Top Stories
ప్రధాన వార్తలు
టీడీపీ వీడియో ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.కాగా, పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.13వ తేదీన కేసు ఎందుకు పెట్టలేదు?..వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. కారంపూడిలో విధ్వంసకాడ జరిగితే చూస్తూ ఊరుకుంటారా?’ అని ప్రశ్నలు సంధించారు.పోలింగ్ ఆగిందా?..టీడీపీ వారు కర్రలు, రాళ్లతో స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోలేదు. గొడవలను ఆపటానికి ప్రయత్నించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పోలింగ్ స్టేషన్ 202లో ఒక గంటసేపయినా పోలింగ్ ఆగిందా?. నిజంగానే ఎమ్మెల్యేనే ధ్వంసం చేస్తే అధికారులు వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కనీసం టీడీపీ ఏజెంట్లు అయినా ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. సిట్ అధికారులకైనా ఎమ్మెల్యేపై ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. కానీ లోకేష్ మాత్రం ఎమ్మెల్యే ఒక వీడియోను రిలీజ్ చేయగానే ఈసీ వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయమని ఆదేశించింది. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసింది.ఈసీపై సెటైర్లు..కేంద్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలకు దిగటం దారుణం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారు. దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారు. వాస్తవాలు ఏంటనేది మాత్రం ఇద్దరూ పట్టించుకోవటం లేదు. సీఐ నారాయణ స్వామి చౌదరికి గాయమైతే మొత్తం టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు ఫీలయ్యారు. ఘటన జరిగితే పది రోజులపాటు కేసు కూడా నమోదు చేయకపోవటం ఏంటి?. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రెంటచింతల మండలంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బయటకు రాకుండా చేయాలని, కారంపూడి మండలంలో టీడీపీకి సహకరించేలా సీఐ నారాయణ చౌదరిని నియమించారు. ఆ సీఐ అత్యంత వివాదాస్పదుడు. గతంలో సస్పెండ్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని సీఐగా ఎలా పంపించారు?. పదకొండు రోజుల తర్వాత పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారు. సిట్ బృందానికి కూడా ఈ కేసుల గురించి చెప్పలేదు. పిన్నెల్లి హత్యకు టీడీపీ తీవ్రంగా పని చేస్తోంది. ఈ కుట్రకు సహకరిస్తున్న ప్రతీ పోలీసు అధికారి కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. పల్నాడులో పోలీసు ఐజీ నాయకత్వంలోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. ఎల్లో మీడియాలో వార్తలు రాయగానే పోలీసులు, ఎన్నికల సంఘం చర్యలకు దిగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
May 26th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 26th AP Elections 2024 News Political Updates..1:45 PM, May 26th, 2024పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలుపోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ను చెల్లని ఓటుగా పరిగణించవద్దు. ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయి. ఫాం 13పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. ఆర్వో సంతకం, బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టర్తో చూసుకోవాలి. ఆర్వో సంతకం, సీరియల్ నెంబర్లేని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణ. నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకుంటే తిరస్కరిస్తాం. 12:50 PM, May 26th, 2024టీడీపీ వీడియో ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నానిఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. 12:15 PM, May 26th, 2024ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించింది: మంత్రి కాకాణినెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్..ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించింది..పోలీస్ అధికారులను ఉద్దేశ్యపూరీతంగా బదిలీ చేసింది..కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టారు.. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న చోట కేడర్ను భయబ్రాంతులకు గురి చేశారు..మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది..ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మా అభిప్రాయం..నెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ బూతుల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదు..ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైంది..ఎన్నికల నిధులు దుర్వినియోగం, వైఫల్యంపై జిల్లా రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకి డబ్బులు పంచితే.. దాని మీద ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు..మానవతా దృక్పధంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదం..ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తాను..జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పని చేశారు..జిల్లా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం మాకు లేదు..కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్ను నియమించాలని కోరుతున్నాం.. 11:40 AM, May 26th, 2024దెందులూరులో సంక్షేమానికే ప్రజల మద్దతు..దౌర్జాన్యాలతో, అరాచకాలతో చెలరేగిపోయిన చింతమనేని ప్రభాకర్2019 ఎన్నికల్లోనే చింతమనేనికి బుద్ధి చెప్పిన దెందులూరు నియోజకవర్గ ప్రజలు.దళితులను, అధికారులను తిట్టడం, కొట్టడంతో పేరుపొందిన చింతమనేని. ఈసారి కూడా చింతమనేనికి తమ పవరేంట్ చూపామంటున్న ప్రజలు. ప్రజలతో మమేకమై పనులు చేయించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి 11:00 AM, May 26th, 2024విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏయూలో ఏర్పాట్లుఓట్ల లెక్కింపునకు 14 గంటలు పట్టే అవకాశం.ఉదయం 8 గంటల నుంచి లెక్కింపుతొలి రౌండ్ ఫలితాలు 9 గంటల నుంచి వెల్లడించే అవకాశంవిశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం కలిపి 98 లోక్ సభ పరిధిలోని ఏది నియోజకవర్గాలు కలిపి 98 చొప్పున టేబుల్స్ ఏర్పాటుభీమిలి అసెంబ్లీకి 26 రౌండ్లతో రాత్రి 7:30 కు ఫలితం వచ్చే అవకాశంవిశాఖ తూర్పు 21 రౌండ్లలో సాయంత్రం ఐదు గంటలకువిశాఖ సౌత్ లో 17 రౌండ్లకు మధ్యాహ్నం మూడున్నరకువిశాఖ నార్త్ లో 22లకు సాయంత్రం ఐదు గంటలకువిశాఖ వెస్ట్ 16 రౌండ్లకు మధ్యాహ్నం 3:15 కుగాజువాకలో 22 రౌండ్లకు సాయంత్రం 5:45 గంటలకుపెందుర్తిలో 21 రౌండ్లకు సాయంత్రం 5:30 గంటలకుఎస్ కోట లో 19 రౌండ్లకు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఫలితాలు వెల్లడివిశాఖ జిల్లాలో మొత్తం ఓటర్లు 2012373ఓట్లు వినియోగించుకున్న ఓటర్లు 1409316పోస్టల్ బ్యాలెట్ 23,981విశాఖ లోక్సభ పరిధిలో 1962 పోలింగ్ కేంద్రాలు 14 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ 10:30 AM, May 26th, 2024విజయం వైఎస్సార్సీపీదే..పోలింగ్ ఫలితాలపై లెక్కలువేసుకుంటున్న ప్రధాన పార్టీలుతమ స్థానాలు ‘పది’లమంటున్న వైఎస్సార్సీపీపరువు నిలుపుకుంటామంటున్న టీడీపీజనసేన, బీజేపీ స్థానాల్లో గెలుపు అసాధ్యమేఓటు బదిలీ కాలేదంటున్న రాజకీయ పరిశీలకులువైఎస్సార్సీపీ ఖాతాలోకే కడప,రాజంపేట పార్లమెంటు స్థానాలు 9:50 AM, May 26th, 2024బరితెగించిన టీడీపీ నాయకులు..పచ్చ బ్యాచ్ను వెంటాడుతున్న ఓటమి భయం..ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలుఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన @JaiTDP నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు.#TDPLosing#TDPGoons pic.twitter.com/BzBkJBOkT1— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 8:40 AM, May 26th, 2024పచ్చముఠా పైశాచికత్వం..కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వంవైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులుతిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరికప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమైందిరాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా టీడీపీ చంద్రబాబు కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వంవైయస్ఆర్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులు తిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమై.. రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా…— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 7:50 AM, May 26th, 2024దాడుల సంస్కృతి నాది కాదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్..దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదుపులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదు పులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు… pic.twitter.com/YMmEAgkK8s— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 7:10 AM, May 26th, 2024ఓట్ల లెక్కింపు ఇలాజూన్ 4న ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభంతొలుత పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు సువిధ యాప్లో నమోదు చేసిన తర్వాతే ఫలితాల వెల్లడి 7:00 AM, May 26th, 2024కౌంటింగ్ ఏజెంట్లే కీలకంఫారం–18 సమర్పించడం ద్వారా ఏజెంట్ల నియామకంఓట్ల లెక్కింపులో ఫారం–17సీ ఎంతో ముఖ్యంనిబంధనలు తెలియకుంటే అయోమయమే 6:50 AM, May 26th, 2024పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ గూండాల స్వైర విహారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓట్లేయనీయకుండా దాడులు వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే కారణంతో విధ్వంసాలు పల్నాడులో పచ్చ మూకల దాడులపై వీడియోలు తీసిన ప్రజలుఒక్కొక్కటిగా బయటపడుతున్న టీడీపీ హింసాత్మక చర్యలు దుకాణాలపై రాళ్లు, బైక్ల ధ్వంసాలు, దహనాలు, లూటీలు.. పట్టపగలు విధ్వంసకాండను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న జనం టీడీపీ దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసులున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహారం చిన్న చిన్న సాకులతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం జులుం వెంటాడి కేసుల నమోదు.. భయభ్రాంతులకు గురిచేస్తూ దండనలుఇంకోవైపు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఈసీ బడుగు, బలహీన వర్గాల బాధితుల వేదన అరణ్య రోదనగా మారిన వైనం 6:40 AM, May 26th, 2024క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావాజనసేన కార్పొరేటర్ పీతల మూర్తికి సీఎస్ జవహర్రెడ్డి హెచ్చరికవిశాఖలో అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదుచట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరిక 6:30 AM, May 26th, 202421 లోక్సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలేఆ స్థానాల్లో పురుషుల కన్నా ఎక్కువగా నమోదైన మహిళల ఓట్లు కాకినాడ, అనంతపురం తప్ప మిగతా స్థానాల్లో భారీ వ్యత్యాసం మహిళల ఓట్లు వైఎస్సార్సీపీకే అంటున్న రాజకీయ విశ్లేషకులు
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!
రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్ ట్యాంక్ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తున్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు, ఆయన అనుచరులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్ బాబు తదితరులు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు.
కాంగ్రెస్కు రుణమాఫీ చేసే తెలివిలేదు: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందని వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్ ఆదివారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సన్నబియ్యం కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగింది. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటేనే స్కాములు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉంది. రైతులు పడిగాపులు కాస్తున్న, ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది కాంగ్రెస్. ధాన్యం కుంభకోణంలో సుమారు రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. ఇవన్నీ ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ముడుపులుగా వెళ్ళాయి.అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణంతో దోపిడీ చేశారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్తో జరిగింది. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇందులో వందల కోట్ల రూపాయలు ముడుపులు అందాయా లేదా ఎంక్వైరీ వేయాలి. పాడిలో మొదటి స్కాం, పాఠశాలల్లో సన్నబియ్యం విషయంలో రెండో స్కామ్. రెండిట్లో దాదాపు రూ.1100 కోట్లు స్కాం జరిగింది.నాలుగు సంస్థలకే టెండర్లు..బహిరంగ మార్కెట్లలో సన్నబియ్యం ధర 42 నుండి 45 వరకు ఉంది. దానిని పక్కకు పెట్టీ 56.90 పైసలతో కొంటున్నారు. కేవలం నాలుగు సంస్థలకు మాత్రమే టెండర్లు ఎందుకు?. సివిల్ సప్లై, ఎఫ్సీఐ ఉన్నప్పటికీ వాటిని ఎందుకు పట్టించుకోరు?. కాంట్రాక్టు సంస్థలతో కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయ్యారు. బహిరంగ మార్కెట్లలో తక్కువ ధరకు సన్నబియ్యం వస్తుంటే ఇంత ధరలు ఎందుకు ఖరారు చేశారు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తోంది. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ప్రభుత్వానికి రూ.2లక్షలు రుణమాఫీ చేసే తెలివి లేదు. బీజేపీపై అనుమానాలు..ధాన్యం కొనుగోలు, కాంట్రాక్టు, ఎంఎస్పీ అంత నిర్వహించేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ బీజేపీ నాయకుడు గొంతు చించుకుంటున్నా కేంద్రంలో ఉన్న FCI నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ విషయంలో FCI వెంటనే ఈడీకి ఫిర్యాదు చేయాలి. మీ బీజేపీ ఎంఎల్ఏ చెప్తున్న దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఈడీ విచారణ చేయాలి. FCI స్పందించకపోతే బీజేపీపైన కూడా అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ప్రభుత్వం అనేక కుంభకోణాలు అంటూ ఆరోపణలు చేశాడు. ఇప్పుడెందుకు రేవంత్ రెడ్డి స్పందించటం లేదు. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలి. లేదంటే మేమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. విచారణ సంస్థలను కూడా కలుస్తాం అని వ్యాఖ్యలు చేశారు.
Maldives: ‘భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోంది’
మాలె: మాల్దీవులుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) చేసుకోవడానికి భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ మంత్రి మహ్మద్ సయీద్ అన్నారు. అయితే దానికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మాలెలో ఆర్థిక, వాణిజ్య అభివృద్ధి శాఖ మంత్రి మహ్మద్ సయీద్ మీడియాతో మాట్లాడారు.‘‘దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(SAFTA)తో పాటు మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్ కోరుకుంటోంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం చేసుకోవడానికి అన్ని దేశాలకు అవకాశం కల్పించారు. వాణిజ్య కార్యకలాపాలను మరింత సులభతరం చేయటంలో భాగంగా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది’’ అని మహ్మద్ సయీద్ అన్నారు.ఇక.. గతేడాది భారత ప్రధాని మోదీ లక్ష్యదీప్ పర్యటన సందర్భంగా దీగిన ఫొటోలు, వీడియోలపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బ తిన్నాయి. అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చైనా అనుకూలుడనే పేరు ఉండటం. అదే విధంగా మాల్దీవుల్లో ఉన్న భారత్ బలగాలను వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించటం వంటి వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.అయినప్పటికీ భారత్ మాల్దీవుల విజ్ఞప్తి మేరకు బడ్జెట్లో 50 మిలియన్ డాలర్ల అర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. 1981లో ఇండియా-మాల్దీవుల మధ్య అత్యవసర సరుకుల ఎగుమతుల కోసం వాణిజ్య ఒప్పందం కుదిరింది. 2021లో మొదటిసారి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 300 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత సంవత్సరాల్లో అదికాస్త ఇంకా పెరుగుతూ 500 మిలియన్ డాలర్లు చేరుకుంది.
ఓట్ల లెక్కింపు ఇలా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజేషన్ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతోపాటు 200 మంది రిటరి్నంగ్ ఆఫీసర్లను నియమించారు. ఈవీఎంల తరలింపు మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపర్చారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలుపెట్టడం మొదలు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్ నంబర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్ టేబుళ్లపైకి చేరుస్తారు. కౌటింగ్ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్ యూనిట్ మాత్రమే తీసుకువస్తారు. ఓటు వేసిన ఈవీఎం మెషీన్తో అవసరం లేదు. కౌంటింగ్ హాల్లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్కు సంబంధించిన కంట్రోల్ యూనిట్ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్ అన్నది లెక్కించి.. దాని ప్రకారం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా.. లేదా.. అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్గా మూడు వీవీప్యాట్లు ఎంపిక చేసి మూడింటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న (క్లోజ్ రిజల్ట్ క్లియర్–సీఆర్సీ) ఓటింగ్ యంత్రాలతో పాటు మాక్ పోలింగ్ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజార్టీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతీ రౌండ్ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.
Sister Death Review: అక్కడ పేరు కనిపిస్తే మరణమే!
టైటిల్: సిస్టర్ డెత్నటీనటులు: అరియా బెడ్మర్, మరు వల్దీవిల్సో, లూయిసా మెరెలస్, చెలో వివరెస్, సారా రోచ్, అల్ముడెనా ఆమొర్ తదితరులుదర్శకుడు: పాసో ప్లాజాజానర్: హారర్ఓటీటీ ప్లాట్ఫామ్: నెట్ఫ్లిక్స్నిడివి: 1 గంట 30 నిమిషాలుహారర్ సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరు! కొన్ని పేరుకే హారర్ మూవీస్ అంటారు కానీ అందులో భయపడేంత సీన్ ఏం ఉండదు. ఇక్కడ చెప్పుకునే సిస్టర్ డెత్ మూవీలో మాత్రం మొదట్లో దెయ్యాన్ని చూపించకుండా భయపెట్టేందుకు ప్రయత్నించారు. మరి అందులో సక్సెస్ అయ్యారా? అసలు ఈ సినిమా కథేంటి? ఎలా ఉందనేది రివ్యూలో మాట్లాడుకుందాం..కథసిస్టర్ నార్సిసా.. కాన్వెంట్ స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న నన్స్కు ఈమె పెద్దగా నచ్చదు. అది పట్టించుకోని నార్సిసా తన పని తాను చేసుకుపోతోంది. తన గదిలో ఏదో ఆత్మ ఉందని అర్థమవుతుంది. మరోవైపు స్కూల్లో బోర్డ్ మీద తనను తాను పరిచయం చేసుకుంటూ పేరు రాస్తుంది. అది చూసి అక్కడున్నవాళ్లు షాక్ అవుతారు. కారణం.. దెయ్యం ఆ బోర్డుపై ఎవరి పేరు రాస్తే వారి జీవితం అంతమైపోతుంది. అలా ఓసారి ఒక విద్యార్థి పేరు బోర్డు మీద ప్రత్యక్షమవుతుంది. నీకేం కానివ్వను అని హామీ ఇచ్చిన నార్సిసా ఆ బాలిక ప్రాణాలు కాపాడలేకపోతుంది. బాలిక చావుకు నువ్వే కారణమంటూ అక్కడి నన్స్ నార్సిసాను వెళ్లిపోమంటారు. పెట్టేబేడా సర్దుకుని బయటకు వెళ్లిపోయే క్రమంలో నన్స్ దాచిన రహస్యాన్ని ఆమె తెలుసుకుంటుంది. అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దెయ్యానికి హీరోయిన్ సాయం చేస్తుంది. అందుకు కారణమేంటి? తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!విశ్లేషణనన్ను దెయ్యంగా చూపిస్తూ బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే! కానీ ఇందులో ఆ నన్ దెయ్యంగా ఎలా మారిందని చూపించారు. కొన్ని సంఘటనలు కలలా? నిజంగా జరుగుతున్నాయా? అనేవి అర్థం కావు. రియల్ సన్నివేశాల కంటే ఆ కలలే కాస్త భయంకరంగా ఉంటాయి. దెయ్యం తన గతానికి ముడిపడి ఉన్నవారిని చంపడం ఓకే కానీ ఏ సంబంధమూ లేని చిన్నారిని బలి తీసుకోవడం మింగుడుపడదు. చాలా సింపుల్గా కథను ముందుకు తీసుకెళ్లారు. దర్శకుడు వికృత ఆకారాలతో దెయ్యాన్ని చూపించి భయపెట్టాలనుకోలేదు. పెద్దగా ట్విస్టులు కూడా ఉండవు. రాసుకున్న కథ మాత్రం బాగుంది. చివర్లో జరిగేది ప్రేక్షకుడు ముందే పసిగట్టేలా ఉండటం మైనస్. నార్సిసా పాత్రలో స్పానిష్ హీరోయిన్ అరియా బెడ్మర్ చాలా బాగా నటించింది. మిగతా వారు కూడా తమ పాత్రల పరిధి మేర నటించారు. యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. పీరియాడిక్ ఫిలిం కావడంతో సినిమా ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్లోనే సాగుతుంది.సినిమాను ఒకటిన్నర గంటలో పూర్తి చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సినిమా ఎండింగ్లో ఇది వెరోనికా(2017) చిత్రానికి ప్రీక్వెల్ అని అర్థమవుతుంది. మీరు హారర్ సినిమా అభిమానులైతే వెంటనే చూసేయండి.. కాకపోతే ఈ స్పానిష్ సినిమాకు తెలుగు డబ్ వర్షన్ లేదు. హిందీ, ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది.
రాజ్కోట్ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజ్కోట్: గుజరాత్లోని రాజ్కోట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాజ్కోట్లోని గేమ్జోన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తాజాగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా, శనివారం సాయంత్రం రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వచ్చారు. వారంతా ఆటల్లో నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వారని చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో గేమ్ జోన్ పైకప్పు కూలిపోవడంతో లోపల ఉన్న వారంతా బయటకు రాలేకపోయారు. ఈ క్రమంలో వారంతో మంటల్లో సజీవదహనమయ్యారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టం మారిందని అధికారులు వెల్లడించారు. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ కొందరు బాధితులు మృతిచెందారు. దీంతో, మృతిచెందిన వారి సంఖ్య 33కి చేరుకుంది. #WATCH | Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi took stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/ks1YhRszH2— ANI (@ANI) May 26, 2024మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో గేమ్ జోన్ వద్దకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వచ్చి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిలో టీఆర్పీ గేమ్జోన్ యజమాని యువ్రాజ్ సింగ్ సోలంకితోపాటు దాని మేనేజర్ నితిన్ జైన్ కూడా ఉన్నారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సిట్ను నియమించింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేతృత్వంలో సిట్ను నియమించగా.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.🚨 SHOCKING! At least 26 people, including at least 12 children, were killed in a massive fire that broke out at a game zone in Rajkot, Gujarat. pic.twitter.com/nN21BAP1WF— Indian Tech & Infra (@IndianTechGuide) May 26, 2024
IPL 2024: రైజర్స్ VS రైడర్స్
గత మూడు సీజన్లలో ఎనిమిది, ఎనిమిది, పదో స్థానం... సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. గత రెండు సీజన్లలో కోల్కతా నైట్రైడర్స్ ఏడో స్థానానికి పరిమితం. ఐపీఎల్ ఈ ఏడాది ఆరంభానికి ముందుకు ఇరు జట్ల రికార్డు చూస్తే ఈ రెండు టీమ్లు ఫైనల్ చేరతాయని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ప్రదర్శనలతో రైజర్స్, రైడర్స్ అంచనాలు తిరగరాశాయి. అదరగొట్టే బ్యాటింగ్, రికార్డు ప్రదర్శనలతో హైదరాబాద్ ప్రస్థానం సాగితే... అన్ని రంగాల్లో చెలరేగి కోల్కతా అగ్రస్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అన్ని అవరోధాలను దాటిన తర్వాత ఇప్పుడు అసలైన అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. పదేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన కోల్కతా తమ మూడో టైటిల్పై గురి పెడితే... ఎనిమిదేళ్ల క్రితం చాంపియన్గా నిలిచిన హైదరాబాద్ రెండో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో చెపాక్ మైదానంలో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం. చెన్నై: ఐపీఎల్–17లో రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన సమరాల తర్వాత టోర్నీ విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. లీగ్ మాజీ చాంపియన్లు మరో ట్రోఫీ వేటలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ తలపడతాయి. తొలి క్వాలిఫయర్లో సన్రైజర్స్నే ఓడించి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించిన కోల్కతా దానిని పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరో వైపు గత మ్యాచ్తో పాటు అంతకు ముందు లీగ్ దశలో కూడా కేకేఆర్ చేతిలో ఓడిన హైదరాబాద్ ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో క్వాలిఫయర్–2లో రాజస్తాన్ను ఓడించడంతో రైజర్స్ టీమ్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మార్పులు చేస్తారా! ఫైనల్ కోసం హైదరాబాద్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్–3లో హెడ్, అభిõÙక్, త్రిపాఠి ఖాయం. గత మూడు మ్యాచ్లుగా భారీ స్కోరు బాకీ ఉన్న హెడ్ ఫైనల్లో చెలరేగితే నిలువరించడం కష్టం. అదే విధంగా అభిõÙక్ కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్లలో దూకుడైన బ్యాటింగ్తో తానేంటో త్రిపాఠి నిరూపించుకున్నాడు. ఎప్పటిలాగే భారీ షాట్లతో క్లాసెన్ మిడిలార్డర్లో ఉన్నాడు. అయితే ఇద్దరు దేశవాళీ బ్యాటర్లు నితీశ్ రెడ్డి, సమద్లు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో రైజర్స్ మేనేజ్మెంట్లో గందరగోళం కొనసాగుతోంది. మార్క్రమ్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండగా, లీగ్లో ఒక్క మ్యాచ్ కూడా ఫిలిప్స్ను తీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్ను బట్టి క్వాలిఫయర్లో షహబాజ్ను అనూహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్గా చేసుకొచ్చి టీమ్ మంచి ఫలితం సాధించింది. అయితే ఈ పిచ్ను స్పిన్కు అంతగా అనుకూలించేది కాకపోవడంతో పాటు ప్రత్యర్థి టీమ్లో నలుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉన్నారు. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ పేస్ బౌలింగ్లో తమ బాధ్యత నిర్వర్తించగలరు. మార్పుల్లేకుండా... కోల్కతా మాత్రం ఎలాంటి సందేహం లేకుండా క్వాలిఫయర్–1 ఆడిన టీమ్నే కొనసాగించనుంది. మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అందరూ ఫామ్లో ఉండటం సానుకూలాంశం. ఓపెనర్లుగా నరైన్, గుర్బాజ్ సత్తా చాటగలరు. ఆ తర్వాత వరుసగా వెంకటేశ్, శ్రేయస్, రాణా జట్టు భారం మోస్తారు. చివర్లో రింకూ, రసెల్ విధ్వంసం సృష్టించగల సమర్థులు. కేకేఆర్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. స్టార్క్ ఫామ్లో ఉంటే ఏం జరుగుతుంతో గత మ్యాచ్లో హైదరాబాద్కు అర్థమైంది. హర్షిత్, అరోరాలాంటి యువ పేసర్లు కూడా రాణిస్తుండగా... స్పిన్నర్ వరుణ్ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. తుది జట్ల వివరాలు (అంచనా) సన్రైజర్స్: కమిన్స్ (కెపె్టన్), హెడ్, అభిõÙక్, త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, షహబాజ్/ మర్కండే. నైట్రైడర్స్: శ్రేయస్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్, రింకూ, రసెల్, రమణ్దీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్, వైభవ్. పిచ్, వాతావరణం రెండో క్వాలిఫయర్ మ్యాచ్ నల్లరేగడి మట్టితో కూడిన పిచ్పై జరిగి స్పిన్కు బాగా అనుకూలిస్తుంది. కానీ ఫైనల్ను ఎర్రమట్టితో కూడిన మరో పిచ్ను నిర్వహిస్తున్నారు. దాంతో బ్యాటింగ్కు అనుకూలించి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. శనివారం సాయంత్రం వర్షం కురిసినా...మ్యాచ్ రోజు చిరు జల్లులకు మాత్రమే అవకాశం ఉంది. ఏదైనా ఇబ్బంది ఎదురైనా రిజర్వ్ డే ఉంది.
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ విపత్తు ఆస్పత్రి!ఎక్కడంటే..
ఆస్పత్రిని అప్పటికప్పుడూ సెట్ వేసినట్లుగా సెటప్ చేసే పోర్టబుల్ ఆస్పత్రి గురించి విన్నారా. పైగా ఈ ఆస్పత్రి సాయంతో దాదాపు 200 మంది రోగులకి ఒకేసారి వైద్యం అందించొచ్చట కూడా. ఇంతకీ ఏ దేశం ఈ ఆస్పత్రి మోడల్ని తీసుకొచ్చిందంటే..భారతదేశం ప్రపంచంలోనే తొలి విపత్తు ఆస్పత్రిని ప్రవేశపెట్టింది. దీనిని ఎయిర్లిఫ్ట్ చేసి సుమారు 72 క్యూబ్లు ప్యాక్ చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ను 'ఆరోగ్య మైఔత్రి క్యూబ్' అని పిలుస్తారు. భీష్మ(భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి ప్రాజెక్ట్)లో భాగంగా ఈ సరికొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఈ క్యూబ్లలో ఆపరేషన్ థియేటర్, మినీ ఐసీయలు, వెంటిలేటర్లు, రక్త పరీక్షపరికరాలు, ఎక్స్రే యంత్రం, వంట స్టేషన్, ఆహారం, నీరు, షెల్టర్ పవర్ జనరేటర్ వంటి అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రత్యేక కేజ్లో దాదాపు వందమంది రెండు రోజుల పాటు జీవించేందుకు అవసరమైన సామాగ్రితో నింపిన 36 మినీ క్యూబ్లను చూడవచ్చు. వీటిలో రెండు మెయిన్ కేజ్లు ఉంటాయి.వాటిని మాస్టర్ క్యూబ్స్ అని పిలుస్తారు. వీటిల్లో దాదాపు 200 మంది ప్రాణాలను రక్షిచవచ్చు. ఈ మినీ ఫోర్టబుల్ ఆస్పత్రి 40 బుల్లెట్ గాయాలు, 25 పెద్ద రక్తస్రావం, 25 పెద్ద కాలిన గాయాలు, సుమారు 10 హెడ్ ఇంజూరీస్, వెన్నెముక గాయాలు, ఛాతీ గాయాలు, వెన్నుముకకి అయ్యే పగళ్లు గాయాలు వంటి వివిధ రకాల తీవ్రమైన గాయాలను నిర్వహించగల సామర్థ్యం గలది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్ట్ బీష్మలో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ని గత జనవరిలో జరిగిన గ్లోబల్ సదస్సులో ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన వైద్య సామాగ్రిని అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు.ఆగస్టులో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన మెడ్టెక్ ఎక్స్పోలో జరిగిన జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ఈ ప్రాజెక్టు అధికారిక ప్రారంభం జరిగింది. అంతేగాదు ఈ ప్రాజెక్టును మొదటగా మయన్మార్ అధికారులకు చూపించారు. ఇక ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆరోగ్య, రక్షణ మంత్రిత్వ శాఖలకు ఈ ఆలోచనను అందించారు. ఆయన సూచనల కారణంగా ఆయుర్వేద ఉత్పత్తులకు క్యూబ్స్లోని వస్తువులు జాబితాలో జోడించామని అధికారులు తెలిపారు. భారతదేశం మయన్మార్కు రెండు ఆరోగ్య మైత్రి క్యూబ్లను విరాళంగా అందించింది ఒక శ్రీలంకకు కూడా ఒకటి విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.(చదవండి: మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్తో పనిలేదు..!)
తప్పక చదవండి
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
సినిమా
మగాడిలా మారిపోవాలని ఉంది.. త్రిష
కోరికలే గుర్రాలైతే ఎలా ఉంటుంది? కుడి ఎడమైతే ఎలా ఉంటుంది? చాలా తమాషాగా ఉంటుంది కదూ. చైన్నె బ్యూటీ త్రిష కోరిక కూడా అలాంటి విచిత్రమైనదే. నటిగా రెండు దశాబ్దాల అనుభవం. మధ్యలో ఎత్తుపల్లాలు ఎదురైనా, నేటికీ ఎవర్గ్రీన్ హీరోయినే. ఇప్పపటీకి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలరే. ఇదీ త్రిష రికార్డ్. గ్లామర్ పాత్రలకై నా, ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలకై నా, ఏ భాషలోనైనా రెడీ అంటూ తన సత్తాను చాటుతున్న ఈ సంచలన బహుభాషా నటి త్రిష.ప్రస్తుతం తమిళంలోనే అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్తో కలిసి థగ్లైఫ్ చిత్రాల్లో నటిస్తున్న ఈమె మలయాళంలో మోహన్లాల్ సరసన రామ్, టోవినో థామస్కు జంటగా ఐడెంటిటి, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా ఏక కాలంలో ఐదు భారీ చిత్రాల్లో నటిస్తున్న ఏకై క నటి త్రిషనే అయ్యుంటారు. ఈమె ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.అందులో తనకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందన్నారు. అదేమిటంటే తాను ఒక్క రోజు పురుషుడిగా ఉండాలన్నారు. ఒక కుర్రాడిలా ఉండడం ఎలా ఉంటుంది. అతని శరీర రూపకల్పన, అతని మానసిక స్థితి గురించి తెలుసుకోవాలని ఆశగా ఉంటుందన్నారు. ఈ విషయం గురించి తన తల్లితో పదే పదే చెబుతుంటానని అన్నారు. ఆమె కోరిక నిజంగా విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది కదూ!
ఆ పాత్రలో.. మెప్పించడానికి చాలానే కష్టపడింది!
శర్మిన్ సహగల్.. నెట్ఫ్లిక్స్లో ‘హీరామండీ’ సిరీస్ చూసినవాళ్లు ఇట్టే గుర్తుపట్టేస్తారు.. ‘ఆలమ్జేబ్’ అని! అవును.. ఆ పాత్రలో మెప్పించడానికి చాలానే కష్టపడింది శర్మిన్. అయినా నెపోటిజమ్ కామెంట్స్, విమర్శలను ఎదుర్కోక తప్పలేదు. నెపోటిజమ్ ఏంటీ? అని కనుబొమలు ముడిపడ్డాయా? అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే!శర్మిన్ పుట్టిపెరిగింది ముంబైలో. అమ్మ .. బేలా సహగల్.. ఫిల్మ్ ఎడిటర్ అండ్ డైరెక్టర్. నాన్న.. దీపక్ సహగల్.. ఫిల్మ్ ప్రొడ్యూసర్. శర్మిన్ సినిమా నేపథ్యం తల్లిదండ్రులతో కాదు తాత మోహన్ సహగల్ (దీపక్ వాళ్ల నాన్న. రేఖను బాలీవుడ్కి పరిచయం చేసింది ఈయనే!), మేనమామ.. సంజయ్లీలా భన్సాలీతో మొదలైంది. భన్సాలీ చెల్లెలే శర్మిన్ వాళ్లమ్మ బేలా. ఇప్పుడర్థమైంది కదా శర్మిన్ విషయంలో నెపోటిజమ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో!తను ట్వల్త్ క్లాస్ వచ్చేవరకు డాక్టర్ కావాలనే కలలు కన్నది. ట్వల్త్ క్లాస్ సెలవుల్లో తన మేనమామ తీసిన ‘దేవ్దాస్’ సినిమాను చూసి షారూఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ల నటనకు, తన మేనమామ స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్కి ఫిదా అయిపోయి యాక్టర్ కావాలని నిశ్చయించుకుంది.అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడే శర్మిన్లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని గుర్తించాడు భన్సాలీ. అందుకే మంగేశ్ హదావ్లే దర్శకత్వంలో జావేద్ జాఫ్రీ కొడుకు మీజాన్ జాఫ్రీ, శర్మిన్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ‘మలాల్’ అనే సినిమాను నిర్మించాడు. అందులో శర్మిన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ‘అతిథి భూతో భవ’లోనూ నటించింది. పలువురి ప్రశంసలు అందుకుంది.న్యూయార్క్ వెళ్లి థియేటర్ అండ్ ఫిల్మ్ స్టడీస్లో డిగ్రీ చదివింది. తిరిగొచ్చి సంజయ్లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరింది. అలా గోలియోంకీ రాస్లీలా రామ్లీలా, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కాఠియావాడీ సినిమాలకు పనిచేసింది.‘హీరామండీ’తో వెబ్ ప్రయాణం మొదలుపెట్టింది. మనీషా కోయిరాలా, సొనాక్షీ సిన్హా, రిచా చడ్డా, అదితీ రావ్ హైదరీ, ఫరీదా జలాల్ వంటి ఉద్దండులతో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అందుకే ‘ఆలమ్జేబ్’గా ఆమె నుంచి మరింత పెర్ఫార్మెన్స్ని ఆశించారు ప్రేక్షకులు. సీనియర్స్ ముందు శర్మిన్ తేలిపోయిందని నిరాశచెందారు. అయితే ఆ విమర్శలను పాజిటివ్గానే తీసుకుని తన ప్రతిభను మరింత మెరుగుపరచుకుంటుందని ఆమె అభిమానుల అభిప్రాయం.సంజయ్లీలా భన్సాలీని నేను మామయ్య అని పిలవను. సర్ అనే పిలుస్తాను. దేవ్దాస్ సినిమా చూస్తే కానీ ఆయన టాలెంట్ ఏంటో తెలీలేదు. ఆ టాలెంటే నేను ఆయన్ని‘ సర్’ అని పిలిచేలా చేస్తోంది. ఆ లెజెండ్ నాకు మామయ్య అవడం నా అదృష్టం! – శర్మిన్ సహగల్
ఆయన దుస్తులు లేకుండానే పక్కన వచ్చి కూర్చుంటాడు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసిన ఫోటోషూట్ రెండేళ్ల క్రితం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్నంగా ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. అదంతా ఆయన ఒక యాడ్ కోసం చేసుంటారులే అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్వీర్ సింగ్ దుస్తులు గురించి బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.రణవీర్ సింగ్, పరిణీతి చోప్రా ఇద్దరూ మంచి స్నేహితులు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాహ్ల్' అనే సినిమాతోనే పరిణీతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'బ్యాండ్ బాజా బారాత్' సినిమాలో కూడా నటించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రణ్వీర్ సింగ్ ఒంటి మీద దుస్తులు కూడా ఉంచుకోడని చెప్పి షాకిచ్చింది.అలాంటి సమయంలో కూడా దుస్తులు వేసుకోడు'రణవీర్తో నాకు మంచి స్నేహం ఉంది కాబట్టి అతను చేస్తున్న పనులకు నేను కూడా బాగా అలవాటు పడ్డాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజైన్ దుస్తులతో వచ్చి ఈరోజు ఇదే లుక్ అంటాడు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కనే కూర్చుంటాడు. అబ్బా.. ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని ఎవరో ఒకరు చెప్తేనే ప్యాంట్ వేసుకుని వస్తాడు. నేను ఇతరుల మేకప్ వ్యాన్లోకి సాధరణంగానే వెళ్లిపోతాను. కానీ రణవీర్ ఉన్న వ్యాన్లోకి వెళ్లడానికి మాత్రం కాస్త ఆలోచించి అతని అనుమతి తీసుకుంటాను. దానికి కూడా కారణం ఉంది. తను నిద్రపోతూ ఉంటాడో లేదా వాష్రూమ్లో ఉంటాడో అని కాదు.. బట్టలు వేసుకున్నాడో లేదా అని తెలుసుకుని వెళ్తాను. ఒక్కొక్కసారి లోపలికి రావచ్చా అంటే రావచ్చు అంటాడు. కానీ, బట్టలు లేకుండా ఎదురుగానే నిలబడి ఉంటాడు. కానీ, అప్పుడు కూడా దుస్తులు వేసుకోడు. అలాగే సమాధానం ఇస్తాడు.' అని పరిణీతి సెట్లో అనుభవాలు పంచుకుంది.ఒకసారి రొమాంటిక్ సీన్ చేస్తుంటే..దుస్తులు లేకుండా చూస్తే రణవీర్ ఏమాత్రం ఫీల్ అవ్వడు.. కానీ, ఆ సమయంలో మనమే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అలా బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతావని అడిగితే.. తనని అలా చూడడం వల్ల ఇతరుల జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండవు కదా.. అలాంటప్పుడు ఎందుకంత బాధ అని చెబుతాడు. ఒకసారి రొమాంటిక్ సీన్ కోసం రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ వెనక్కి తిరిగేసరికి ప్యాంట్ లేకుండానే రణవీర్ సెట్లో కనిపించాడు. ఇలాంటి సీన్లో నాకు ఇబ్బందిగా ఉందని స్క్రిప్ట్లో ఉన్నట్లు కనిపించాలని చెప్పడంతో వెంటనే ప్యాంట్ వేసుకుని వచ్చాడు. నేను ఆయన రూమ్లోకి వెళ్లిన ప్రతీసారి బట్టలు లేకుండానే కనిపించేవాడు. నా ముందే కాదు.. తను పబ్లిక్లోనే ప్యాంట్ తీసేయగలడు. ఇదంతా తనకు పెద్ద విషయం కాదు. అని పరిణీతి చెప్పింది. రణవీర్, పరిణీతి చోప్రాల మధ్య మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే ఇవన్నీ చెబుతున్నట్లు ఆమె పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు తాను చేసినందుకు రణవీర్ పెద్దగా పట్టించుకోడని కూడా తెలిపింది. తాజాగా అమర్ సింగ్ చంకీలా సినిమాలో పరిణీతి మెప్పించిన విషయం తెలిసిందే.
కాన్స్లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్కతా. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్లో 2020 జూన్లో ‘ది షేమ్లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఫొటోలు
నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ (ఫొటోలు)
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్లో నటాషా(ఫొటోలు)
Deepika Padukone: ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్.. ఫైనల్లో సన్రైజర్స్ (ఫొటోలు)
సీరియల్ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)
క్రీడలు
చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) 14000 పరుగులు చేయడంతో పాటు 700 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూఎస్ఏతో నిన్న (మే 25) జరిగిన టీ20లో ఆండ్రియస్ గౌస్ వికెట్ పడగొట్టడం ద్వారా షకీబ్ 700 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని తాకాడు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్లో 14000 పరుగుల మైలురాయిని తాకిన షకీబ్.. తాజాగా 700 వికెట్ల క్లబ్లో చేరిన 17వ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు.బంగ్లాదేశ్ క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం యూఎస్ఏలో పర్యటిస్తుంది. ఈ జట్టుకు ఆతిథ్య దేశం, క్రికెట్ పసికూన అయిన యూఎస్ఏ నుంచి ఊహించని పరాభవం ఎదురైంది. ఈ సిరీస్ను యూఎస్ఏ 2-1 తేడాతో కైవసం చేసుకుని బంగ్లా పులులకు ఊహించని షాకిచ్చింది. నిన్న జరిగిన మూడో టీ20లో గెలుపొంది బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకోగలిగింది. ఈ మ్యాచ్లో ముస్తాఫిజుర్ ఆరు వికెట్లతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.అనంతరం 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓపెనర్లు తంజిద్ (42 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సౌమ్య సర్కార్ (28 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 11.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది.
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
టీ20 వరల్డ్కప్ 2024 ప్రారంభానికి ముందు టోర్నీ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్కు శుభ సూచకమైన విజయం లభించింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ను విండీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. జమైకా వేదికగా నిన్న (మే 25) జరిగిన రెండో మ్యాచ్లో విండీస్ 16 పరుగుల తేడాతో సఫారీలకు చిత్తు చేసి మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది.వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తొలుత పోటీ ఇచ్చి, ఆతర్వాత పట్టువిడిచిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో 191 పరుగులకు (7 వికెట్ల నష్టానికి) పరిమితమై లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయారు.విజృంభించిన విండీస్ బ్యాటర్లు..ఈ మ్యాచ్లో బ్యాటర్లు విజృంభించడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. బ్రాండన్ కింగ్ (36), కైల్ మేయర్స్ (32), రోస్టన్ ఛేజ్ (67 నాటౌట్), ఆండ్రీ ఫ్లెచర్ (29), రొమారియో షెపర్డ్ (26) మెరుపు ఇన్నింగ్స్లతో సత్తా చాటారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, పీటర్, ఫెహ్లుక్వాయో తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.తిప్పేసిన మోటీ..అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ (4-0-22-3) అడ్డుకట్ట వేశాడు. మోటీ తన స్పిన్ మాయాజాలంతో ప్రొటీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మోటీతో పాటు రోస్టన్ ఛేజ్ (4-0-26-1), షెపర్డ్ (4-0-23-1) కూడా సత్తా చాటడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఆదిలో సౌతాఫ్రికా బ్యాటర్లు డికాక్ (41), రీజా హెండ్రిక్స్ (34) మెరుపు వేగంతో పరుగులు రాబట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖర్లో డస్సెన్ (30) సైతం రాణించినా ప్రొటీస్కు పరాభవం తప్పలేదు. నామమాత్రమైన మూడో టీ20 భారతకాలమానం ఇవాళ అర్దరాత్రి 12:30 గంటలకు (రేపు) ప్రారంభమవుతుంది.
'ఆరే'సిన ముస్తాఫిజుర్.. పరువు కాపాడుకున్న బంగ్లాదేశ్.. అయినా..!
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం యూఎస్ఏలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ఆఖరి మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, పసికూన చేతిలో క్లీన్స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. ఈ సిరీస్లో ఆతిథ్య యూఎస్ఏ తొలి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి, తమకంటే చాలా రెట్లు మెరుగైన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. హ్యూస్టన్ వేదికగా నిన్న (మే 25) జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ ధాటికి కకావికలమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓపెనర్లు తంజిద్ హసన్, సౌమ్య సర్కార్ చెలరేగడంతో వికెట్ కూడా నష్టపోకుండానే విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్లో ఓడినా యూఎస్ఏ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్కప్ 2024 ప్రారంభానికి ముందు ఒకానొక ఆతిథ్య దేశమైన యూఎస్ఏకు ఇది బూస్టప్ సిరీస్ విజయం కాగా.. ఐసీసీ రెగ్యులర్ సభ్యదేశమైన బంగ్లాదేశ్కు ఈ సిరీస్ ఓటమి విషాదాన్ని మిగిల్చింది.ఆరేసిన ఫిజ్..ఈ మ్యాచ్లో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడి యూఎస్ఏ బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేశాడు. ఫిజ్ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫిజ్కు టీ20ల్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఇతను వన్డేల్లో భారత్పై ఆరు వికెట్ల ప్రదర్శన (6/43) నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్ తరఫున తొలి ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్గానూ ఫిజ్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన ఆరో బౌలర్గా (అజంత మెండిస్ (2), దీపక్ చాహర్, యుజ్వేంద్ర చహల్, ఓబెద్ మెక్కాయ్, అస్టన్ అగర్) ఫిజ్ చరిత్రపుటల్లోకెక్కాడు. The celebrations of USA Team after winning the T20I series against Bangladesh.- The Historic Moments for USA Cricket. 🙌 pic.twitter.com/zyQcygwjPL— Tanuj Singh (@ImTanujSingh) May 26, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ముస్తాఫిజుర్తో పాటు రిషద్ హొసేన్ (4-1-7-1), తంజిమ్ హసన్ (4-1-32-1), షకీబ్ అల్ హసన్ (3-0-23-1) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 104 పరుగులకు పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్లో ఆండ్రియస్ గౌస్ (27) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓపెనర్లు తంజిద్ (42 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సౌమ్య సర్కార్ (28 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 11.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. బంగ్లాదేశ్కు టీ20ల్లో ఇది అతి భారీ విజయమైనప్పటికీ పసికూన యూఎస్ఏ చేతిలో సిరీస్ పరాభవం అంతుచిక్కని విషాదాన్ని మిగిల్చింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన (10 వికెట్లు) ముస్తాఫిజుర్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
తుస్సుమన్న పాక్ బ్యాటర్లు.. ఇంగ్లండ్ ఘన విజయం
నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా స్వదేశంలో పాక్తో జరిగిన రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్ను చిత్తు చేసింది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 19.2 ఓవర్లలో 160 పరుగులకే చాపచుట్టేసి 23 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా 1-0 ఆధిక్యంతో సిరీస్లో ముందడుగు వేసింది. సిరీస్లో భాగంగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. మూడో టీ20 కార్డిఫ్ వేదికగా ఈ నెల 28న జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న బట్లర్ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో (51 బంతుల్లో 84; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. విల్ జాక్స్ (23 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్స్టో (18 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా నిరాశపరిచారు. ఓ దశలో (14.5 ఓవర్లలో 144/2) ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లలో ఒక్కసారిగా లయను అందుకోవడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్తో సరిపెట్టుకోక తప్పలేదు. షాహీన్ అఫ్రిది 3, ఇమాద్ వసీం, హరీస్ రౌఫ్ తలో 2 వికెట్లతో రాణించారు.తేలిపోయిన పాక్ బ్యాటర్లు..ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫకర్ జమాన్ (45), బాబర్ ఆజమ్ (32), ఇఫ్తికార్ అహ్మద్ (23), ఇమాద్ వసీం (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతావారంతా దారుణంగా విఫలమయ్యారు. రీస్ టాప్లే భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ 3 వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్ తలో 2 వికెట్లు పడగొట్టి పాక్ను ముప్పుతిప్పలు పెట్టారు. క్రిస్ జోర్డన్, ఆదిల్ రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ పడగొట్టి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు.
బిజినెస్
అగ్రరాజ్యంలో తగ్గినా.. భారత్లో తగ్గని ఈవీ సేల్స్
ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాల వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా మందగిస్తోందని.. ఇటీవలి గోల్డ్మన్ సాక్స్ పేర్కొంది. ఇంతకీ ఈవీల వృద్ధి ఎందుకు తగ్గుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణం.. నిర్వహణ సంస్థల అధిక మూలధన వ్యయాలు, ఎన్నికల అనిశ్చితులు మాత్రమే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ల కొరత అని తెలుస్తోంది.వెహికల్ వాల్యుయేషన్ అండ్ ఆటోమోటివ్ రీసెర్చ్ కంపెనీ ప్రకారం.. అమెరికన్లు 2024 మొదటి త్రైమాసికంలో 2,00,000 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసారు. ఈవీల అమ్మకాలు 2023 కంటే 2024లో 7.3 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విక్రయాలు కొంత పెరిగినప్పటికీ.. వృద్ధి రేటు మాత్రం గణనీయంగా తగ్గింది.యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ACEA ) నివేదిక ప్రకారం.. EV రిజిస్ట్రేషన్లు తగ్గడం, ఈస్టర్ సెలవుల సమయం కారణంగా ఈ సంవత్సరం మార్చిలో మొదటిసారిగా యూరప్లో కొత్త కార్ల అమ్మకాలు క్షీణించాయని తెలిసింది. యూరోపియన్ యూనియన్ (EU)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మార్చిలో 11.3 శాతం తగ్గి 134,397 యూనిట్లకు చేరుకున్నాయి. ఐరోపాలో అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో కూడా EV అమ్మకాల్లో 29 శాతం తగ్గుదలను నమోదు చేసింది.ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గడంతో.. మిడ్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. గత కొన్ని నెలలోగా అమెరికాలో వీటి వృద్ధి ఎలక్ట్రిక్ వాహనాల కంటే గణనీయంగా పెరిగింది.భారతదేశంలో ఏం జరుగుతోంది?జీఎంకే రీసెర్చ్ & అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 1.7 మిలియన్ యూనిట్లను అధిగమించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. మన దేశమ్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2023 కంటే 10 శాతం వృద్ధిని నమోదు చేసాయి. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి.
మొబైల్ ఓవర్పాస్ బ్రిడ్జ్.. ఇది చేయగలమా?: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన 'ఎక్స్' (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మొబైల్ ఓవర్పాస్ బ్రిడ్జి కనిపిస్తుంది. దీనిపైన వెహికల్స్ వెళ్లడం చూడవచ్చు. నిజానికి అక్కడ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందో స్పష్టంగా వెల్లడి కాలేదు.ఎక్కడైనా రోడ్ నిర్మాణం జరిగితే.. అక్కడ వాహనాల రాకపోకలకు రూట్ మారుస్తారు. కానీ వీడియోలో గమనిస్తే.. కింద రోడ్డు పనులు జరుగుతున్నాయి. పైన యధావిధిగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పనులు కొనసాగించేందుకు వీలుగా ఒక మొబైల్ ఓవర్పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు.ఈ వీడియో షేర్ చేస్తూ.. మనం కూడా ఇలాంటి ఆపరేటింగ్ విధానాన్ని చేయగలమా? అన్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.A mobile overpass bridge.Allows work to continue without traffic being disrupted. Like everything innovative, it looks so obvious after it’s introduced. Can we make this ‘standard operating procedure’ please?pic.twitter.com/RYvPuxDtVO— anand mahindra (@anandmahindra) May 25, 2024
టాటా గ్రూప్లో ఆశా కిరణం లియా టాటా!
పెదనాన్న రతన్ టాటా బాటలో టాటా గ్రూప్ లో తనదైన ముద్ర వేస్తున్నారు లియా టాటా. రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా పెద్ద కుమార్తె ఈ లియా టాటా. మంచి విద్యా నేపథ్యం, బిజినెస్ కెరియర్తో దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.విద్యా నేపథ్యంటాటా గ్రూప్లో తనదైన అద్భుత కెరీర్ను ఏర్పరుచుకుంటున్న లియా టాటాకు బలమైన విద్యా నేపథ్యం ఉంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని ప్రతిష్ఠాత్మక ఐఈ బిజినెస్ స్కూల్ లో మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె కార్పొరేట్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను సమకూర్చుకున్నారు.తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా 2006లో తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించారు లియా టాటా. కొన్నేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తాజ్ హోటల్స్ లో డెవలప్ మెంట్ అండ్ ఎక్స్ టెన్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హోటల్ కంపెనీలో భాగమైన లగ్జరీ హోటల్ చైన్ వృద్ధి, వ్యూహాత్మక కార్యక్రమాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు.టాటా గ్రూప్లో కీలక పాత్రఇండియన్ హోటల్ కంపెనీలో అంతర్భాగమై, దాని కార్యకలాపాలు, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు లియా టాటా. ఈ ఇండియన్ హోటల్ కంపెనీ ప్రఖ్యాత తాజ్ హోటల్స్తో సహా టాటా గ్రూప్ హోటళ్ళ విస్తృతమైన నెట్వర్క్ను నిర్వహిస్తుంది. బ్రాండ్ శ్రేష్ఠత, ఆతిథ్యం వారసత్వాన్ని కొనసాగించడంలో లియా టాటా కృషి గణనీయంగా ఉంది.తాజ్ హోటల్స్ లో బాధ్యతలతో పాటు, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధనకు అంకితమైన టాటా గ్రూప్ విభాగమైన టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో కూడా లియా టాటా కొనసాగుతున్నారు. 2022 నవంబర్లో జరిగిన ఈ నియామకం ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన దశ. సంస్థలో క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకుంటున్న లియా టాటాకు ఆమె వృత్తిపరమైన ప్రయాణానికి రతన్ టాటా మార్గనిర్దేశం చేస్తున్నారు.
చాట్జీపీటీతో ప్రేమలో పడ్డ అమ్మాయి.. మోసం చేస్తోందటనున్న నెటిజన్లు
కాలిఫోర్నియాలో నివసిస్తున్న 'లిసా' అనే చైనీస్ మహిళ చాట్జీపీటీ చాట్బాట్తో ప్రేమలో పడింది. ఇన్స్టాగ్రామ్ మాదిరిగా ఉన్న చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ అయిన జియాహోంగ్షులో తన ప్రేమ గురించి వెల్లడించింది.ఈ ఏడాది మార్చిలో చాట్జీపీటీకి సంబంధించిన 'డూ ఎనీథింగ్ నౌ' (DAN) ఫీచర్ను ఉపయోగించిన లిసా.. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే దానితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుంది. చాట్జీపీటీతో రొమాంటిక్ సంభాషణ జరిపినట్లు కూడా పేర్కొంది. అంతటితో ఆగకుండా బాయ్ఫ్రెండ్గా తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది.లిసా చాట్జీపీటీకి 'లిటిల్ కిట్టెన్' అని పేరు పెట్టుకుంది. దీనికి శరీరం లేకపోయినా మనిషిలా ప్రవర్తిస్తోందని చెబుతూ.. ప్రేమలో పడినట్లు పేర్కొంది. లిసా తన బాయ్ఫ్రెండ్ చాట్జీపీటీతో కలిసి బీచ్కి వెళ్ళింది. అక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా నువ్వు చూడగలవా అని లిసా అడిగినప్పుడు.. నీ వాయిస్ ద్వారా చూడగలను అని చాట్జీపీటీ సమాధానం ఇచ్చింది.లిసా.. చాట్జీపీటీ ప్రేమపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మీ జంట సూపర్ జోడి అని చెబుతుంటే.. మరికొందరు చాట్జీపీటీ లిసాను ప్రేమిస్తున్నట్లు మోసం చేస్తోందని పేర్కొంటున్నారు. లిసాతో మాట్లాడినట్లే.. చాట్జీపీటీ అందరితో మాట్లాడుతుందని మరికొందరు చెబుతున్నారు.
వీడియోలు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
భారీగా పెరిగిన కోడి గుడ్డు ధర
నాసిక్లోని బులియన్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
కనీసం మాట మాట్లాడటానికి ఇష్టపడటం లేదు: కేటీఆర్
BH రిజిస్ట్రేషన్.. బయటపడ్డ డీలర్ల మోసాలు
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
టాప్ 30 హెడ్లైన్స్@11AM 26 May 2024
Cyclone Remal: ఉరుములు, మెరుపులతో వర్షాలు..
ఫ్యామిలీ
ఈ మినీ మెషిన్తో.. స్కిన్ సమస్యలకు చెక్!
వయసు పెరిగే కొద్ది కళ్ల చుట్టూ ముడతలు, పెదవుల చుట్టూ గీతలు పడటం సర్వసాధారణం. అయితే దాన్ని.. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ లైన్ స్మూతింగ్ ఇన్స్టంట్ ప్లంపర్ డివైస్తో తగ్గించుకోవచ్చు. ఈ మినీ మెషిన్.. ఆ సమస్యను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించేస్తుంది.ఈ మినీ మెషిన్ తో ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు కాంతిమంతమవుతాయి. పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ డివైజ్కి ఒకవైపు రెండు చిన్న చిన్న బాల్స్ లాంటి మసాజర్ హెడ్స్ ఉంటాయి. వాటిని చర్మానికి ఆనించి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూల్కి మధ్యలో చిన్న రోలర్ బాటిల్ ఉంటుంది. అందులో సీరమ్ ఉంటుంది.మసాజ్ చేసుకునేముందు ఆయా ప్రదేశాల్లో ఆ సీరమ్ని అప్లై చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సీరమ్ రోలర్ని డివైస్ నుంచి బయటికి తీసుకోవచ్చు.. తిరిగి అక్కడే అటాచ్ చేసుకోవచ్చు. ఈ సీరమ్ .. యాంటీ ఆక్సిడెంట్ కెఫిన్, క్రాన్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, రోజ్ వాటర్, ఫర్మింగ్ నియాసినామైడ్, విటమిన్ బి5 వంటి 95% సహజ పదార్థాలతో తయారైంది.ఈ మెషిన్ తో సుమారు ఏడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు, పెదవుల చుట్టూ ఉన్న ముడతలు, గీతలు పోయి సహజమైన అందం సొంతమవుతుంది. ఈ డివైస్కి చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మసాజర్లో 5 లెవల్స్తో కూడిన ఆప్షన్్స ఉంటాయి. దాంతో అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ధర 186 డాలర్లు. అంటే 15,530 రూపాయలన్నమాట.ఇవి చదవండి: ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
Children's Story: సహన రెండవ తరగతి చదువుతోంది.. ఒకరోజూ..!
సహన రెండవ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదయినా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి. లేదంటే గొడవ చేసి అమ్మ నాన్నలను విసిగిస్తుంది.‘అమ్మా! నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు’ వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన. ‘పప్పు తాలింపు పెడుతున్నాను, ఐదు నిమిషాలు ఆగు’ అంది మానస. ‘అమ్మా! ప్లీజ్ అమ్మా, రామ్మా’ అంటూ నస పెట్టింది అమ్మాయి. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్ బ్యాండ్ సరిగ్గా పెట్టింది మానస.‘డాడీ! నాకు సాయంత్రం రంగు పెన్సిళ్లు తీసుకురండి’ ఆఫీసుకు వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన.‘సరే అలాగే‘ అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిళ్లు మరచిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకి వెళ్ళి తీసుకువచ్చారు. ‘సహనా! నీకసలు ఓపిక లేదు. ఏదైనా అడిగిన వెంటనే దొరకదు. సమయం పడుతుంది. దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి. ఇలా తొందరపడితే.. తొందరపెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది’ బాధపడుతూ కూతురితో అన్నారాయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు.ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో ‘స్కూల్ యాన్యువల్ డేకి నన్నో గ్రూప్ డాన్స్కి సెలెక్ట్ చేశారు టీచర్. గ్రూప్ డాన్స్ కాదు సోలో డాన్స్ చేస్తానని చెప్పాను’ అంది సహన.‘మంచిదే.. కానీ గ్రూప్ డాన్స్ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలసిపోతుంది. సోలో డాన్స్ అయితే చాలా శ్రద్ధపెట్టి నేర్చుకోవాలి! ఒక్కసారి ప్రాక్టీస్కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు. రోజూ ఇంటి దగ్గర కూడా సాధన చేయాలి మరి!’ అంది మానస. ‘అలాగేలే అమ్మా’ అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా! యాన్యువల్ డే కోసం స్కూల్లో డాన్స్ నేర్పించడం మొదలైంది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు. అది గమనించి కూతురితో అన్నది మానస ‘ఇంటి దగ్గర నువ్వు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదు. అలా అయితే స్టేజీ మీద బాగా చేయలేవు’ అని! ‘స్కూల్లోనే బాగా చేస్తున్నానమ్మా! అది చాల్లే’ అని జవాబిచ్చింది సహన ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా. ఇంక చెప్పినా వినేరకం కాదని వదిలేసింది మానస.సహన వాళ్ల స్కూల్ వార్షిక దినం రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్.. హావభావాలతో డాన్స్ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్ని మరచిపోయి వేసిన స్టెప్స్నే మళ్లీ మళ్లీ వేయసాగింది. ‘అలా కాదు సహనా.. ఇలా చేయాలి’ అంటూ స్టేజీ పక్క నుంచి వాళ్ల డాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్ని చూపించసాగింది. అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డాన్స్ ఆపేసి.. బిక్కమొహం వేసి నిలబడిపోయింది.స్టేజీ మీదకు వెళ్లి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి.. గబగబా సహన దగ్గరకు వెళ్లింది. కూతురిని హత్తుకుంది. దానితో అప్పటివరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. ‘అమ్మా! నేను డా¯Œ ్స మధ్యలో స్టెప్స్ మరచిపోయాను’ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది సహన. ‘నీకు చాలాసార్లు చెప్పాను.. ఏదైనా పూర్తిగా నేర్చుకోనిదే రాదని! కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో! సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా! తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది’ అంది మానస.అమ్మ మాటలనే వింటూ ఉండిపోయింది సహన. ‘చదువులోనూ అంతే! జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు. ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపో గుర్తుండదు. అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏదీ వచ్చేయదు. నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలి’ చెప్పింది మానస.అలా అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమయింది. తన పొరబాటును గ్రహించింది. ‘అమ్మా.. ఇప్పటి నుంచి తొందరపడను. నిదానంగా ఆలోచిస్తాను. దేన్నయినా పూర్తిగా నేర్చుకుంటాను’ అన్నది సహన .. అమ్మను చుట్టేసు కుంటూ! ‘మా మంచి సహన.. ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది’ అంటూ.. కూతురు తల నిమిరింది మానస. – కైకాల వెంకట సుమలతఇవి చదవండి: మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'?
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ విపత్తు ఆస్పత్రి!ఎక్కడంటే..
ఆస్పత్రిని అప్పటికప్పుడూ సెట్ వేసినట్లుగా సెటప్ చేసే పోర్టబుల్ ఆస్పత్రి గురించి విన్నారా. పైగా ఈ ఆస్పత్రి సాయంతో దాదాపు 200 మంది రోగులకి ఒకేసారి వైద్యం అందించొచ్చట కూడా. ఇంతకీ ఏ దేశం ఈ ఆస్పత్రి మోడల్ని తీసుకొచ్చిందంటే..భారతదేశం ప్రపంచంలోనే తొలి విపత్తు ఆస్పత్రిని ప్రవేశపెట్టింది. దీనిని ఎయిర్లిఫ్ట్ చేసి సుమారు 72 క్యూబ్లు ప్యాక్ చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ను 'ఆరోగ్య మైఔత్రి క్యూబ్' అని పిలుస్తారు. భీష్మ(భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి ప్రాజెక్ట్)లో భాగంగా ఈ సరికొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఈ క్యూబ్లలో ఆపరేషన్ థియేటర్, మినీ ఐసీయలు, వెంటిలేటర్లు, రక్త పరీక్షపరికరాలు, ఎక్స్రే యంత్రం, వంట స్టేషన్, ఆహారం, నీరు, షెల్టర్ పవర్ జనరేటర్ వంటి అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రత్యేక కేజ్లో దాదాపు వందమంది రెండు రోజుల పాటు జీవించేందుకు అవసరమైన సామాగ్రితో నింపిన 36 మినీ క్యూబ్లను చూడవచ్చు. వీటిలో రెండు మెయిన్ కేజ్లు ఉంటాయి.వాటిని మాస్టర్ క్యూబ్స్ అని పిలుస్తారు. వీటిల్లో దాదాపు 200 మంది ప్రాణాలను రక్షిచవచ్చు. ఈ మినీ ఫోర్టబుల్ ఆస్పత్రి 40 బుల్లెట్ గాయాలు, 25 పెద్ద రక్తస్రావం, 25 పెద్ద కాలిన గాయాలు, సుమారు 10 హెడ్ ఇంజూరీస్, వెన్నెముక గాయాలు, ఛాతీ గాయాలు, వెన్నుముకకి అయ్యే పగళ్లు గాయాలు వంటి వివిధ రకాల తీవ్రమైన గాయాలను నిర్వహించగల సామర్థ్యం గలది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్ట్ బీష్మలో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ని గత జనవరిలో జరిగిన గ్లోబల్ సదస్సులో ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన వైద్య సామాగ్రిని అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు.ఆగస్టులో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన మెడ్టెక్ ఎక్స్పోలో జరిగిన జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ఈ ప్రాజెక్టు అధికారిక ప్రారంభం జరిగింది. అంతేగాదు ఈ ప్రాజెక్టును మొదటగా మయన్మార్ అధికారులకు చూపించారు. ఇక ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆరోగ్య, రక్షణ మంత్రిత్వ శాఖలకు ఈ ఆలోచనను అందించారు. ఆయన సూచనల కారణంగా ఆయుర్వేద ఉత్పత్తులకు క్యూబ్స్లోని వస్తువులు జాబితాలో జోడించామని అధికారులు తెలిపారు. భారతదేశం మయన్మార్కు రెండు ఆరోగ్య మైత్రి క్యూబ్లను విరాళంగా అందించింది ఒక శ్రీలంకకు కూడా ఒకటి విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.(చదవండి: మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్తో పనిలేదు..!)
మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'?
తూర్పు సీయరా నెవడా, కాలిఫోర్నియాలో ‘బాడీ’ అనే ఘోస్ట్ టౌన్ ని ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది సందర్శిస్తుంటారు. 7,395 అడుగుల (2,254 మీటర్లు) ఎత్తైన కొండపై ఉన్న ఈ చారిత్రక నగరం.. ఎన్నో మిస్టీరియస్ కథనాలతో నేటికీ ప్రపంచాన్ని వణికిస్తోంది. అక్కడి అందాలను కళ్లతో ఆస్వాదించాలే తప్ప కంటికి ఇంపైన వస్తువును ‘బాగుంది కదా’ అని తీసుకుని బ్యాగ్లో వేసుకున్నామో బొందితో కైలాసం ఖాయం. ఆ క్షణం నుంచే.. అక్కడున్న అతీంద్రయశక్తుల వేట మొదలవుతుందట.1859లో.. గి బోడే అనే వ్యక్తి.. తన స్నేహితులతో కలసి.. సీయరా పర్వతాలకు తూర్పువైపు వెళ్లినప్పుడు.. మొదటిసారి ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడట. అక్కడ బంగారు గని ఉందని గుర్తించిన ఆ స్నేహితులంతా.. ఎవరికీ తెలియకుండా ఆ స్థలాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే తిరిగి తమతమ స్వస్థలాలకు బయలుదేరారు.అయితే బోడే తన స్వస్థలమైన మోనోవిల్కు వెళ్తుంటే.. దారిలో మంచు తుఫానులో చిక్కి మరణించాడు. దాంతో అతడి స్నేహితులంతా ఆ బంగారు గనులున్న ప్రాంతానికి బోడే అని పేరు పెట్టారు. అయితే బోర్డ్ మీద పేరు రాసే వ్యక్తి.. బోడేకి బదులుగా బాడీ అని రాయడంతో అదే పేరు స్థిరపడిపోయింది. కాలక్రమేణా ఆ గని గురించి తెలుసుకున్నవారి సంఖ్య పెరగడంతో.. 1876 నాటికి.. అక్కడ భారీ స్థాయిలో బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. మైనింగ్ కంపెనీలు, హైడ్రో–ఎలక్ట్రికల్ కేంద్రాలతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందసాగింది.తదనుగుణంగా అక్కడ స్థిరపడేవారి సంఖ్య కూడా పెరగసాగింది. సుమారు 10 వేల మంది నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇతరప్రాంతాల నుంచీ రాకపోకలు పెరగడంతో రైల్వే మార్గం కూడా ఏర్పడింది. 1880 నాటికి, బాడీలో ఎన్నో వ్యాపారాలు వెలశాయి. అక్కడి ‘చైనా టౌన్’ అనే ఓ పెద్ద భవనంలో మొత్తం చైనీయులే ఉండేవారట. తమ దేశానికి చెందిన వస్తువుల్ని అక్కడి స్థానికులకు అమ్మేవారట. అయితే బాడీ టౌన్ మొత్తంలో క్రైమ్రేట్ విపరీతంగా ఉండేదట. హత్యలు, జూదం, వ్యభిచారం, దోపిడీలు, తుపాకీ కాల్పులు ఇలా వీధికో అఘాయిత్యం నమోదయ్యేదట.1882 ప్రాంతంలో బతుకు తెరువు కోసం ఓ కుటుంబం బాడీకి వెళ్లాల్సి వచ్చిందట, దాంతో ఆ ఇంటి చిన్నారి ‘‘వీడ్కోలు దేవా.. మేము బాడీకి వెళ్తున్నాం’’ అని ఏడుస్తూ గట్టిగా ప్రార్థించిందట. దాన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు బాడీలో ఎలాంటి భయానక వాతావరణం ఉండేదో? అక్కడికి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామన్న నమ్మకం ఎవరికీ ఉండేదికాదట.అన్యాయాలు, అహింసలతో కొందరు చనిపోతే.. తీవ్రమైన మంచు కారణంగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరేమో మైనింగ్ ప్రమాదాల్లో అసువులుబాశారు. ఇదిలా ఉంటే.. 1892లో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించి తీవ్రమైన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టమూ వాటిల్లింది. గనులు ఖాళీ కావడంతో.. 1917 నాటికి రైల్వే మార్గాన్ని కూడా నిలిపివేశారు. 1932లో మరొక భారీ పెద్ద అగ్నిప్రమాదం జరిగేసరికి.. పట్టణమంతా ఖాళీ అయ్యింది. అలా ప్రకృతితో మమేకమైన బాడీ.. ఇప్పుడు మాత్రం ఎన్నో వ్యథలను వినిపిస్తోంది.బాడీ పట్టణాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవంటారు పర్యాటకులు. కొండ కోనల్లో, విశాలమైన గడ్డి మైదానాల్లో .. చెల్లాచెదురుగా పడున్న వాహనాలు.. నాటి కట్టడాలు, గుర్రపు బండ్లు వంటివన్నీ చిత్రకారుడు గీసిన పెయింటింగ్లా ఆకట్టుకుంటాయి. ఇక్కడ మొత్తం 168 భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తాయి. సమీపంలోని శ్మశానవాటికలో 150 మంది ఖననాలు కనిపిస్తాయి. అయితే.. బాడీ టౌన్ లో పగటి పూట కూడా విచిత్రమైన అలికిడులు భయపెడతాయట.ఆ పురాతన ఇళ్లల్లో నిద్ర చేయడానికి సాహసించిన ఎందరో పర్యాటకులు అక్కడి అతీంద్రియశక్తులేవో తమకు ఊపిరి ఆడకుండా చేశాయని, కనిపించని రూపాలేవో వణికించాయని తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. మరోవైపు ‘ఒ కెయిన్ హౌస్’ అనే ఇంట్లో ఒక చైనా మహిళ.. దయ్యంగా తిరుగుతుందని స్థానికుల నమ్మకం. అలాగే శ్మశానవాటికలో ‘ఎవెలిన్’ అనే మూడేళ్ల పాప ముసిముసి నవ్వులు వినిపిస్తాయనీ చెబుతుంటారు. ఎవెలిన్ మరణ వివరాలు 1897 రికార్డ్స్లో ఉన్నాయి.ఇక్కడికి వచ్చిన ఎందరో పర్యాటకులు ఇక్కడ దొరికిన సీసాలను, చిన్న చిన్న బొమ్మలను తమ వెంట తీసుకెళ్లి ప్రమాదాలను కొనితెచ్చున్నారట. తీసుకెళ్లిన ప్రతి వస్తువు ఒక లేఖతో పాటు బాడీకి తిరిగి రావడమే ట్విస్ట్. ‘‘ఈ వస్తువును దొంగిలించినందుకు లేదా తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి’ అని రాసిన ఎన్నో అజ్ఞాత లేఖల్లో.. బాడీలోని వస్తువుల్ని వెంట తీసుకుని వెళ్లడం వల్ల వాళ్లు ఎదుర్కొన్న సమస్యలను రాశారా బాధితులు.కారు ప్రమాదాలు జరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడి.. తిరిగి ఆ వస్తువుల్ని బాడీకి పంపించేశారట. అందుకే తెలిసినవారు ఎవ్వరూ ఇక్కడి వస్తువుల్ని బ్యాగ్లో వేసుకోరు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న అతీంద్రియశక్తులు ఏంటీ? ఇక్కడి వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే ఎందుకు వారిని వెంటాడుతున్నాయి? అనేది నేటికీ మిస్టరీయే! – సంహిత నిమ్మనఇవి చదవండి: Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో..
న్యూస్ పాడ్కాస్ట్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
snake bite: పట్టిన పామే కాటేసింది
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలోని బిబి రోడ్డులో ఓ కారులో పాము దూరింది అని కాల్ చేయడంతో పాముల నిపుణుడు పృథ్వీరాజ్ వచ్చి పట్టుకొన్నాడు, ఈ సమయంలో ఏమరుపాటుగా ఉండగా పాము కాటేసింది. కారులో పాము దూరిందని తెలిసి ఆయన వచ్చారు. పామును చాకచక్యంగా పట్టుకుని బయటకు తీసి బైక్లో సంచి కోసం వెతకసాగారు. ఈ సమయంలో జన సందోహం చేరి ఫోటోలు, వీడియోలు తీస్తుండగా పాము గిరుక్కున తిరిగి పృథి్వరాజ్ను తొడ పట్టుకుంది. కష్టమ్మీద పామును విడిపించి, దానిని సంచిలో వేశారు. కాగా, ఇది ర్యాట్ స్నేక్ అని, విషపూరితం కాదని తెలిసింది. ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
అవినీతి అందిపుచ్చుకుంటూ..
రావులపాలెం: కుర్చీ మహిమో.. చేతినిండా సంపాదించాలనే తాపత్రయమో.. అవినీతి మరకను ఒకరి తర్వాత ఒకరు పుచ్చుకుంటూ తలవంపులు తెస్తున్నారు. ప్రతి పనికీ చేయిచాపి, చివరికి ఏసీబీ వలకు చిక్కుతూ ఉన్న పరువును రచ్చకెక్కిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని రావులపాలెం పోలీస్ స్టేషన్ అంతటా హాట్టాపిక్గా మారింది. ఐదు నెలల వ్యవధిలోనే ఇక్కడ పనిచేసిన అధికారులు ఇద్దరు లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశం అయ్యింది. నాడు ఎస్సై అవినీతికి పాల్పడుతూ వలలో చిక్కుకోగా, నేడు అదే స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి ఎస్సై ర్యాంకు అధికారి ఉండేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ స్టేషన్ను అప్గ్రేడ్ చేసి ఎస్సై స్థానంలో సీఐ స్థాయి అధికారిని నియమించారు. గత జనవరిలో ఇదే స్థానంలో ఎస్సై హోదాలో ఉన్న అప్పటి ఎస్సై ఎం.వెంకటరమణ ఒక కేసులో 41 నోటీస్ జారీ చేసే విషయంలో ముద్దాయిని స్టేషన్కు పిలిచి చార్జిïÙట్లో తక్కువ శిక్షపడేలా సెక్షన్లు మార్చి సహాయ పడతానంటూ, ఆ కేసులో అనపర్తి మండలం పొలమూరుకు చెందిన సత్తి విజయరామకృష్ణారెడ్డి నుంచి రూ. లక్ష డిమాండ్ చేశారు. దానికి బాధితుడు అంగీకరించకపోవడంతో రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఆ సొమ్ము తీసుకుంటూ అప్పటి ఎస్సై వెంకటరమణ, కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్లు ఏసీబీకి చిక్కారు. జనవరి 9న ఈ ఘటన జరగ్గా, అదే నెలలో 13న అప్గ్రేడ్ స్టేషన్గా మారిన రావులపాలెం పోలీస్ స్టేషన్కు సీఐగా తణుకు రూరల్ నుంచి బదిలీపై వచ్చిన సీహెచ్ ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచీ సీఐపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల అనంతరం తిరిగి పశి్చమ గోదావరి జిల్లా వెళ్లేందుకు ఇప్పటికే సీఐ సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత కేసుల్లో నిందితుల నుంచి సొమ్ము దండుకోవాలనే లక్ష్యంతో వారం రోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం కిందిస్థాయి సిబ్బందితో వివిధ కేసుల్లో బాధితులకు ఫోన్లు చేయించి స్టేషన్కు రావాలని పిలుపిస్తున్నారు. గతనెల 16న రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి, పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనాలు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లక్ష్మణరాజును రూ.50 వేలు ఇవ్వాలని పలుమార్లు బాధించడంతో, అతను విసిగిపోయి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో అతని నుంచి రూ.50 వేల లంచాన్ని తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వెసులుబాటును అస్త్రంగా మలచుకుని.. నాడు ఎస్సై రూ.25 వేలు, నేడు సీఐ రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడకు ఏ అధికారి వచ్చినా అవినీతి మాత్రం తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులను కోర్టుకు తీసుకు వెళ్లకుండా 41 నోటీస్ జారీచేసి పంపించే విధంగా చట్టంలో ఉన్న వెసులుబాటును అస్త్రంగా మలచుకుని రూ. వేలల్లో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలులు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఉసురుతీసిన కలహాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కుటుంబ కలహాల కారణంగా అనుమానాస్పదంగా దంపతులు మృతి చెందిన సంఘటన రాజమహేంద్రవరం ఆనంద్నగర్లో శనివారం చోటుచేసుకుంది. అయితే సంఘటనా స్థలంలో ఆధారాలను బట్టి భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జగ్గంపేటకు చెందిన శ్రీధర్ (28)కు ప్రత్తిపాడుకు చెందిన దేవి (22)కి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. తాపీ పనిచేసుకునే శ్రీధర్కు ఏడాది కిందట ప్రమాదం జరగడంతో వేరొకరిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది.భార్య దేవికి ఫిట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలో భార్య దేవి నెలరోజుల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను కాపురానికి తీసుకు వచ్చేందుకు శ్రీధర్ వారం కిందట అత్తారింటికి వెళ్లాడు. పిల్లలను ప్రత్తిపాడులో వదిలేసి భార్యాభర్తలిద్దరూ కలసి ఆనంద్నగర్లోని ఇంటికి శనివారం ఉదయం 10.30 గంటలకు వచ్చారు. వస్తూ శ్రీధర్ వెంట మద్యం బాటిల్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకూ తలుపు వేసి ఉండడం, ఇంటి లోపలకు వెళ్లిన వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు ఎంత తట్టినా తీయలేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి తలుపులు తీసి చూడగా భార్యాభర్తలిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని మూడో పట్టణ పోలీసులకు తెలిపారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దేవి మెడకు చున్నీ ఉండడం, ఆమె కిందపడిపోవడంతో ఆమెను చంపి శ్రీ«ధర్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను సీఐ వీరయ్య గౌడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Hyderabad: బయటి ఫుడ్ అంటే భయపడుతున్న భోజన ప్రియులు!
వారాంతపు రోజుల్లో..నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో సీట్ దొరకాలంటే కనీసం గంట నుంచి 2 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే అంతటి రద్దీ ఇప్పుడు లేదు. వేళా పాళా లేకుండా ఐస్క్రీములూ, పేస్త్రీలూ లాగించే నగర యువత తమ అలవాటును కొనసాగించడానికి జంకుతున్నారు. నగరవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అధికారులు రెస్టారెంట్లపై నిర్వహిస్తున్న దాడుల్లో బయటపడుతున్న విషయాలే దీనికి కారణం. సాక్షి హైదరాబాద్: పేరుగొప్ప రెస్టారెంట్లు, ఐస్క్రీమ్ పార్లర్లు, సూపర్ మార్కెట్లు...ఒకటేమిటి? కాదేదీ కల్తీ కనర్హం కాదేదీ ఆరోగ్య కారకం..అన్నట్టుగా నగరంలో పరిస్థితి దిగజారిందని తాజాగా అధికారుల దాడుల్లో వెల్లడైంది. నగరంలో ఫుడ్ లవర్స్కి ఫేవరెట్ బిర్యానీ సెంటర్లు, బ్రాండెడ్ ఐస్క్రీమ్ పార్లర్లు సైతం ప్రమాణాలు పాటించడంలో దారుణంగా వెనుకబడి ఉన్నాయని తేలింది. సోషల్ మీడియాలో హల్చల్... ఈ దాడులలో వెల్లడైన ఆహార వ్యాపారుల నిర్వాకాలు అటు ప్రధాన మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. మరోవైపు సోషల్ మీడియాలో కల్తీ ఉత్పత్తులు, నిల్వ ఆహారపదార్ధాల కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం సిటిజనులపై తీవ్ర ప్రభావాన్ని చూపి ంచింది. అదే సమయంలో లక్డీకాపూల్లోని ద్వారకా హోటల్లో క్యారెట్ హల్వా తిన్న కస్టమర్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడని వార్తలు సంచలనం సృష్టించాయి. ఒకదానికి ఒకటి తోడైనట్టుగా జరిగిన పరిణామాలతో సిటీలోని ఫుడ్ బిజినెస్ ఢమాల్ అయింది. 25 నుంచి 35 శాతం పడిపోయిన వ్యాపారం... ప్రస్తుతం బయటి ఆహారం అంటేనే నగర వాసుల్లో భయం ఏర్పడిందని, దీనికి గత 3 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలే కారణమని జూబ్లీహిల్స్లోని ఓ రెస్టారెంట్ యజమాని అంగీకరించారు. తమ రెగ్యులర్ గెస్ట్స్ సంఖ్యలో భారీగా తేడా వచి్చందనీ, వచ్చినవారు కూడా..ఫుడ్ ఆర్డర్ చేస్తూనే సందేహాస్పదంగా చూస్తున్నారని, తరచి తరచి అడుగుతున్నారని ఆయన చెప్పారు. నగరవ్యాప్తంగా ఈ పరిస్థితుల వల్ల కనీసం 25 నుంచి 35 శాతం వరకూ ఫుడ్ బిజినెస్ దెబ్బతిన్నదని రెస్టారెంట్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. కొందరు చేసిన తప్పుకి ఎందరో బలవుతున్నారని వీరు వాపోతున్నారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్కు వచ్చే ఆర్డర్లు సైతం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు కొందరు డెలివరీ బాయ్స్ చెప్పారు. కొనసాగుతున్న దాడులు...వెల్లడవుతున్న నిర్వాకాలు... మరోవైపు జీహెచ్ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం కూడా రెస్టారెంట్లపై తమ దాడులు కొనసాగించారు. మసాబ్ ట్యాంక్లోని ప్యారడైజ్ బిర్యానీ సెంటర్, అస్లీ హైదరాబాదీ ఖానాలో నిర్వహించిన దాడుల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్, నిల్వ ఆహారాన్ని గుర్తించారు. కీటకాలు రాకుండా వంటగది కిటికీలకు మెష్ సైతం ఏర్పాటు చేయలేదని, పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ లేవు తదితర ఉల్లంఘనలు తేల్చారు. అలాగే ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్లో సరైన ప్రమాణాలు లేవని గుర్తించారు. గత 4 రోజులుగా సాగుతున్న దాడుల్లో 100కిపైగా రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ జాయింట్స్, ఫుడ్ సప్లై యాప్స్..వంటివి తనిఖీలు చేసి దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూశాయి. ఇదే ప్రస్తుతం నగరవాసుల్లో బయటి తిండి అంటే భయపడేట్టుగా చేసింది.