14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

6 Jun, 2014 08:32 IST|Sakshi
14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

నగరంలోని రాజేంద్రనగర్ ఉప్పరపల్లికి చెందిన మైనర్ బాలికను కొంతమంది దుండగలు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. ఆమెను నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో రెండు రోజుల పాటు బందించి బాలికపై అత్యాచారం జరిపారు. అనంతరం ఆమెను గత రాత్రి ఉప్పరపల్లిలో వదిలి నిందితులు పరారైయ్యారు. దాంతో ఆమె ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

 

మరిన్ని వార్తలు