-
అమెరికా–చైనా చర్చలపర్వం
ఎడతెగని చర్చలు జరుగుతున్నాయంటే, అయినా కనుచూపుమేరలో పరిష్కారం కానరా లేదంటే... కనబడని కారణాలేవో అడ్డుపడుతున్నాయని అర్థం. సమస్య తీవ్రంగా ఉన్నదని తాత్పర్యం. ఈనెల ప్రారంభంనుంచి అమెరికా–చైనాలమధ్య భిన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతూనే వున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్లు నేరుగా ఫోన్లో సంభాషించుకున్నారు. నాలుగు నెలలక్రితం తొలిసారి మాట్లాడుకున్న ఈ నేతలిద్దరూ మళ్లీ మాట్లాడుకోవాల్సిన పనిబడటం గమనించదగిందే. వారం తిరగకుండానే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్ చైనా సందర్శనకొచ్చి ప్రధాని లీ కియాంగ్తోపాటు చైనా ఉన్నత స్థాయి అధికారులను కలిసి మాట్లాడారు. అంతకుమునుపే ఇరు దేశాల ఉన్నతాధికారులు నాలుగు రోజులపాటు చర్చించుకున్నారు. త్వరలోనే అమెరికా విదేశాంగమంత్రి ఆంథోనీ బ్లింకెన్ చైనా వెళ్లబోతున్నారు. ఇలా సంభాషణల పరంపర కొనసాగుతున్నది గానీ పరిష్కారం కానరావటం లేదు. వీటికి సమాంతరంగా చైనాను కట్టడి చేసే ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా 2021లో రూపుదిద్దుకున్న సైనిక సహకార సంస్థ ‘ఆకస్’ కార్యకలాపాలు చురుకందు కున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ రక్షణమంత్రులు ఇటీవల భేటీ అయ్యారు. ఇందులో మనదేశాన్ని కూడా చేర్చు కోవాలని అమెరికా తహతహలాడుతున్నా ఎలాంటి సైనిక ఒడంబడికల్లోనూ భాగం కారాదన్న విధానానికే ఇంతవరకూ మన దేశం కట్టుబడివుంది. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని జపాన్ మాత్రం చేరే అవకాశం ఉందంటున్నారు. అలాగని మన దేశం మౌనంగా ఏమీ లేదు. దక్షిణ చైనా సముద్రంలో చైనానుంచి తరచు బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాలకు మద్దతుగా నిలుస్తామని చాటుతూనేవుంది. ఇటీవల చైనా గస్తీ నౌకలు చేసిన దాడుల్లో ఫిలిప్పీన్స్ వాణిజ్య నౌకలు రెండు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే ఆ దేశాన్ని సందర్శించి అండగా వుంటామని ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతం తన సొంతమని చైనా చెప్పుకుంటోంది. నిరంతర గస్తీ కాస్తోంది. సమస్యేమంటే ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో 60 శాతం దక్షిణ చైనా సముద్రం వైపే సాగుతోంది. అంతర్జాతీయంగా చైనాను కట్టడి చేయటమే అత్యవసరమని భావిస్తున్న అమెరికాకు రష్యా దూకుడు ఊహించని పరిణామం. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించాక దృష్టి అటువైపు మళ్లింది. ఉక్రెయిన్కు ఆయుధాలందించటం ద్వారా రష్యాను దారికి తేవొచ్చని భావించిన అమెరికాకు నిరాశే ఎదురైంది. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు సైతం ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. రష్యాకు ఇరాన్ నుంచి డ్రోన్లు అందుతున్నాయి. ఎడాపెడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా రష్యాకు చైనా అండగా నిలుస్తోంది. ఉత్తర కొరియా సైతం చైనా ద్వారా రష్యాకు సహాయసహకారాలందిస్తోందని అమెరికా భావిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ దుందుడుకుతనంతో గాజా మండుతోంది. ఇజ్రాయెల్ను ఎలాగైనా దారికి తేవా లన్న బైడెన్ ఎత్తుగడలు ఫలించటం లేదు. కనుకనే దౌత్యరంగంలో వున్నంత దూకుడు రక్షణరంగంలో కనబడటం లేదన్నది బైడెన్పై వున్న ప్రధాన విమర్శ. ఈ ఏడాది చివర అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ విమర్శలు బైడెన్ను కలవరపెడుతున్నాయి. పర్యవసానంగా చైనాతో చర్చోప చర్చలు సాగుతున్నాయి. వాణిజ్యపరంగా అమెరికాకు మరో ప్రత్యేక సమస్య కూడా వుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి అపరిమితంగా వచ్చిపడుతున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఇతర ఉపకరణాలు అమెరికాకు తలనొప్పి తెస్తున్నాయి. వాటివల్ల అమెరికా ఉత్పత్తులు అమ్ముడుకావటం కష్టమవుతోంది. అమెరికా పరిశ్రమలు సంక్షోభంలో పడుతున్నాయి. ఈ నెల మొదట్లో జో బైడెన్, షి జిన్పింగ్ మధ్య ప్రధానంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంశాలపై చర్చలు నడిస్తే... చైనా తమ వాణిజ్య దూకుడుకు కళ్లెం వేయటంపై జానెట్ ఎలెన్ ప్రధాని లీ కియాంగ్తో చర్చించారు. దీన్ని ఆపకపోతే మరో మూడేళ్లలో అవసరానికి మించి ఏటా 50 లక్షల నుంచి కోటి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్కొస్తాయన్నది అమెరికా అంచనా. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ తదితర అంశాల్లో తమ ఎదుగుదలను నిరోధించేలా అమెరికా వ్యవహరిస్తున్నదని చైనా ఆరోపణ. కనుకనే ఇరుదేశాల ఉన్నతాధికారులమధ్యా వరసగా నాలుగురోజులపాటు చర్చలు సాగినా... నేరుగా ఎలెన్, లీ కియాంగ్లు సంభాషించుకున్నా పరిష్కారం దొరకలేదు. చిత్రమేమంటే అమెరికా, చైనాల మధ్య అనేక అంశాల్లో తీవ్ర విభేదాలున్నా వాణిజ్యపరంగా ఆ రెండు దేశాలూ పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పని స్థితి. అందుకే ఇండో–పసిఫిక్ అంశంలో దూకుడుగా వున్నట్టు కనిపిస్తున్నా వాణిజ్య సమస్యలపై ఏదోవిధంగా చైనాను దారికి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. ట్రంప్ హయాంలో చైనాపై విధించిన ఆంక్షల్లో చాలా భాగం బైడెన్ కొనసాగించారు. వీటికి మరిన్ని జోడిస్తానన్న బైడెన్ హెచ్చరికలు ఆచరణలోకి రాకపోయినా అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు సడలింపు వైఖరితో ఉన్నామన్న సంకేతాలు రెండు దేశాలూ ఇస్తున్నాయి. ఎలాంటి సమస్యలకైనా ఓర్పుగా సాగించే సంభాషణలు పరిష్కారాన్ని చూపుతాయి. ఘర్షణల నివారణ ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే ఘర్షణలవల్ల అంతిమంగా విధ్వంసం తప్ప మరేమీ మిగలదు. అయితే ఏ చర్చలైనా నిర్మాణాత్మకంగా వుండాలి. చిత్తశుద్ధితో సాగాలి. లేనట్టయితే నిష్ఫలమవుతాయి. -
నెతన్యాహూతో ఇజ్రాయెల్కు నష్టమే: బైడెన్
విలి్మంగ్టన్: గాజాలో హమాస్పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. నెతన్యాహూ అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహూ దారుణంగా విఫలమవుతున్నారని ఆక్షేపించారు. బైడెన్ శనివారం మీడియాతో మాట్లాడారు. తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్కు సూచించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. హమాస్ను వేటాడే హక్కు ఇజ్రాయెల్కు ఉందని వెల్లడించారు. కానీ, సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చిచెప్పారు. గాజాలో మరణాల సంఖ్య ఇజ్రాయెల్ చెబుతున్నదానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. గాజాలో అమాయకుల మరణాలు ఇంకా పెరిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని బైడెన్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
USA: బైడెన్ వద్దు.. మిషెల్లీ ఒబామా బెటర్.. ఆసక్తికర పోల్స్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఫోకస్ పెట్టాయి. దీంతో, రెండు పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే, అధికార డెమోక్రటిక్ పార్టీలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బదులుగా.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా బరిలో నిలవాలని అమెరికన్లు కోరుకుంటున్నారని రాస్ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. వివరాల ప్రకారం.. 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మరో దఫా ఎన్నికల్లో నిలబడేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఆయన వయసు, మానసిక ఆరోగ్య స్థితిని ఇందుకు కారణంగా చూపుతున్నారు. అలా చెబుతున్నవారు దాదాపు 48 శాతం ఉన్నారని తేలింది. బైడెన్ బదులు.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామాను కోరుకుంటున్నారని రాస్ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. కాగా, 38 శాతం మంది జో బైడెన్ను కోరుకోవడం లేదని ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది. If Michelle Obama decides to replace President Biden ,then it's an absolute game over for Trump or Republicans . She will win presidency hands down, and for us, staunch Gandhian will be the most powerful person on the face of earth. Let the game begin @MichelleObama pic.twitter.com/pFkyFrYO67 — Prashant shah (@prashantsapp) February 28, 2024 ఇక, అదే సమయంలో బైడెన్ను మార్చే అవకాశాలు లేవని 45 శాతం మంది అభిప్రాయపడుతున్నారని సర్వేలో వెల్లడైంది. బైడెన్ మరోసారి ఎన్నికకు సిద్ధపడకపోతే ఆయన స్థానంలో ఎవరైతే బాగుంటందనే ప్రశ్నతో సర్వే నిర్వహించారు. ఇందులో మిషెల్లీ ఒబాబాకే ఎక్కువ సంఖ్యలో మద్దతు పలికారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తదితరులు తదుపరి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. మిషెల్లీ ఒబామా మాత్రం తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితోలేనని ఇప్పటికే ప్రకటించారు. కాగా, జనవరిలో ఒక పాడ్క్యాస్ట్ ఇంటర్వ్యూలో మిషెల్లీ ఒబామా మాట్లాడుతూ 2024 అధ్యక్ష ఎన్నికల్లో వచ్చే ఫలితం గురించి తాను భయపడుతున్నానని వ్యాఖ్యానించారు. అలాగే, తనకు ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదన్నారు. -
సన్నగిల్లిన బైడెన్ జ్ఞాపకశక్తి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచు కున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్ ఖండించినా ఆ నివేదికలో పేర్కొన్న విషయాలను గమనిస్తే అవన్నీ నిజాలే అని అనిపించకమానవు. తక్కువ జ్ఞాపకశక్తి ఉన్న వృద్ధుడు అని బైడెన్ను నివేదిక అభివర్ణించింది. గత జనవరిలో వాషింగ్టన్లోని బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలను సిబ్బంది కనిపెట్టడంతో ఆ విషయం అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్దాకా వెళ్లింది. దీంతో ఆయన న్యాయశాఖ స్పెషల్ కౌన్సిల్గా రాబర్ట్ హుర్ను నియమించారు. ఈయన ఇటీవల బైడెన్ను ఏకధాటిగా ఐదు గంటలపాటు ఇంటర్వ్యూ చేసి ఆయన జ్ఞాపకశక్తిపై ఒక అంచనాకొచ్చారు. ఇదిగాక ఇతరత్రా సాక్ష్యాధారాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. గురువారం విడుదలైన ఆ 345 పేజీల నివేదికలో ఏమన్నాయంటే.. ► బరాక్ ఒబామా హయాంలో ఉపా« ద్యక్షుడిగా పనిచేసినకాలంలో అఫ్గానిస్తాన్ లో అమెరికా స్థావరాలు, సైన్యం మొహరింపు రహస్యాలను ఒక ప్రైవేట్ వ్యక్తితో బైడెన్ పంచుకున్నారు. సంబంధిత రహస్య పత్రాలను డెలావర్లోని తన గ్యారేజీలో మర్చి పోయారు. ► తన కుమారుడు బ్యూ బైడెన్ క్యాన్సర్ తో ఏ సంవత్సరంలో చనిపోయిందీ బైడెన్ ఠక్కున చెప్పలేకపోయారు ► ఉపాధ్యక్షుడిగా ఏ సంవత్సరంలో దిగిపోయారు అనేదీ ఈయనకు సరిగా గుర్తులేదు ► తన జీవితచరిత్ర రాస్తున్న ఒక రచయితకు సున్నితమైన అంశాలున్న ఒక నోటు పుస్త కం ఇచ్చారు. అందులో అఫ్గానిస్తాన్కు సంబంధించిన రహస్య సమాచారం ఉంది. అవన్నీ అబద్ధా్దలు: బైడెన్ ‘దాదాపు 40 సంవత్సరాల క్రితం విషయాలను ఠక్కున చెప్పాలంటే ఎలా?. నా కుమారుడి మరణాన్ని చర్చించకూడదనే ఆ ప్రశ్న సమయంలో స్పందించలేదు. రెండోసారీ అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగే శక్తిసామర్థ్యాలు నాకున్నాయి’’అని బైడెన్ పనరుద్ఘాటించారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలపై తడబడుతూ, పొరబడటం గమనార్హం. -
USA: అధ్యక్ష రేసులో ట్రంప్ లైన్ క్లియర్!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ దాదాపు లైన్ క్లియర్ అయ్యింది. న్యూ హాంప్షైర్లో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ ప్రత్యర్థి నిక్కీ హేలీ ఓటమి చెందారు. దీంతో, ట్రంప్ అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారు. అయితే, ట్రంప్ విజయం అనంతరం నిక్కీ హేలీ స్పందించారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్కు అధినందనలు తెలిపారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం పోటీపడిన అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీలో పోటీ అంతా ట్రంప్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యనే కేంద్రీకృతమైంది. భారత సంతతికే చెందిన మరో అభ్యర్థి వివేక్ రామస్వామి, న్యూ జెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్లు బరినుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. వీరిలో రామస్వామి, డిశాంటిస్లు ట్రంప్నకు మద్దతు ప్రకటించారు. ఇక హ్యాంప్ షైర్ గవర్నర్ సునును మద్దతు ఉన్న హేలీ ఆ రాష్ట్ర ప్రైమరీలో ట్రంప్నకు గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ట్రంప్కు మద్దతు ఇవ్వడంతో ఆయన ముందంజలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్కు 55.5 శాత ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా 41,423 ఓట్లు పడ్డాయి. 46.1 శాతంతో 36,083 ఓట్లను సాధించారు నిక్కీ హేలీ. కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. BREAKING: Essential projects Donald Trump will win the #NewHampshirePrimary pic.twitter.com/yitff269Fg — Essential Filmworks 🇺🇸 (@Real_EF_News) January 24, 2024 ఇదిలా ఉండగా, అంతకుముందు.. అయోవా స్టేట్లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు పడ్డాయి. El expresidente de #EEUU🇺🇲 Donald Trump gana las primarias republicanas en #NewHampshire pic.twitter.com/4spzM0jPmQ — Allan Berfield 🌎 (@allanberfield) January 24, 2024 అయితే, ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్లో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. దీంతో, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ.. ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. 2019 నాటి ఎన్నికల్లో ఓడినా మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది. -
పుతిన్ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్ను సర్వనాశనం చేసేందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంకణం కట్టుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దుయ్యబట్టారు. ‘‘ఆయన యుద్ధోన్మాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాల్సిందే. ఉక్రెయిన్పై రష్యా తాజాగా క్షిపణుల వర్షం కురిపించిన వైనం ఈ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది’’ అన్నారు. తమ దేశంపైకి రష్యా ఏకంగా 110 క్షిపణులను ప్రయోగించిందని, ఈ డాడిలో 31 మంది అమాయకులు బలవగా వందలాది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం తెలిసిందే. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి పెద్ద దాడి అని ఉక్రెయిన్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ను అడ్డుకునేందుకు ఉక్రెయిన్కు మరింత సాయం అందిద్దామని అమెరికా చట్టసభ కాంగ్రెస్కు బైడెన్ పిలుపునిచ్చారు. -
Israel-Hamas war: ఇజ్రాయెల్పై బైడెన్ అసంతృప్తి!
వాషింగ్టన్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దండయాత్రను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారిగా తప్పుబట్టారు. బుధవారం వాషింగ్టన్లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇజ్రాయెల్ యుద్ధరీతిపై బైడెన్ మాట్లాడారు. ‘‘ ఇజ్రాయెల్ భద్రత అనేది అమెరికాతో ముడిపడి ఉంది. ఇన్నాళ్లూ ఐరోపా సమాఖ్య, యూరప్ దేశాలూ ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడ్డాయి. కానీ ఇప్పుడా పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణారహిత బాంబుదాడులే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ విషయం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తెలుసో తెలీదో. గాజావ్యాప్తంగా ఇళ్లలో ఉన్న సాధారణ ప్రజానీకాన్ని చిదిమేస్తూ భవనాలపై దారుణ బాంబింగ్ కొనసాగుతోంది. ఈ దాడుల పర్వం మరికొన్ని వారాలు, నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులే చెబుతున్నారు. అమా యక పాలస్తీనియన్ల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది’’ అని ఇజ్రాయెల్ భీకర గగనతల, భూతల దాడులను బైడెన్ ఆక్షేపించారు. ఈ విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ఈ వారమే ఇజ్రాయెల్లో పర్యటించి భారీ దాడులకు ఎప్పుడు చరమగీతం పాడుతారనే దానిపై ఒక హామీ తీసుకోనున్నారు. ‘‘ 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా అఫ్గాని స్తాన్లో యుద్ధానికి దిగింది. అమెరికా చేసిన ఇలాంటి అతి ‘స్పందన’ తప్పిదాల నుంచి ఇజ్రాయెల్ ఏమీ నేర్చుకున్నట్లు కనిపించట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మద్దతును ఇజ్రాయెల్ కోల్పోతుంది’’ అని బైడెన్ హెచ్చరించారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ సాయుధసంస్థ ప్రతినిధి బీరుట్ నగరంలో మాట్లాడారు. ‘‘ఈ యుద్ధ విపరి ణామాలు ఇజ్రాయెల్లో త్వరలోనే కనిపిస్తాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాత శ్వేతసౌధంలో బైడెన్ సీటు గల్లంతవుతుంది’’ అని హమాస్ రాజకీయవిభాగం నేత ఒసామా హమ్దాన్ వ్యాఖ్యానించారు. -
బైడెన్తో జిన్పింగ్ భేటీ
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చైనా అధినేత షీ జిన్పింగ్ సమావేశానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన ఈ భేటీ జరుగనుంది. ఇటీవలి కాలంలో అమెరికా–చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరువురు నాయకుల సమావేశం అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధాలను పునరుద్ధరించుకొనే దిశగా వారిద్దరూ చర్చలు జరుపునున్నట్లు తెలుస్తోంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జిన్పింగ్ మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయన అమెరికాకు రావడం ఆరేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. -
అల్ఖైదా కంటే ప్రమాదకరం
వాషింగ్టన్: పాత మసీదులు, యూదుల పురాతన ఆలయాల ఆనవాళ్లు ఉన్న పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం మొదలైన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం పలు మలుపులు తీసుకుంటున్న వేళ హమాస్ సాయుధసంస్థపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోని ఫిలడెలి్ఫయాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ మాట్లాడారు. 2001 సంవత్సరంలో 9/11 సెపె్టంబర్ దాడులకు తెగబడిన అల్ఖైదా ఉగ్రసంస్థ కంటే హమాస్ ప్రమాదకరమైనదని అభివరి్ణంచారు. హమాస్ దాడులకు గురైన ఇజ్రాయెల్కు అమెరికా ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ‘ ఇజ్రాయెల్పై దాడి చేసి హమాస్ ఏకంగా వేయి మందికిపైగా అమాయకులను పొట్టనబెట్టుకుంది. అల్ఖైదా సృష్టించిన 9/11 దాడులకంటే ఈ దాడి అత్యంత దారుణం. అల్ఖైదా కంటే హమాస్ ప్రమాదకరం. అల్ఖైదాను మించిన దుషు్టలు వీరు. మొదట్నుంచీ చెబుతున్నట్లే మేం ఇజ్రాయెల్కు బాసటగా నిలబడతాం. ఆత్మరక్షణ కోసం, ప్రతిదాడుల కోసం ఇజ్రాయెల్ తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రతీ చర్యకూ అమెరికా అండగా ఉంటుంది. గాజాలో నెలకొన్న మానవీయ సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే ఇజ్రాయెల్కు చేరుకున్నారు’ అని బైడెన్ చెప్పారు. ఐరాసతోనూ చర్చిస్తున్నాం ‘ఇజ్రాయెల్ ప్రభుత్వంతోనేకాదు దాని పొరుగున ఉన్న జోర్డాన్, ఈజిప్ట్ ఇతర అరబ్ దేశాలతో మంతనాలు జరుపుతున్నాం. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో పాలస్తీనా, ఇజ్రాయెల్లలో నెలకొన్న మానవీయ సంక్షోభం పోగొట్టేందుకు ఐక్యరాజ్యసమితితోనూ సమష్టిగా కృషిచేస్తున్నాం. చర్చిస్తున్నాం’ అని అన్నారు. -
ఉక్రెయిన్కు మరో రూ.2,695 కోట్ల సాయం
వాషింగ్టన్: రష్యా సైనిక చర్య వల్ల ఎంతగానో నష్టపోయిన ఉక్రెయిన్కు ఇప్పటికే వివిధ రూపాల్లో సాయం అందించిన అగ్రరాజ్యం అమెరికా మరో భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భద్రతా సాయం కింద ఉక్రెయిన్కు 325 మిలియన్ డాలర్లు (రూ.2,695 కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఆయన తాజాగా వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యాతోయుద్ధంపై వారు చర్చించుకున్నారు. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వాన్ని కాపాడడమే తమ కర్తవ్యమని బైడెన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రజలు అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు సహా ఉక్రెయిన్కు రూ.2,695 కోట్ల సాయం అందజేయబోతున్నామని తెలిపారు. అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులను వచ్చేవారం ఉక్రెయిన్కు ఇస్తామని వివరించారు. -
మహాత్ముని పలుకులే భారత్–అమెరికా మైత్రికి మూలం
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సంరక్షణ సూక్తులే భారత్–అమెరికా మధ్య సత్సంబంధాలకు మూలమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మహాత్ముని సమాధి ‘రాజ్ఘాట్’లో నివాళులరి్పంచిన సందర్భంగా బైడెన్ పలు ట్వీట్లు చేశారు. ‘ గాం«దీజీ ప్రవచించిన సంరక్షణ సూక్తులే ఇరు దేశాల మధ్య దృఢ బంధానికి మూలం. మన రెండు దేశాలు మధ్య నెలకొన్న పరస్పర నమ్మకం, సంరక్షణ బాధ్యతలే మన పుడమి సంరక్షణకూ దోహదపడుతున్నాయి’ అని అన్నారు. ‘మోదీతో విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా ముగిశాయి. 31 అధునాతన డ్రోన్ల కొనుగోలు, భారత్లో జీఈ జెట్ ఇంజిన్ల సంయుక్త తయారీసహా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి’ అని చెప్పారు. ‘ఈ రోజు ఇక్కడికి(రాజ్ఘాట్)కు తీసుకొచ్చిన మీకు(ప్రధాని మోదీ) నా కృతజ్ఞతలు. అద్భుతంగా అతిథ్యమిచి్చ, జీ20 సదస్సును సజావుగా నిర్వహించి, కూటమికి విజయవంతంగా సారథ్యం వహించారు. రాజ్ఘాట్కు రావడం నిజంగా గర్వంగా ఉంది. గాం«దీజీ ఆచరించి చూపిన సత్యం, అహింసా మార్గాలు ప్రపంచానికి ఆచరణీయాలు. ఇవి ఎల్లప్పుడూ ప్రపంచదేశాలకు స్ఫూర్తిదాయకాలు. ఇదే మన రెండు దేశాల బంధానికి పునాది రాళ్లు’ అని మోదీనుద్దేశిస్తూ బైడెన్ ట్వీట్చేశారు. జీ20 సదస్సు ముగిశాక భారత్కు బైబై చెప్పిన బైడెన్.. వియత్నాంకు పయనమయ్యారు. మహాత్మునికి జీ20 నేతలంతా పుష్పగుచ్ఛాలతో నివాళులర్పిస్తున్న ఫొటోను, కార్యక్రమానికి సంబంధించిన 19 సెకన్ల వీడియోను బైడెన్ ట్వీట్ చేశారు. జీ20 దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూటమే స్వయంగా పరిష్కార మార్గాలు కనిపెట్టగలదని బైడెన్ ధీమా వ్యక్తంచేశారు. మహాత్మునికి నేతల నివాళి జీ20 సదస్సుకు విచ్చేసిన నేతలంతా ఆదివారం రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మాగాం«దీకి నివాళులరి్పంచారు. మొదట వారంతా వర్షం నీరు నిలిచిన రాజ్ఘాట్ లోపలికొచ్చారు. 1917 నుంచి 1930 వరకు గాం«దీజీ నివసించిన సబర్మతి ఆశ్రమం ఫొటో ఉన్న ప్రాంతం వద్ద నిల్చుని విడివిడిగా ఒక్కో నేతకు మోదీ స్వాగతం పలికారు. ఫొటో చూపిస్తూ ఆశ్రమం ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ అంగవస్త్రం బహూకరించారు. మోదీ, సునాక్ పాదరక్షలు లేకుండా రాజ్ఘాట్ లోపలికి ప్రవేశించగా, మిగతా నేతలు.. నిర్వాహకులు సమకూర్చిన తెల్లని పాదరక్షలు ధరించారు. తర్వాత నేతలంతా కలిసి గాం«దీజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అక్కడి శాంతికుడ్యంపై సంతకాలు చేశారు. -
G20 summit: నేడే మోదీ– బైడెన్ చర్చలు
న్యూఢిల్లీ: జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ప్రపంచ, వ్యూహాత్మక స్థాయి భాగస్వామ్యాన్ని మరింతగా దృఢతరం చేసుకోవడమే చర్చల ప్రధాన అజెండా కానుంది. స్వచ్ఛ ఇంధనం, వర్తకం, హై టెక్నాలజీ, రక్షణ వంటి రంగాల్లో ప్రస్తుత పరస్పర సహకారాన్ని సమీక్షించి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సమస్యలను అధిగమించే మార్గాలపై నేతలు దృష్టి సారిస్తారు. బైడెన్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకుంటారు. ఆదివారం జీ 20 సదస్సు ముగియగానే వియత్నాం బయల్దేరతారు. మోదీ, ఇతర నేతలతో ఈ వారాంతంలో ఫలప్రదమైన చర్చల కోసం బైడెన్ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారని వైట్ అండ్ హౌజ్ ప్రెస్స్ కార్యదర్శి కరిన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చివరిసారిగా 2020లో భారత్ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. -
G20 Summit: అతిథులొస్తున్నారు...
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. ఏయే దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు శుక్రవారం ఏ సమయానికి విచ్చేస్తున్నారో ఓసారి చూద్దామా! ► రేపు ఢిల్లీలో ప్రారంభంకానున్న జీ–20 శిఖరాగ్ర సదస్సు బ్రిటన్ :: రిషి సునాక్ జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. జపాన్ :: ఫుమియో కిషిదా సునాక్ విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పాలెం విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా విమా నం ల్యాండ్ కానుంది. మధ్యా హ్నం 2.15 గంటలకు ఆయన భారత గడ్డపై అడుగుపెడతారు. ఈయనను సైతం కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి రిసీవ్ చేసుకోనున్నారు. కిషిదా భారత్కు రావడం ఇది రెండోసారి. ఇటీవల మార్చి నెలలో భారత్లో రెండు రోజులపాటు పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా :: జో బైడెన్ అగ్రరాజ్యాధినేత జో బైడెన్ రాకపైనే అందరి కళ్లు. ఈయన సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ బైడెన్కు సాదర ఆహ్వానం పలుకుతారు. బైడెన్ సతీమణి జిల్కు కరోనా పాజిటివ్ రావడంతో బైడెన్ జీ20 సదస్సుకు వస్తారో రారో అనే సందిగ్ధత నెలకొంది. బైడెన్కు చేసిన కరోనా టెస్ట్లో నెగటివ్ ఫలితం రావడంతో ఆయన పర్యటన ఖాయమైంది. అయినా సరే సదస్సు సందర్భంగా ఆయన మాస్క్ ధరించే పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. కెనడా :: జస్టిన్ ట్రూడో అమెరికా తర్వాత ఆ దేశానికి ఉత్తరవైపు పొరుగు దేశం కెనడా తరఫున ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత్లో అడుగుపెడతారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాలెం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జస్టిన్కు సాదర స్వాగతం పలుకుతారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు చిరునామాగా నిలిచిన కెనడాలో ఇటీవల వేర్పాటువాద సంస్థలు రెచ్చిపోయాయి. భారత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ కెనడా–భారత్ సత్సంబంధాలను క్షీణింపజేశాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒడంబడికను కెనడా అర్ధంతరంగా ఆపేసింది. ఈ తరుణంలో జీ20 వేదికగా కెనడా అగ్రనేత భారత్లో పర్యటించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. చైనా :: లీ కియాంగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వాస్తవానికి ఈ సదస్సులో పాల్గొనాలి. కానీ ఈసారి ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ‘జిన్పింగ్ గైర్హాజరు ఊహించిందే. ఇది జీ20 కూటమి పరస్పర ఉమ్మడి నిర్ణయాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావంచూపబోదు’అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కుండబద్దలు కొట్టారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అకాŠస్య్ చిన్ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ తమ కొత్త భౌగోళిక పటాన్ని చైనా విడుదలచేయడంతో డ్రాగన్ మీద భారత్ ఆగ్రహంగా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ల నేతలూ.. యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ రాత్రి ఏడున్నరకు ఢిల్లీలో దిగుతారు. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ సైతం జీ20 సదస్సుకు వస్తున్నారు. సింగపూర్ ప్రధాని లూంగ్ లీని కేంద్ర సహాయ మంత్రి మురుగన్ రిసీవ్ చేసుకుంటారు. జర్మనీ చాన్స్లర్ స్కోల్జ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నారు. ఈయనను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ రిసీవ్ చేసుకోనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ శనివారం మధ్యాహ్నం 12.35 నిమిషాలకు వస్తారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మహిళా మంత్రి అనుప్రియా సింగ్ పాటిల్ మేక్రాన్కు స్వాగతం పలుకుతారు. క్యూ కట్టనున్న నేతలు సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకుంటారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ ఇయోల్ యూన్ సాయంత్రం 5.10కి వస్తున్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో రాత్రి సమయంలో రానున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పదిగంటలకు చేరుకుంటారు. స్పెయిన్ అధ్యక్షుడు పెట్రో పెరిజ్ రాత్రి 10.15కు చేరుకుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్యావరణ హామీలపై దృష్టి
వాషింగ్టన్: వర్ధమాన దేశాలకు చేసిన వాగ్దానాలను, పర్యావరణం సహా కీలక అంశాలపై హామీలను నెరవేర్చడం తదితరాలు జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రాథమ్యాలు కానున్నాయి. ఆయన భారత పర్యటనకు సంబంధించి బుధవారం చేసిన ప్రకటనలో వైట్హౌస్ ఈ మేరకు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జీ20 సదస్సు గొప్పగా విజయవంతం అవుతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్ గురువారం భారత్ రానున్నారు. శుక్రవారం ఆయన మోదీతో భేటీ అవుతారు. శని, ఆదివారాల్లో జీ20 భేటీలో పాల్గొంటారు. -
జీ20 నేతలకు మెనూ సిద్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నో పోషకాలతో నోరూరించే భారతీయ తృణధాన్యాల వంటకాల రుచిని వీరికి చూపించనున్నారు. భారత్ మంటపంలో జరుగుతున్న శిఖరాగ్రం ఏర్పాట్లను జీ20 స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి ఆదివారం పీటీఐకి వివరించారు. ‘మన దేశ స్ట్రీట్ ఫుడ్, ప్రాంతీయ, స్థానిక వంటకాలను వారికి సరికొత్త రీతిలో పరిచయం చేయనున్నాం. ఢిల్లీలోని చాందినీ చౌక్ తదితర ప్రాంతాల్లోని స్ట్రీట్ ఫుడ్కు ఎంతో పేరుంది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న మీడియా సెంటర్లో భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచిని ఆస్వాదించొచ్చు’అని పర్దేశి వివరించారు. ప్రపంచదేశాల నేతల సతీమణుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ‘నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో షాపింగ్ అనుభవంతో కూడిన భారతీయ ప్రసిద్ధ హస్తకళల వారసత్వంపై లైవ్ షోలు ఏర్పాటుచేశాం. నేతలు, ప్రతినిధులకిచ్చే బహుమతుల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం’అని చెప్పారు. ‘ప్రపంచ నాయకులకిచ్చే బహుమతులు గౌరవభావాన్ని పెంచేలా, వారి మనస్సును ఆకట్టుకునేలా ఉండాలని ప్రధాని చెప్పారు. ఆ మేరకు తివాచీలు, హస్తకళల వస్తువులు, పెయింటింగ్ల వంటి వాటితో జాగ్రత్తగా తయారు చేసిన జాబితాను అందజేశాం’అని తెలిపారు. శిఖరాగ్రానికి వివిధ దేశాల నుంచి 10 వేల మందికి పైగా తరలిరానున్నారని పర్దేశి చెప్పారు. ‘శిఖరాగ్రంలో చివరి సెషన్లో జీ20 తదుపరి అధ్యక్ష హోదాలో బ్రెజిల్ లాంఛనప్రాయంగా బాధ్యతలను చేపడుతుంది. నవంబర్ 30వ తేదీన ప్రధాని బ్రెజిల్కు వెళ్లి బాధ్యతలను అప్పగించే అవకాశం లేకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు’అని పర్దేశి చెప్పారు. -
8న ప్రధాని మోదీతో బైడెన్ భేటీ
వాషింగ్టన్: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్ రానున్న అధ్యక్షుడు బైడెన్ ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. భారత్ అధ్యక్షతన ఈ నెల 9, 10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ‘జీ20 సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 7వ తేదీన అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీకి చేరుకుంటారు. 8న ప్రధాని మోదీతో ఆయన సమావేశమవుతారు’ అంటూ వైట్ హౌస్ శుక్రవారం రాత్రి బైడెన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్లో వివరించింది. 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర భేటీల్లో ఆయన పాల్గొంటారు. ఇతర జీ20 భాగస్వామ్య దేశాల నేతలతో ఆయన క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణ మార్పులను నిలువరించడం వంటి అంతర్జాతీయ అంశాల్లో ఉమ్మడి ప్రయత్నాలపై చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది. 10న వియత్నాంకు బయలుదేరి వెళతారని పేర్కొంది. -
ఆ పాప నా మనవరాలే : బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబ వ్యవహారంపై గత కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు ఆయన ఎట్టకేలకు తెర దించారు. నేవీ జాన్ రాబర్ట్స్ అనే నాలుగేళ్ల చిన్నారి తన మనవరాలేనని అంగీకరించారు. ఆ పాప తన ఏడవ మనవరాలని ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘ నా కుమారుడు హంటర్ బైడెన్, లండెన్ రాబర్ట్లకు 2018లో కలిగిన సంతానమే చిన్నారి నేవీ. హంటర్, లండెన్లు తమ కుమార్తె క్షేమం కోసం వారిద్దరి మధ్య సంబంధాలను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని ఆ ప్రకటనలో చెప్పారు. ఇదేమీ రాజకీయ వ్యవహారం కాదని, కుటుంబ వ్యవహార మని స్పష్టం చేశారు. నేవీతో పాటుగా తమ మనవలు, మనవరాళ్లు అందరికీ అంతా మంచి జరగాలని తాను, జిల్ బైడెన్ కోరుకుంటున్నామని బైడెన్ పేర్కొన్నారు. నేవీ రాబర్ట్స్ పెంపకం బాధ్య తలపై తల్లి లండెన్ రాబర్ట్ కోర్టుకెక్కిన సమయంలో వారిద్దరి మధ్య సంబంధం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన కోర్టు నేవీ తండ్రి హంటర్ బైడెనేనని నిర్ధారించింది. హంటర్ బైడెన్ 2021లో తాను రాసిన పుస్తకంలో లండెన్తో సంబంధం గురించి రాశారు. డ్రగ్స్కు బానిసగా ఉన్న సమయంలో ఆమె తన జీవితంలోకి వచ్చిందని ఆ తర్వాత ఆమెని మర్చిపోయానని ఆ పుస్తకంలో రాశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు పాప బాధ్యతను తాను కూడా తీసుకున్నానని అందులో రాసుకొచ్చారు. ఇంత జరిగినా అధ్యక్షుడు బైడెన్ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం చిన్నారి నేవీని మనవరాలిగా స్వీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ ప్రకటన చేశారు. -
మా దగ్గరా బోలెడు క్లస్టర్ బాంబులు
కీవ్: ఉక్రెయిన్కు అమెరికా విధ్వంసకర క్లస్టర్ బాంబులను సరఫరా చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమ వద్ద కూడా క్లస్టర్ బాంబుల నిల్వలు దండిగా ఉన్నాయని ప్రకటించారు. ఈ వివాదాస్పద ఆయుధాలను ఉక్రెయిన్ వాడిన పక్షంలో తగు రీతిలో స్పందించే హక్కు తమకుందని హెచ్చరించారు. ‘మా వద్ద క్లస్టర్ బాంబులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు వాటిని వాడలేదు. అటువంటి అవసరం కూడా మాకు రాలేదు’ అని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ ఇప్పటికే క్లస్టర్ బాంబులను వాడినట్లుగా పలు ఆధారాలను అసోసియేటెడ్ ప్రెస్, అంతర్జాతీయ మానవతావాద సంస్థలు చూపుతున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో, యుద్ధక్షేత్రంలో రష్యా ఆర్మీపై ఉక్రెయిన్ పైచేయి సాధించాలంటే విధ్వంసకర క్లస్టర్ బాంబులే మార్గమని అమెరికా అంచనా వేస్తోంది. క్లస్టర్ బాంబుల సరఫరాపై నెలలపాటు అమెరికా మల్లగుల్లాలు పడింది. ఉక్రెయిన్కు వీటిని అందజేయాలన్న నిర్ణయానికే అధ్యక్షుడు బైడెన్ చివరికి మొగ్గు చూపారు. ప్రమాదకరమైనవిగా భావించే క్లస్టర్ బాంబులను చివరిసారిగా అమెరికా 2003లో ఇరాక్ యుద్ధంలో వాడినట్లు చెబుతోంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 30 లక్షల క్టస్టర్ ఆయుధ నిల్వలున్నాయి. డొనెట్స్క్, ఖెర్సన్ ప్రాంతాలే లక్ష్యంగా గత 24 గంటల్లో రష్యా రెండు షహీద్ డ్రోన్లను, రెండు క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైళ్లతోపాటు 40 వైమానిక దాడులు, 46 రాకెట్ దాడులు జరిపిందని ఉక్రెయిన్ తెలిపింది. -
బీచ్లో బైడెన్ సందడి.. వైరల్గా ఫొటోలు
డెలావర్: ఊపిరిసలపని పనుల్లో సతమతమయ్యే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెలావర్ బీచ్లో సందడి చేశారు. 80 ఏళ్ల వయసున్న బైడెన్ భార్య జిల్ బైడెన్, మనవరాలు ఫిన్నెగన్తో కలిసి బీచ్లో కాసేపు సన్ బాత్ తీసుకున్నారు. కుటుంబంతో కలిసి బీచ్లో ఎంజాయ్ చేస్తూ పని ఒత్తిళ్ల నుంచి రిలాక్సయ్యారు. బీచ్కి వెళ్లే వారికి అధ్యక్షుడు వస్తున్నారని సమాచారం కాస్త ముందుగా ఇచ్చారు. దీంతో బీచ్లో అక్కడక్కడా జనం కనిపిస్తూనే ఉన్నారు. అయిదు రోజుల యూరప్ పర్యటనకి వెళ్లడానికి ముందు శనివారం డెలావర్లోని రెహోబాత్ బీచ్కు బైడెన్ వచ్చారు. ఆ రోజు కాస్త సూర్యుడు రావడంతో సన్ బాత్ తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. -
బైడెన్కు తీవ్ర నిద్ర సమస్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిద్రకు సంబంధించిన స్లీప్ అప్నియా అనే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. దీంతో, ఆయన కొన్ని రోజులుగా నిద్ర కోసం సీపాప్(కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్) అనే యంత్రాన్ని వాడుతున్నారని వైట్హౌస్ అధికారులు తెలిపారు. స్లీప్ అప్నియా సమస్య ఆయనకు దశాబ్దకాలంగా ఉందని తెలిపారు. 2008 నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన తన మెడికల్ రిపోర్టుల్లో వెల్లడిస్తున్నారని కూడా పేర్కొన్నారు. స్లీప్ అప్నియా అనేది సాధారణంగా కనిపించే సమస్య. నిద్రలో ఉన్న సమయంలో గాలి పీల్చుకోవడం తరచూ ఆగిపోతుంటుంది. ఈ సమస్య ఉన్న వారు రాత్రి మొత్తం నిద్రపోయినా పగటి వేళ అలసిపోయినట్లు ఉంటారు. సీపాప్ యంత్రాన్ని అధ్యక్షుడు మంగళవారం రాత్రి కూడా వాడాల్సి వచి్చందని వైట్హౌస్ అధికారులు వివరించారు. షికాగోలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు బయలుదేరిన సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపించాయి. సీపాప్ పరికరాన్ని వాడటం వల్లే ఇలా గీతలు పడ్డాయని తెలిపారు. -
భారత్–అమెరికా భాగస్వామ్యానికి ప్రపంచంలో ప్రాముఖ్యత: బైడెన్
వాషింగ్టన్: భారత్–అమెరికా భాగస్వామ్యానికి, స్నేహానికి ప్రపంచంలో అత్యధిక ప్రాముఖ్యత ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా, సన్నిహితంగా, స్థిరంగా ఉన్నాయని వివరించారు. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ మేరకు బైడెన్ తాజాగా ట్వీట్ చేశారు. బైడెన్ ట్వీట్ పట్ల ప్రధాని మోదీ స్పందించారు. భారత్–అమెరికా స్నేహం ప్రపంచదేశాల అభ్యున్నతికి తోడ్పతుందని పేర్కొన్నారు. మన భూగోళం మరింత ఉత్తమంగా, స్థిరంగా మారడానికి ఇరుదేశాల భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ట్విట్టర్లో స్పష్టం చేశారు. బైడెన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. ఇటీవల తాను చేపట్టిన పర్యటన భారత్–అమెరికా నడుమ సంబంధ బాంధవ్యాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్యనున్న సన్నిహిత, లోతైన భాగస్వామ్యాన్ని మోదీ పర్యటన మరింత దృఢతరం చేసిందని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్హౌజ్ హర్షం వ్యక్తం చేసింది. -
నింగి.. నేల.. నీరు.. ఎక్కడైనా పవర్ఫుల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు రక్షణ రంగంలో పటిష్ట బంధాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ రంగంలో వేలాది కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అందులో అందరి దృష్టిని ఎంక్యూ9 రీపర్ డ్రోన్లు ఆకర్షిస్తున్నాయి. ఈ డ్రోన్ల కొనుగోలుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ డ్రోన్ల ప్రత్యేకతలు భారత్కు ఒనగూరే ప్రయోజనాలేంటో చూద్దాం.. నింగి, నేల, నీరు ఎక్కడైనా, ఏ పనైనా ఈ డ్రోన్లు చేయగలవు. కదన రంగంలో అరివీర భయంకరమైనవిగా గుర్తింపు సంపాదించాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు బహుళ ప్రయోజనాలకు వినియోగపడతాయి. అమెరికాకు చెందిన జనరల్ ఆటమిక్స్ ఏరోనాటికల్ వ్యవస్థ ఈ డ్రోన్లను అభివృద్ధి చేసింది. సaరిహద్దు ప్రాంతాల్లో నిఘా, శత్రుదేశాల రహస్యాల సేకరణ వంటి కార్యక్రమాలతో పాటు బాంబు దాడుల్ని కూడా ఈ డ్రోన్లు చేయగలవు. ఈ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. త్రివిధ బలగాలైన భారత వైమానిక దళం, నావికా దళం, ఆర్మీలకు ఒక్కో దానికి 10 డ్రోన్ల చొప్పున మొత్తం 30 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య గురువారం నాడు జరిగే భేటీలో 300 కోట్ల డాలర్ల విలువైన (రూ.24,600 కోట్లు) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మిలటరీ ఆపరేషన్లు, సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యల్లో ఈ డ్రోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. మానవ రహిత డ్రోన్లు కావడంతో కదన రంగంలో వినియోగించినా ప్రాణనష్టం ఉండదు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లో ఇద్దరు పైలట్లు ఈ డ్రోన్ను నియంత్రిస్తూ ఉంటారు భారత్కు ఎలా ఉపయోగం ? దీర్ఘకాలం పనిచేయడం, నిరంతరాయంగా నిఘా పెట్టే సామర్థ్యం, దాడులకు దిగే సత్తా వంటి బహుళ ప్రయోజనాలు కలిగిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు భారత త్రివిధ బలగాల మేధస్సు, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మనకి నిరంతరాయంగా ఘర్షణలు, చొరబాట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ డ్రోన్లు మన దగ్గరుంటే సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసి, ముప్పుల్ని ముందే పనిగట్టడం, వాటికి సంబంధించిన ఇమేజ్లను పంపించి అప్రమత్తం చేయడం వంటివి చేస్తాయి. ఉగ్రవాద కార్యకలాపాలను కూడా ఇవి గుర్తించి వాయువేగంతో వాటికి సంబంధించిన సమాచారాన్ని పంపుతాయి. మన దేశానికి అతి పెద్ద సముద్ర తీరప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల్లో భద్రత అత్యంత కీలకం. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్లు పర్యవేక్షించగలవు. స్మగ్లింగ్, పైరసీ వంటి కార్యకలాపాలను గుర్తించడమే కాకుండా, సహాయ కార్యక్రమాల్లోనూ ఉపయోగపడతాయి. ప్రకృతి విపత్తులైన వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి సమయాల్లో విపత్తు నిర్వహణ కూడా చేయగలవు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లు వెళ్లి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఏయే దేశాలు వినియోగిస్తున్నాయి? ఈ డ్రోన్లను అమెరికా చాలా విస్తృతంగా వినియోగిస్తోంది. అప్గానిస్తాన్, ఇరాక్ సహా ఇతర ఘర్షణ ప్రాంతాల్లో వీటిని మోహరించింది. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, నాసా ఈ డ్రోన్లను వినియోగిస్తున్నాయి. యూకే రాయల్ ఎయిర్ఫోర్స్, ఇటలీ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్, స్పెయిన్ ఎయిర్ఫోర్స్ , జపాన్ దేశాలు ఈ డ్రోన్లు వాడుతున్నాయి. 2014–2018 మధ్య కాలంలో ఇరాక్, సిరియాలో నిర్వహించిన 2,400 మిషన్లలో బ్రిటన్ ఈ డ్రోన్లనే మోహరించింది. 398 సార్లు ఈ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్ తమ దేశ రహస్యాలను ఉక్రెయిన్కు చేరవేస్తోందన్న అనుమానంతో నల్లసముద్రంలో గత మార్చిలో కూల్చేసింది. 2020 జనవరిలో ఇరాన్లో జనరల్ క్వాజిం సొలెమినీ ఈ డ్రోన్తో అమెరికా చేసిన బాంబు దాడిలోనే మరణించారు. ప్రత్యేకతలు ► 50 వేల అడుగుల ఎత్తులో 40 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు ► అధునాతన కెమెరాలు, సెన్సార్లు, రాడార్లతో సరిహద్దుల్లో గట్టిగా నిఘా పెట్టి సున్నితమైన అంశాలను, అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి పంపించగలదు ► 240 నాట్స్ ట్రూ ఎయిర్ స్పీడ్ (కేటీఏఎస్) వేగంతో ప్రయాణిస్తుంది ► ఆటోమేటిక్ టేకాఫ్, ల్యాండింగ్, ఎన్క్రిపె్టడ్ కమ్యూనికేషన్ వంటివి చేయగలదు ► 12,177 కేజీల బరువైన పేలోడ్ను మోసుకుపోగలదు ► 2,721 కేజీల ఇంధనాన్ని నింపవచ్చు ► 114 హెల్ఫైర్ క్షిపణులు, జీబీయూ–12 పేవ్వే లైజర్ గైడెడ్ బాంబుల్ని మోసుకుపోగలదు ► ఆకాశంపై నుంచి బాంబుల్ని కూడా కురిపించగలదు సాక్షి, నేషనల్ డెస్క్ -
తీవ్రంగా చలించిపోయా: బైడెన్
వాషింగ్టన్: ఒడిశాలోని బాలాసోర్లో రైలు ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్లో సుమారు 300 మందిని బలి తీసుకున్న రైలు ప్రమాద విషాద వార్త విని తీవ్రంగా చలించిపోయానని బైడెన్ పేర్కొన్నారు. ‘భారత్లో చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన రైలు ప్రమాద విషాద వార్త విని నేను, నా భార్య జిల్ బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి, క్షతగాత్రుల గురించి ప్రార్థిస్తున్నాం. భారత్, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక మూలాల్లో ఉన్న విలువలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది’అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలాసోర్ ఘటనపై ఇప్పటికే యూకే ప్రధాని రిషి సునాక్, రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్ ప్రధాని కిషిదా తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
వీడియో: తుళ్లి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు..
-
Joe Biden: తుళ్లి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తన చేష్టలతో తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఉన్నట్లుండి మరిచిపోవడం, ఒకవైపు వెళ్లాల్సింది మరోవైపు వెళ్లడం, ఉన్నట్లుండి కిందపడిపోవడం.. అంతెందుకు ఆ మధ్య సైకిల్ నుంచి కిందపడిన సందర్భమూ ఉంది. తాజాగా.. ఆయనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గురువారం కొలరాడోలోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో మిలిటరీ గ్రాడ్యుయేట్స్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు హాజరైన బైడెన్.. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తుళ్లి ముందుకు పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆయన్ని పక్కకు తీసుకెళ్లగా.. అక్కడున్నవాళ్లతో కలిసి ఆయన కూడా చిరునవ్వులు చిందించారు. ఎనభై ఏళ్ల బైడెన్ క్షేమంగానే ఉన్నట్లు వైట్ హౌజ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ బెన్ లాబోల్ట్ ట్వీట్ చేశారు. కానీ..ఇక.. ఆయన శారీరకంగా ఫిట్గా ఉన్నారని, నిత్యం ఎక్సర్సైజులు గట్రా చేస్తున్నారని ప్రకటించారు. 2020 నవంబర్లో పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కిందపడి కాలు విరగొట్టుకున్నారు బైడెన్. అయితే ఆ గాయం నుంచి త్వరగానే కోలుకున్నారాయన. 🚨 BREAKING: Joe Biden falls at the Air Force Graduation pic.twitter.com/5r2HQwjAdN — Benny Johnson (@bennyjohnson) June 1, 2023 బైడెన్ కిందపడిన సందర్భంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. బైడెన్కి మానసికంగానే కాదు.. ఇప్పుడు నడవడానికి కూడా కష్టంగా ఉంది. అమెరికన్ల రక్షణ కోసం పార్లమెంట్(అమెరికన్ కాంగ్రెస్) ఇప్పుడు అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణను(అధ్యక్ష స్థానాన్ని మరొకరితో భర్తీ చేయించడం) తెర మీదకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ట్వీట్ చేశారాయన. బైడెన్కి ఇది కొత్త కాదంటూ కొందరు సెటైర్లు పేలుస్తుంటే.. వయసు పైబడిన వ్యక్తి కదా సహజమేనంటూ మరికొందరు ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. Joe Biden is mentally unfit and now unable walk. For the safety of the American people, congress must invoke the 25th amendment NOW! pic.twitter.com/gHQ6rLVd9F — The Trump Train 🚂🇺🇸 (@The_Trump_Train) June 1, 2023 To the ignorant people who are calling for President Joe Biden to be removed from office via the 25th Amendment because he tripped, here is a reminder that Franklin D. Roosevelt was confined to a wheelchair for his presidency. Old people fall. Young people fall. Smart people… pic.twitter.com/iOwTELPVZo — Brian Krassenstein (@krassenstein) June 1, 2023 Stop making fun of Joe Biden, it’s clear he tripped over the flat ground. pic.twitter.com/I4m1tk2w9v — Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) June 1, 2023 BREAKING: Donald Trump reacts to Joe Biden falling pic.twitter.com/qt7ntp8cER — ALX 🇺🇸 (@alx) June 1, 2023 Here’s why Joe Biden fell…pic.twitter.com/cjG1RmNALn — Vernon Jones (@VernonForGA) June 1, 2023 Joe Biden falling pic.twitter.com/akTBYwevbz — COMBATE |🇵🇷 (@upholdreality) June 1, 2023 ఇదీ చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యే సముద్రంలోకి దూకాడు.. రియల్ హీరో అయ్యాడు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు
ఏపీలో అల్లర్లు చేసింది వీరే..
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
కర్నూల్ లో వజ్రాల వేట
యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్..
హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు!.. కానీ..
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
తప్పక చదవండి
- జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
- అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
- Jr NTR Birthday: 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా ఎన్టీఆర్ ఎలా ఎదిగాడు..?
Advertisement