కూలీ డబ్బుల కోసం తాతను పొడిచాడు

3 Feb, 2015 09:59 IST|Sakshi

సంతనూతలపాడు : తనకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు చెల్లించలేదన్న కోపంతో వరుసకు తాతైన వ్యక్తిని మనవడు కత్తిలో పొడి చాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మైనంపాడులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మైనంపాడులో గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తన్నీరు సింగయ్య(50) బేల్దారి పనిచేస్తుంటాడు. వరుసకు మనవడు అయిన తన్నీరు కోటేశ్వరరావును పనికి తీసుకెళ్తుంటాడు.

ఈక్రమంలో కోటేశ్వరరావుకు రావాల్సిన వెయ్యి రూపాయల కూలి డబ్బులు సింగయ్య ఇవ్వలేదు. మెయిన్ రోడ్డుపై సింగయ్యను నిలదీయడంతో నేను నీకు ఇవ్వాల్సింది కేవలం వంద రూపాయలేనన్నాడు. దీంతో కోటేశ్వరరావు కత్తి తీసుకుని సింగయ్య కడుపులో పొడిచి పరారయ్యాడు. సింగయ్యను ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు