ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్ష

3 Apr, 2016 10:27 IST|Sakshi

రెండు తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష ఈరోజు ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఆంధ్రప్రేదశ్‌లోని విజయవాడ, తిరుపతి, విశాఖ, గుంటూరులలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రారంభమైంది.

 

ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు హాజరు కానివ్వం అనే నిబంధన ఉండటంతో విద్యార్థులు ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాలకు వచ్చిన వారు ఉరుకులు పరుగులు వేస్తూ కనిపించారు.
 

మరిన్ని వార్తలు