుకుపడ్డారు. రాముని పేరు ఎవరు వాడుకుంటున్నారో? తెలుసుకోవాలని ప్రశ్నించారు. రామ మందిర ప్రతిష్ఠాపనకు తనకు ఆహ్వానం అందకపోవడంపై థాక్రే బీజేపీని విమర్శించారు. మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దని అన్నారు. ఒకే పార్టీ చుట్టూ తిరగకూడదని చెప్పారు. రామాలయం ప్రారంభోత్సవం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం తన తండ్రి బాల్ థాక్రే చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇటీవల రామాలయ వేడుక ఆహ్వానాన్ని సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు -
మిత్రపక్షం శివసేనకు కాంగ్రెస్ షాక్.. అందుకు నో!
ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనకు (ఉద్ధవ్వర్గం) కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో 23 సీట్లలో పోటీ చేస్తామంటూ శివసేన చేసిన డిమాండ్ను కాంగ్రెస్ తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమిలో భాగస్వామమ్యులైన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించేందుకు నేతలు సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఎంవీఏ కూటమీ పేరులో మహారాష్ట్రలో 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే 2022లో శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని రెండుగా చీల్చాడు. బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. దీంతో ఎంవీఏ కూటమి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన శివసేనలో ఏక్నాథ్ షిండే వైపే మెజార్గీ నేతలు వెళ్లిపోయారు. ఉద్దవ్ వర్గంలో తగినంత అభ్యర్థులు లేకపోయినప్పటికీ 23 స్థానాలు కోరడం సరికాదని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. సీట్లు గెలుచుకోవడంపై నేతలు విభేదాలు మానుకోవాలని అన్నారు. శివసేన 23 సీట్లు డిమాండు చేయొచ్చు, కానీ వాటిని ఏం చేస్తారని ప్రశ్నించారు. సంక్షోభం అనంతరం శివసేన నేతలు వెళ్లిపోయారని, వాళ్లకు అభ్యర్థుల కొరత సమస్య. ఉంది’ అని తెలిపారు. శివసేన, శరద్పవార్ ఎన్సీపీలో చీలికలు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కటే స్థిరమైన ఓట్షేర్తో కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు సమావేశంలో తెలిపారు.పార్టీల మధ్య సర్దుబాటు అవసరమని మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు. ప్రతి పార్టీ సీట్లు ఎక్కువ వాటాను కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివసేన 23 సీట్ల డిమాండ్ చేయడం ఎక్కవ అని అభిప్రాయపడ్డారు. -
సోదరులిద్దరూ కలిసేనా? ఒకతాటిపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (చీఫ్) రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఒకతాటిపైకి వస్తుండవచ్చనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. దివంగత బాల్ ఠా క్రే స్మారకం విషయంపై చర్చించేందుకు తన సోదరుడైన రాజ్ఠాక్రేకి ఫోన్ చేయాల్సి ఉందని ఇటీ వల ఓ ఇంటర్వ్యూలో ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. అయితే అది ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. కాగా.. రాజ్–ఉద్ధవ్లు ఒకటయితే బాగుంటుందని ఇరు పార్టీల కార్యకర్తలు కొంత కాలంగా కోరుకుంటున్నా రు. అంతేగాకుండా ఇటీవల అక్కడక్కడా ఫ్లె క్సీలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు ఠాక్రేలు ఒకటైతే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఎవరు.. ఏ పార్టీలో ఉన్నారో? రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఊహించని మార్పులు జరుగుతున్నాయి. నాయకులు ఓ పార్టీ నుంచి బయటపడి ప్రత్యర్థి పారీ్టలో చేరడం, లేదంటే కొత్త పార్టీ ఏర్పాటు వంటివి చేస్తున్నారు. కూటములు ఏర్పడుతున్నాయి దీంతో ఎవరు, ఏ పారీ్టలో ఉన్నారో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొంది. గత సంవత్సరం ఏక్నాథ్ శిందే.. శివసేనను చీల్చి బీజేపీలో చేరారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయం నుంచి తేరుకోకముందే మహా వికాస్ ఆఘాడిలో మిత్రపక్షంగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ కూడా బయటపడ్డారు. పార్టీని చీల్చి తన మద్దతుదారులతో ఆయన బీజేపీ ప్రభుత్వంలో చేరారు. వారికి కొన్ని మంత్రిపదవులు సైతం లభించాయి. అందరూ స్వార్థ రాజకీయాలు చేస్తున్న వేళ.. వీరెందుకు (రాజ్–ఉద్ధవ్) ఒకటి కాకూడదనే అంశాన్ని ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు తెరమీదకు తెచ్చారు. బీజేపీ నుంచి ప్రతికూల సంకేతాలు.. బీజేపీతో సాన్నిహిత్యంగా మెలుగుతున్న తీరును బట్టి ఆ పారీ్టతో పొత్తు పెట్టుకుంటుండవచ్చని అప్పట్లో అందరు భావించారు. కానీ ఉత్తర భారతీయుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని రాజ్ఠాక్రేకు కొంత దూరంగా ఉంచడమే ఉత్తమమని బీజేపీ వర్గాలు భావించాయి. ఆ తరువాత మసీదులపై లౌడ్స్పీకర్లు తొలగించాలని చేపట్టిన ఆందోళన రాజ్ను బీజేపీకి మరింత దగ్గర చేసింది. ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ శిందే, చంద్రకాంత్ పాటిల్సహా పలువురు బీజేపీ మంత్రులు, నేతలు రాజ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు ఆయన నివాసమైన శివాజీపార్క్లోని రాజ్ఘడ్కు వెళ్లడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాజ్ ఠాక్రే బీజేపీతో జత కట్టడం ఖాయమని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. కానీ వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్ లాంటి ఇద్దరు బలమైన నాయకులు లభించారు. ఫలితంగా బీజేపీతో పొత్తుపై ఎమ్మెన్నెస్ పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే.. బాల్ ఠాక్రే స్మారకం విషయంపై స్వయంగా రాజ్ ఠాక్రేకు ఫోన్ చేస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇరువురు ఠాక్రేలు స్మారకం అంశంతో పాటు తాజా రాజకీయలు, పొత్తు అంశంపై కూడా చర్చస్తుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై ఇరు పారీ్టల పదాధికారులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఉద్ధవ్తో మైత్రికి ప్రయత్నాలు.. అయితే అప్పటికే రాష్ట్ర రాజకీయాలపై రాజ్ ఠాక్రే నిప్పులు చెరుగుతున్నారు. మనం ఎవరికి ఓటు వేశాం..? మనం ఓటువేసిన ప్రతినిధి ఏ పార్టీలో కొనసాగుతున్నారో తెలుసుకోలేని పరిస్ధితుల్లో ఓటర్లు ఉన్నారని పలుమార్లు అన్నారు. తను భవిష్యత్తులో ఎవరితోను పొత్తుపెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు అనేక సందర్బాల్లో వెల్లడించారు. అంతేగాకుండా సోదరులిద్దరూ ఒకటయ్యే విషయంపై ఇదివరకు ఉద్ధవ్కు రెండు సార్లు మైత్రి హస్తం చూపానని రాజ్ అన్నారు. కానీ ఏకైక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెన్నెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్ధవ్ భావించి ఉండవచ్చని అనేక సంవత్సరాలు వేచి చూశారు. ఉద్ధవ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దూరంగా ఉండడమే ఉత్తమని రాజ్ భావించారు. -
మహారాష్ట్రలో మరో ట్విస్ట్.. పవార్, ఉద్దవ్కు బిగ్ షాక్!
ముంబై: మహారాష్ట్రలో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే, పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సమంత్ సంచలన కామెంట్స్ చేశారు. ఉద్దవ్ వర్గం శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి చెందిన 33 మంది ఎమ్మెల్యే తమతో టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు పొలిటికల్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివరాల ప్రకారం.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు షిండే గ్రూపుతో టచ్లో ఉన్నారని మంత్రి ఉదయ్ సమంత్ పేర్కొన్నారు. అలాగే, మహాబలేశ్వర్లోని సీఎం షిండేతో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రహస్యంగా సమావేశమయ్యారని అన్నారు. కాగా, ఉదయ్ సమంత్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేతో టచ్లో ఉన్నారని తెలిపారు. సీఎంకు మద్దతు తెలిపేందుకు రెడీ ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గం అప్రమత్తమైనట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఖర్ఘర్ ఘటన తర్వాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఆ పదవి నుంచి తప్పిస్తారనే చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, షిండే వ్యవహార శైలి వల్ల బీజేపీ మంత్రులు, నాయకుల్లో ఆగ్రహం పెరుగుతోందని, సీఎం పలు ఫైళ్లను క్లియర్ చేయడం లేదని సమాచారం. బీజేపీ రాష్ట్ర నేతలు హైకమాండ్కు సమాచారం అందించినప్పటికీ, కర్ణాటక ఎన్నికల వరకు వేచి ఉండాలని రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్.. బీజేపీ నేతలతో టచ్లోకి వచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో, అజిత్ పవార్ మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ స్పందించారు. తన చివరి శ్వాస వరకు ఎన్సీపీలోనే ఉంటానని పవార్ స్పష్టం చేశారు. #BREAKING "13 remaining MLAs of the Shiv Sena (UBT), around 20 MLAs & senior Congress leaders too are in touch with CM #EknathShinde," Maharashtra minister #UdaySamant claims.@AruneelS shares more developments in Maharashtra's politics with @prathibhatweets. pic.twitter.com/gNIJUeFz2h — TIMES NOW (@TimesNow) April 28, 2023 ఇది కూడా చదవండి: సినీ ఫక్కీలో బీజేపీ నేత హత్య -
మహా వికాస్ అఘాడీకి కోర్టులో చుక్కెదురు
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో 227 వార్డులుండాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలాగే కొనసాగించాలని ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో 236 వార్డులుండాలని దాఖలుచేసిన రెండు పిటిషన్లను తిరస్కరించింది. ఫలితంగా హైకోర్టులో మహా వికాస్ అఘాడీకి గట్టి దెబ్బ తగిలినట్లైంది. అంతేగాకుండా హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ మహా వికాస్ అఘాడీ సుప్రీంకోర్టును ఆశ్రయించని పక్షంలో ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్, వార్డుల పునరి్వభజన, ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తదితర ప్రక్రియ పూర్తిచేయాలి. దీన్ని బట్టి బీఎంసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అక్టోబరులో లేదా నవంబరులో అంటే దీపావళిలోపు బీఎంసీ ఎన్నికల నగారా మోగే అవకాశముంది. అఘాడీ ప్రభుత్వంలోనే నిర్ణయం రెండేళ్ల కిందట ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఎంసీ వార్డుల సంఖ్య 227 నుంచి 236కు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అందుకు వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ముంబై సిటీ, పశ్చిమ ఉపనగరం, తూర్పు ఉపనగరంలో మూడు చొప్పున ఇలా తొమ్మిది వార్డులు పెరిగాయి. కానీ వార్డుల హద్దులన్నీ తారుమారయ్యాయి. ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాలన్నీ మరో వార్డులోకి వెళ్లిపోయాయి. దీంతో కచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్ల అంచనాలు తారుమారయ్యాయి. కానీ ఏక్నాథ్ షిందే 50 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంవల్ల మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత షిందే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2022 జూన్ ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మహా వికాస్ అఘాడీ తీసుకున్న 236 వార్డుల పెంపు నిర్ణయాన్ని రద్దు చేసింది. 2017లో జరిగిన జనగణన ప్రకారం 227 వార్డులు ఉండాలని షిందే, ఫడ్నవీస్ మంత్రివర్గం తీర్మానించింది. కానీ 227 ఉంచాలని షిందే, ఫడ్నవీస్ మంత్రిమండలి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు రాజు ఫడ్నేకర్, సమీర్ దేశాయ్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎస్.బి.శక్రే, ఎం.డబ్ల్యూ చాంద్వాని బెంచి ఇరువురు సమర్పించిన పిటిషన్లను కొట్టివేసింది. మూడోసారి వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వార్డుల రిజర్వేషన్ లాటరీ జాబితాను ఇదివరకు రెండుసార్లు రద్దు చేయాల్సి వచి్చంది. ఇప్పుడు తాజాగా కోర్టు తీర్పుతో మూడోసారి వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మొదటిసారి రాష్ట్ర ఎన్నికల సంఘం 2021, మే 31న వార్డుల రిజర్వేషన్ లాటరీ వేసింది. ఆ తరువాత ప్రత్యేక వెనకబడిన తరగతులు (ఓబీసీ) రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో జూలై 29న మళ్లీ కొత్తగా వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడు 227 వార్డులు ఉంచాలని షిందే, ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలాగే కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మూడోసారి వార్డుల రిజర్వేషన్, వార్డుల పునరి్వభజన చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. 2021 జనగణన జరగకుండా వార్డుల సంఖ్య పెంపు ఎలా? బీఎంసీలో కార్పొరేటర్ల సంఖ్య 2001లో జరిగిన జనగణన ప్రకారం 227 ఉండాలని నిర్ణయించారు. కానీ 2011లో చేపట్టిన జనగణనలో జనాభా పెరిగినప్పటికీ కార్పొరేటర్ల సంఖ్య పెంచలేదు. కాగా 2001 నుంచి 2011 మధ్య కాలంలో ముంబైలో జనాభా 3.87 శాతం పెరిగింది. దీంతో పెరిగిన జనాభా, పెరిగిన నగర విస్తరణను పరిగణంలోకి తీసుకుని కార్పొరేటర్ల సంఖ్య 227 నుంచి 236కు పెంచాలని అప్పటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ముంబై సిటీ, పశి్చమ, తూర్పు ఉప నగరాల్లో మూడు చొప్పున మొత్తం 9 వార్డులు పెంచింది. కానీ వార్డుల సంఖ్య పెంచాలంటే తాజాగా అంటే 2021లో చేపట్టిన జనగణనను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2021లో జనగణన జరగనే లేదు. ఇక 9 వార్డులు పెంచాల్సిన అవసరమేముందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అనేక సార్లు ప్రశ్న లేవనెత్తింది. అయినప్పటికీ ఎన్నికల సంఘం వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ పూర్తిచేసి జాబితా కూడా విడుదల చేసింది. ఆ తరువాత ఓబీసీ రిజర్వేషన్ అమలు కావడంతో రెండోసారి లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి వచి్చంది. చివరకు ఏక్నాథ్ షిందే తిరుగుబాటు చేసి శివసేన నుంచి బయటపడటం, ఆ తరువాత నాటకీయ పరిణాల మధ్య షిందే ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడం అన్ని చకచకా జరిగిపోయాయి. దీంతో మçహా వికాస్ అఘాడీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి ఎప్పటి లాగే వార్డుల సంఖ్య 227 ఉంచాలని నిర్ణయం తీసుకుంది. వార్డుల సంఖ్య తగ్గింపు శివసేనపై ప్రభావం వార్డుల సంఖ్య 236 నుంచి 227కు తగ్గడంవల్ల దీని ప్రభావం శివసేనపై చూపనుంది. వార్డుల పునరి్వభజన, తొమ్మిది వార్డులు తగ్గిపోవడంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో వివిధ పారీ్టలతో పోలిస్తే శివసేనకు ఎక్కువ శాతం నష్టం వాటిళ్లే ప్రమాదముంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం తొమ్మిది వార్డులు పెంచాలని అప్పట్లో తీసుకున్న నిర్ణయంతో వార్డులను పునర్విభజన చేశారు. మొత్తం 236 వార్డుల్లో అధిక శాతం శివసేనకు అనుకూలంగా ఉన్నాయి. కానీ తాజాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమరి్థంచడంతో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. 2017 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో శివసేన 84, బీజేపీ 82 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాలు మారడంతో ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో జరిగే బీఎంసీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. -
మహారాష్ట్రలో ఆనాడు జరిగిందిదే.. మాజీ గవర్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముంబై: మహారాష్ట్రలో శివసేనకు చెందిన విల్లుబాణం గుర్తుపై రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే.. సీఎం ఏక్నాథ్ షిండేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. కాగా, దీనిపై తాజాగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్పందించారు. అయితే, కోష్యారీ ఇండియా టుడే ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిందన్నారు. తమకు మెజార్టీ ఉందని షిండే, ఫడ్నవీస్ చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతే రాజ్ భవన్లో కార్యక్రమం జరిగింది. అంతే తప్ప గవర్నర్గా నా పాత్ర ఏమీ లేదన్నారు. అలాగే.. ఇదే సమయంలో ఉద్ధవ్ థాక్రే తనకు మెజార్టీ ఉందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తన వద్దకు రాలేదన్నారు. ఏమీ మాట్లాడలేదు. దీంతో, మరో పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది.. చేసింది. రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రఫుల్ పటేల్, శరద్ పవార్, ఛగన్ భుజ్ బల్ (ఎన్సీపీ నేతలు)ను అడిగాను. అయినా ఒక్కరు కూడా.. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ ఉందని లేఖ ఇవ్వలేదు. శివ సైనికుడిని సీఎం చేయాలని అనుకుంటున్నామని మాత్రం చెప్పుకుంటూ వచ్చారంతే అని కోష్యారీ వివరించారు. ఇక, కోష్యారీ గవర్నర్గా ఉన్న సమయంలోనే మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. శివసేన రెండుగా చీలిపోవడం ఆ తర్వాత బీజేపీతో కలిసి షిండే కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఎన్నికల కమిషన్ కూడా శివసేన అధికారిక గుర్తు.. విల్లుబాణంను షిండే వర్గానికే కేటాయించింది. -
‘బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా.. హిందుత్వాన్ని వదులుకోలేదు’
ముంబై: బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా.. శివసేన (యూబీటీ) ఎప్పుడూ హిందుత్వాన్ని వదులుకోలేదని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ఠాక్రే స్పష్టం చేశారు. ముంబైలో నివసిస్తున్న మరాఠీ ప్రజలు, ఉత్తర భారత ప్రజల మధ్య తామెప్పుడూ వివక్ష చూపలేదు, చూపబోమన్నారు. గత అపార్థాలను మనసులోంచి తొలగించుకోవాలని ఉత్తర భారత సమాజానికి విజ్ఞప్తి చేశారు. ముంబైలో ఉత్తర భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ఉద్దవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మోదీని కాపాడకపోయి ఉంటే.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవారు కాదన్నారు. హిందుత్వ అంటే ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజలను విభజించడం కాదని అన్నారు. ‘‘నేను బీజేపీతో విభేదించాను, కానీ నేను హిందుత్వాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. బీజేపీ అంటే హిందుత్వ కాదు. ఒకరినొకరు ద్వేషించుకోవడం హిందుత్వం కాదు’’ అన్నారు. బీజేపీ హిందువుల మధ్య చీలికను సృష్టిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ 25-30 ఏళ్లు రాజకీయపరమైన స్నేహబంధాన్ని కాపాడిందని గుర్తు చేశారు. మతంతో సంబంధం లేకుండా భారత్ను ద్వేషించేవారికే బాలాసాహెబ్ వ్యతిరేకమని ప్రస్తావించారు. కానీ బీజేపీ మాత్రం తమని వద్దనుకున్నారని వ్యాఖ్యానించారు. శివసేన, అకాలీదళ్తో ఉన్న సుదీర్ఘ బంధానికి బీటలు వారడాన్ని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యానించారు.. తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు బీజేపీతో పొత్తు నుంచి వైదొలిగినట్లు ఠాక్రే చెప్పారు. ‘‘లేకపోతే ఇప్పుడు నా మనుషుల్లో కొందరు మారినట్లే.. నేనూ నా మెడకు బెల్టు పెట్టుకుని బానిసగా పడి ఉండేవాడిని’ అని శివసేన (శిండే) వర్గాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. ఉత్తర భారతీయులను లేదా ముస్లింలను కలిసినప్పుడల్లా, హిందుత్వంపై ప్రశ్నించినప్పుడల్లా తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చదవండి: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో'.. ప్రారంభించిన మోదీ.. ‘మీతో నా భేటీపై విమర్శలు వచ్చాయి.. ముస్లింలను కలిస్తే హిందుత్వాన్ని వదులుకున్నాడని నాపై ఆరోపణలు చేస్తారు. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ముంబై వచ్చినప్పుడు ఎవరి వంటింటిలోకి వెళ్లాడు? నేనే అలా చేసి ఉంటే ఈ పాటికి హిందూ వ్యతిరేకిని అయిపోయేవాడిని. కానీ ప్రధానమంత్రి అలా చేస్తే మాత్రం ఆయనది చాలా పెద్ద మనసని చెబుతారు. ఇదేం ద్వంద్వ వైఖరి? బోహ్రా వర్గానికి వ్యతిరేకంగా మేం ఎప్పుడూ లేం. వారు మాతోనే ఉన్నారు’ అని ఉద్ధవ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు మంచి రోజు ఇక భగత్సింగ్ కోశ్యారీ రాజీనామా ఆమోదంపై ఉద్ధవ్ స్పందిస్తూ... ఇది రాష్ట్రానికి మంచిరోజన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషికాన్ని ఉత్తర భారతదేశానికి చెందిన పూజారి జరిపించారని, ఈ రోజు శివాజీ మహరాజ్ను అవమానించిన వ్యక్తిని వెనక్కి పంపారని ఆయన అన్నారు. -
శిందే వర్గంలో చేరే ప్రసక్తే లేదు.. ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోనే..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గంలో తాను చేరే ప్రసక్తే లేదని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మహిళా నేత రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ నీలమ్ గోర్హె స్పష్టం చేశారు. తానెప్పటికీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోనే కొనసాగుతానని వెల్లడించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...తాను శిందే వర్గంలో చేరబోతున్నానంటూ మీడియా ఆధారాల్లేని వార్తల్ని రాసిందని, ఆ వార్తల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. శ్రద్ధావాకర్ హత్యకేసులో అఫ్తాబ్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించేందుకు మాత్రమే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశానని, ఆ భేటీలో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆమె వెల్లడించారు. అదేవిధంగా అదే కార్యక్రమంలో సీఎం శిందే, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్లు కూడా పాల్గొని బిర్లాను కలిశారని తెలిపారు. చదవండి: నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. గుజరాత్లో బీజేపీకి షాక్ తగులుతుందా? -
కూటమికి బీటలు..
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement