‘అందుకే స్వాగతించారు’

9 Sep, 2016 19:57 IST|Sakshi

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేస్తున్న సాయంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతిస్తూ.. అభినందించినట్లు మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్రాన్ని తాము అభినందించలేదని స్పష్టం చేశారు. కేంద్ర సాయంపై సభలో చర్చిద్దామని చెప్పినా ప్రతిపక్ష సభ్యులు వినట్లేదన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు శాసనసభను ఉపయోగించుకోకుండా.. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ సమయాన్ని వధా చేస్తున్నారని ఆరోపించారు.
 

మరిన్ని వార్తలు