వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం కమిటీ నియామకం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం కమిటీ నియామకం

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

పట్నంబజారు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా బీసీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా దానబోయిన వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులుగా కొడాలి క్రాంతి, రాచమంటి గంగాధర్‌రావు, సున్నం మల్లికార్జునరావు, దానబోయిన శివశంకరరావు, కుంచాల శ్రీనివాసరావు, డి.మంగ, కార్యదర్శులుగా కడియం నాగేశ్వరరావు, జె.నాగమోహన్‌, పమిడి నరసింహారావు, పి.నాగేంద్రబాబబు, బలుసుపాటి వీరేంద్రకుమార్‌, ఆలా మహేష్‌, రాచకొండ వెంకటేశ్వరరావు, కె.పరమేశ్వరరావు, గుండు నాగరాజు, సహాయ కార్యదర్శులుగా తుల్లిమెల్లి శ్రీనివాస్‌, కె.రామలింగేశ్వరరావు, కాకుమాను ఉమామహేశ్వరరావు, పొదిలి శ్రీనివాసరావు, ఎస్‌.జార్జిరాజు, బండి నాగరాజు, షేక్‌ మదరసా (షఫి), షేక్‌ జానీ, కేశన ఏడుకొండలు, కాకుమాను రవిప్రతాప్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎస్సీ విభాగం కమిటీ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎస్సీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. విభాగం జిల్లా అధ్యక్షుడిగా పెరికల కృష్ణమోహన్‌, ఉపాధ్యక్షులుగా లింగాల మరియబాబు, బత్తుల వెంకట్రావు, కనపర్తి అనిల్‌, ప్రధాన కార్యదర్శులుగా డి.నరసింహారావు, జె.దాసు, మట్టిగుంట ప్రసన్నకుమార్‌, కొరగంటి ఉదయ్‌రాజు, దాసరి రత్నరాజు, సౌపాటి ప్రేమ్‌కుమార్‌, దేవరకొండ నాగేశ్వరరావు, జండ్రాజుపల్లి నాగేశ్వరరావు, ఉన్నవ ప్రశాంత, కార్యదర్శులుగా బత్తుల మరియన్న, పడాల దుర్గా, కుక్కమూడి అచ్చిబాబు, ఎం.రమేష్‌కుమార్‌, కె.బోయేజు, పిల్లి ధర్మరత్నం, మాతంగి ఆశీర్వాదం, కారుమూరి అంకమ్మరావు, గేరా సంజీవ్‌, టి.నరసింహారావు, ఎస్‌.నాగరాజు, గడ్డం మురారి, గంటా రమేష్‌, కె.విజయ్‌, సహాయ కార్యదర్శులుగా మేరిగ అమర్‌బాబు, మురికిపూడి రమేష్‌, దారం సాంబశివరావు, ఎం.బాలయ్య, చెరుకూరి నాగయ్య, శాంతకుమారి, రాయపూడి చినరాజు, కట్టెపోగు ఉదయభాస్కర్‌, వడ్డేశ్వరం రవి, కట్టవరపు ఆషాజ్యోతి, మాతంగి రవీంద్ర, కాకాని రవీంద్రబాబు, ఎం.సతీష్‌, మంచాల బిక్షాలు, గేరా చిన అంకయ్య, బుర్రి కిషోర్‌, నల్లపాటి బేబి, వై.ఇమ్మానియేల్‌ రాజు, దావులూరి పోతురాజు, గొరికపూడి జోసఫ్‌లను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

వైఎస్సార్‌టీయూసీ ఉపాధ్యక్షురాలిగా

వెంకటరమణి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సత్తెనపల్లి వెంకటరమణిని పార్టీ వైఎస్సార్‌టీయూసీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈమేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement