గొంతుకు నైలాన్ తాడు బిగించి హత్య

10 Apr, 2016 20:20 IST|Sakshi

యాకుత్‌పురా (హైదరాబాద్): గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఓ వృద్దున్ని హత్య చేసి బిరువాలో ఉన్న 27 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... తలాబ్‌కట్టా మురాద్ మహాల్ క్యుబా మసీదు ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ బిన్ అమేర్ (62) టైలర్‌గా పని చేస్తాడు.

శనివారం రాత్రి భార్యా పిల్లలు వేరే గదిలో నిద్రించగా... ఓ గదిలో రెహమాన్ బిన్ అమేర్ పడుకున్నాడు. ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి రెహమాన్ గొంతుకు నైలాన్ తాడుతో బిగించి హత్యకు గురై కనిపించాడు. ఇంట్లో బిరువా పగలగొట్టి ఉండగా,  అందులో ఉన్న 27 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. జరిగిన సంఘటనపై కుటుంబ సభ్యులు భవానీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు