-
అబ్రాడ్కు వెళ్లిపోయిన రజనీకాంత్
కోలీవుడ్ స్టార్ రజనీకాంత్కు తాను నటించిన చిత్రం పూర్తి కాగానే విశ్రాంతి కోసం ఆధ్యాత్మికత పర్యటనలకు వెళ్లడం పరిపాటి. అలా హిమాలయాలు, హరిద్వార్, ద్వారకేష్ వంటి ప్రదేశాలకు వెళ్లి ఒకటి రెండు వారాలు ధ్యానం, యోగా వంటి మానసికంగా నూతనోత్సాహాన్ని పొంది వస్తుంటారు. ప్రస్తుతం ఈయన కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శతక్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నటుడు అమితాబ్ కీలక పాత్రను పోషించిన ఇందులో నటి దుషారా విజయన్, రిత్వికాసింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా రజనీకాంత్ ఈ చిత్రం షూటింగ్ను ఇటీవలే పూర్తి చేశారు. తదిపరి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కూలీ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఫస్ట్ ఆఫ్ కథను సిద్ధం చేసి.. సెకండ్ ఆఫ్ పూర్తిచేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో రజనీకాంత్ రిలాక్స్ కోసం తాజాగా అబ్రాడ్కు వెళ్లారు. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి అబుదాబి వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా మరో కొన్ని వారాలు అక్కడ గడిపిన తరువాత రజనీకాంత్ చెన్నైకి తిరిగి వస్తారని సమాచారం. சென்னை விமான நிலையத்திலிருந்து எதிஹாட் ஏர்வேஸ் விமானம் மூலம் அபுதாபி புறப்பட்டு சென்றார் நடிகர் ரஜினிகாந்த்...#Chennai | #Airport | #Actor | #Rajinikanth | #SuperStar | #AbuDhabi | #PolimerNews pic.twitter.com/j9JJvxcLlt— Polimer News (@polimernews) May 16, 2024 -
ముంబైలో వేట్టయాన్
ముంబైలో అమితాబ్ బచ్చన్ను కలిశారు వేట్టయాన్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా ఇతర లీడ్ రోల్స్లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. తాజాగా ‘వేట్టయాన్’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది.రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో హైదరాబాద్లో జరిగిన ‘వేట్టయాన్’ షూటింగ్ షెడ్యూల్లో రజనీ, అమితాబ్ కాంబినేషన్ సీన్స్ తీశారు. ఇప్పుడు ముంబైలో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ను తీస్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
తలైవా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయాన్. ఈ చిత్రాన్ని జైభీమ్ చిత్రం పేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తలైవా నటిస్తోన్న 170వ చిత్రం. ఈ మూవీ తర్వాత రజినీకాంత్ 171వ చిత్రంలో నటించనున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమాపై అసత్య ప్రచారం ఎక్కువైందనే చెప్పాలి. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టైటిల్ ప్రకటన, టీజర్ను వరుసగా విడుదల చేయడంతో ఈ చిత్రానికి సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. దీంతో అంతకు ముందే ప్రారంభం అయిన రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం వేట్టైయాన్ చిత్రం మరుగున పడిందనే చెప్పాలి.కాగా.. తాజాగా వేట్టైయాన్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రం షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని.. ఈ ఏడాది అక్టోబర్లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించారు. దీంతో ఇకపై వేట్టైయాన్ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వంటి ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో దుషారా విజయన్, అమితాబ్బచ్చన్, ఫాహత్ ఫాజిల్, రానా, మంజువారియర్, రితికాసింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 100 days of #Vettaiyan shooting 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Jailer | #Rajinikanth | #superstar @rajinikanth | #Coolie | #VettaiyanFromOctober | #ThalaivarNirandharam | #SuperstarRajinikanth | #Hukum | #CoolieDisco | #Jailer2 | #ThalaivarNirandharam | #CoolieTitleTeaser pic.twitter.com/psri6cXUtQ— Suresh balaji (@surbalutwt) April 27, 2024 -
లాయర్గా...
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ లాయర్గా తన నటనతో ఆడియన్స్ను కట్టిపడేశారు. మరోసారి కోర్టులో అమితాబ్ బచ్చన్ మాట్లాడే పవర్ఫుల్ డైలాగ్స్ వినే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘వేట్టయాన్’ చిత్రంలో లాయర్ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారట. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అది లాయర్ పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. రజనీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపిస్తారని, అమితాబ్ లాయర్గా కనిపిస్తారనీ భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో జరుగుతోందట. రజనీ ఇంట్రో సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. -
32 ఏళ్ల తర్వాత స్టార్ హీరోయిన్తో రజనీకాంత్ సినిమా
దళపతి చిత్రం కాంబో రిపీట్ కానుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్, మమ్ము ట్టి, అరవిందస్వామి కలిసి నటించిన చిత్రం దళపతి. ఇందులో శోభన కథానాయకిగా నటించారు. 1988లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ విషయం పక్కన పెడితే నటుడు రజనీకాంత్ ప్రస్తుతం వేటైయాన్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితా బచ్చన్, యువ నటి దుషార విజయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఇటీవల విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కాగా చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసింది. దీనికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా దీనికి 'కళుగు' అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ చిత్రం టైటిల్, టీజర్ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నట్లు దర్శకుడు లోకేష్ ఇంతకుముందు చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో రజనీకాంత్ సరసన సీనియర్ నటి, నృత్య కళాకారిణి శోభన నటించనున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. వీరిద్దరు కలిసి నటించిన దళపతి చిత్రం 1988లో విడుదలైన విషయం గమనార్హం. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజమెంతా అన్నది తెలియాల్సి ఉంది. -
అక్టోబర్లో వేట్టయాన్
అక్టోబర్లో థియేటర్స్కు వస్తున్నాడు ‘వేట్టయాన్ ’. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వేట్టయాన్’. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ , జీకేఎమ్ తమిళ కుమరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరులో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రజనీకాంత్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ‘వేట్టయాన్ ’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. -
చెన్నైకి వేటగాడు
హైదరాబాద్లో పని ముగించుకుని చెన్నైకు వెళ్లాడు వేటగాడు. హీరో రజనీకాంత్ టైటిల్ రోల్లో టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, రితికా సింగ్, దుషారా విజయన్, మంజు వారియర్ కీలకపాత్రధారులు. ఇటీవల హైదరాబాద్లోప్రారంభమైన ‘వేట్టయాన్’ సినిమా షెడ్యూల్ ముగిసింది. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా, రితికా సింగ్ ఈ షెడ్యూల్లో పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని తెలిసింది. ఓ యాక్షన్ సీక్వెన్స్, ఓపాటను కూడా చిత్రీకరించారని సమాచారం. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలవుతుంది. -
గ్లామర్కు గేట్లు ఎత్తేసిన బ్యూటీ.. ఫోటోలు వైరల్
నటి దుషారా ఇప్పుడిప్పుడే కోలీవుడ్లో సత్తా చాటుతోంది. ఈమె చేసింది తక్కువ చిత్రాలే అయినా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో మెప్పించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా చక్కని నటనను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఆ తరువాత మళ్లీ పా.రంజిత్ దర్శకత్వంలో నక్షత్రం నగరగిదు చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఆ తరువాత కరువేక్తి ముహుర్తం, వసంత పాళెం దర్శకత్వంలో చిత్రాలు చేశారు. తాజాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 50వ చిత్రంలో దుషారా నటిస్తున్నారు. అదే సమయంలో నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టయ్యన్ చిత్రంలోని ప్రత్యేక పాటలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. కాగా ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా కనిపించిన దుషారా ఇప్పుడు గ్లామర్కు గేట్లు ఎత్తివేయటం విశేషం. ఇటీవల ఈమె ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించుకుని తీయించుకున్న గ్లామరస్ ఫొటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టయాన్ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్లో నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు పుష్ప చిత్రంలో సమంత నటించిన ఊ అంటావా మామా పాట జైలర్ చిత్రంలో తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా పాట ఎంత పాపులర్ అయ్యాయో అంతకంటే ఎక్కువగా వేట్టైయాన్ చిత్రంలో దుషారా ఐటమ్ సాంగ్ పాపులర్ అవుతుందనే ప్రచారం ప్రస్తుతం కోలీవుడ్లో జోరందుకుంది. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
వేట్టైయన్ కాదు
తన తాజా చిత్రానికి వేట్టైయన్ అనే టైటిల్ను ఖాయం చేయలేదంటున్నారు నటుడు, నిర్మాత విశాల్. పాండియనాడు ఫేమ్ సుశీంద్రన్ దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు. ఈ చిత్రాన్ని తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుండగా సత్యం, వెడి చిత్రాల తరువాత మరోసారి పోలీసు అధికారిగా నటించడానికి విశాల్ రెడీ అవుతున్నారు. షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభించి ఏకబిగువన పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇంతకుముందు కావల్కోట్టం అనే టైటిల్ను నిర్ణయించినట్లు, తాజాగా వేట్టైయన్ పేరును పెట్టినట్లు ప్రచారం మొదలైంది. అయితే చిత్రానికి ఇంతవరకు పేరే ఖరారు చేయలేదని నటుడు విశాల్ స్పష్టం చేశారు. అయితే వేట్టైయన్ టైటిల్ను చంద్రముఖి దర్శకుడు వి.వాసునే రిజిష్టర్ చేసినట్లు సమాచారం.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
సూర్యప్రభ వాహనంపై గోవిందుడు
బడి బస్.. ఫిట్నెస్
పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు
కౌంటింగ్కు పటిష్టంగా భద్రత
No Headline
ఇంటర్ మ్యాథ్స్–బి, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
తత్కాల్ ఫార్మ్స్పై నంబర్లు వేసి ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో సిరికల్చర్ ఉద్యోగి మృతి
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
తప్పక చదవండి
- టీమిండియా హెడ్కోచ్గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
- Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
- సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement