34 నామినేషన్ల దాఖలు | Sakshi
Sakshi News home page

34 నామినేషన్ల దాఖలు

Published Tue, Apr 23 2024 8:40 AM

- - Sakshi

అనంతపురం అర్బన్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. నాల్గో రోజు సోమవారం పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు 34 నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి ఆరు సెట్ల నామినేషన్లు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు 28 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ వద్ద అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకరనారాయణ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, నాయకులు వెన్నపూస రవీంద్రారెడ్డి, రాజారామ్‌, పెన్నోబులేసు ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయగా.. రెండో సెట్‌ను వైఎస్సార్‌సీపీ నాయకుడు పామిడి వీరాంజినేయులు దాఖలు చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా జి.లక్ష్మీనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. అదే విధంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాలగుండ్ల రవీంద్ర, జాతీయ చేనేత వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా ఉమ్మడిశెట్టి చిన్న వెంకట సుబ్బయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా జి.వి.రమణారెడ్డి, వడ్ల కేశవయ్య నామినేషన్లు దాఖలు చేశారు.

Advertisement
Advertisement