ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

15 Feb, 2015 15:39 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు...కళ్లిపాలెం గ్రామానికి చెందిన దాసరి భిక్షాలు, ఆయన భార్య లక్ష్మీ తిరుపతమ్మ ఆదివారం ఉదయం గుడికి వెళ్లి... తిరిగి కళ్లిపాలెంకు వెళుతుండగా... రేపల్లె రోడ్డులో ప్రజ్నం వద్ద ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ తిరుపతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా... భిక్షాలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

(నిజాంపట్నం)

మరిన్ని వార్తలు