ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్‌ | Sakshi
Sakshi News home page

ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్‌

Published Mon, Apr 8 2024 1:13 AM

Housing sales in top seven cities record 14 percent increase in Q1 2024 - Sakshi

తొలి 3 నెలల్లో 1.30 లక్షల యూనిట్ల విక్రయాలు

హైదరాబాద్‌లో 38% వృద్ధి 

అనరాక్‌ గణాంకాల వెల్లడి

ముంబై: బలమైన డిమాండ్‌ కొనసాగడంతో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 14% పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్‌ అనరాక్‌ గణాంకాలు తెలిపాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జనవరి–మార్చి మధ్య మొత్తం 1,30,170 యూనిట్లు అమ్ముడవగా., గతేడాది ఇదే కాలంలో 1,13,775 యూనిట్ల విక్రయాల జరిగాయి. ఇదే త్రైమాసికానికి సగటున ఇళ్ల ధరలు 10–32 % పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం(ఎంఎంఆర్‌), పూణే, బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్మకాలు పెరిగాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్, చెన్నై, కోల్‌కత్తా నగరాల్లో క్షీణించాయి.

► ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 24% పెరిగి 42,920 యూనిట్లు అమ్ముడయ్యాయి. పూణేలో 15% పెరిగి 22,990 యూనిట్లు, హైదరాబాద్‌లో 38% వృద్ధితో 19,660 యూనిట్లు, బెంగుళూరులో 14% అధికంగా 17,790 ఇళ్లు అమ్ముడయ్యాయి.  
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో విక్రయాలు 9% క్షీణించి 15,650 యూనిట్లు, కోల్‌కత్తాలో అమ్మకాలు 9% తగ్గి 5,650 యూనిట్లు, చెన్నైలో ఆరుశాతం తక్కువగా 5,510 యూనిట్లు అమ్మకాలు జరిగాయి.  


‘‘ముఖ్యంగా రూ.1.5 కోట్ల; అంతకు మించి పైగా ధరలు కలిగిన ఇళ్లకు అత్యధిక డిమాండ్‌ కారణంగా గత పదేళ్లలో రికార్డు విక్రయాలు ఈ జనవరి–మార్చి మధ్య నమోదయ్యాయి. వినియోగదారులు, ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్‌తో అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. పెరిగిన ఇళ్ల స్థలాలు ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలను సూచిస్తున్నాయి’’ అని అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు.

Advertisement
Advertisement