12 లక్షలు దాటిన కోవిడ్‌ పరీక్షలు 

16 Jul, 2020 04:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా పరీక్షల్లో రాష్ట్రం 12 లక్షల మైలు రాయిని అధిగమించింది. గడిచిన 24 గంటల్లో 22,197 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా పరీక్షల సంఖ్య 12,17,963కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం పేర్కొంది. 

► మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు పరీశీలించిన నమూనాల్లో 2,432 మందికి వైరస్‌ సోకింది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది.  గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న 911 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18,378కి చేరింది.  
► కొత్తగా 44 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 452కి చేరింది.

మరిన్ని వార్తలు