మదనపల్లె : స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అనాధ వృద్ధురాలు తాయమ్మ(70) సోమవారం మృతి చెందింది. నెల రోజులుగా పట్టణంలో భిక్షాటన చేస్తూ మతిస్థిమితం లేక దేవతానగర్ వద్ద పడి ఉండగా, స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రెండు రోజులకే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. యాచించుకుంటూ తిరిగి నడవలేని స్థితిలో ఆస్పత్రి ఆవరణలో చెట్టు కింద ఉండగా స్థానికులు కొందరు మానవత్వంతో ఆమెకు సపర్యలు చేశారు. ఈనెల 10వ తేదీన ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదురుగా అనాధగా పడి ఉన్న తాయమ్మను క్యాజువాలిటీ వద్దకు వచ్చినమెడికల్ కాలేజీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎమ్మెస్ రాజు గమనించి జిల్లా ఆసుపత్రి ఐసీయూ విభాగంలో చేర్పించారు. ఆ సమయంలో వివరాలు అడగగా తన పేరు తాయమ్మ అని కర్ణాటక రాష్ట్రం కే జి ఎఫ్ కు చెందిన రామస్వామి భార్యగా పేర్కొంది. బంధువులు ఎవరూ లేకపోవడంతో, ఆమెకు ఐసీయూ విభాగంలో చికిత్సలు అందించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. అప్పటినుంచి ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతూ సోమవారం పరిస్థితి విషమించి అనారోగ్యంతో ఆమె మృతి చెందింది. ఆమె బంధువులు ఎవరైనా ఉంటే టూ టౌన్ పోలీసులను సంప్రదించాల్సిందిగా సీఐ యువరాజు కోరారు.
జిల్లా ఆస్పత్రిలో అనాధ వృద్ధురాలి మృతి
Published Tue, Apr 23 2024 8:35 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement