ఏపీలో 1,052 మంది డిశ్చార్జ్

14 Jul, 2020 05:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,052 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 16,464కి చేరింది. తాజాగా 19,247 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 11,73,096కి చేరింది. కొత్తగా 1,935 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ సోమవారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కరోనా కేసులు 31,103కి చేరాయి.

వీటిలో 2,416 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి సంబంధించినవి కాగా, 432 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి. తాజాగా 37 మంది మృతితో మొత్తం మృతుల సంఖ్య 365కి చేరింది. ప్రస్తుతం 14,274 యాక్టివ్‌ కేసులున్నాయి. 

మరిన్ని వార్తలు