నూతన నియామకం | Sakshi
Sakshi News home page

నూతన నియామకం

Published Tue, Apr 23 2024 8:35 AM

వలంటీర్‌ తలకు 
గాయమైన దృశ్యం    - Sakshi

రాయచోటి టౌన్‌ : అన్నమయ్యజిల్లా వైఎస్సార్‌ సీపీకి చెందిన ఇద్దరిని రాష్ట్ర స్థాయి సెక్రటరీలుగా నియమించారు. రాష్ట్ర పార్టీ సెక్రటరీగా తురుక శ్రీనివాసుల రెడ్డిని, రాష్ట్ర వింగ్‌ కమిటీ సెక్రటరీగా జి. రాజశేఖర్‌రెడ్డిలను నియమించారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆమోద పత్రం తమకు అందినట్లు సోమవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా వారు పేర్కొన్నారు. ఈసందర్భంగా వీరు తమకు ఈ అవకాశం కల్పించినందుకు కృత/్ఞతలు తెలిపారు. తమ వంతు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

వలంటీర్‌పై హత్యాయత్నం

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండల పరిధిలోని ఇబ్రహీంపేటలో సోమవారం వలంటీర్‌ టి.సుధాకర్‌ యాదవ్‌పై సోమవారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడంలేదనే అక్కసుతో సుధాకర్‌పై అదే గ్రామానికి చెందిన పిడుగు సురేష్‌ కుమార్‌రెడ్డి, మొర్రంరెడ్డి విజయసింహారెడ్డి కత్తి, రాడ్డుతో దాడి చేశారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన గ్రామస్తులను కూడా కత్తితో పొడుస్తామని బెదిరింపులకు దిగారు. ఈ దృశ్యం సమీపంలోని కోదండరాముడి బ్రహ్మోత్సవాల బందోబస్తుకు వచ్చిన ఓ పోలీసు అధికారి కంటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారి దాడికి దిగిన వారిద్దరిని ఒంటిమిట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. గాయపడిన వలంటీర్‌ను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement