మేడిపల్లిలో చైన్‌స్నాచింగ్‌

5 Jun, 2017 10:54 IST|Sakshi
హైదరాబాద్‌: రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అమ్మసాని వెంకటరెడ్డి నగర్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీలో నడచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని 3 తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగుడు తెంపుకెళ్లాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 
మరిన్ని వార్తలు