రిలయన్స్ జ్యూయెల్స్ అక్షయ తృతీయ గిఫ్ట్‌

12 Apr, 2018 14:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : అక్షయ తృతీయ పర్వదినాన్ని మరింత ఆనందంగా జరుపుకునేలా... రిలయన్స్ జ్యూయెల్స్ సరికొత్త బంగారు, వజ్ర ఆభరణాలను మార్కెట్లోకి విడుదల చేసింది. బంగారం కొనుగోళ్లకు అత్యంత శుభప్రదంగా భావించే అక్షయ తృతీయను పురష్కరించుకుని, సరికొత్త వజ్రాభరణాలతో పాటు ఈనెల 22 వరకు పలు రకాల ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నామని రిలయన్స్ జ్యూయెల్స్ సీఈఓ సునీల్ నాయక్ వెల్లడించారు. 

ఈ ఆఫర్ల కింద బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 40 శాతం రాయితీ ఇస్తునట్లు చెప్పారు. అదే విధంగా 10 గ్రాములకు మించి బంగారు నాణేలు, 50 గ్రాములకు మించి వెండి నాణేల కొనుగోలు చేస్తే.. వాటి తయారీ ఛార్జీలపై 50 శాతం రాయితీ అందిస్తునట్లు వివరించారు. వజ్రాభరణాల తయారీ చార్జీలపై 75 శాతం, ప్లాటినం రింగ్ లపై 15 శాతం రాయితీ ఉంటుందన్నారు. అలాగే పాత బంగారం మార్పిడితో ఆభరణాల కొనుగోలుపై 0 శాతం తరుగు ఆఫర్‌ను ఇస్తున్నట్లు సునీల్ నాయక్ చెప్పారు.
 

మరిన్ని వార్తలు