ఏపీలో మరో 704 కరోనా కేసులు

30 Jun, 2020 12:25 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మరో 648 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51మందికి, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
(చదవండి : కరోనా: భారత్‌లో కొత్తగా 18,522 పాజిటివ్‌ కేసులు)

సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 18,114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 704 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,595కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 187కి చేరింది. ఈ రోజు మృతి చెందిన ఏడుగురిలో కృష్ణా 3, కర్నూలు 2,  గుంటూరు, అనంతపురంలో జిల్లాలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,897 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు