ఊపిరి ఉన్నంత వరకూ వైఎస్సార్‌సీపీలోనే | Sakshi
Sakshi News home page

ఊపిరి ఉన్నంత వరకూ వైఎస్సార్‌సీపీలోనే

Published Tue, Apr 9 2024 12:25 AM

హిందూపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ  - Sakshi

జగనన్న ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి..

‘పురం’ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ

హిందూపురం: ‘‘జగనన్న అవకాశం ఇవ్వడం వల్లే రాజకీయాల్లోకి వచ్చా. ఆయన ఆశీస్సులతోనే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నా. నా ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన జగనన్న బాటలోనే నడుస్తా. ఊపిరి ఉన్నంత వరకూ వైఎస్సార్‌సీపీలోనే ఉంటా’ అని హిందూపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ అన్నారు. సోమవారం ఆమె తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నానంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలన్నారు. ఇలాంటి అసత్యాలను ప్రజలు, పార్టీ అభిమానులు ఎవరూ నమ్మవద్దన్నారు. జగనన్న ప్రభుత్వంలోనే మహిళలకు సముచిత స్థానం, గౌరవం దక్కుతున్నాయన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకం ఉంచి తనకు ఇంత పెద్ద పదవి ఇచ్చారని, ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞతగా, రుణపడి ఉంటానన్నారు. వైఎస్సార్‌ సీపీకి సేవ చేస్తూ తనకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు సాగుతానన్నారు.

Advertisement
Advertisement