-
ప్రేమకథ ఆరంభం
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ల కొత్త ప్రేమకథ మొదలైంది. ‘బవాల్’ సినిమా తర్వాత వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలిసి ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే ప్రేమకథా చిత్రంలో జోడీగా నటిస్తున్నారు. సన్నీ పాత్రలో వరుణ్, తులసీ కుమారి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని ఊహించవచ్చు.శశాంక్ కేతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శనివారం మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వరుణ్ ధావన్తో పాటు ఈ సినిమా కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల కానుంది. -
బాలీవుడ్ ఎంట్రీ.. రెచ్చిపోతున్న కీర్తిసురేశ్!
ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేశ్. కెరీర్ ప్రారంభం నుంచే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను మెయింటెన్ చేస్తూ వచ్చారు. అలా ఇక్కడ రజనీమురుగన్, రెమో, భైరవా, సామి 2 చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ల లిస్టులో చేరారు. ఈ మధ్య నటించిన మామన్నన్, సైరన్ చిత్రాల వరకూ గ్లామర్కు దూరంగానే ఉంటూ వచ్చారు.బాలీవుడ్లో ఎంట్రీతెలుగులో మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకున్నారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో గ్లామర్గా కనిపించినా శ్రుతిమించి పోలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్లోకి అడుగు పెట్టారో పూర్తిగా గ్లామర్కు ఓటేస్తున్నారు. హిందీ చిత్రాల్లో నటించడం మొదలెడితే అందాల ఆరబోత తప్పదేమో అనిపిస్తోంది కీర్తీసురేష్ను చూస్తుంటే! తెలుగు, తమిళంలో సక్సెస్లు ఉన్నా, అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం.వరుణ్ ధావన్ బర్త్డేబేబీజాన్ చిత్రం ద్వారా కీర్తి బాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తేరి చిత్రానికి రీమేక్. ఈ మూవీని తమిళ టాప్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. బేబీజాన్ షూటింగ్ దశలో ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఈ మూవీ హీరో వరుణ్ ధావన్ బర్త్డే సెలబ్రేషన్స్ చిత్ర యూనిట్ మధ్య జరిగాయి. ఇందులో కీర్తీసురేష్ డీప్ నెక్ ఉన్న లెహంగాలో కనిపించింది. వరుణ్ ధావన్కు కేక్ తినిపించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంతలా మారిపోయారేమిటి? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #KeerthySuresh from the sets of #Babyjohn ( Hindi remake of THERI) 🎬⭐️😎#VarunDhawan | #Atleepic.twitter.com/u3IkBELUtW— Tharani ᖇᵗк (@iam_Tharani) April 24, 2024 చదవండి: వీకెండ్ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ కావొద్దు -
బాలీవుడ్ స్టార్ సతీమణి సీమంతం.. సెలబ్రేషన్స్ చూశారా? (ఫోటోలు)
-
నాకు సిగ్గబ్బా.. 25 ఏళ్లవరకు ఎవరినీ ప్రేమించలేదు: హీరో
యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇతడు ప్రస్తుతం బడే మియా చోటే మియా (పెద్దోడు.. చిన్నోడు) అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్తో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ సినిమా రంజాన్కు రిలీజ్ కానుంది. ఇకపోతే టైగర్ చేతిలో బాఘీ 4 కూడా ఉంది. 25 ఏళ్ల వయసులో లవ్.. ఈ మూవీ థియేటర్లో రిలీజైన తర్వాత అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ గ్రాండ్ ఈవెంట్లో ప్రకటించారు. ఈ వేదికపై టైగర్పై జోకులు పేల్చాడు హీరో వరుణ్ ధావన్. ముందుగా యాక్షన్ హీరో మాట్లాడుతూ.. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, కలిసిపోనని నీకు తెలుసుగా వరుణ్. అందరితో కలివిడిగా ఉండలేను. అందుకే 25 ఏళ్ల వరకు నాకంటూ ఒక గర్ల్ఫ్రెండ్ కూడా లేదు అని చెప్పాడు. ఫస్ట్ లవ్.. ఆమె కాదా? అయితే వరుణ్ మాత్రం.. నిజంగానా? 25 ఏళ్లవరకు నీకు ప్రియురాలే లేదా? అని ఆశ్చర్యపోయాడు. అవును, నాకు పాతికేళ్లు నిండాక.. తొలి సినిమా ఆడిషన్కు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చాడు. అంటే నీ ఫస్ట్ మూవీ హీరోయిన్ కృతి సనన్నే కదా నువ్వు మొదటిసారి ప్రేమించింది? అని అడిగాడు. ఆమె పేరు చెప్పగానే షాకైన టైగర్.. కాదు.. ఇంకో పేరు చెప్పు అన్నాడు. దీంతో వరుణ్.. సరే, నేను సరదాగా అన్నాను. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే! ఎవరూ దీన్ని సీరియస్గా తీసుకోకండి అని చెప్పాడు. దిశాతో డేటింగ్- బ్రేకప్ కాగా టైగర్ ష్రాఫ్- దిశా పటానీ ఇద్దరూ రిలేషన్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మధ్య విడిపోయారని రూమర్స్ రాగా ఇటీవల మాత్రం ఓ ఈవెంట్లో ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆమె పక్కన కూర్చోవడానికి మాత్రం అతడు నిరాకరించాడు. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా వీరు కలిసే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. Tiger talks about Disha and that she is his first gf and how he met her Varun: Kriti Sanon 😒🤣#KritiSanon pic.twitter.com/JSVtwZ3Dg1 — kariti_arab (@aaryan_koki) March 19, 2024 చదవండి: అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్పై ధనుష్ కామెంట్ -
జాన్వీ కపూర్- వరుణ్ ధావన్ జోడీ రిపీట్
బాలీవుడ్ మూవీ ‘బవాల్’ లో(2023) జోడీగా కనపించి ఆడియన్స్ను మెప్పించారు హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ జాన్వీ కపూర్. తాజాగా ఈ జోడీ రిపీట్ అవుతోంది. బాలీవుడ్లో ‘ధడక్’, ‘బద్రీనాథ్ హీ దుల్హనియా’ సినిమాలను తెరకెక్కించిన శశాంక్ కేతన్ తాజాగా ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే కొత్త సినిమాని ప్రకటించారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు గురువారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ చిత్రంలో సన్నీగా వరుణ్ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్ నటిస్తారు. కరణ్ జోహార్, యశ్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ కేతన్ ఈ మూవీ నిర్మించనున్నారు. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. 2025 ఏప్రిల్ 18న ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు జాన్వీ కపూర్. -
నా కుటుంబమే నా బలం
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఓ శుభవార్తను షేర్ చేశారు. తాను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘మేం తల్లిదండ్రులయ్యాం. మీ ఆశీర్వాదాలు కావాలి. మై ఫ్యామిలీ మై స్ట్రెన్త్ (నా కుటుంబమే నా బలం)’’ అంటూ తన భార్య నటషాదలాల్ ప్రెగ్నెన్సీతో ఉన్న ఫోటోను షేర్ చేశారు వరుణ్ధావన్. ఫ్యాషన్ డిజైనర్, మోడల్ నటషా దలాల్ను 2021 జనవరిలో వరుణ్ వివాహం చేసుకున్నారు. హిందీలో ప్రస్తుతం ‘బేబీ జాన్’ సినిమా చేస్తున్నారు వరుణ్ ధావన్. అలాగే ఆయన నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్సిరీస్ ఈ ఏడాది వేసవిలో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేశారు. -
స్టార్ హీరో భార్యకు ప్రెగ్నెన్సీ.. విష్ చేసిన సమంత!
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా కనిపించింది. డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్ ప్రస్తుతం స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా వరుణ్ ధావన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య బేబీ బంప్తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు. కాగా.. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మనీష్ పాల్ కాబోయే తల్లిదండ్రులను అభినందించారు. వరుణ్ ధావన్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో కనిపించనున్నారు. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో సమంతతో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్కు రాజ్,డీకే దర్శకత్వం వహించనున్నారు. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
పవన్ ఫ్యాన్స్కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. బయటకు చెప్పకుండా గుక్కపెట్టి ఏడుస్తున్నారు! ఇదంతా కూడా ఓ హిందీ సినిమా వల్లే? ఏంటి నిజమా అని మీరనుకోవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే పవన్ మొదలుపెట్టిన ఓ రీమేక్ ఎప్పుడొస్తుందో తెలీదు కానీ మరో భాషలో మాత్రం అదే సినిమాకు రీమేక్గా తీస్తున్న మూవీ.. నెలల వ్యవధిలో విడుదలకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) పవన్ కల్యాణ్ మాట తప్పడంలో స్పెషలిస్ట్. 2019లో ఎన్నికల ముందు తను ఇక ప్రజలకే అంకితమైపోతానని అన్నాడు. తీరా ఎలక్షన్స్ అయిపోగానే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోయేసరికి యూటర్న్ తీసుకున్నాడు. సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. పోనీ అవి అయినా సరిగా చేశాడా అంటే లేదు. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' అని రీమేక్ మూవీస్ చేశాడు. ఇవి అతడి ఫ్యాన్స్కి తప్పితే సగటు ప్రేక్షకుడికి పెద్దగా నచ్చలేదు! పైన చెప్పన మూడు సినిమాలతో పాటు 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ'.. ఇలా రెమ్యునరేషన్ వస్తుంది కదా అని చెప్పి చాలా సినిమాల్ని ఒప్పేసుకున్నాడు. వాటిని పూర్తి చేయడంలో మాత్రం నాన్చుడు ధోరణి పాటించాడు. పైకి చెప్పట్లేదు గానీ కక్కలేక మింగలేక ఆయా చిత్రాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకని మీకు అనుమానం రావొచ్చు. అక్కడికే వచ్చేస్తున్నాం. (ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?) పవన్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో దాదాపు మూడేళ్ల క్రితం 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ప్రకటించారు. ఏమైందో ఏమో గానీ అది అలా వాయిదా పడుతూ వస్తోంది. మధ్యలో దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చి కొంత షూటింగ్ చేశారు. కానీ ఇప్పడది హోల్ట్లో పడిపోయింది. ఇది తమిళంలో వచ్చిన 'తెరి'(పోలీసోడు) చిత్రానికి రీమేక్. బయటకు చెప్పనప్పటికీ ఈ విషయం అందరికీ తెలుసు. అయితే 'తెరి' తెలుగు రీమేక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. కానీ హిందీలో మాత్రం వరుణ్ ధావన్ హీరోగా ఇదే మూవీని రీమేక్ చేస్తున్నారు. 'బేబీ జాన్' పేరుతో తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఈ ఏడాది మే 31న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశారు. 'తెరి' హిందీ రీమేక్ రిలీజ్ తేదీని కూడా ప్రకటించేసరికి.. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ తెగ గింజుకుంటున్నారు. పాపం వీళ్లకు ఏడుపు ఒకటే తక్కువైందని.. మిగతా హీరోల ఫ్యాన్స్ సైటెర్లు వేస్తున్నారు. (ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?) -
భార్యకు స్పెషల్గా విష్ చేసిన స్టార్ హీరో.. ఫోటో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అతనికి జోడీగా నటించింది. ఈ ఏడాది సిటాడెల్-2తో పాటు కోలీవుడ్లో మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా దలాల్ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వరుణ్, నటాషా దలాల్ జనవరి 24, 2021న అలీబాగ్లో జరిగిన వివాహా వేడుకలకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ జంట వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు స్పెషల్ విషెస్ చెప్పారు బాలీవుడ్ హీరో. పెళ్లికి ముందు తనకు ప్రపోజ్ చేసిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. హ్యాపీ త్రీ బేబీ అంటూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర ఏళ్ల క్రితం మార్క్ ఆంథోనీ పాట ప్లే అయినప్పుడు ప్రపోజ్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. గతేడాది వరుణ్ నటించిన బవాల్ నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
ఆలియా అవుట్..జాన్వీ ఇన్?
హిందీలో ‘దుల్హనియా’ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హంప్టీ శర్మా కీ దుల్హనియా’, ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ చిత్రాల్లో వరుణ్ ధావన్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాలకు శశాంక్ కేతన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ ఫ్రాంచైజీలో మూడో భాగానికి కేతన్ ప్రయత్నాలు మొదలు పెట్టారని బాలీవుడ్ సమాచారం. వరుణ్ ధావన్, ఆలియా భట్లను కూడా సంప్రదించారట. అయితే వరుణ్ ధావన్ సుముఖంగానే ఉన్నా, ఇప్పటికే అంగీకరించిన చిత్రాల కారణంగా ఆలియా మాత్రం ఈ సినిమాలో నటించలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో ఈ చాన్స్ జాన్వీ కపూర్కు వెళ్లిందట. ఈ సినిమాకు జాన్వీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకున్నాయని టాక్. వేసవిలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. -
బాలీవుడ్లోకి కీర్తీ సురేష్.. దర్శకుడిగా అట్లీ
వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలిస్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా హీరోయిన్స్గా నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ అక్టోబరు రెండో వారం వరకూ సాగుతుందట. వరుణ్, కీర్తీ కాంబోలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు, వరుణ్తో ఓ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశారట కాలిస్. కీర్తీసురేష్కు బాలీవుడ్లో ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. అయితే అట్లీ దర్శకత్వంలోని తమిళ హిట్ ‘తేరీ’ హిందీ రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ కూడా బాలీవుడ్లో విని పిస్తోంది. -
స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!
బాలీవుడ్ హీరోలందరూ సౌత్ డైరెక్టర్లపై మనసు పారేసుకుంటున్నారు! ప్రస్తుతం అంతటా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే యంగ్ హీరో వరుణ్ ధావన్.. దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ మూవీలో నటిస్తున్నాడు. షారుక్తో 'జవాన్' తీసిన తమిళ దర్శకుడు అట్లీ.. వరుణ్ ధావన్ సినిమాని మాత్రం నిర్మిస్తున్నాడు. కలీస్ దర్శకుడు. ఇదంతా పక్కనబెడితే షూటింగ్ మొదలైన రోజే హీరో గాయపడ్డాడనే వార్త అభిమానుల్ని కంగారు పెట్టింది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) 'బవాల్' సినిమాతో ఈ మధ్య ప్రేక్షకుల్ని పలకరించిన వరుణ్ ధావన్.. 'VD18' వర్కింగ్ టైటిల్తో తీస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ప్రోమో కోసం కీలక ఎపిసోడ్స్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఓ యాక్షన్ సీన్లో భాగంగా పట్టుతప్పి కిందపడిపోయిన వరుణ్ మోచేతికి గాయమైంది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఇతడు.. 'నో పెయిన్ నో గెయిన్' (ఫలితం కావాలంటే నొప్పిని భరించాలి) అని రాసుకొచ్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమాతో హీరోయిన్ కీర్తి సురేశ్.. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. వామిక గబ్బి మరో హీరోయిన్. ఇదిలా ఉండగా గతేడాది 'భేడియా' చిత్రంతో హిట్ కొట్టిన వరుణ్.. మొన్నీ మధ్య 'బవాల్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే పెట్టుకుని, గట్టిగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!) -
మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన తాజా చిత్రం బవాల్. ఈ చిత్రంలో జూలై 21న నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదానికి దారితీస్తున్నాయి. ఇటీవలే ఆష్విట్జ్ సీన్స్పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూదుల మారణకాండను ఉద్దేశించేలా చిత్రీకరించిన సన్నివేశాలపై నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు. (ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!) ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి పూర్తిగా తొలగించాలని యూదుల మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ రంగంలోకి దిగింది. ఈ చిత్రాన్ని వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. నాజీల డెత్ క్యాంపుల్లోని సన్నివేశాలతో దర్శకుడు ప్రచారం పొందాలనుకున్నాడని ఆరోపించింది. హిట్లర్ జరిపిన మారణహోమంలో 6 మిలియన్ల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధాన్ని ఈ సినిమాలో తక్కువ చేసి చూపించారు. అందుకే ఈ చిత్రాన్ని వెంటనే ప్రైమ్ నుంచి తొలగించాలని మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ అసోసియేట్ డీన్, డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ సోషల్ యాక్షన్ రబ్బీ అబ్రహం కూపర్ డిమాండ్ చేశారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. నెటిజన్స్ కామెంట్స్ సైతం జాన్వీ కపూర్ స్పందించింది. మీరు సరైన కోణంలో చూడాలని కౌంటర్ ఇచ్చింది. మరోవైపు నెట్టింట జరుగుతోన్న వివాదంపై నితీశ్ తివారీ ఇటీవల స్పందించారు. బవాల్లో మంచి సందేశాలు ఉన్నాయని తెలిపారు. ఆష్విట్జ్లో ఎదురైన పరిస్థితులు చూసి అజ్జూ, నిషా చలించిపోయినట్టు చూపించాం కదా.. విమర్శలు చేసేవాళ్లకు అవీ కనిపించలేదా? అని నితీశ్ ప్రశ్నించారు. (ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) -
ఆష్విట్జ్ సీన్ వివాదం.. నెటిజన్స్కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్!
శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్న భామ ఇటీవల వరుణ్ ధావన్ సరసన నటించిన బవాల్ చిత్రం రిలీజైంది. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేశారు. జూలై 21 నుంచి ఆమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా.. కొన్ని సీన్స్పై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆష్విట్జ్తో ఉన్న సంబంధాలను తెరపై చూపించడంపై ఈ సినిమాపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఆష్విట్జ్ క్యాంపులను చూపించడాన్ని వాళ్లు తప్పుబడుతున్నారు. కాగా.. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించారు. (ఇది చదవండి: కమెడియన్తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) వివాదంపై జాన్వీకపూర్ మాట్లాడుతూ.. 'ఇజ్రాయెల్ దేశస్థుడైన వ్యక్తి నాకు తెలుసు. అతను ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. అతడి పూర్వీకులు దురదృష్టవశాత్తు నాజీల నిర్బంధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అతను ఈ చిత్రాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మేము తీసిన విధానాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అంతేకాదు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. సన్నివేశాల్లో ఎక్కడా ఒక్కసారి కూడా బాధించేలా చూపించలేదు. కాబట్టి ఏదైనా ప్రేక్షకుల దృష్టి కోణంపైనే ఆధారపడి ఉంటుంది. మా ఉద్దేశ్యం రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాన్ని చూపించడమే. మీరు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను. ఈ సినిమాలోని నా పాత్రను చూసి పలువురు విద్యార్థులు చలించిపోయారు. నా పాత్ర చూశాక వాళ్లకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పారు. అది నాకెంతో గర్వంగా అనిపించింది.' అని అన్నారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారని సమాచారం. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా..బవాల్లో వరుణ్, జాన్వీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాస్ ఆడియన్స్కు బాగా నచ్చింది. (ఇది చదవండి: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన టాలీవుడ్ నటి) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
జాన్వీ కొత్త మూవీ బవాల్ స్క్రీనింగ్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ప్యారిస్లో హనీమూన్..
వరుణ్ ధావన్ , జాన్వీ కపూర్ జంటగా నటించిన హిందీ చిత్రం ‘బవాల్’. ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారి దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21 నుంచి అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక దుబాయ్లో జరిగింది. ఈ చిత్రంలో హిస్టరీ టీచర్ అజయ్గా వరుణ్ ధావన్ , నిషాగా జాన్వీ నటించారు. అజయ్, నిషాలు వివాహం చేసుకుని హనీమూన్ కోసం ప్యారిస్కు వెళతారు. అక్కడ వీరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? అనే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా మేజర్ షూటింగ్ కూడా ప్యారిస్లోనే జరిగింది. అయితే ఈ మూవీలో రెండో ప్రపంచ యుద్ధానికి, వరుణ్–జాన్వీల ప్రేమకథకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ చిత్ర యూనిట్ పేర్కొంది. ‘ప్రతి ప్రేమ కథకు, ఆ ప్రేమ తాలూకు యుద్ధం ఉంటుంది’ అన్న విజువల్స్ ట్రైలర్లో కనిపిస్తాయి. -
మాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తున్న రానా
టాలీవుడ్ హీరో రానా, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రానా, వరుణ్ ధావన్ హీరోలుగా నటించడం లేదట. వరుణ్ ధావన్ హీరోగా రానా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ చిత్రం నిర్మాణంలో రానాతో పాటు సునీల్ నారంగ్ కూడా భాగస్వామ్యులు అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో రానా ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఇలా గతంలోనూ రానా పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంటున్నారు రానా. ప్రస్తుతం హీరోగా రానా చేతిలో ఉన్న చిత్రాల్లో ‘రాక్షసరాజు’ (వర్కింగ్ టైటిల్) ఒకటి. ‘నేనే రాజు నేను మంత్రి’ చిత్రం తర్వాత దర్శకుడు తేజ–రానా కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. -
పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో? ట్వీట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ ధావన్ భార్య నటాషాతో విడిపోనున్నట్లు ఓ ట్వీట్ వైరల్గా మారింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను వరున్ 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఏ పార్టీ, ఫంక్షన్స్ జరిగినా ఇద్దరూ కలిసే హాజరవుతుంటారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో విడాకులు తీసుకునేందుకు డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అయితే సినీ సెలబ్రిటీల గురించి సెన్సేషనల్ కామెంట్స్తో వార్తల్లో నిలిచే ఉమైర్సంధు ఇప్పుడు కూడా ప్రబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నాడని, ఇందులో నిజం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. Everything is not “ Ok ” between #VarunDhawan & his wife #NatashaDalal. Separation is on the way !! pic.twitter.com/J5sCXpYnNX — Umair Sandhu (@UmairSandu) May 24, 2023 -
ఓటీటీకి వచ్చేస్తున్న 'తోడేలు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'భేడియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరిట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. (ఇది చదవండి: ‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’) అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈనెల 26 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి నటించింది. (ఇది చదవండి: మనిషి తోడేలుగా మారితే ఏమవుతుంది.. ఆసక్తిగా భేడియా ట్రైలర్) కథేంటంటే.. ఢిల్లీకి చెందిన భాస్కర్(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) కలిసి అరుణాచల్కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థియేటర్లలో సినిమా చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
లండన్లో ‘సీటాడెల్’టీమ్తో సమంత, వరుణ్ ధావన్
-
ఎందుకంత ఓవరాక్షన్?.. సమంతపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్!
సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో అభిమానులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వరుణ్ ధావన్తో సిటాడెల్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్లో నటించింది. ఈ సిరీస్ ఈనెల 28న రిలీజ్ కానుండడంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవల లండన్లో నిర్వహించిన ప్రీమియర్ కార్యక్రమంలో సమంత సరికొత్త లుక్లో కనిపించారు. బ్లాక్ డ్రెస్, ఖరీదైన డైమండ్ నగలతో వేదికపై మెరిసింది. అయితే ఈ వేడుకలో సమంత స్పీచ్పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు నెగెటివ్గా పోస్టులు పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్లో తాను భాగం కావడం పట్ల సామ్ తన కాస్తా ఎక్కువగానే ఎగ్జైట్ మెంట్ ప్రదర్శించింది. కానీ కొత్తగా ఈ ఫేక్ యాక్సెంట్ అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. విదేశాలకు వెళ్లినంత మాత్రాన యాస మారుతుందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్లో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. Warra Fake Accent 🤡🤡🤡 pic.twitter.com/WGJmElk2WC — 🐋 (@Bhaag_Saale) April 23, 2023 -
లండన్లో ‘సీటాడెల్’టీమ్తో సమంత, వరుణ్ ధావన్
లండన్లో ‘సీటాడెల్’టీమ్తో సమంత, వరుణ్ ధావన్ -
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న మాస్ మహారాజ రవితేజ
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తుంటే, మన హీరోలు బాలీవుడ్ బాట పడుతున్నారు. సౌత్ సినిమాలు పాన్ఇండియా స్థాయిలో సత్తాచాటుతుండటంతో బాలీవుడ్ మేకర్స్ దృష్టి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై పడింది. దీంతో తమ సినిమాల్లో సౌత్ స్టార్స్ ఉండేలా మేకింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లో వెంకటేశ్, వార్-2లో హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్లో మాస్ మహారాజ రవితేజ కూడా వచ్చి చేరినట్లు తెలుస్తుంది. బీటౌన్ టాక్ ప్రకారం.. యంగ్ హీరో వరుణ్ ధావణ్తో కలిసి రవితేజ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను రానా, కరణ్ జోహార్, ఏషియన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్గా అనౌన్స్మెంట్ రానుందట. -
మోడల్ను ఎత్తుకుని ముద్దుపెట్టిన హీరో, సిగ్గు లేదంటూ ట్రోలింగ్!
రిలయన్స్ అధినేత ముఖేవ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్ఎంఏసీసీ)ని ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే! ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలే కాకుండా సినీ, క్రీడా ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. ఈ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవ రెండో రోజు కూడా పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్లతో స్టేజీని హోరెత్తించారు. ఈ క్రమంలో యంగ్ హీరో వరుణ్ ధావన్ హాలీవుడ్ మోడల్ గిగి హ్యాడిడ్ను ఎత్తుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా చాలామంది హీరో వైఖరిని తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. 'గిగి చాలా అసౌకర్యంగా ఫీలైంది', 'అతను అలా చేసి ఉండాల్సింది కాదు', 'బాలీవుడ్కు సిగ్గులేకుండా పోతోంది' అంటూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్పై వరుణ్ ధావన్ స్పందించాడు. 'మిమ్మల్ని మేల్కొపాలనుకుంటున్నాను. గిగిని స్టేజీపై ఎత్తుకుని ముద్దుపెట్టడం అనేది మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఇక మామీద రచ్చ చేయడం ఆపి మీ పని చూసుకోండి' అని స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. దీనిపై వరుణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. అనవసరంగా మా హీరో మీద పడి ఏడ్చారు కదరా అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఎన్ఎంఏసీసీ లాంఛింగ్ కార్యక్రమంలో ప్రియాంక - రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీని దద్దరిల్లిపోయేలా చేశారు. రష్మిక మందన్నా, ఆలియా భట్ అయితే నాటునాటు స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హాలీవుడ్ సెలబ్రిటీలు లా రోచ్, టామ్ హాలాండ్, జెండాయా సహా పలువురు తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I guess today you woke up and decided to be woke. So lemme burst ur bubble and tell u it was planned for her to be on stage so find a new Twitter cause to vent about rather then going out and doing something about things . Good morning 🙏 https://t.co/9O7Hg43y0S — VarunDhawan (@Varun_dvn) April 2, 2023 Yes exactly Gigi Hadid 🥰 THAT would have been my reaction too if Varun lifted me up and danced with him for 5 secs. pic.twitter.com/ExfCE3CaJK — Annesha (@ApnaaVarun) April 2, 2023 -
సమంత ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పిన ‘ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్స్
సమంత ఫ్యాన్స్కు గుడ్న్యూస్. ఇటీవల మయోసైటిస్ బారిన పడిన సామ్ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. కాలు కూడా కదపలేని స్థితిలో ఉన్న సామ్ క్రమంగా కోలుకున్నారు. ఇక రీసెంట్గా శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో సందడి చేసిన ఆమె తన చిత్రాల షూటింగ్స్ను మొదలు పెట్టేసింది. తాజాగా సామ్ తన వెబ్ సిరీస్ షూటింగ్ సెట్ అడుగుపెట్టినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. చదవండి: అప్పుడే ఓటీటీకి వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..! కాగా విడాకుల అనంతరం సమంత వరుసగా పలు భారీ ప్రాజెక్ట్స్కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేతిలో హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. అందులో ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డికే ‘సీటాడెల్’ ఒకటి. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సిరీస్ షూటింగ్లో తాజాగా సమంత పాల్గొన్నట్లు డైరెక్టర్స్ రాజ్-డీకే ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా సమంత కొత్త లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో సామ్, మోడరన్ లుక్లో స్టైలిష్ కాప్లా కనిపిస్తోంది. చదవండి: సీనియర్ నటి ఖుష్బుకు చేదు అనుభవం దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ‘‘సామ్ ఈజ్ బ్యాక్’ అంటూ కొందరు.. ‘ఇంతవరకు సమంత ఇలా ఎప్పుడూ చూడలేదు’, ‘ఈ వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ‘రుస్సో బ్రదర్స్’ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ను సీటాడెల్ అనే ఫ్రాంచైజ్లో భాగంగా ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్గా రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తుండగా సమంత కీ రోల్ పోషించనుంది. Super excited to team up with this powerhouse once again! Welcome @Samanthaprabhu2 to the world of Citadel! Now filming 🎬@Varun_dvn #RussoBrothers @MenonSita @d2r_films @agbo_films @PrimeVideoIN @AmazonStudios pic.twitter.com/yuoigSDiTd — Raj & DK (@rajndk) February 1, 2023
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీపై ఆర్బీఐ చర్యలు
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇండియా కూటమి 272 సీట్లలో గెలిచేసింది: జైరామ్రమేశ్
అనిల్ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం
చరిత్ర సృష్టించిన బట్లర్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
స్కూల్ పిల్లల చేతుల మీదుగా 'సంకెళ్లు' పాట విడుదల
ఆలౌట్ తాగిన చిన్నారి.. అరుదైన చికిత్సతో కాపాడిన కిమ్స్ కడల్స్ డాక్టర్లు
Deepika Padukone: ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్.. ఫైనల్లో సన్రైజర్స్ (ఫొటోలు)
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్ స్వాధీనం
- రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement