కొడనాడ్‌ హత్య కేసులో విచారణ వాయిదా | Sakshi
Sakshi News home page

కొడనాడ్‌ హత్య కేసులో విచారణ వాయిదా

Published Tue, Apr 23 2024 8:30 AM

-

కొరుక్కుపేట: కొడనాడు హత్య కేసు విచారణ ఈనెల 29కి వాయిదా పడింది. వివరాలు.. ఊటీలోని జిల్లా కోర్టులో గత నాలుగేళ్లుగా కొడనాడ్‌ హత్య, దోపిడీ కేసు నడుస్తోంది. సయాన్‌, జమ్సీర్‌ అలీ, జిద్‌ దిన్‌ జాయ్‌, దీపు సహా ఎనిమిది మంది నిందితులపై విచారణ జరిగింది. అలాగే కొడనాడు ఎస్టేట్‌ మేనేజర్‌ నటరాజన్‌, శశికళ, మాజీ ఎమ్మెల్యే అరుకుట్టి సహా 316 మందిని ప్రత్యేక బలగాల పోలీసులు మళ్లీ విచారించారు. ఈ నేపథ్యంలో కేసు సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున న్యాయవాది షాజహాన్‌, కనగరాజ్‌ వాదించారు. సీబీసీఐడీ అదనపు ఎస్పీ మురుగవేల్‌, డీఎస్పీలు అన్నాదురై, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శ్రీధర్‌ కేసు విచారణను 29కి వాయిదా వేశారు.

Advertisement
Advertisement