వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలి | Sakshi
Sakshi News home page

వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలి

Published Sat, Apr 20 2024 1:55 AM

విద్యుత్‌ ఉద్యోగులతో సీజీఎం ప్రభాకర్‌
 - Sakshi

జగిత్యాలజోన్‌: విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఎన్పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రభాకర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో విద్యుత్‌ ఉద్యోగులకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా శుక్రవారం వరంగల్‌ హెచ్‌ఆర్‌డీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రభాకర్‌ పాల్గొని ఉద్యోగులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్‌ సంస్థ అభివృద్ధి కోసం సంస్థలో పనిచేస్తున్న ఆపరేషన్స్‌, మెయింటనెన్స్‌ విద్యుత్‌ సిబ్బందికి, జూనియర్‌ లైన్‌మెన్‌ నుంచి ఫోర్‌మెన్‌ క్యాడర్‌ వరకు అంతర్గత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపా రు. విద్యుత్‌ లైన్‌ పనులు చేస్తున్నప్పుడు స్పా ట్‌ ఎర్తింగ్‌ చేసుకుని ప్రమాదాలు జరగకుండా పనులు చేయాలని సూచించారు. వినియోగదారులకు నా ణ్యమైన సేవలందిస్తూ సంస్థకు మంచిపేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సత్యనారా యణ, డీఈలు గంగారాం, రవీందర్‌, ఏడీఈ లు నగేశ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement