ఉద్యోగుల ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
నెహ్రూనగర్: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల స్థితిగతుల్లో సమూల మార్పులు వచ్చినట్లు ఏసీ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోలే ముత్యం, రెడ్డి కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కంజుల సత్యనారాయణ రెడ్డి, వైఎసార్ సీపీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంపాలెంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగుల ప్రయోజనాలకు కట్టుబడిన దాఖలాలు లేవని వారు స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడడమే కాకుండా సమర్థులైన ఉద్యోగులకు సరైన గుర్తింపు, సముచిత గౌరవం కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటారని పేర్కొన్నారు.
పోలైన 5076పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గుంటూరు వెస్ట్: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో బుధవారం జిల్లావ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, జర్నలిస్టులు, అత్యవసర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓటింగ్ మొత్తం ప్రశాంతంగా జరిగింది. ఈక్రమంలో తాడికొండలో 462, మంగళగిరిలో 1088, పొన్నూరు 426, తెనాలి 442, ప్రత్తిపాడు 394, గుంటూరు పశ్చిమ 1595, గుంటూరు తూర్పు 669.. మొత్తం 5076 ఓట్లు పోలయ్యాయి. యార్డులో 70,776
బస్తాల మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 57,850 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 70,776 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ. 18,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 42,624 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు.
పాస్టర్లకు డిగ్రీ పట్టాలుఅందజేత గుంటూరు మెడికల్: కౌన్సిల్ ఆఫ్ రీఫార్మ్డ్ చర్చెస్ ఆఫ్ ఇండియా, వైజాగ్ వారు మంగళవారం స్థానిక గాంధీనగర్ పవర్ గాస్పల్ మినిస్ట్రీస్లో రెవ.పి.వరప్రసాద్ ఆధ్వర్యంలో దైవసేవకులకు పట్టాలు అందజేశారు. వేదాంత విద్యలో భాగంగా సర్టిఫికెట్స్, వివాహ పట్టాలు 20 మంది పాస్టర్లకు అందజేశారు. ఆర్చ్ బిషప్ జి.విజయరాజు, బిషప్స్ నతానియేలు, దేశిరాజు, పాస్టర్లు, ఇవాంజిలిస్టులు, బైబిల్ ఉమెన్స్, స్థానిక సంఘ విశ్వాసులు, తదితరులు పాల్గొన్నారు. పట్టాల అందజేత అనంతరం అభిషక్తులకు సన్మానం చేశారు.
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై టీడీపీ దుష్ప్రచారం కొరిటెపాడు(గుంటూరు): టీడీపీ నేత చంద్రబాబునాయుడుకు ఓటమి భయం పట్టుకుందని గిరిజన ప్రజా సమాఖ్య(జీపీఎస్) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్నాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో మన భూములకు మరింత రక్షణ ఉంటుందన్నారు. భావితరాలకు వివాద రహిత భూమిని అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకై క లక్ష్యమని స్పష్టం చేశారు.