-
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తాజాగా తన సోషల్ మీడియాలో వెల్లడిరచింది. చాలా బాధాకరమైన ఎండోమెట్రియోసిస్నునిర్లక్ష్యం చేయకండి. దయచేసి గూగుల్లో ఎండోమెట్రియోసిస్ కోసం సెర్చ్ చేయండి. లక్షణాల గురించి తెలుసుకోండి అంటూ మహిళలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో, అది కలిగించే నొప్పి కారణంగా ఇది వైకల్యంలో భాగంగా ప్రకటించారట. ఈ నేపథ్యంలో అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? ఇది ప్రాణాంతక వ్యాధా? ఇది మహిళల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీని గర్భధారణ సమస్యలొస్తాయా? తెలుసుకుందాం.ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి?మహిళల గర్భాశయంలోని పొరను ఎండోమెట్రియం అంటారు. సాధారణంగా ఈ కణజాలం నెలసరి సమయంలో బయటకు వెళ్లిపోతుంది. కానీ, ఇలా వెళ్లకుండా కటి భాగంలో, అండాశయంలో, ఫాలోపియన్ నాళాల్లోకి చేరి, అక్కడ పెరిగిపోతే దాన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఎండోమెట్రియం కణాలు గర్భాశయం లైనింగ్ వెలుపల పెరుగుతాయి. ఫలితంగా గర్భాశయం, అండాశయాలు (పెరిటోనియం), ప్రేగు, మూత్రాశయం చుట్టూ ఉన్న కణజాలంలో గాయాలు ఏర్పడతాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, వ్యంధత్వం(ఇన్ఫర్టిలిటీ) వంటి లక్షణాలు ఏర్పడతాయి.ఎండోమెట్రియోసిస్ వ్యాధికి కారణం తెలియదు. కానీ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు మారుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు తేలికపాటి లక్షణాలుంటే, మరికొందరిలో విపరీతమైన నొప్పి, అధిక రక్త స్రావం ఉంటాయి. చాలామందిలో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించవు.ఎండోమెట్రియోసిస్ లక్షణాలుపెల్విక్ విపరీతమైన నొప్పిపీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పిఅధిక ఋతు రక్తస్రావం లేదా పీరియడ్స్ మధ్యలో రక్తస్రావంప్రేగు కదలిక నొప్పిమూత్రవిసర్జన సమయంలో నొప్పిసంతానలేమిసంతానోత్పత్తిపై ప్రభావంసాధారణంగా ఎండోమెట్రియోసిస్ తీవ్రతను బట్టి గర్భధారణ సమస్యఉండకపోవచ్చు. అయితే, ఎండోమెట్రియోసిస్ కలిగిన మహిళలకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే ముప్పు ఉంది. వీటిపై అవగాహన కలిగి ఉండాలి. గర్భం పోవడం, లేదా నెలలు నిండకముందే ప్రసవించే ముప్పు ఉంటుంది. నిపుణులైన గైనకాలజిస్ట్ పర్యవేక్షణ అవసరం.హార్మోన్ థెరపీహార్మోన్లతో చికిత్స చేయడం ఒక మార్గం. బర్త్ కంట్రోల్ పిల్స్ లేదా గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్లు ఎండోమెట్రియోసిస్ కణాల వృద్ధిని నియంత్రణలో ఉంచుతాయి. దీంతో గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి. మరికొందరిలో లాప్రోస్కోపిక్ సర్జరీ అవసరం పడుతుంది. ఆపరేషన్ ద్వారా ఎండోమెట్రియోసిస్ కణాలను సమూలంగా తొలగిస్తారు. ఎండోమెట్రియోసిస్ స్టేజ్ని నిర్ధారించుకుని తగిన చికిత్స చేసుకోవాలి.ఎండోమెట్రియోసిస్కు చికిత్స ఏమిటి?హార్మోన్ థెరపీ సప్లిమెంటరీ హార్మోన్లను తీసుకోవడం కొన్నిసార్లు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు .ఎండోమెట్రియోసిస్ పురోగతిని ఆపవచ్చు. ఎండోమెట్రియోసిస్ ప్రాణాంతకం కాదు. చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఒక్కోసారి కొన్ని కేన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.నోట్ : లక్షణాలను గమనించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒత్తిడిని మరింత పెంచుతుంది. వైద్యుల పర్యవేక్షణలో రోగనిర్ధారణ, సరైన సమయం చికిత్స చాలా ముఖ్యం. -
మహిళల భద్రతకు ‘పచ్చ’ముప్పు
సాక్షి, అమరావతి : చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన మునుపెన్నడూలేని రీతిలో బరితెగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు పన్నాగం పన్నుతూ యావత్ మహిళల భద్రతకు పెనుముప్పుగా మారారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ రూపొందించిన ‘వుయ్ యాప్’ రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రమాదంగా పరిణమించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాలను ఉల్లంఘించి రూపొందించిన ఈ యాప్ మహిళల భద్రత పాలిట పెనుగండంగా మారింది. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న టీడీపీ ‘వుయ్ యాప్’ బాగోతం కథాకమామిషు ఏమిటంటే.. వ్యక్తిగత సమాచారం అంతా ‘పచ్చ’ముఠా గుప్పెట్లోరాష్ట్రంలో ఓటర్ల వివరాలన్నింటినీ చంద్రబాబు ముఠా అక్రమంగా సేకరించింది. గతంలో అధికారంలో ఉండగా నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్కు అనుసంధించారు. ప్రస్తుతం కూడా టీడీపీ అదే రీతిలో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించింది. ఓటర్ల పేర్లు, చిరునామాలు, వయసు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఫొటోలు.. ఇలా పూర్తి వివరాలను వుయ్ యాప్లో పొందుపరిచారు. వాటిలో రాష్ట్రంలోని 2.10 కోట్ల మహిళా ఓటర్ల వివరాలు వారి ఫొటోలతో సహా ఉండటం గమనార్హం. అంటే.. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యవతులు, మహిళల పూర్తి వ్యక్తిగత సమాచారం అంతా టీడీపీ గుప్పెట్లోకి వచి్చందన్న మాట. ఈ సమచారాన్ని వుయ్ యాప్ ద్వారా టీడీపీ బూత్కమిటీలకు చేర్చింది. దీంతో ఆకతాయిలు, వీధి రౌడీలు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారు, ఇతర నేరచరితులకు ఈ వివరాలన్నీ అందుబాటులోకి వచ్చినట్లే. వేధింపులకు అవకాశం.. భద్రతకు ముప్పుటీడీపీ పాల్పడుతున్న ఈ అక్రమాలు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెనుముప్పుగా పరిణమించాయి. ఎందుకంటే ఆకతాయిలు మహిళల ఫోన్ నంబర్లకు ఫోన్లుచేసి వేధించొచ్చు.. ఫొటోలను ఎవరైనా మార్ఫింగ్ చేసి సైబర్ నేరాలకు పాల్పడొచ్చు.. వారి బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్ చేసి ఆరి్థక నేరాలకు పాల్పడొచ్చు.. ఇలా.. ఎటువంటి నేరాలకైనా పాల్పడేందుకు ఆ యాప్ అవకాశం కలి్పస్తోంది.టీడీపీ కుట్ర కచి్చతంగా రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు భంగకరం. వ్యక్తిగత గోప్యత హక్కుకు ప్రమాదకరం. ఈ నేపథ్యంలో.. వుయ్ యాప్ పేరుతో టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడటంతోపాటు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెను ప్రమాదాన్ని తీసుకొచి్చందని మేధావులు, రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ (ఈసీ)తోపాటు పోలీసు యంత్రాంగం తక్షణం స్పందించి ఈ యాప్ను తొలగించాలని కోరుతున్నారు. చంద్రబాబుతోపాటు వుయ్ యాప్ రూపొందించిన వారిపై కుట్ర కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విధ్వంసాలకు బాబు స్కెచ్మరోవైపు.. ఓటమి భయంతో అసలే బెంబేలెత్తుతున్న చంద్రబాబు మహిళా ఓటర్లు పేరెత్తితే రగిలిపోతున్నారు. వారంతా ముక్తకంఠంతో సీఎం జగన్కే మద్దతు ప్రకటిస్తుండడంతో బాబుకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో ఆయన విధ్వంసకర కుట్రకు తెరతీశారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు స్కెచ్ వేశారు. మహిళల ఓట్లు ఎలాగూ సాధించలేం కాబట్టి వారి ఓటింగ్ శాతాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించేందుకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా రాబోయే 24 గంటల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు పన్నాగం పన్నారు. రెచ్చగొట్టి దాడులకు తెగబడాలి.. పోలింగ్ బూత్లకు వెళ్లే మహిళలను ఆకతాయిలతో రెచ్చగొట్టి.. అసభ్య పదాలతో దూషించి.. వారు దానిపై ప్రశి్నంచగానే టీడీపీ గూండాలు ఘర్షణలకు దిగి.. దాడులకు తెగబడేలా చేయాలన్నది చంద్రబాబు బ్లూప్రింట్. ఈ కుట్రను పక్కాగా అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు, నేతలు తమ మందీమార్బలాన్ని, గూండాలను సమీకరించుకుని.. వారికి కర్రలు, కత్తులతోపాటు ఇతర ఆయుధాలను కూడా అందించి పోలింగ్ను భగ్నం చేసేందుకు తద్వారా మహిళల ఓటింగ్ను తగ్గించేందుకు సన్నద్ధమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహిళలే లక్ష్యంగా బాబు కుట్ర..ఇక ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్రంలోని ఎన్నికల ముఖచిత్రం ఏమిటన్నది చంద్రబాబుకు స్పష్టమైంది. ప్రజలంతా వైఎస్సార్సీపీపట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారన్నది తేలిపోవడం.. మహిళా ఓటర్లు సీఎం జగన్కు నీరాజనాలు పడుతున్నారని అన్ని జాతీయ సర్వేలతో సహా స్పష్టంచేస్తుండటంతో ఆయన రగిలిపోతున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లుండగా.. వారిలో మహిళా ఓటర్లే 2.10 కోట్ల మంది ఉన్నారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా మొత్తం రూ.2.83 లక్షల కోట్ల మేర లబ్ధి వారికి చేకూర్చి దేశంలోనే కొత్త చరిత్రను సృష్టించడంతో సీఎం జగన్కు మహిళలు జేజేలు పలుకుతున్నారు. దీంతో మహిళల ఓట్లపై చంద్రబాబు దాదాపుగా ఆశలు వదిలేసుకోవడం.. టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోవడంతో మహిళా ఓటర్లే లక్ష్యంగా బాబు విధ్వంసానికి కుట్ర పన్నారు.అడ్డుకట్ట వేయాల్సింది ఈసీ, పోలీసులేఈ నేపథ్యంలో.. పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ), పోలీసు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ కోసం వెబ్కాస్టింగ్, వీడియో రికార్డింగ్ తదితర చర్యలు తీసుకుంటున్నా.. అవి పోలింగ్ బూత్ల వద్ద పరిస్థితిని మాత్రమే పర్యవేక్షణకు ఉద్దేశించినవి.⇒కానీ, సామాన్య మహిళా ఓటర్లు తమ ఇళ్ల నుంచి పోలింగ్ బూత్లకు వచ్చే మార్గాల్లోనూ.. ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు తెగబడేందుకు కుట్ర పన్నుతున్న టీడీపీ గూండాలను కట్టడి చేయాలంటే ఆ చర్యలు సరిపోవు. కాబట్టి ఈసీ, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి.. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా.. మహిళలు అత్యధికంగా ఓటింగులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి ఓటింగ్ శాతం తగ్గించడమే లక్ష్యం సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొంటారు. పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా సాగితే మహిళల ఓటింగ్ శాతం అమాంతంగా పెరుగుతుంది. అందుకే మహిళల ఓటింగ్ శాతాన్ని తగ్గించడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జాన్యాలకు పాల్పడమని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు.అందుకోసం స్థానికంగా ఉండే టీడీపీ రౌడీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలు, రౌడీ మూకలను రప్పించినట్లు సమాచారం. ఎక్కడపడితే అక్కడ దాడులకు తెగించాలని.. తద్వారా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలన్నది చంద్రబాబు పన్నాగం. పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం.. వీలైతే పోలీసు కాల్పుల వరకూ పరిస్థితి తీసుకొచ్చి శాంతిభద్రతలు అదుపుతప్పేలా చేయాలని ఆయన టీడీపీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇందులో భాగమే ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు. అవి.. ⇒ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపైనే టీడీపీ గూండాల దాడి. ⇒ మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరిలపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి తన అనుచరులతో దాడిచేయించడం.. ⇒ ఇక కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి భార్య, తనయుడిపై టీడీపీ గూండాలు దాడి. -
యూనివర్సిటీ వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. పరారీలో భర్త, అత్త? ..?
లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఘోరం వెలుగుచూసింది. గౌతమ్ బుద్దా యూనివర్సిటీలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను భర్త, అత్తే హత్య చేసి అక్కడి నుంచి పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భర్త సమీపంలోని జిమ్స్ ఆసపత్రిలో పనిచేస్తున్నట్లు తేలింది. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త, అత్త కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు. కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వాస్తవాలను బయటపెడతామని చెప్పారు. -
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
కవల శిశువుల జననం గురించి మనం వినేవుంటాం. ఒకే కాన్పులో ఇద్దరో లేదా ముగ్గురో పుట్టడాన్ని కూడా చూసేవుంటాం. అయితే ఒకే కాన్పులో ఏకంగా ఐదుగురు శిశువులు జన్మంచడాన్ని అంతగా చూసి ఉండం. వినివుండం. బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలో 20 ఏళ్ల మహిళ ఏకకాలంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది.ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. శిశువులంతా ఒక కిలో లోపు బరువుతో ఉన్నారు. తల్లి, శిశువులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆ మహిళకు పురుడు పోసిన డాక్టర్ ఫర్జానా మాట్లాడుతూ ఈ కేసు తనకు చాలెంజింగ్గా అనిపించిందని, ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు. కాగా ఆ మహిళకు సాధారణ ప్రసవం ద్వారా శిశువులంతా జన్మించడం విశేషం.కిషన్గంజ్ జిల్లాలోని కనక్పూర్ పంచాయతీ పరిధిలోని జల్మిలిక్ గ్రామానికి చెందిన తాహిరా బేగం (20) గర్భం దాల్చినప్పటి నుంచి ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్లో చికిత్స అందుకుంటోంది. ఈ నేపధ్యంలో ఆమె కడుపులో ఐదుగురు కవలలు ఉన్నారని స్కానింగ్లో వెల్లడయ్యింది. దీంతో ఆమె భయపడిపోయింది. అయితే డాక్టర్ ఫర్జానా ఆమెకు ధైర్యం చెప్పారు. తరువాత ఆమెకు తొమ్మిది నెలల పాటు రెగ్యులర్ చెకప్ కొనసాగింది. శనివారం ఆమె ఐదురుగు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. తాహిరా ఇప్పుడు రెండోసారి తల్లి అయ్యింది. ఆమెకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఆరుగురు పిల్లలకు తల్లిగా మారింది. -
టీడీపీ కార్యకర్త దాష్టీకం
కంకిపాడు: టీడీపీ కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. నేతల అండ చూసుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అధికారంలోకి రానివ్వండి తేలుస్తాం.. అంటూ పెనమలూరు నియోజకవర్గంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రచారం పేరుతో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి దాషీ్టకం ప్రదర్శించాడు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేయడమేగాక ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ అవుతోంది. కంకిపాడుకు చెందిన గుమ్మడి కిరణ్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో టీడీపీ ప్రచారం పేరుతో.. మహిళ ఒంటరిగా ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. నువ్వు ఫోన్ చేస్తే వచ్చానని, ఫోన్లో డబ్బులు వేశానని అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. సామగ్రి ధ్వంసం చేసి భయాందోళనలకు గురిచేశాడు. అతడి చేష్టల్ని వీడియోలో చిత్రీకరిస్తున్న ఆమెను తిడుతూ.. తనకు యార్లగడ్డ, బోడె, పార్థసారథి అండ ఉందని హెచ్చరించాడు. ఆమెపై దాడిచేసి కొట్టాడు. తెలుగుదేశం వర్గీయుల దౌర్జన్య వ్యవహారాలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. -
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తిరువనంతపురం: కేరళలో రెండు రోజుల క్రితం ఒక మహిళ అపార్ట్మెంట్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి జరిగింది. కేరళ కొల్లంలోని ఓ హాస్ట్ల్లో ఉంటున్న యువతి తాను గర్భవతి అన్న విషయాన్ని స్నేహితురాళ్ల వద్ద దాచింది. ఆదివారం(మే5) హాస్టల్లోని తన గది తలుపు పెట్టుకుని బాత్రూమ్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. చాలా సేపటివరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు బలవంతంగా తలుపు తీశారు. దీంతో యువతి బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం బయటపడింది. ఈ విషయాన్నివారు అధికారులకు సమాచారమివ్వగా తల్లిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్(ట్విటర్)లో హరీశ్రావు ట్వీట్ చేశారు.‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
బెంగళూరు: మహిళ కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణను బెంగళూరు పోలీసులు శనివారం(మే4) అరెస్టు చేశారు. రేవణ్ణ తన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. కిడ్నాప్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రేవణ్ణ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను బెంగళూరు కోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలోనే పోలీసులు రేవణ్ణను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ సంచలనం రేపిన సెక్స్ వీడియోల స్కాండల్ కేసులో కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణతో పాటు రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్నారు. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈయనపై సెక్స్ స్కాండల్ కేసులో పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. -
సామాన్యురాలు... పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ
‘మా ప్రాంతంలోని పేదల కష్టాలే నన్ను పెద్దలతో తలపడేలా చేస్తున్నాయి’ అంటోంది దాసరి భారతి.కోవిడ్ సమయంలో నర్స్గా పని చేసి ఎందరికో సేవ చేసిన భారతిబాధితులకు న్యాయం జరగాలంటే చట్టం తెలియాలని ఎల్.ఎల్.బి. చదువుతోంది.జోగులాంబ జిల్లా మేడికొండకు చెందిన 26 ఏళ్ల ఈ దళిత యువతినాగర్ కర్నూల్ ΄ార్లమెంట్ స్థానం నుంచి అధికారికంగా పోటీలో ఉంది.‘జనం కోసం గొంతెత్తకుండా ఉండలేక΄ోతున్నాను’ అంటున్న భారతి పరిచయం.‘నేను హైదరాబాద్ అ΄ోలో నర్సింగ్ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ చదివాను. ఎమ్మెస్సీ నర్సింగ్ చేయాలని ఉండేది. నాకు మెరిట్ ఉన్నా సీట్ వచ్చినా కేవలం డబ్బుల్లేక ఒక సంవత్సరం ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత పాండిచ్చేరి జిప్మర్లో ఎమ్మెస్సీ నర్సింగ్ చదివాను. నాలా ఎందరో పేదింటి, దళిత, వెనుకబడ్డ వర్గాల యువతీ యువకులు చదువు కోసం బాధలు పడుతున్నారు. వారిని పట్టించుకునేది ఎవరు? వారి కోసం గొంతెత్తాలని ఎన్నికలలో నిలుచున్నాను’ అంటుంది దాసరి భారతి.26 ఏళ్ల ఈ దళిత అమ్మాయి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ‘విడుదలై చిరుతైగల్ కట్చి’ (వి.సి.కె.) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆమెకు ‘టీవీ రిమోట్’ను ఎన్నికల చిహ్నంగా కేటాయించారు. పాండిచ్చేరిలో చదివేటప్పుడు వి.సి.కె. పార్టీ కార్యక్రమాలు గమనించాను. అది దళితుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న పార్టీ. ఒక దళిత యువతిగా నేను ఆ పార్టీతో కలిసి పని చేయాలని భావించాను’ అని తెలిపింది భారతి.జోగులాంబ జిల్లా మేడికొండ భారతి ఊరు. తండ్రి దాసరి రాములు కౌలు రైతు. తల్లి పద్మావతి గృహిణి. ‘మా నాన్న చనిపోయాడు. మేము నలుగురం పిల్లలం. చదువుకోవడానికి చాలా బాధలు పడాల్సి వచ్చింది’ అంది భారతి.‘నా బాల్యం నుంచి చూస్తున్నాను. మా ఊరికి ఇప్పటికీ సరైన రోడ్డు లేదు. రోగాలొచ్చినా ఏమొచ్చినా చాలా కష్టం. ఒక నిండు చూలాలు అంబులెన్స్ ఎక్కి రోడ్డు గతుకుల వల్ల దారిలోనే డెలివరీ అయ్యి చని΄ోయిన సంఘటన కళ్లారా చూశాను. నిధులన్నీ ఏమవుతున్నాయి? ఎం.ఎల్.ఏలు, ఎం.పి.లు, మంత్రులు ఏం చేస్తుంటారు? ఎందుకు పరిస్థితులు మార్చరు? కృష్ణ, తుంగభద్రల తీరంలో ఉండేదే మా ్ర΄ాంతం. కాని పశువులు తాగడానికి కూడా చుక్క నీరు ఇప్పుడు లేదు. రాజకీయ చైతన్యం ఉన్న యువత ఈ పరిస్థితిని ప్రశ్నించే వరకు మార్పు రాదు. అందుకే నేను ఎన్నికలలో నిలుచున్నాను’ అంది భారతి.నాగర్ కర్నూల్లో పార్లమెంట్ స్థానానికి ప్రవీణ్ కుమార్ (బి.ఆర్.ఎస్), మల్లు రవి (కాంగ్రెస్), భరత్ కుమార్ (బి.జె.పి) పోటీలో ఉన్నారు. భారతి దగ్గర మందీ మార్బలం లేకపోయినా కేవలం తన ధర్మాగ్రహంతో వీరితో తలపడనుంది.‘కోవిడ్ కాలంలో టిమ్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేశాను. పేదలు సరైన వైద్యం అందక, కార్పొరేట్ ఆస్పత్రులకు పోలేక మరణించారు. నాకు ముందు నుంచి కూడా విద్యార్థి రాజకీయాలన్నా, ఉద్యమాలన్నా ఇష్టం. నా విస్తృతి పెరగాలంటే నర్స్గా ఉంటే సరి΄ోదనిపించింది. అందుకే ఇప్పుడు ఎల్.ఎల్.బి. చదువు తున్నాను. నేను ఎలక్షన్లలో పోటీ చేస్తున్నానని తెలిసి మావాళ్లంతా సంతోషపడుతున్నారు. నాలాంటి వాళ్లు గెలిచి పేదలకు మేలు జరిగినప్పుడే కదా నిజమైన సంతోషం’ అని ముగించింది భారతి. -
స్కూటర్లో వెళ్తూ జూమ్ మీటింగ్ !
యశవంతపుర: ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరంలో ట్రాఫిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈనెల 23న ఓ మహిళ తన కార్యాలయం వెళ్లేందుకు స్కూటర్లో బయలుదేరారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దీంతో రోడ్డు పక్కన వాహనం నిలిపి సంస్థ నిర్వహించిన జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సదరు మహిళను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. -
రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?) బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు) What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024 -
ఆస్ట్రియన్ పర్యాటకురాలికి కేరళ పోలీసుల సమన్లు
కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో వివాదాస్పద ఉదంతం చోటుచేసుకుంది. పాలస్తీనా అనుకూల పోస్టర్ను చింపివేసూ ఒక ఆస్ట్రియన్ యూదు పర్యాటకురాలు కేరళలో స్థానికులతో వాదిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ వారం ప్రారంభంలో ఎర్నాకులం జిల్లా ఫోర్ట్ కొచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో పోస్టర్ను చింపివేస్తున్న ఆమెను వారించేందుకు స్థానిక యువకులు ప్రయత్నించగా, ఆమె వారితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ఆ పోస్టర్ చినిగిన ముక్కలను తీయమని అక్కడున్న యువకులు ఆమెకు చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ గోడపత్రికతో సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని వారు ఆమెకు సూచించడాన్ని కూడా ఆ వీడియోలో గమనించవచ్చు. An Austrian tourist tears down pro-palestinian posters in Kochi, India. What an entitled Zionist woman. Kerala Police filed a FIR against her. pic.twitter.com/X4CM7tIJCM — Mahesh Kusumagiri (@maheshkusumagir) April 17, 2024 ఈ వీడియో వైరల్గా మారిన నేపధ్యంలో కేరళ పోలీసులు విచారణ కోసం ఆ మహిళను పోలీస్ స్టేషన్కు రావాలని కోరారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ)కొచ్చి ఏరియా సెక్రటరీ మహమ్మద్ అజీమ్ కెఎస్ ఆ మహిళపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. ఎస్ఐవో అతికించిన పోస్టర్లను ఆ ఆస్ట్రియన్ యువతి చించివేసింది. కాగా గత జనవరిలో కోజికోడ్ బీచ్ సమీపంలోని స్టార్బక్స్ స్టోర్పై పాలస్తీనా అనుకూల పోస్టర్లు అతికించిన ఆరుగురు విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నాడు నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం స్టార్బక్స్ స్టోర్ గ్లాస్ డోర్పై ఆ విద్యార్థులు ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసిన పోస్టర్లను అతికించారు. గాజాలో జరిగిన యుద్ధ నేపధ్యంలో స్టార్బక్స్ ఇజ్రాయెల్కు అనుకూల వైఖరిని ప్రదర్శించినదుకు విమర్శలకు గురైంది. -
కార్పొరేట్ జాబ్ వదిలేసి మరీ..సివిల్స్ ర్యాంక్ కొట్టిన యువతి స్టోరీ
సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టేసింది. పట్టుదలతో చదివి ఊహించని ఫలితాన్ని సాధించింది. తాజా యూపీఎస్సీ ఫలితాల్లో టాప్-20లో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువతి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి..! ప్రతిష్టాత్మక పరీక్ష సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలంటే అంత ఈజీకాదు. దీనికి ఎంతో పట్టుదల కృషి కావాలి. అలా దీక్షగా చదివి తన ప్రత్యేకతను చాటుకుంది నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్లో నివసించే వార్దా ఖాన్. మంగళవారం ప్రకటించిన తాజా యూపీఎస్సీ ఫలితాల్లో 18 వ ర్యాంక్ సాధించింది. తన తొలి ప్రిఫరెన్స్గా ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అని తెలిపింది. ప్రపంచంలోనే భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది. సివిల్స్లో మంచి తన టార్గెట్. కానీ టాప్ 20లో ఉంటానని అస్సలు ఊహించలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది వార్దా ఖాన్. దీంతో తన ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. వాస్తవానికి సివిల్స్కోసం 2021 నుండి సిద్ధమవుతున్నాననీ, రెండో ప్రయత్నంలో విజయం సాధించానని వెల్లడించింది. ఈ సందర్బంగా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Uttar Pradesh | Noida resident Wardah Khan secures 18th rank in UPSC 2023. She says, "I had never thought that I would make it to Top 20. I just wanted to make it to the list (of qualifiers). This is a huge moment for my family and me. This was my second attempt. I have… pic.twitter.com/2KoPdlDPmV — ANI (@ANI) April 16, 2024 నోయిడా సెక్టార్ 82లోని వివేక్ విహార్లో ఉండే వార్ధా ఖాన్ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోగా ప్రస్తుతం తల్లితో కలసి ఉంటోంది. ఢిల్లీలోని ఖల్సా కాలేజీ నుంచి బీకామ్ హానర్స్ పూర్తి చేసింది. చదువు తరువాత ఎనిమిది నెలల పాటు కార్పొరేట్ కంపెనీలో పనిచేసింది. అది సంతృప్తి నివ్వలేదు. పైగా సమాజానికి సేవ చేయాలనే ఆశయం. దీంతో కష్టపడి చదవి తమ కలను సాకారం చేసుకుంది. హిస్టరీ, జియోపాలిటిక్స్ సబ్జెక్టులు అంటే ఇష్టమని పేర్కొంది. అలాగే కాలేజీ రోజుల్లో ఎక్కువగా డిబేట్లలో, MUN లలో (మాక్ యునైటెడ్ నేషన్స్) పాల్గొనేదాన్ని ఆ సమయంలో సివిల్స్ సాధించాలనే ఆలోచన తనలో కలిగిందని చెప్పుకొచ్చింది. -
ఆ రాష్ట్రంలో.. 1952 తర్వాత 1998లోనే మహిళా ఎంపీ!
ఉత్తరాఖండ్లో ఇంతవరకూ జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉత్తరాఖండ్ పేరుగాంచింది. అయితే రాజకీయాల్లో ఇక్కడ నేటికీ లింగవివక్ష కనిపిస్తూనే ఉంది. 1952లో రాష్ట్రంలోని తెహ్రీ నుంచి ఎన్నికైన కమలేందు మతి షా ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ. 1998లో నైనిటాల్ నుంచి ఎన్నికైన రెండో మహిళా ఎంపీ ఇలా పంత్. ఈ విధంగా చూస్తే రాష్ట్రం నుంచి లోక్సభకు మహిళా ఎంపీ చేరేందుకు 46 ఏళ్లు పట్టింది. 2012లో మాలా రాజ్య లక్ష్మి షా అనే మరో మహిళ ఎంపీ స్థాయికి చేరుకోగలిగారు. ఏడు దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్సభలో ప్రాతినిధ్యం దక్కింది. 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెహ్రీ నుంచి మాలా రాజ్యలక్ష్మి షా ఎంపీ అయ్యారు. 1952 ఎన్నికల్లో తెహ్రీ గర్వాల్ సీటు నుంచి రాజమాత కమలేందు మతి షా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నాటి రోజుల్లో కాంగ్రెస్కు భారీ మద్దతు ఉన్నప్పటికీ, ఇక్కడి ఎన్నికల్లో కమలేందు మతి షా విజయం సాధించారు. నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ కృష్ణ సింగ్ ఓటమి చవిచూశారు. -
అందుకే మంగళగిరిలో చేనేత మహిళకు టికెట్.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘మరో వైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘కుప్పంలోనూ బీసీలు ఎక్కువగా ఉన్నా అక్కడ కూడా ఇదే పరిస్థితి. తేడా గమనించమని కోరుతున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ‘‘చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది’’ అని సీఎం జగన్ వివరించారు. మంగళగిరిలో చేనేతలు ఎక్కువ. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చాం. మరోవైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కుప్పంలోనూ బీసీలు… pic.twitter.com/kB1XDL6mOQ — YS Jagan Mohan Reddy (@ysjagan) April 13, 2024 -
బియ్యపు గింజపై ‘ఓటు వేయండి’!
దేశంలో లోకసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగున్నాయి. వివిధ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే జనం చేతిలో ఓటు అనే అయుధం ఉంది. దీనితో వారు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఎన్నికల సంఘం ఓటు హక్కు గురించి ప్రచారం చేస్తుంటుంది. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఒక హస్త కళాకారిణి వినూత్న రీతిలో ఓటు హక్కుకున్న ప్రాముఖ్యత తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. జైపూర్లోని సాంగనేర్ నివాసి నీరూ చాబ్రా ప్రజలకు ఓటుహక్కు ప్రాముఖ్యతను తెలియజేయాలని భావించారు. ఇందుకోసం ఆమె బియ్యపుగింజలపై ‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ రాశారు. ఆమె బియ్యపు గింజపై భారత మ్యాప్ను సూక్ష్మ శైలిలో గీయడంతోపాటు ఎన్నికల స్లోగన్ కూడా రాశారు. ఈ సందర్భంగా నీరూ చాబ్రా మీడియాతో మాట్లాడుతూ 1984 నుంచి తాను బియ్యపు గింజపై సూక్ష్మ అక్షరాలు రాయడాన్ని కొనసాగిస్తున్నానని, కిచెన్లో వంట చేసేటప్పుడు తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపారు. మెల్లమెల్లగా ఈ కళలో ప్రావీణ్యం సంపాదించానని అన్నారు. కాగా నీరూ బియ్యపు గింజపై 108 అక్షరాలు రాసి రికార్డు సృష్టించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు నీరూ చాబ్రా ప్రతిభను గతంలో మెచ్చుకున్నారు. -
HYD: యువతి హైడ్రామా.. రాజేంద్రనగర్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ దొంగతనం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒక యువతి ఆడిన నాటకాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకొని యువతి చోరీ డ్రామాకు తెరతీసింది. ఉదయం తాను వాష్ రూమ్కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు ఉన్నారని తెలిపిన యువతి.. పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారంటూ వెల్లడించింది. స్థానికులు సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు. పథకం ప్రకారమే ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25 వేలు పొగొట్టుకుని భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: ‘డెత్’లైన్ గేమ్స్! -
కారులో చికెన్ ఫ్రై రెసిపీ..ఎలాగంటే..?
వెళ్తున్న కారులోనే వంటకాలు చేసి ఔరా! అనిపిస్తున్నారు. యూట్యూబ్ రీల్ కోసం అనో చాలామంది ఇలా కారులోనే వంటకాలు చేసిన వీడియోలు చూశాం. కానీ వాటిలో అదంతా ఫేక్ అయ్యి ఉండొచ్చు కుదరదు అనుకునే వాళ్లం కదా!. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఈజీగా కారులో కూడా వంట చేసేయొచ్చేని అంటారు. ఇంతకీ ఎలా కారులో వండేస్తున్నారంటే.. ఆ వీడియోలో ఒక మహిళ సీటులో కూర్చొని చక్కగా చికెన్ని కబాబ్ ముక్కలుగా కట్ చేస్తుంది. ఆ తర్వాత ఓ చిన్న కవర్ తీసుకుని అందులో మసాల దినుసులు, పెరుగు అని కలిపి ఉంచుతుంది. దానిలో చికెన్ కబాబ్ ముక్కలు అన్ని వేసి కాసేపు అలా ఉంచుతుంది. ఆ తర్వాత మరో కవర్ కార్న్ఫోర్ తీసుకుంటుంది. ఇప్పుడు మసాలాలో నాన్చిన చికెన్ముక్కలను ఈ కార్న్ఫోర్ కవర్లో దొర్లించి ఓ ప్లేట్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఓ ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని కాసేపు అలా ఉంచుతుంది. అది వేడిక్కెంది అని నిర్థారించుకున్నాక ఈ కార్న్ఫోర్ అద్దిన చికెన్ ముక్కల్ని వేసి చక్కగా డీప్ ఫ్రై చేస్తుంది. ఆ తర్వాత చక్కగా ఓ ప్లేట్లో మంచిగా సర్వ్ చేసుకుని లాంగించేస్తుంది. అబ్బా ఇంత ఈజీనా కారులో వంటలు చేయడం అనిపిస్తుంది ఆ మహిళ చేసిన విధానం చూస్తే. కానీ ఎలాగైన కిచెన్.. కిచెనే! ఎందుకంటే కారులో వంట చేయాలంటే కావాల్సిన పదార్థాల తోపాటు అన్ని క్లీన్ చేసుకుని ముందుగా రెడీ చేస్తేనే చేయడం ఈజీ. ఇంతలా ముందుగా హైరాన పడి రెడీ చేసుకోవడం కంటే వంటగదిలో హాయిగా టెన్షన్ పడకుండా చేసుకుంటే బెటర్ కదా..! అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Sophie Saldana (@sophiesophss) (చదవండి: చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!) -
బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిల్.. మహిళా పైలట్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మహిళా పైలట్ బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలైంది. దీంతో టాటా గ్రూపు విమానయాన సంస్థ ఆ మహిళా పైలట్పై కఠిన చర్యలు తీసుకుంది. మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది. గత వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బోయింగ్ 787 విమానం ఫస్ట్ ఆఫీసర్గా మహిళా పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. ఇంతలో ఆమె బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలై విధులకు దూరమైంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారులు మంగళవారం(ఏప్రిల్ 9) ధృవీకరించారు. సస్పెన్షన్కు గురైన మహిళా పైలట్ సోషల్ మీడియాలో పాపులర్ అని తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూల్స్ ప్రకారం ఆల్కహాల్ తీసుకున్న పైలట్లను విమానం నడిపేందుకు అనుమతించరు.ఎవరైనా ఆల్కహాల్ ఉన్న మౌత్వాష్లు,టూత్ జెల్ మందులు తీసుకుంటే ముందుగా సమాచారమివ్వాల్సి ఉంటుంది. లేదంటే టెస్టుల్లో పట్టుబడితే తొలిసారి శిక్ష కింద విధుల నుంచి 3 నెలలు సస్పెండ్ చేస్తారు. ఇదీ చదవండి.. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ,ఈడీ సోదాలు -
Madhya Pradesh High Court: సహజీవనం చేసినా భరణం
భోపాల్: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా ఒక పురుషుడితో చాలాకాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భరణం ఇవ్వాలన్న కింది కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. 38 ఏళ్ల శైలేంద్ర బాప్చే, 48 ఏళ్ల అనిత చాలాఏళ్లు సహజీవనం చేశారు. కుమారుడు పుట్టాక విడిపోయారు. బిడ్డను పోషించుకోవడానికి, తన జీవనానికి భరణం ఇవ్వాలని అనిత డిమాండ్ చేయగా శైలేంద్ర అంగీకరించలేదు. దాంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అనిత్ పిటిషన్పై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ.1,500 చొప్పున భరణం చెల్లించాలని శైలేంద్రను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శైలేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. శైలేంద్ర పిటిషన్ను కొట్టివేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే సీఆర్పీసీ సెక్షన్ 125 కింద ఆమెకు భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
త్వరగా బిడ్డ పుట్టాలంటే.. ఈ ఆహారం ట్రై చేయండి!
మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో పెళ్లి అయిన ఏడాదిలోపు బిడ్డ కడుపున పడాలని కోరుకునేవారు. సాధారణంగా అలా జరిగేది కూడా. కానీ మారిన పరిస్థితులు, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందిలో సంతానోత్పత్తి పెద్ద సమస్యగా మారింది. లైఫ్స్టయిల్, చేస్తున్న ఉద్యోగాలు తదితర కారణాల రీత్యా పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోంది. అయితే చక్కటి లైంగిక జీవితంతోపాటు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం అవసరం. కొన్ని ఆహారాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.. తల్లి కావాలనుకునే మహిళలకు పోషకాలు, ఫోలిక్యాసిడ్,ఫోలేట్, కాల్షియం ఐరన్ పుష్కలంగా కావాలి. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, బ్రోకలీ, బోక్ చోయ్, కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. వీటిని ఆలివ్ నూనెలో వేయించుకుని, సైడ్ డిష్గా తినండి లేదా సూప్లు, సలాడ్లు, క్యాస్రోల్స్ మరియు ఆమ్లెట్లలో యాడ్ చేసుకోవాలి. కాల్షియం పునరుత్పత్తి వ్యవస్థ సజావుగా పని చేసేలా చేస్తుంది. వేగంగా గర్భం దాల్చడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డకు అవసరమైన కాల్షియం నిల్వలు పెరుగుతాయి. సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి, మహిళలు తమ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ "బి", ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, విటమిన్ "సి" సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బీన్స్లో లీన్ ప్రొటీన్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళల సంతానోత్పత్తిని పెంచుతుంది. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బీ6 ఇందులో తగినంత పరిమాణంల ఉంటాయి.సంతానోత్పత్తి హార్మోన్లను పెంచడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ త్వరగా గర్భం దాల్చడానికి తోడ్పడతాయి. విటమిన్ "సి" పుష్కలంగా ఉండే పండ్లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. నోట్: పిల్లలు పుట్టాలంటే దంపతుల ఆరోగ్యం చాలా ముఖ్యం. పీరియడ్ సైకిల్ను, ఓవులేషన్ పీరియడ్ను సరిగ్గా అర్థం చేసుకోని ఆ సమయానికి శారీరక కలయిక చాలా కీలకం. ఒక వేళపిల్లలు పుట్టడం లేట్ అయితే.. నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. మహిళలైతే గర్భసంచిలో, ఫాలోపియన్ ట్యూబ్స్లో అడ్డంకులను గైనకాలజిస్ట్ అంచనా వేస్తారు. పురుషుల్లో అయితే వీర్య కణాలు, వాటి కదలికలు, సామర్థ్య పరీక్షలుంటాయి. అలాగే సహజంగా పిల్లలు కలగరు అని తెలిసినా ఆందోళన అనవసరం. ఇపుడు అనేక ఆధునిక సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మనం పెద్ద మనసు చేసుకోవాలేగానీ ఆదరించే ఆమ్మానాన్నల కోసం అనాథ పసి బిడ్డలు చాలామంది వేచి ఉన్నారనేది గుర్తుంచుకోవాలి! -
USA: చిన్న పొరపాటుతో మహిళకు జాక్పాట్!
వాషింగ్టన్: జీవితంలో చిన్న పొరపాట్లు చేసి కోట్ల రూపాయల సంపదను పోగొట్టుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అమెరికాలోని వర్జీనియాలో మిరియం లాంగ్ అనే మహిళకు మాత్రం తాను చేసిన చిన్నపొరపాటే భారీగా కలిసి వచ్చింది. ఒకేసారి ఏకంగా 1 మిలియన్ డాలర్(సుమారు 8 కోట్ల రూపాయలు) వర్జీనియా లాటరీ గెలుచుకునేలా చేసింది. మిరియం వర్జీనియాలోని బ్లాక్స్బర్గ్ నగరంలో ఉన్న సౌత్ మెయిన్ స్ట్రీట్లోని సీవీఎస్ స్టోర్కి వెళ్లింది. పనిలో పనిగా స్టోర్లో ఉన్న వర్జీనియా లాటరీ వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లి ఒక బటన్ నొక్కింది. అయితే అది రాంగ్ బటన్. నిజానికి మిరియం మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొనాల్సింది పోయి పొరపాటున వన్ మిలియన్ పవర్ బాల్ ప్రైజ్ టికెట్కు సంబంధించిన బటన్ నొక్కింది. దీంతో ఆమె అనుకున్నది కాకుండా వేరే టికెట్ వచ్చింది. లాటరీ డ్రా తీయగా విచిత్రంగా మిరియంకు పొరపాటున వచ్చిన టికెట్కే వన్ మిలియన్ డాలర్ ప్రైజ్ తగిలింది. ఊహించని విధంగా జాక్పాట్ తగలడంతో మిరియం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ గెలుచుకోవడంపై మిరియం స్పందిస్తూ ‘ఇది నా జీవితంలో చేసిన చాలా మంచి పొరపాటు. ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నందుకు షాక్ తిన్నాను. నా గుండె సంతోషంతో వేగంగా కొట్టుకుంది’అని తెలిపింది. ఇదీ చదవండి.. 19 ఏళ్లకే బిలియనీర్ స్టూడెంట్.. ఆమె ఆస్తి అన్ని కోట్లా..? -
ఐపీఎల్ అంత బోరింగ్గా ఉందా..!? అమ్మడు పనికి నెటిజన్లు షాక్!
బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో తాజా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దర్శమిన్చిన దృశ్యాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లు స్వయంగా స్టేడియంలో కూచుని చూడటమంటే చాలా ఖరీదైన వ్యవహారం. టికెట్లు దొరకడం చాలా గగనం కూడా. అయితే టికెట్ కొనుక్కుని మరీ మ్యాచ్ను చూడటం మానేసిన ఒక అమ్మడు తీరిగ్గా అమెరికన్ పాపులర్ షో చూస్తూ కూచోవడం కెమెరా కంట పడింది. దీంతో ఇది నెట్టింట్ వైరల్గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సందర్బంగా ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీపక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ "ఈ అమ్మాయి ఐపిఎల్ మ్యాచ్లో ‘ఫ్రెండ్స్’ చూస్తోందంటే నమ్మలేకపోతున్నాను" అనే క్యాప్షన్తో ఈ ఫోటోను షేర్ చేశాడు. అంతే ఇది లక్షల వ్యూస్, లైక్స్తో చక్కర్లు కొడుతోంది. ‘‘ఈ సంవత్సరం ఐపీఎల్ అస్సలు ఆసక్తికరంగా లేదు, బోరింగ్గా కనీసం నా సర్కిల్లో కూడా ఆసక్తికరంగా లేదు’’ ఒకరు, ‘‘ఇందులో నమ్మలేకపోవడానికేమీ లేదు.. చిన్న స్వామి స్టేడియం అంతే.. ఆ అమ్మాయిని నిందించి లాభం లేదు’’ అని మరొకరు "మ్యాచ్ తప్పనిసరిగా బోరింగ్గా ఉందేమో బ్రో’’, ‘‘ఆర్సీబీ ఫ్యాన్ అందుకే’’ ఇలా రక రకాల కమెంట్లు చేయడం విశేషం. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ఓటమిని మూట గట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. Can’t believe this girl is watching Friends during an IPL match 😭 pic.twitter.com/fgL14lPGyC — Deepak Kumaar (@immunewolf_) April 2, 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22నప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్ అనగానే లైవ్లో మ్యాచ్ను, అభిమాన ఆటగాళ్లను చూడాలనే ఉత్సాహం, థ్రిల్ కోసం స్టేడియం టిక్కెట్లను కూడా బుక్ చేసుకుంటారు. టికెట్లు దక్కని వారు, స్థోమత లేని క్రికెట్ అభిమానులు టెలివిజన్ స్క్రీన్లకు అతుక్కుపోతారు.అన్నట్టు మ్యాచ్ సందర్బంగా కెమెరా మెన్లు పనితీరును మెచ్చుకోవాల్సిందే. మ్యాచ్లోని అద్భుత క్షణాలను మాత్రమే కాదు, గ్యాలరీలో చోటు చేసుకునే దృశ్యాలను క్యాప్చర్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా అన్నట్టు ఉంటారు. అందమైన అమ్మాయిలు వారి చేష్టలు, సెలబ్రిటీ హావభావాలు, తదితర దృశ్యాలు టీవీల ముందు కూర్చున్నవారికి మంచి కాలక్షేపం. -
సౌదీ అరేబియా స్టాక్ ఎక్స్ఛేంజ్ హెడ్గా సారా! ఎవరీమె.?
సౌదీ అరేబియాలో మహిళల పట్ల ఎలాంటి ఆంక్షలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చోట ఇటీవల పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకు కారణం ఆ దేశ ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ అని చెప్పొచ్చు. ఇటీవల ఆయన హాయాంలోనే సంచలన నిర్ణయాలు ఎక్కువుగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సౌదీ దేశ చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. వాటన్నింటకంటే మునుపే ఓ మహిళ సౌదీ అతి పెద్ద స్థాక్ మార్కెట్కి చైర్మన్ అయ్యి సంచలనానికి తెరతీసింది. ఏకంగా యావత్తు ప్రపంచం ఆమె విజయాన్ని చూసి విస్తుపోయింది. ఇంతకీ ఎవరీమె అంటే.. 44 ఏళ్ల సారా అల్-సుహైమి సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్గా అత్యున్నత పదవిని అలంకరించిన తొలి సౌదీ మహిళగా చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఆర్థిక ప్రపంచంలో రికార్డు సృష్టించింది. ఆమెను చూస్తే.. సౌదీ కార్యాలయాల్లో మహిళల పాత్రలు దినదినాభివృద్ధి చెందుతున్నాయోమో! అనిపిస్తుంది. ఇక ఆమె ఎడ్యుకేషన్ పరంగా..సౌద్ విశ్వవిద్యాలయంలో అకౌంటింగ్ ప్రోగ్రామ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. ఆమె బ్యాంకింగ్ కుటుంబానికి చెందినది. ఎందుకంటే ఆమె తండ్రి జమ్మాజ్ అల్ సుహైమి గల్ఫ్ బ్యాంక్, సౌదీ అరేబియా క్యాపిటల్ మార్కెట్స్ అథారిటీలో ఉన్నత పదవులును అలంకరించారు. ఇక సారా కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడిచింది. అత్యున్నత మార్కులతో గ్రాడ్యుయేఏషన్ పూర్తి చేసి అద్భతమైన కెరీర్కు మార్గం సుగమం చేసుకుంది. సారా తొలుత ఎన్సీబీ క్యాపిటల్ చీప్ ఎగ్జిక్యూటివ్గా అయ్యినప్పుడే ఆమె కెరీర్ అంచెలంచెలుగా పెరగడం ప్రారంభించింది. ఇది సౌదీ అరేబియాలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా ఏర్పడటానికి సాంబాతో విలీనమయ్యింది. ఇక ప్రస్తుతం సారా సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్కే చైర్మన్ అయిన తొలి మహిళగా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఆమె విజయం ఒక్క సౌదీలోనే గాదు యావత్తు ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. అంతేగాదు ఆమె ఎన్సీబీ క్యాపిటల్ ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్లో కీలక పాత్ర పోషించింది. వినూత్న పెట్టుబడి వ్యూహాలను పరిచయం చేసింది. దీంతో అత్యధిక మంది క్లయింట్ల ఆకర్షించేలా మంచి ఫలితాలను అందుకుంది. అంతేగాదు సారా ఫోర్బ్స్ మ్యాగజైన్లో ప్రపంచంలోని అత్యుత్తమ మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. On the occasion of #InternationalWomensDay, Sarah al-Suhaimi, the Arab world’s first female stock exchange head, rang the opening bell of Tadawul, the largest financial market in the region.https://t.co/fo6MckbJ2M pic.twitter.com/s22FYn8ZZe — Al Arabiya English (@AlArabiya_Eng) March 8, 2019 (చదవండి: యూఎస్లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా 75 వేల కోట్లు..!) -
ఎంపీగా గెలిస్తే ఫారెన్ లిక్కర్ ఇస్తా: మహిళా అభ్యర్థి వినూత్న ప్రచారం
చంద్రాపూర్: ఈ లోక్సభ ఎన్నికల్లో తాను గెలిస్తే పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి చెబుతున్నారు. ఈ విచిత్ర హామీ ఇస్తున్న అభ్యర్థి పేరు వనితా రౌత్. బీరు, విస్కీలను సబ్సిడీ ధరలకు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది వనితా రౌత్. అయితే ఈ స్కీమ్ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్ ఉండాల్సిందేనన్న కండీషన్ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడమని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్ వారికి అవసరమని సమర్థించుకుంటోంది. పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది. వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్సభ ఎన్నికల్లో నాగ్పూర్ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్ను ఎన్నికల కమిషన్ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం. ఇదీ చదవండి.. మోదీ హామీలు చైనా వస్తువుల లాంటివి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
IPL 2024: ముగిసిన లీగ్ మ్యాచ్లు.. ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు ఇవే
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
కమల్హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (19-05-2024)
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement