వైఎస్సార్

ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి

(8 జూలై 1949 - 2 సెప్టెంబర్ 2009)

'నేను ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ధైర్యంగా మైకు పట్టుకుని 'ఈ గ్రామంలో ఇల్లు లేనివాళ్లు, నిజంగానే అర్హులై ఉండీ పెన్షన్‌ రానివాళ్లు, అర్హులైన వాళ్లలో ఏ ఒక్కరికైనా తెల్లకార్డు లేనివాళ్లు ఎవరైనా ఉంటే చేతులెత్తండి' అని అడగాలి. అలా అడిగినప్పుడు ఒక్క చెయ్యి కూడా లేవకూడదు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరినీ బాగుచేయాలి' దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కన్న గొప్ప కల ఇది. తాను ఎక్కడికెళ్లినా 'గోడు ఉండకూడదు, గూడు ఉండాలి' అని కోరుకున్న మహానేత.

చెదరిపోని గుండె బలం... నాయకత్వానికి నిలువెత్తు రూపం.. మేరునగ ధీరుడు మన వైయస్ రాజశేఖరుడు... ఆ పాదం అడుగిడిన నేలంతా అయ్యింది సస్యశ్యామలం.. మాట తప్పని ఆయన తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపగా మడమతిప్పని ఆయన నైజం ప్రత్యర్థులకు సింహస్వప్నం అయ్యింది. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

పూర్తి వివరాలు
వీడియోలు