-
రోహిత్ శర్మకు ‘షాకిచ్చిన’ మహిళా అభిమాని! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ఇంత వరకు బోణీ కొట్టని ఒకే ఒక జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మూడో ఓడి.. హ్యాట్రిక్ పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి తొలి విజయం అందుకోవాలని పట్టుదలగా ఉంది. సొంత మైదానం వాంఖడేలోనైనా సత్తా చాటాలని ఉవ్విళూర్లుతోంది. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచిన పంత్ సేనకు ముంబైతో పోరు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ‘అస్త్రశస్త్రాల’తో సంసిద్ధులయ్యారు. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను చూసేందుకు అభిమానులు వాంఖడేకు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఈ క్రమంలో ఓ యువతి హిట్మ్యాన్ను కలిసేందుకు మైదానానికి వచ్చింది. మ్యాచ్కు ముందు సేద తీరుతున్న రోహిత్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి.. అతడి పాదాలకు నమస్కరించింది.దీంతో రోహిత్ ఒక్కసారిగా షాకయ్యాడు. A fan meets Rohit Sharma & touches his feet at the Wankhede stadium. 💥 pic.twitter.com/LsWwFUCbRg — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2024 కాస్త ఇబ్బందిపడుతూనే ఇలా చేయవద్దవంటూ వారించాడు. ఇక తన అభిమాన క్రికెటర్ను కలిసిన అనంతరం సదరు యువతి.. రోహిత్ ఫొటోపై అతడి ఆటోగ్రాఫ్ తీసుకుంది. ఆ తర్వాత ఫొటోలు కూడా దిగి ఫ్యాన్గర్ల్ మూమెంట్ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లోనైనా బ్యాట్ ఝులిపిస్తాడేమో చూడాలి!! చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు జారవిడిచారు. కెపె్టన్గా హర్మన్ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్ప్రీత్ కూడా బ్యాటింగ్లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్లో రేణుక సింగ్తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్ఫీల్డ్, తాలియా మెక్గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం సాధ్యమే. -
సచిన్ విగ్రహంపై అభిమానుల అసంతృప్తి.. స్టీవ్ స్మిత్లా ఉందంటూ కామెంట్స్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్తగా ఏర్పాటైన సచిన్ టెండూల్కర్ విగ్రహంపై భారత క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్ విగ్రహం ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ను పోలి ఉండటంతో సచిన్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. సచిన్ విగ్రహాన్ని సరిగ్గా రూపొందింలేదని విగ్రహ రూపకర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కీర్తించే సచిన్ విగ్రహాన్ని తయారు చేసేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని తాయారు చేసి ఉండాల్సిందని విగ్రహ రూపకర్తను దూషిస్తున్నారు. సచిన్ అంటే గిట్టని వారు, క్రికెట్ పరిజ్ఞానం లేని వారు స్టీవ్ స్మిత్ విగ్రహం భారత్లో ఉందేందంటూ వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వాంఖడేలో నిన్న భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగినప్పటికీ నుంచి సచిన్ విగ్రహం పెద్ద చర్చనీయాంశమైంది. కాగా, నవంబర్ 1న ప్రతిష్టాత్మక వాంఖడే మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వాంఖడేలో సచిన్ స్టాండ్ పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ ఆఫ్సైడ్ షాట్ ఆడే పోజ్లో ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. అహ్మదాబాద్కు చెందిన ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని రూపొందించారు. సచిన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా విగ్రహావిష్కరణ చేశారు. కాగా, సచిన్ తన సొంత మైదానమైన వాంఖడేలో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ (నవంబర్ 16, 2013) ఆడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్గా నిలిచాడు. -
Sachin Tendulkar Statue At Wankhede Stadium: వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ (ఫొటోలు)
-
నేడు సచిన్ విగ్రహావిష్కరణ
ముంబై: ప్రతిష్టాత్మక వాంఖెడె మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహం ఏర్పాటు కానుంది. బుధవారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సచిన్ స్టాండ్ పక్కనే దీనిని ఏర్పాటు చేయనుండగా...ఆఫ్సైడ్లో షాట్ ఆడుతున్న చిత్రాన్ని ఈ విగ్రహం కోసం ఎంచుకున్నారు. అహ్మదాబాద్కు చెందిన ప్రమోద్ కాంబ్లే దీనిని రూపొందించారు. స్వయంగా సచిన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు దీనికి హాజరవుతారు. తన సొంత మైదానమైన ముంబై వాంఖెడె స్టేడియంలోనే 2011 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న సచిన్... తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ను ఇక్కడే నవంబర్ 16, 2013న ఆడాడు. -
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ధోనికి అరుదైన గౌరవం
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం ఇవ్వనుంది. వాంఖడే స్టేడియం వేదికగా 12 సంవత్సరాల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం స్టాండ్స్లోని ఒక సీటుకు ధోని పేరు పెట్టాలని నిర్ణయించింది. 91 పరుగులు నాటౌట్గా నిలిచిన ధోని సిక్సర్తో విన్నింగ్ షాట్ కొట్టి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. కాగా.. శ్రీలంకతో ఫైనల్లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ కొట్టి కోట్లాది భారతీయు కలను నిజం చేశాడు. నాడు ధోని కొట్టిన సిక్స్.. స్టేడియంలో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ వెల్లడించారు. వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్కు ఇప్పటికే సచిన్, గవాస్కర్, విజయ్ మర్చంట్ పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి వినూత్నంగా సీటుకు ధోని పేరు పెట్టనుండడం విశేషం. -
భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ కు అరుదైన గౌరవం
-
IPL 2022: ముచ్చటగా మూడు...
ముంబై: ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాత మెరుగ్గా ఆడుతున్న ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ‘సొంతగడ్డ’ వాంఖెడేలో జరిగిన పోరులో ఐదుసార్లు లీగ్ చాంపియన్ ముంబై ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసింది. తాజా ఫలితంతో నాలుగుసార్లు విజేత చెన్నై కూడా అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’కు దూరమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఎమ్మెస్ ధోని (33 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడగా, మిగతావారంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డానియెల్ స్యామ్స్ (3/16) చెన్నైని దెబ్బ తీయగా... కార్తికేయ, మెరిడిత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. తిలక్ వర్మ (32 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (7 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. టపటపా... తొలి ఓవర్లో కాన్వే (0), మొయిన్ అలీ (0) వికెట్లను కోల్పోయిన చెన్నై ఆ తర్వాత కోలుకోలేకపోయింది. రాబిన్ ఉతప్ప (1), రుతురాజ్ గైక్వాడ్ (7), అంబటి రాయుడు (10) కూడా వెనుదిరగడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 32/5కు చేరింది. ఈ దశలో ధోని ఒక ఎండ్లో నిలబడి పరుగులు సాధించే ప్రయత్నం చేయగా... శివమ్ దూబే (10), బ్రేవో (12) కూడా విఫలమయ్యారు. అనంతరం ముంబై కూడా కాస్త తడబడింది. ఇషాన్ కిషన్ (6), రోహిత్ శర్మ (18), స్యామ్స్ (1), స్టబ్స్ (0) తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ స్కోరు 33/4కు చేరింది. అయితే తిలక్ వర్మ, హృతిక్ షోకిన్ (18; 2 ఫోర్లు) ఐదో వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపుదిశగా నడిపించారు. కరెంట్ లేదు...డీఆర్ఎస్ లేదు ప్రపంచ క్రికెట్లో అత్యంత విలువైన ప్రతిష్టాత్మక టోర్నీ... లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య దేశంలో అమిత ప్రాధాన్యత ఉన్న మైదానంలో జరుగుతున్న మ్యాచ్... కానీ మ్యాచ్కు ముందస్తు ఏర్పాట్లను బీసీసీఐ చేసుకోవడంలో విఫలమైంది. ముంబై నగరంలో కరెంట్ కోతతో వాంఖెడేలో కూడా అంధకారం ఏర్పడింది. ఫ్లడ్ లైట్లు సరిగా వెలగకపోవడంతో టాస్ కూడా ఆలస్యమైంది. అయితే ఆ తర్వాత కరెంట్ కోత అసలు ఆటనూ ఇబ్బంది పెట్టింది. విద్యుత్ సమస్య కారణంగా ‘హాక్ ఐ’ టెక్నాలజీని వాడే అవకాశం లేదంటూ చెన్నై ఇన్నింగ్స్లో తొలి పది బంతుల పాటు డీఆర్ఎస్ పని చేయలేదు. నాలుగో బంతికి కాన్వేను అంపైర్ ఎల్బీగా ప్రకటించగా, రివ్యూ చేసే అవకాశం లేకపోయింది. బంతి గమనాన్ని చూస్తే కచ్చితంగా అతను నాటౌట్గా తేలేవాడని అనిపించింది. రెండో ఓవర్ నాలుగో బంతికి కూడా ఉతప్ప దాదాపు ఇదే తరహాలో వెనుదిరిగాడు. అతను కూడా రివ్యూ గురించి ఆలోచించినా ఆ అవకాశం లేదని తేలడంతో విరమించుకున్నాడు. ఆ తర్వాతే మైదానంలో సాధారణ స్థితి నెలకొంది. ఐపీఎల్లో నేడు బెంగళూరు X పంజాబ్ కింగ్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
బంపరాఫర్ కొట్టేశారు
-
IND vs NZ 2nd Test: కోహ్లి వచ్చేశాడు.. రహానేకు మరో అవకాశం!
IND vs NZ 2nd Test.. అన్ని అనుకూలతలు ఉన్నా న్యూజిలాండ్తో తొలి టెస్టులో చేతులదాకా వచ్చిన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయిన భారత్ ఈసారి అలాంటి తప్పును పునరావృతం చేయరాదని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలుపుతో పాటు సిరీస్ను కూడా సొంతం చేసుకునేందుకు టీమిండియా సన్నద్ధమైంది. నేటినుంచి వాంఖెడే మైదానంలో జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి ఈ టెస్టులో అందుబాటులోకి రావడం భారత జట్టు బలాన్ని పెంచింది. మరోవైపు పర్యాటక న్యూజిలాండ్ జట్టు కూడా తీసికట్టుగా ఏమీలేదు. ఒక్క వికెట్ చేతిలో పెట్టుకొని 11 మంది ఆటగాళ్లతో ఓ ఆటాడుకున్న కివీస్ అంతే ఆత్మవిశ్వాసంలో సమరానికి సన్నద్ధమైంది. ఈ రెండు జట్ల ఉత్సాహంపై చినుకులు కురిపించేందుకు వానా కూడా కాచుకుంది. గురువారం ముంబైలో వర్షం కురిసింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఇండోర్ నెట్స్లో ప్రాక్టీస్ చేయాల్సివచ్చింది. సాహా ఫిట్... వచ్చీ రాగానే భారత కెప్టెన్ కోహ్లికి జట్టు కూర్పు పెను సవాలు విసురుతోంది. మైదానంలో దిగే తుది 11 మంది కోసం పెద్ద కసరత్తే చేయాల్సిన కష్టం వచ్చింది. కోహ్లి గైర్హాజరీలో కాన్పూర్లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ సెంచరీ, అర్ధ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. దీంతో అతన్ని తప్పించడం విరాట్తో పాటు జట్టు మేనేజ్మెంట్కు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఫామ్లో లేని రహానే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్లలో ఒకరిపై వేటు ఖాయం. అయితే సీనియర్గా రహానేకు సొంతగడ్డపై మరో అవకాశం దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. టెస్టు స్పెషలిస్టు కీపర్, అనుభజ్ఞుడైన సాహా ఫిట్గా ఉండటంతో ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అరంగేట్రం చేసే అవకాశాలు తగ్గిపోయాయి. పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇషాంత్ స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి రావచ్చు. భారత బ్యాటింగ్ లైనప్ను పుజారా, రహానేల వైఫల్యం కలవరపెడుతోంది. వీళ్లిద్దరు అనుభవజ్ఞులు తమ బ్యాట్లకు పని చెబితే భారత్కు భారీస్కోరు ఖాయమవుతుంది. వర్షంతో తేమ ఉన్నప్పటికీ సీమర్లకంటే ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్లపైనే టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుంది. కివీస్ గెలుపు ఆశలు! టి20 సిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్ను కోల్పోయేందుకు సిద్ధంగా లేదు. భారత్కు తగ్గట్టే స్పిన్ అస్త్రాలు, భారత్ కంటే మెరుగైన పేస్ బౌలర్లున్న కేన్ విలియమ్సన్ సేన ఈ టెస్టు విజయంతో సిరీస్ను ఎగరేసుకుపోవాలని చూస్తోంది. బౌలర్లకు అండగా బ్యాట్స్మెన్ కూడా నిలకడగా రాణిస్తే కివీస్ అనుకున్నది సాధిస్తుంది. ఓపెనర్లు యంగ్, లాథమ్లతో పాటు అనుభవజ్ఞుడైన రాస్ టేలర్ ఈ మ్యాచ్లో రాణిస్తే భారత్కు కష్టాలు తప్పవు. అయితే మిడిలార్డర్లో నికోల్స్, వికెట్ కీపర్ బ్లన్డేల్ సత్తా చాటాల్సి ఉంది. రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. ఉదయం బౌన్స్కు అనుకూలించే వికెట్పై జేమీసన్, సౌతీ చెలరేగడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో భారత టాపార్డర్ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), శుబ్మన్, పుజారా, రహానే, అయ్యర్, సాహా, జడేజా, అశ్విన్, అక్షర్, సిరాజ్, ఉమేశ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), విల్ యంగ్, లాథమ్, టేలర్, నికోల్స్, బ్లన్డేల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ, సోమర్విలే /వాగ్నర్, ఎజాజ్ పటేల్. పిచ్, వాతావరణం తొలి రోజైతే వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో తేమ కారణంగా వాంఖెడే పిచ్ పేసర్లకు అనుకూలించవచ్చు. మూడు, నాలుగు రోజుల్లో ఆటపై స్పిన్ ప్రభావం ఉంటుంది. -
రాయల్స్ రాజసం
ఆల్రౌండ్ ప్రదర్శనతో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో మోరిస్ హడలెత్తించి కోల్కతా నైట్రైడర్స్ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగా... ఛేజింగ్లో సంజూ సామ్సన్, మిల్లర్ నడిపించడంతో రాయల్స్ సునాయాసంగా విజయతీరం చేరింది. నిరాశాజనక ప్రదర్శనతో మాజీ చాంపియన్ కోల్కతా నాలుగో పరాజయం చవిచూసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ముంబై: రెండు వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న రాజస్తాన్ రాయల్స్కు ఊరటనిచ్చే విజయం లభించింది. మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్లో మెరిసి తమ ఖాతాలో రెండో గెలుపును జమ చేసుకుంది. వాంఖెడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ 6 వికెట్లతో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై నెగ్గింది. తొలి మ్యాచ్లో నెగ్గిన కేకేఆర్ వరుసగా నాలుగో పరాభవాన్ని మూట గట్టుకొని ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (26 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. క్రిస్ మోరిస్ (4/23) బంతితో విజృంభించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (41 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. మిల్లర్ (23 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్లో తడబాటు... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్కు మరోసారి శుభారంభం దక్కలేదు. క్రీజులో ఉన్నంతసేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డ శుబ్మన్ గిల్ (11) బట్లర్ అద్భుతమైన అండర్ ఆర్మ్త్రోకి రనౌటయ్యాడు. 5వ ఓవర్ నాలుగో బంతికి షార్ట్ ఎక్స్ట్రా కవర్లోకి ఆడిన గిల్... లేని పరుగు కోసం ప్రయత్నించగా అక్కడే ఉన్న బట్లర్ బంతిని అందుకొని నాన్ స్ట్రయికింగ్ ఎండ్లోని వికెట్లను నేరుగా గురిచూసి కొట్టాడు. దాంతో గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి ఎదుర్కొన్న తొలి బంతిని ఫోర్ బాదాడు. మరో ఎండ్లో ఉన్న నితీశ్ రాణా (22; 1 ఫోర్, 1 సిక్స్) ఉనాద్కట్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. అయితే సకారియా బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చిన రాణా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన సునీల్ నరైన్ (6) యశస్వి జైస్వాల్ పట్టిన అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. దాంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా స్కోరు 55/3గా ఉంది. ఫామ్లో లేని కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ (0)ను ఈ మ్యాచ్లో దురదృష్టం వెంటాడింది. మోరిస్ వేసిన 11వ ఓవర్ తొలి బంతిని షార్ట్ ఫైన్లెగ్ మీదుగా సిక్సర్ బాదిన త్రిపాఠి... రెండో బంతిని స్ట్రయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే ఆ బంతి కాస్తా నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న మోర్గాన్ బ్యాట్ను తాకి... మోరిస్ సమీపంలో పడింది. అయితే అప్పటికే క్రీజును వదిలి ముందుకు వెళ్లిన మోర్గాన్ వెనక్కి వచ్చేలోపు బంతిని అందుకున్న మోరిస్ వికెట్లను గిరాటేశాడు. దాంతో ఒక్క బంతి ఆడకుండానే మోర్గాన్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్, త్రిపాఠి కలిసి రాజస్తాన్ బౌలర్లను ప్రతిఘటించారు. అయితే ముస్తఫిజుర్ తన స్లో ఆఫ్కట్టర్ డెలివరీతో త్రిపాఠిని బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన రసెల్ సిక్సర్ బాది చెన్నైతో జరిగిన మ్యాచ్కు కొనసాగింపు అన్నట్లు కనపించాడు. అయితే బంతిని అందుకున్న మోరిస్... రసెల్ (9)తో పాటు మరో ఎండ్లో ఉన్న దినే శ్ కార్తీక్ను పెవిలియన్కు చేర్చాడు. మళ్లీ చివరి ఓవర్ వేయడానికి వచ్చిన మోరిస్... ఆ ఓవర్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చి కమిన్స్ (10), శివమ్ మావి (5)లను అవుట్ చేసి కేకేఆర్ను కట్టడి చేశాడు. నడిపించిన నాయకుడు ఛేదనలో రాజస్తాన్ను కెప్టెన్ సామ్సన్ విజయం వరకు నడిపించాడు. బట్లర్ (5) వికెట్ను త్వరగా కోల్పోగా... వన్డౌన్లో వచ్చిన సామ్సన్ బౌండరీతో ఖాతా తెరిచాడు. మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ (22; 5 ఫోర్లు) దూకుడుగా ఆడి శివమ్ మావి బౌలింగ్లో వెనుదిరిగాడు. లక్ష్యం చిన్నదే అయినా వెంటవెంటనే వికెట్లను కోల్పోవడంతో రాజస్తాన్కు ఒక భాగస్వామ్యం అవసరమైంది. దాంతో ఆ బాధ్యతను కెప్టెన్ సామ్సన్, దూబే తీసుకున్నారు. నరైన్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా దూబే సిక్సర్ కొట్టడంతో... పవర్ప్లేలో రాజస్తాన్ రెండు వికెట్లకు 50 పరుగులు చేసింది. సామ్సన్, దూబే బౌండరీలతోపాటు సింగిల్స్కూ ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా రాజస్తాన్ స్కోరు బోర్డు ఎక్కడా నెమ్మదించలేదు. 10 ఓవర్లకు రాజస్తాన్ 80/2గా నిలిచింది. ఈ సమయంలో బౌలింగ్కు వచ్చిన వరుణ్ కేకేఆర్కు బ్రేక్ను అందించాడు. వరుణ్ వేసిన గూగ్లీ బంతిని దూబే షాట్ ప్రయత్నం చేయగా... బంతి బ్యాట్ అంచును తాకుతూ గాల్లోకి లేవగా షార్ట్ థర్డ్మ్యాన్ దగ్గర ఉన్న ప్రసిధ్ కృష్ణ క్యాచ్ పట్టాడు. దాంతో 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తెవాటియా (5) విఫలమయ్యాడు. ఈ దశలో సామ్స న్తో జత కలిసిన మిల్లర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. మావి, ప్రసిధ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో రాజస్తాన్ విజయ సమీ కరణం 30 బంతుల్లో 30 పరుగులకు వచ్చింది. మిల్లర్ వరుస ఓవర్లలో మూడు బౌండరీలు బాదడంతో రాజస్తాన్ను విజయం వరించింది. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: నితీశ్ రాణా (సి) సామ్సన్ (బి) సకారియా 22; గిల్ (రనౌట్) 11; రాహుల్ త్రిపాఠి (సి) పరాగ్ (బి) ముస్తఫిజుర్ 36; సునీల్ నరైన్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ఉనాద్కట్ 6; మోర్గాన్ (రనౌట్) 0; దినేశ్ కార్తీక్ (సి) సకారియా (బి) మోరిస్ 25; రసెల్ (సి) మిల్లర్ (బి) మోరిస్ 9; కమిన్స్ (సి) పరాగ్ (బి) మోరిస్ 10; శివమ్ మావి (బి) మోరిస్ 5; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–24, 2–45, 3–54, 4–61, 5–94, 6–117, 7–118, 8–133, 9–133. బౌలింగ్: జైదేవ్ ఉనాద్కట్ 4–0–25–1, చేతన్ సకారియా 4–0–31–1, ముస్తఫిజుర్ 4–0–22–1, క్రిస్ మోరిస్ 4–0–23–4, రాహుల్ తెవాటియా 3–0–24–0, శివమ్ దూబే 1–0–5–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ చక్రవర్తి 5; యశస్వి జైస్వాల్ (సబ్) (సి) కమలేశ్ నాగర్కోటి (బి) శివమ్ మావి 22; సంజూ సామ్సన్ (నాటౌట్) 42; శివమ్ దూబే (సి) ప్రసిధ్ కృష్ణ (బి) వరుణ్ చక్రవర్తి 22; తెవాటియా (సి) (సబ్) (సి) కమలేశ్ నాగర్కోటి (బి) ప్రసిధ్ కృష్ణ 5; మిల్లర్ (నాటౌట్) 24; ఎక్స్ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–21, 2–40, 3–85, 4–100. బౌలింగ్: శివమ్ మావి 4–0–19–1, కమిన్స్ 3.5–0–36–0, వరుణ్ చక్రవర్తి 4–0–32–2, నరైన్ 4–0–20–0, ప్రసిధ్ కృష్ణ, 3–0–20–1. -
IPL 2021, RCB vs RR: పడిక్కల్ ఫటాఫట్...
అందని ద్రాక్షలా ఉన్న ఐపీఎల్ టైటిల్ను ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో మరో ఘనవిజయం సాధించింది. ముందు బంతితో హడలెత్తించి... ఆ తర్వాత బ్యాట్తో గర్జించి... ఈ సీజన్లో వరుసగా నాలుగో విజయంతో ‘టాప్’లోకి వెళ్లింది. సిరాజ్, హర్షల్ పటేల్ బంతితో మెరిపించగా... ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ రాజస్తాన్ రాయల్స్ బౌలర్లను చితగ్కొట్టి తన ఖాతాలో తొలి శతకాన్ని జమ చేసుకున్నాడు. దేవ్దత్కు కెప్టెన్ కోహ్లి అండగా నిలువడంతో బెంగళూరు వికెట్ నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించి రాజస్తాన్ రాయల్స్ను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ముంబై: మరోసారి స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్–14 సీజన్లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వాంఖెడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో కోహ్లి బృందం 10 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. 178 పరుగుల ఛేజింగ్లో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ అజేయ శతకం (52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్లు)తో కదం తొక్కగా... కెప్టెన్ విరాట్ కోహ్లి (47 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అతడికి సహకరించాడు. దాంతో బెంగళూరు 16.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒకదశలో బెంగళూరు బౌలర్ సిరాజ్ (3/27) ధాటికి 43/4తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్ను శివమ్ దూబే (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్ తెవాటియా (23 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్లు) తమ వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించారు. మరో బౌలర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. వికెట్ చేజార్చుకోకుండా... రాజస్తాన్ ఆపసోపాలు పడుతూ సాధించిన స్కోరును బెంగళూరు ఓపెనర్లు ఆడుతూ పాడుతూ కొట్టేశారు. రాజస్తాన్ సారథి సామ్సన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ను లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్తో వేయించగా... మొదటి మూడు బంతులను ఆచితూచి ఆడిన కోహ్లి నాలుగో బంతిని సిక్సర్ కొట్టి బెంగళూరు స్కోరు బోర్డును తెరిచాడు. అనంతరం పడిక్కల్ మూడు ఓవర్ల వ్యవధిలో ఏకంగా ఐదు ఫోర్లు బాది తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించాడు. బౌలర్ ఎవరైనా సరే కొడితే సిక్సర్ లేదా ఫోర్ అన్నట్లు పడిక్కల్ ఇన్నింగ్స్ సాగింది. దాంతో మరో ఎండ్లో ఉన్న కోహ్లి... పడిక్కల్కే ఎక్కువగా స్ట్రయికింగ్ ఇస్తూ ప్రోత్సహించాడు. ఈ క్రమంలో ఎనిమిదో ఓవర్ మూడో బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టిన పడిక్కల్ 27 బంతుల్లో అర్ధ శతకాన్ని సాధించాడు. 9వ ఓవర్లో రెండు సిక్సర్లు, పదో ఓవర్లో మరో సిక్సర్ బాదిన పడిక్కల్ దెబ్బకు 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 107/0గా నిలిచింది. ఇక ఇక్కడి నుంచి నా వంతు అంటూ కోహ్లి మెరుపులు మెరిపించడం మొదలు పెట్టాడు. పడిక్కల్లా భారీ సిక్సర్లు బాదకపోయినా... కచ్చితమైన టైమింగ్తో చూడ చక్కటి షాట్లతో బౌండరీలను రాబడుతూ కోహ్లి 34 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్ శతకానికి చేరువగా రావడంతో కోహ్లి భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ను రోటేట్ చేశాడు. ఈ క్రమంలో ముస్తఫిజుర్ వేసిన 17వ ఓవర్ తొలి బంతిని ఎక్స్ట్రా కవర్లో బౌండరీ బాదిన పడిక్కల్... 51 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఇది అతడి ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ కావడం విశేషం. ఇక అదే ఓవర్లో బెంగళూరు విజయాన్ని అందుకుంది. నిలబెట్టిన భాగస్వామ్యం అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ బ్యాట్స్మెన్ను బెంగళూరు బౌలర్లు హడలెత్తించారు. రెండు బౌండరీలు సాధించి ఊపు మీదున్న బట్లర్ (8)తో పాటు డేవిడ్ మిల్లర్ (0)ను సిరాజ్ అవుట్ చేయగా... మనన్ వొహ్రా (7) వికెట్ను జేమీసన్ దక్కించుకోవడంతో రాజస్తాన్ 18 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ సామ్సన్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండు ఫోర్లతో పాటు వాషింగ్టన్ సుందర్ ఓవర్లో డీప్ మిడ్వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టి జట్టును ఆదుకునేలా కనిపించాడు. అయితే ఒక స్లో డెలివరీతో సామ్సన్ను బోల్తా కొట్టించిన వాషింగ్టన్ సుందర్ బెంగళూరుకు నాలుగో వికెట్ అందించాడు. అయితే ఇక్కడి నుంచే ఒక అద్భుత పోరాటం మొదలైంది. యువ ప్లేయర్లు శివమ్ దూబే, రియాన్ పరాగ్ (16 బంతుల్లో 25; 4 ఫోర్లు) బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రాజస్తాన్ స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో 12.2 ఓవర్లలో రాజస్తాన్ 100 పరుగుల మార్కును అందుకుంది. హర్షల్ పటేల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో హెలికాప్టర్ షాట్తో లాంగాన్ మీదుగా బౌండరీని సాధించిన పరాగ్... ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. దాంతో దూబే, పరాగ్ల 66 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. తెవాటియా వచ్చీ రావడంతోనే సిక్సర్ కొట్టి ఖాతా తెరిచాడు. బంతి వ్యవధిలో మరో ఫోర్ కొట్టి బెంగళూరు బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. అయితే అర్ధసెంచరీ వైపు దూసుకెళ్తున్న దూబే... రిచర్డ్సన్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో తెవాటియా బౌండరీలతో వేగంగా పరుగులు సాధించడంతో రాజస్తాన్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్నే ఉంచగలిగింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (బి) సిరాజ్ 8; మనన్ వొహ్రా (సి) రిచర్డ్సన్ (బి) జేమీసన్ 7; సంజూ సామ్సన్ (సి) మ్యాక్స్వెల్ (బి) సుందర్ 21; డేవిడ్ మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 0; శివమ్ దూబే (సి) మ్యాక్స్వెల్ (బి) రిచర్డ్సన్ 46; రియాన్ పరాగ్ (సి) చహల్ (బి) హర్షల్ పటేల్ 25; రాహుల్ తెవాటియా (సి) షహబాజ్ అహ్మద్ (బి) సిరాజ్ 40; క్రిస్ మోరిస్ (సి) చహల్ (బి) హర్షల్ పటేల్ 10; శ్రేయస్ గోపాల్ (నాటౌట్) 7; చేతన్ సకారియా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 0; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–14, 2–16, 3–18, 4–43, 5–109, 6–133, 7–170, 8–170, 9–170. బౌలింగ్: సిరాజ్ 4–0–27–3; జేమీసన్ 4–0–28–1; రిచర్డ్సన్ 3–0–29–1; యజువేంద్ర చహల్ 2–0–18–0; వాషింగ్టన్ సుందర్ 3–0–23–1; హర్షల్ పటేల్ 4–0–47–3. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 72; దేవ్దత్ పడిక్కల్ (నాటౌట్) 101; ఎక్స్ట్రాలు 8; మొత్తం (16.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 181. బౌలింగ్: శ్రేయస్ గోపాల్ 3–0–35–0; చేతన్ సకారియా 4–0–35–0; క్రిస్ మోరిస్ 3–0–38–0; ముస్తఫిజుర్ 3.3–0–34–0; తెవాటియా 2–0–23–0; పరాగ్ 1–0–14–0. ► ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. బెంగళూరు బ్యాట్స్మెన్ మొత్తం 14 సెంచరీలు చేశారు. 13 సెంచరీలతో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ► ఐపీఎల్ చరిత్రలో 10 వికెట్ల తేడాతో నాలుగుసార్లు గెలిచిన ఏకైక జట్టు బెంగళూరు. ► ఐపీఎల్లో సెంచరీ చేసిన మూడో పిన్న వయస్కుడిగా పడిక్కల్ (20 ఏళ్ల 289 రోజులు) నిలిచాడు. మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజలు; 2009లో), పంత్ (20 ఏళ్ల 218 రోజులు; 2018లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ► పంజాబ్ కింగ్స్ ప్లేయర్ పాల్ వాల్తాటీ (2011లో చెన్నైపై) తర్వాత భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండా ఐపీఎల్లో సెంచరీ చేసిన రెండో క్రికెటర్ దేవ్దత్. -
ధవన్ను ఔట్ చేసేందుకు ధోని పక్కా ప్లాన్, కానీ
ముంబై: ఐపీఎల్ 2021 లో భాగంగా శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యం కళ్లముందున్నా ఎక్కడా తొందరపాటు లేకుండా ఢిల్లీ జట్టు ఓపెనర్లు ధవన్, పృథ్వీ షా స్కోరు బోర్డును పరుగెత్తించారు. దీంతో 189 పరుగుల లక్ష్యాన్ని పంత్ సేన సునాయాసంగా ఛేదించింది. అయితే, మాంచి ఊపుమీదున్న ధవన్ను ఔట్ చేసేందుకు ధోని వేసిన ప్లాన్ వర్కవుట్ కాలేదు. సామ్ కరాన్ వేసిన నాలుగో ఓవర్లో ధవన్ సిక్స్, ఫోర్ కొట్టి జోరు కొనసాగిసున్నాడు. వికెట్ పడితే తప్ప మ్యాచ్పై పట్టు రాదని భావించిన ధోని స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్లో ధవన్ను వెనక్కి పంపేందుకు ఓ చక్కటి పథకం రచించాడు. ధవన్ బ్యాటింగ్ చేస్తుండగా బంతిని స్టంప్స్కు దూరంగా.. అంటే వైడ్ దిశగా వేయాలని బౌలర్కు సూచించాడు. ఈ క్రమంలో అనుకున్నట్లే ధవన్ బంతిని బౌండరీని తరలించేందుకు ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. బంతి కాస్తా ధవన్ను దాటిపోయి నేరుగా ధోని చేతుల్లో పడింది. సమయం కోసం వేచి చూస్తున్న చెన్నై సారథి బంతిని అందుకుని మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేశాడు. కానీ చెన్నైని దురదృష్టం వెంటాడింది. ఎందుకంటే ధోని చెప్పినట్టుగా అలీ బంతిని వేయలేదు. వైడ్ బదులు బ్యాట్స్మెన్ మీదుగా బౌన్స్ బాల్ వేశాడు. దీంతో అంపైర్ దానిని నో బాల్గా ప్రకటించాడు. ధవన్ బతికిపోయాడు. ఇక ధోని ట్రిక్ ఫెయిల్ కావడంపై అభిమానులు ట్విటర్లో స్పందించారు. అలీ మంచి చాన్స్ మిస్ చేశాడు. పాపం ధోని అని కొందరు, ధవన్ కనుక ఔట్ అయి ఉంటే ఢిల్లీ పరిస్థితి మరోలా ఉండేది, చెన్నైనే విజయం వరించేది అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ధోని ట్రిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ( చదవండి: ఐపీఎల్లో ధోని డకౌట్లు ఇవే..! ) pic.twitter.com/CAqez5vetE— Aditya Das (@lodulalit001) April 10, 2021 -
ఇలా చేస్తే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడొచ్చు!
ముంబై: తమ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ప్రొటోకాల్ ప్రకారం...వాంఖడే వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే తమ అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను తాము చూడాలనుకునే మ్యాచ్కు 48 గంటలలోపు చేయించుకోవాల్సి ఉంటుందని అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఎంసీఏ కార్యదర్శి సంజయ్ నాయక్ స్పష్టం చేశారు. అందులో నెగెటివ్ అని వస్తేనే మ్యాచ్ను చూసేందుకు స్టేడియంలోకి అడుగుపెట్టనిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా నెగెటివ్ రిపోర్టును కలిగి ఉండాలని సంజయ్ తెలిపారు. ఈ సీజన్లో 10 మ్యాచ్లకు వాంఖడే ఆతిథ్యమివ్వనుంది. ప్రత్యేకంగా మహరాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతూ ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న తెలిసిందే. కొన్ని రోజుల క్రితం స్టేడియం సిబ్బంది కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ( చదవండి: మరోసారి తన విలువేంటో చూపించిన రైనా ) -
ఐపీఎల్ మ్యాచులు ఇక్కడ వద్దంటు సీఎంకు లేఖ
ముంబై: ప్రస్తుతం కరోనా వైరస్ ముంబైలో విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడేలో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయా లేదా అన్న సందేహం మొదలైంది. ఇటీవల బీసీసీఐ మెంబర్ మ్యాచులకు సంబంధించి వేదికలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టత వచ్చింది. కానీ ప్రస్తుతం వాంఖడే సమీపంలోని స్థానికులు కేసులు కారణంగా ముంబై వేదికను మార్చాలంటూ సీఎం ఉద్దవ్ఠాక్రేకు లేఖ రాశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) తన ప్రణాళికను రూపొందించినప్పుడు దేశంలో కోవిడ్ -19 కేసుల పరిస్థితి సాధారణంగానే నమోదు అయ్యేవి. అయితే, గత రెండు వారాలు, దేశంలోని అన్ని నగరాల్లో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ప్రత్యేకంగా మహరాష్ట్రలో అత్యధిక కేసలు నమోదవుతూ ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. వీటి నివారణకు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ వంటి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ల విషయంలో మాత్రం అనుకున్నట్లుగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ముంబై వేదికను మార్చాలని కోరుతూ వాంఖడే స్టేడియం సమీపంలోని నివాసితులు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు లేఖ రాశారు. స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా , ఆటగాళ్లు వేదిక చేరుకున్నాక తమ అభిమాన ఆటగాడిని చూడాలన్న కోరికతో అభిమానులు గూమికూడే అవకాశం ఉంది. తద్వారా కరోనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికను మార్చవలసిందిగా అక్కడి స్థానికులు సీఎంకు లేఖ రాశారు. వివాహాలు, మరణాలు మొదలైన మతపరమైన, ఇతర సామాజిక కార్యకలాపాల విషయంలో ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఎలా అనుమతినిస్తుందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ( చదవండి: వాంఖడేలో చాపకింద నీరులా కరోనా.. తాజాగా మరో ముగ్గురికి ) -
IPL 2021: వాంఖడేలో మ్యాచ్లపై ఎంసీఏ స్పష్టత
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ కొనసాగుతున్న వేళ ఐపీఎల్ 2021 నిర్వహణ కష్టంగా మారింది. మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతపు లాక్డౌన్ విధించడంతో, వాంఖడే స్టేడియంలో మ్యాచులు జరుగుతాయా లేదా అని సందేహాలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అభిమానుల ఉత్కంఠకు బీసీసీఐ తెర దించింది. వాంఖడేలో మ్యాచ్లపై స్పష్టతనిస్తూ ఐపీఎల్ మ్యాచులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఇందులో ఎటువంటి మార్పు లేదని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కార్యదర్శి సంజయ్ నాయక్ మీడియాకు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ‘ఆటగాళ్లు మాత్రమే కాదు, సహాయ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ ఇలా ప్రతి ఒక్కరినీ బయో సేఫ్టీ బబుల్ లో ఉంచుతున్నాము. ముంబైలో లాక్డౌన్ ఉన్నప్పటికీ మ్యాచ్ రోజులలో స్టేడియానికి ప్రయాణించడం సమస్య కాదు. ఆటగాళ్లతో పాటు వారి సహాయ సిబ్బందికి కూడా క్రమం తప్పకుండా పరీక్షలు జరుగుతున్నాయి. గత సంవత్సరం దుబాయిలో తీసుకున్నజాగ్రత్తలు లానే అన్నింటినీ పాటించేలా బోర్డు చర్యలు తీసుకుంది. కనుక ఐపీఎల్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా జరుపగలమని బీసీసీఐ భావిస్తోంది’ అని సంజయ్ నాయక్ పేర్కొన్నారు. ఇక ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. కాగా, వాంఖడే స్టేడియం తాజా ఐపీఎల్ సీజన్లో ఏప్రిల్ 10-25 వరకు 10 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ ఏప్రిల్ 10 న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ( చదవండి: ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్కే ) -
ఐపీఎల్కు కరోనా సెగ
మామూలుగా అయితే వేసవి వస్తుందంటే పిల్లలకు సెలవులు, అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్లు ఉంటాయి. ఈ ఆహ్లాదపరిచే ఆనందం ముందు మండే ఎండలైనా చిన్నబోతాయి. కానీ గతేడాది నుంచి ట్రెండ్ మారింది. కొత్త వైరస్ (కరోనా) దాపురించింది. ఐపీఎల్ను వణికిస్తోంది. ఆటగాళ్లను, సిబ్బందిని బెంబేలెత్తిస్తోంది. మొత్తానికి ఈ ఏడాదీ కరోనా సెగ లీగ్కు తాకింది. ముంబై: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి వారమైనా లేదు. కరోనా వైరస్తో ఈ టోర్నీలో అలజడి రేపింది. లీగ్ ఏర్పాట్లలో కలకలం మొదలైంది. శ్రీకారానికి ముందే వైరస్ సైరన్ మోగింది. భారత ఆల్రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ సహా ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడ్డారు. ఇది లీగ్ వర్గాలను ఠారెత్తించినా... గత అనుభవాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దగా కంగారు పడకుండా చేయాల్సిన పనుల్ని చక్కబెడుతూ, ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేయాలని నిర్ణయించింది. ఐసోలేషన్లో అక్షర్... ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్కు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జట్టు వర్గాలు తెలిపాయి. ముంబైలో తను బసచేసిన హోటల్లో గత నెల 28న అతనికి పరీక్ష చేయగా అప్పుడు నెగెటివ్ వచ్చింది. కానీ మరోసారి కోవిడ్ టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్షర్ ఇంకా బయో బబుల్లోకి వెళ్లలేదు. కాబట్టి జట్టు సన్నాహక శిబిరానికి, ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్కు ఎలాంటి ఇబ్బంది లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మొదట కోల్కతా నైట్రైడర్స్ హిట్టర్ నితీశ్ రాణా వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది. ఈ సీజన్లో ఇదే తొలికేసు. అయితే తదుపరి పరీక్షలో తను నెగెటివ్ అని తేలడంతో ఆటగాళ్లకు సంబంధించి తొలి పాజిటివ్ అక్షర్ ఖాతాలోకి వెళ్లింది. ఐపీఎల్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం అక్షర్ 10 రోజులు క్వారంటైన్లో గడపాలి. క్వారంటైన్ గడువు ఈనెల 12న ముగియనుంది. ఆ తర్వాత వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో కూడా అతనికి నెగెటివ్ రావాలి. అప్పుడే అతను జట్టుతో కలవగలడు. ఫలితంగా ఈనెల 10న చెన్నై సూపర్ కింగ్స్తో... 15న రాజస్తాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ల్లో అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) ఆటగాడికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిసింది. అయితే అతని పేరు మాత్రం బయటకు పొక్కలేదు. పది మంది సిబ్బందికి... మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన మ్యాచ్లను హైదరాబాద్ లేదంటే ఇండోర్లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్లు నిర్వహించేందకు ప్రయత్నిస్తామని చెప్పింది. ‘స్టాండ్బై స్టేడియాలలో హైదరాబాద్ ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలోనే మరో బబుల్ ఏర్పాటు అంత సులభం కాదు’ అని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం వాంఖెడే మైదానంలో ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లీగ్ మ్యాచ్లు జరగాల్సివుంది. శుక్రవారం సాయంత్రం దాకా 8 పాజిటివ్ కేసులుంటే శనివారానికి ఆ సంఖ్య పదికి చేరిందని, ఆరేడు మంది ఈవెంట్ మేనేజర్లు కూడా వైరస్ బారిన పడ్డారని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. -
IPL 2021: ఐపీఎల్కు కరోనా కష్టాలు
-
వాంఖడేలో కరోనా కలకలం.. బీసీసీఐ పునరాలోచన
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందే కరోనా కలకలం రేపింది. ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. కరోనా పాజటివ్గా సోకిన వారందరిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. దీంతో ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే మధ్య జరగనున్న లీగ్ మ్యాచ్ను నిర్వహించాలా వద్దా అనే దానిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. తాజాగా కరోనా కేసులు వెలుగు చూడడంతో వాంఖడే స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన చేస్తుంది. కాగా దేశంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఈసారి ఐపీఎల్ సీజన్ను 6 వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్ల షెడ్యూల్ను ఖరారు చేసింది. ఐపీఎల్లో ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు హోం అడ్వాంటేజ్ లేకుండా ఆరు వేదికల్లో మ్యాచ్లు ఆడేలా ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ 14వ సీజన్కు ఇంకా ఆరు రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో తాజాగా వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్ IPL 2021: మెస్సీని వచ్చే ఏడాది తీసుకుంటాం -
క్వారెంటైన్ కేంద్రంగా వాంఖేడి స్టేడియం
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముంబై వాసులపై ఏమాత్రం కనికరం చూపకుండా తీవ్ర ప్రతాపం చూపుతోంది. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగానూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ముంబైలో కరోనా వైరస్ బాధితులతో ఆస్పత్రులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. ఈ క్రమంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని చారిత్రాత్మక వాంఖేడి స్టేడియాన్ని క్వారెంటైన్ కేంద్రంగా మార్చుకోవాలని నిర్ణయించింది. వీలైనంత తొందరగా మైదానాన్ని తమకు అప్పగించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ)కు ఓ లేఖ రాసింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమకు స్టేడియాన్ని అప్పగించాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ చందనా జాదవ్ కోరారు. (లాక్డౌన్ 4:0: నేడు కొత్త మార్గదర్శకాలు) అంతేకాకుండా ముంబై మున్సిపాలిటీ పరిధిలోని హోటల్స్, లాడ్జ్, క్లబ్స్, కాలేజీలు, పంక్షన్ హాల్స్ మొదలైన వాటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీచేసింది. వీటిలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు వసతి కల్పించాలని బీఎంసీ భావిస్తోంది. అలాగే వైరస్ బాధితులు నానాటికీ పెరుగుతుండటంతో వాటిల్లో క్వారెంటైన్ కేంద్రాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా మహారాష్ట్రంలో ఇప్పటి వరకే 29,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... వైరస్ సోకి 1,068 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే లాక్డౌన్ను మే 31 వరకు పొడిగించింది. (లాక్డౌన్ 4.0: అమిత్ షా కీలక భేటీ) -
పట్టాలి... క్యాచుల్ని, సిరీస్ని!
సిరీస్ సొంతం చేసుకోవడానికి భారత్, వెస్టిండీస్ జట్లు ఆఖరి సమరానికి సిద్ధమయ్యాయి. నిలకడలేని బ్యాటింగ్, ఫీల్డర్ల వైఫల్యం టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా... ఐపీఎల్ అనుభవంతో నిర్ణాయక మ్యాచ్ ఫలితాన్ని శాసించాలని పొలార్డ్ బృందం పట్టుదలతో ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన రోహిత్ శర్మ సొంత మైదానంలో ‘హిట్’ కావాలని, జట్టుకు సిరీస్ అందించాలని ఉత్సాహంతో ఉన్నాడు. ముంబై: భారత్, వెస్టిండీస్ల మధ్య ‘పొట్టి’పోరు ఆఖరి అంకానికి చేరింది. కోహ్లి సేన లోపాలను సరిదిద్దుకొని సమరానికి సన్నద్ధం కాగా... వాంఖెడే స్టేడియం పొలార్డ్ను ఊరిస్తోంది. ఐపీఎల్తో సొంత మైదానమైన చోట మ్యాచ్ను, సిరీస్ను చేజిక్కించుకోవాలని విండీస్ కెపె్టన్ పట్టుదలతో ఉన్నాడు. పూర్తిగా యువకులతో కూడిన వెస్టిండీస్ గత మ్యాచ్లో గెలిచి భారత్కు సవాల్ విసిరింది. టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విండీస్తో ఈ పోరులో భారత్ ఆదమరిస్తే... మూల్యంగా మ్యాచ్నే కాదు, సిరీస్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అనుభవజ్ఞులు, కుర్రాళ్ల కలయికతో ఉన్న టీమిండియా సత్తా చాటాల్సిన సమయమిదే. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలిచి 1–1తో సమంగా ఉన్న నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో టి20 మ్యాచ్ నిర్ణాయకం కానుంది. రోహిత్పై ఆశలు... రోహిత్, కోచ్ రవిశాస్త్రి తన సొంతగడ్డపై రోహిత్ శర్మ మెరుపులు మెరిపిస్తే భారత్ విజయం సులువవుతుంది. గత రెండు మ్యాచ్ల్లో అతను నిరాశపరిచాడు. 8, 15 పరుగులే చేసిన ‘హిట్మ్యాచ్’ ఈ పోరులో బ్యాట్ ఝుళిపిస్తే పరుగుల వరద ఖాయం. తొలి మ్యాచ్లో కోహ్లితో పాటు చెలరేగిన రాహుల్ ఈ మ్యాచ్లో తన ప్రభావం చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఛేజింగ్లో ఓపెనర్లిద్దరు శుభారంభమిస్తే కోహ్లి సేన ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించగలుగుతుంది. సిరీస్ను తేల్చే కీలకమైన ఈ మ్యాచ్కు తుదిజట్టులో మార్పులు చేయకపోవచ్చు. పైగా కెపె్టన్ కోహ్లి... వికెట్ కీపర్ రిషభ్ పంత్పై నమ్మకముంచడంతో సంజూ సామ్సన్కు ఈ సిరీస్లోనూ తుది జట్టులో ఆడే చాన్స్ లేకపోయింది. బంగ్లాదేశ్తో కూడా అతన్ని ఒక్క మ్యాచ్లోనూ ఆడించలేదు. టాపార్డర్లో ప్రమోషన్ పొందిన శివమ్ దూబే ఈ మ్యాచ్లోనూ మెరుపులు మెరిపించేందుకు తహతహలాడుతున్నాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, పంత్లు కూడా పరుగుల ప్రవాహానికి జతకలిస్తే భారత్ భారీ స్కోరు చేయగలుగుతుంది. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లపై భారత బ్యాట్స్మెన్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. క్యాచ్లు పడితేనే... ఈ సిరీస్లో భారత ఫీల్డింగ్ వైఫల్యం జట్టు మేనేజ్మెంట్ను కలవరపరుస్తోంది. రెండు మ్యాచ్ల్లోనూ విలువైన క్యాచ్లు జారవిడువడం సమస్యగా మారింది. తొలి టి20లో ఈ వైఫల్యాన్ని అనుకూలంగా మలుచుకున్న విండీస్ 200 పైచిలుకు పరుగులు చేసింది. కోహ్లి ఆఖరిదాకా చెలరేగడంతో గెలుపు దక్కింది. కానీ రెండో వన్డేలో క్యాచ్లు చేజార్చి భారత్ మూల్యం చెల్లించుకుంది. లేదంటే ఈపాటికే సిరీస్ను గెలిచేది. నెట్స్లోనూ భారత్ ప్రధానంగా ఈ లోపాలపైనే కసరత్తు చేసింది. మరోవైపు బౌలింగ్ విభాగం కూడా మెరుగుపడాలి. పునరాగమనం చేసిన భువనేశ్వర్ పరుగుల్ని కట్టడి చేయలేకపోయాడు. బంగ్లాదేశ్పై నిప్పులు చెరిగిన దీపక్ చాహర్ ఈ సిరీస్లో లయ కోల్పోయాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. వీళ్లంతా రాణిస్తేనే కీలకమైన ఆఖరి మ్యాచ్లో భారత్ విజయఢంకా మోగిస్తుంది. పొలార్డ్కు కలిసొచ్చే ముంబై... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్గా వాంఖెడేలో విండీస్ సారథి పొలార్డ్కు ఎంతో అనుభవముంది. పిచ్, గ్రౌండ్పై అతనికి రోహిత్ శర్మకు ఉన్నంత అవగాహన ఉండటం ఈ మ్యాచ్లో విండీస్కు కలిసిరావొచ్చు. టాపార్డర్లో సిమన్స్, లూయిస్ ఫామ్లో ఉన్నారు. హిట్టర్లు హెట్మైర్, నికోలస్ పూరన్ అందుబాటులో ఉండటం కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేసింది. జట్టు మొత్తం యువకులే. పొట్టి ఫార్మాట్కు తగిన దూకుడు కుర్రాళ్లలోనే ఉంటుంది. బ్రాండన్ కింగ్ భారీషాట్లు ఆడగల సమర్థుడు. గత మ్యాచ్లో బౌలర్లు విలియమ్స్, కాట్రెల్ భారత జోరుకు కళ్లెం వేశారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో అద్భుతంగా కట్టడి చేశారు. అనుభవజ్ఞుడైన పేసర్ హోల్డర్, లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ టీమిండియాపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉంది. ►ముంబైలోని వాంఖెడే స్టేడియంలో భారత్ ఇప్పటివరకు మూడు టి20 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఒక మ్యాచ్లో గెలిచి (శ్రీలంకపై 5 వికెట్లతో; డిసెంబర్ 24న, 2017)... రెండింటిలో (ఇంగ్లండ్ చేతిలో 6 వికెట్లతో; డిసెంబర్ 22న, 2012... విండీస్ చేతిలో 7 వికెట్లతో; మార్చి 31న, 2016) ఓడిపోయింది. వాంఖెడేలో జరిగిన ఈ మూడు మ్యాచ్ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్టే గెలుపొందడం విశేషం. మేం ఎప్పుడో జరిగే పొట్టి ప్రపంచకప్పై ఆలోచించడం లేదు. ఈ మ్యాచ్తో సిరీస్ గెలవడంపైనే దృష్టి పెట్టాం. ఇప్పుడైతే మా లోపాలను సవరించుకునే పనిలో ఉన్నాం. లక్ష్యాన్ని ఛేదించడమే భారత్కు సులువు. ఈ సిరీస్లో కూడా అదే జరిగింది. ప్రస్తుతం పటిష్టమైన జట్టును ఎదుర్కొంటున్నాం. ఆ తర్వాత శ్రీలంకతో ఆడాలి. అనంతరం న్యూజిలాండ్కు వెళ్లాలి. పది నెలల తర్వాత జరిగే మెగా ఈవెంట్కు ముందు మేం ఎన్నో టి20లు ఆడాల్సి ఉంటుంది. –భారత ఓపెనర్ రోహిత్ క్యాచ్లు చేజార్చుతుంటే మ్యాచ్ల్ని నెగ్గలేం. ఫీల్డర్లు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఫ్లడ్లైట్ల వల్ల కనబడలేదనో, మరే ఇతర కారణాల్ని సాకులుగా చెప్పడానికి వీల్లేదు. అవసరమైతే ప్రాక్టీస్లో కఠోరంగా శ్రమించైనా పట్టు సాధించాలి. కెపె్టన్ పొలార్డ్కు ఈ వేదికపై విశేషంగా ఆడిన అనుభవముంది. ఇది మా జట్టుకు పనికొస్తుంది. ఇక్కడ 200 చేసినా ఛేదించవచ్చు. మొదట బ్యాటింగ్ కంటే చేజింగే సులువు. –వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమన్స్ పిచ్, వాతావరణం వాంఖెడేలో లక్ష్యఛేదన సులువు. టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంటుంది. మంచుకురిసే రాత్రి వేళ బౌలర్లకు పట్టుదొరకడం కష్టం కావొచ్చు. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెపె్టన్), రోహిత్ శర్మ, రాహుల్, పంత్, శ్రేయస్, శివమ్ దూబే, జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, భువనేశ్వర్, చహల్. వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెపె్టన్), లెండిల్ సిమన్స్, లూయిస్, కింగ్, హెట్మైర్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, పియరీ, విలియమ్స్, కాట్రెల్, హేడెన్ వాల్ష్ -
మాజీ జట్టును చీల్చిచెండాడాడు!
‘ఇది మా హోమ్గ్రౌండ్. ఇక్కడ మేం చాలా మ్యాచ్లు ఆడాం. మ్యాచ్ గెలువడానికి సీక్రెట్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అందరూ ఉమ్మడిగా ఆడి గెలువాల్సిందే. అందరూ బాధ్యత తీసుకోవాల్సిందే’.. ఇవి రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా టాస్ ఓడిన అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్న మాటలు. కానీ, చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్లో సొంతగడ్డ వాంఖడే స్టేడియంలో ముంబైకి పరాభవమే ఎదురైంది. వాంఖడే స్టేడియంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్ 94 పరుగులు చేసి.. ముంబై ప్లేఆఫ్ ఆశలను కకావికలం చేశాడు. అతను ముంబై మాజీ ఆటగాడు కావడం గమనార్హం. అంతేకాదు, గతంలో ముంబై సభ్యుడిగా వాంఖడేలో ఆడిన అనుభవమే.. తన తాజా ఇన్నింగ్స్కు తోడ్పడిందని బట్లర్ చెప్పడం కొసమెరుపు. నిజానికి ముంబై జట్టు ఈసారి మెరికల్లాంటి ఆటగాళ్లను కోల్పోయినందుకు చాలా బాధపడి ఉంటుంది. ఆ జట్టు వదులుకున్న అంబటి రాయుడు చెన్నై సూపర్కింగ్స్ తరఫున మెరుపులు మెరిపిస్తున్నాడు. కీలక ఇన్నింగ్స్లతో చెలరేగుతున్న రాయుడు అత్యధిక పరుగుల బ్యాట్స్మెన్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ముంబై వదులుకున్న మరో ఆటగాడు జోస్ బట్లర్.. వరుస అర్ధసెంచరీలతో రాజస్తాన్ రాయల్స్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని తెచ్చాడు. తాజా సీజన్లో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించిన బట్లర్.. జట్టు ఫ్లేఆఫ్ ఆశలను ఇంకా సజీవంగా నిలిపిన ఏకైక యోధుడిగా నిలిచాడు. తాజాగా ముంబైతో మ్యాచ్లో 54 బంతుల్లో 94 పరుగులు చేసి.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో ఓడటంతో ముంబై ఇండియన్స్ ఫ్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. వాంఖడే అనుభవమే..! ముంబై విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని 12 బంతులు మిగిలి ఉండగానే రాజస్తాన్ జట్టు ఛేదించింది. మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో తాను ముంబై జట్టులో ఆడిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గత అనుభవాలు తాను సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో తోడ్పడ్డాయని చెప్పాడు. ‘మంచి ఫామ్లో ఉండటంతో దానిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నా. డూ ఆర్ డై పరిస్థితుల్లో మేం ఉన్నాం. మిడిలార్డర్లో నేను ఎంతోకాలంగా బ్యాటింగ్ చేస్తున్నాను. కాబట్టి ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ ముగిసే వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నా. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై జట్టును 15 పరుగుల వరకు కట్టడి చేశారు. మైదానం గురించి, వికెట్ గురించి తెలిసి ఉండటం కలిసొచ్చింది. తదుపరి మ్యాచ్లోనూ బాగా ఆడాలని అనుకుంటున్నా’ అని జోస్ బట్లర్ వివరించాడు. -
పాండ్యా నాటౌట్..! చిర్రెత్తిన కోహ్లీ
ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపమొచ్చింది. హార్దిక్ పాండ్యా ఔటైనా నాటౌట్గా ప్రకటించారంటూ అతడు అసహనానికి గురయ్యాడు. ఫీల్డ్ అంపైర్ని కలిసి ఇదేంటని ప్రశ్నించాడు. ఈ సంఘటన ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చోటుచేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి కీరన్ పొలార్డ్ ఔటవడంతో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి వచ్చాడు. అదే ఓవర్లో వోక్స్ వేసిన మరో బంతికి హార్దిక్ క్యాచ్ ఔట్ అంటూ ఆర్సీబీ అప్పీల్ చేయడం ఫీల్డ్ అంపైర్ వేలెత్తడం చకచక జరిగిపోయాయి. అయితే దీనిపై రివ్యూ కోరిన ముంబై ఇండియన్స్ జట్టుకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. థర్డ్ అంపైర్ హార్దిక్ను నాటౌట్గా ప్రకటించాడు. హార్దిక్ నాటౌట్ అంటూ బిగ్ స్ర్కీన్పై చూసిన కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఫీల్డ్లో ఉన్న అంపైర్ దగ్గరికి వెళ్లి ఆరా తీశాడు. మైదానంలో కూల్గా వ్యవహరించే కోహ్లీ ఈ నిర్ణయం సరైంది కాదని అడ్డంగా తల ఊపుతూ.. అసహనం వ్యక్తం చేశాడు. అయితే స్టికో మీటర్లో సైతం బంతి పాండ్యా బ్యాట్ అంచును తాకుతూ వెళ్లినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. కాగా, ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో బెంగుళూరుపై ఘన విజయం సాధించింది. ముంబైకి ఈ సీజన్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. -
ఐపీఎల్: 10 నిమిషాలకు తమన్నా అంత తీసుకుందా!
ముంబై : మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్-2018 ఆరంభోత్సవ వేడుకల్లో సౌత్బ్యూటీ తమన్నా చిందేయనుంది. పదినిమిషాల ప్రదర్శనకు ఈ అమ్మడు ఏకంగా 50 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో తమన్నాతో కలిసి డ్యాన్సింగ్ మ్యాస్ట్రో ప్రభుదేవా ప్రేక్షకులను అలరించనున్నాడు. నాలుగు దక్షిణాది పాటల్లో చిందేసే వీరి నృత్యాన్ని శైమక్ దేవర్ కొరియోగ్రఫి చేసినట్లు సమాచారం. ఇక ఈ అవకాశంపై తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. తొలిసారి క్రీడా ఈవెంట్లో ప్రదర్శన చేస్తున్నానని సంబరపడిపోయింది. ఇంతకముందు ఇలాంటి వేడుకల్లో ఎప్పుడు పాల్గొనలేదని, ఐపీఎల్ వంటి అద్భుతమైన టోర్నీకి అవకాశం రావడం సంతోషంగా ఉందని ఈ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించడం వేరు స్టేడియంలో ప్రేక్షకుల ముందు చేయడం వేరని, మనమంతా పిచ్చిగా ఆరాధించే క్రికెట్ పండుగ ఈ రాత్రి మొదలవుతుందని ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ వేడుకల్లో తమన్నా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రదర్శన చేయనుంది. దీనిపై స్పందిస్తూ.. ముంబై, హైదరాబాద్, చెన్నైలు తన సొంత నగరాలని తెలిపింది. తాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ నాలుగు భాషలకు చెందిన నాలుగు పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఈ వేడుకల్లో తమన్నా, ప్రభుదేవాలతో పాటు స్టార్ హీరోలు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్లు డ్యాన్సులతో అభిమానులను కనువిందు చేయనున్నారు. అయితే ఈ వేడుకల నుంచి భుజగాయంతో రణవీర్సింగ్, షూటింగ్ బిజీతో పరణితీ చోప్రాలు తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ఆరంభ వేడుకలు అనంతరం చెన్నైసూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ మొదలవుతుంది. It's time for some great adrenaline, it's time for IPL!! #vivoipl A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on Apr 6, 2018 at 10:47pm PDT -
రోడ్డు సేఫ్టీపై క్రికెట్ మ్యాచ్
ముంబై : రోడ్డు ప్రమాదలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు భారత క్రికెటర్లు నడుం బిగించారు. కిక్రెట్ ను అమితంగా ప్రేమించే దేశంలో ప్రజలకు క్రికెట్ ద్వారానే మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో పలువురు క్రికెటర్లు ముందుకొచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేలా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 24న క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్, అంజిక్యా రహానేలతో పాటు పలువురు దేశవాళీ కిక్రెటర్లు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా నకిలీ హెల్మెట్లు తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సచిన్ లేఖ కూడా రాశారు. ఇక దేశంలో రోడ్డు ప్రమాదాల వలన ఎక్కవ మంది చనిపోతున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడంవల్లే ఎక్కవగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు సర్వేల్లో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవగాహన కలిగించేందుకు క్రికెటర్లు ముందుకొచ్చారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement